Tiger
-
మహదేవపూర్ అడవుల్లోకి మళ్లీ పులి!
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ అడవుల్లోకి మళ్లీ పులి వచ్చిందనే సమాచారంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ అడవుల్లో తన ఆవాసం ఏ ర్పాటు చేసుకోవడానికి ఆరు రోజులుగా పులి కాటారం, మహదేవపూర్ ప్రాంతాల్లో తిరు గుతున్నట్లు తెలియడంతో ఆ రెండు రేంజ్ల పరిధిలో ప్రత్యేక బృందాలతో అన్వేషిస్తున్నారు. నస్తూర్పల్లి వద్ద పులి అడుగులు కనిపించడంతో అక్కడి నుంచి గూడూరు, వీరాపూర్ వరకు పరిశీలిస్తూ వెళ్లగా ఆచూకీ లభించలేదు. అడవి లో అక్కడక్కడా ట్రాకింగ్ కెమెరాలు ఏర్పాటు చేసినా.. ఎక్కడా చిక్కలేదు.అయితే, శనివారం మహదేవపూర్ మండలం కుదురుపల్లి సమీపంలో సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద పులి కనిపించినట్లు రోడ్డుమీద వెళ్తున్న వాహనదారులు అటవీశాఖకు సమాచారం ఇచ్చారు. దట్టమైన అడవి కావడంతో పాటు తాగునీటి వసతి ఉండటంతో పులి ఇక్కడ ఆవాసం ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. పశువుల కాపరులు ఆ ప్రాంతాలకు వెళ్లొద్దని, రైతులు వంటచెరుకు కోసం రావొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. మహదేవపూర్ అడవుల్లో ఎక్కువ సంఖ్యలో ట్రాకింగ్ కెమెరాలు అమర్చితే పులి జాడ తెలుస్తుందని భావిస్తున్నారు.కుదురుపల్లి నుంచి కాటారం, అన్నారం ప్రాంతాల్లో అడవులు దట్టంగా వ్యాపించి ఉన్నాయి. చిన్నచిన్న వాగులతో నీటి వసతి కూడా ఉంది. దీంతో పులి రోజుకు 20–25 కిలోమీటర్ల మేర ప్రయా ణం చేస్తోందని అధికారులు భావిస్తున్నారు. ఈ విషయమై అటవీశాఖ రేంజ్ అధికారి రవిని సంప్రదించగా కుదురుపల్లి వద్ద పులి కనిపించినట్లు వాహనదారులు తెలిపారని, దీంతో ఆదిలాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక యానిమల్ ట్రాకింగ్ టీం పగ్మార్క్లను పరిశోధిస్తోందని వివరించారు. గతంలో ఈ ప్రాంతంలో సంచరించిన కే–8 పులి మళ్లీ వచ్చిందా? లేక మరేదైనా కొత్త పులా అనేది తెలియాల్సి ఉందని అధికారులు చెపుతున్నారు. -
సడెన్గా పులి ఎంట్రీ..ఛేజ్ చేసేంత దూరంలో రైతు! ట్విస్ట్ ఏంటంటే..
ఒక్కోసారి ప్రమాదం ఎటు నుంచి వస్తుందో తెలియదు. మనం ప్రమాదకరమైన ప్రదేశంలోకి వెళ్లకపోయినా ఊహించిన విధంగా ప్రమాదం మనల్ని వెతుక్కుంటూ వస్తే అదృష్టం ఉంటే తప్ప బయటపడటం అంత ఈజీ కాదు. అలాంటి సందర్భమే ఎదురైంది ఈ రైతుకి. తప్పించుకునే అవకాశం లేని విత్కర పరిస్థితిని ఎదుర్కొన్నాడు. సరిగ్గా ఆ టైంలో జరిగిన గమ్మత్తైన తమాషా ఆ రైతుకి భూమ్మీద నూకలున్నాయనే దైర్యాన్ని ఇచ్చింది. ఏం జరిగిందంటే..ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని పిలిభిత్(Pilibhit)లో ఒక రైతు బైక్పై కూర్చొని మరో వ్యక్తితో ఏదో సీరియస్గా మాట్లాడుతుంటాడు. ఇంతలో గడ్డిపొదల నుంచి నెమ్మదిగా పులి(Tiger) నక్కి నక్కి వస్తుంటుంది. దీన్ని ఆ ఇరువురు వ్యక్తులు గమనించరు. అయితే పులి మాత్రం దాక్కుంటూ వారిని సమీపిస్తుంటుంది. అమాంతం దాడి చేసేంత దూరంలోకి సమీపించేత వరకు గమనించరు ఆరైతు, సదరు వ్యక్తి. ఆ తర్వాత అంత దగ్గరగా పులిని చూసి స్టన్నైపోతారు. ఆ తర్వాత వెంటనే తేరుకుని ఎలాగైనా తప్పించుకోవాలన్న ఉద్దేశ్యంతో బైక్ని వెనక్కి తిప్పేందుకు రెడీ అవుతాడు. చెప్పాలంటే పులి వారిపై దాడి చేసేంత దగ్గరలోనే ఉన్నారు వాళ్లు. కానీ ట్వీస్ట్ ఏంటంటే ఆ ఉన్నటుండి పులి దాడి చేయకుండా నెమ్మదిగా కూర్చొని అలా సేద తీరుతుంటుంది. నిజానికి దాడి చేసేలా సైలెంట్గా నక్కి వచ్చింది కాస్తా ఒళ్లు విరుచుకుంటూ కూర్చొంటుంది. దీంతో ఆ ఇద్దరు బతికిపోయంరా బాబు అనుకుంటూ అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోయారు. అందుకు సంబంధించిన వీడియోని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ఐఎఫ్ఎస్) అధికారి(Indian Forest Service (IFS)) షేర్ చేయడంతో నెట్టింట తెగ వైరల్గా మారింది.A farmer and a tiger encounter. This is what coexistence looks like. From Pilibhit. pic.twitter.com/4OHGCRXlgr— Parveen Kaswan, IFS (@ParveenKaswan) February 3, 2025 (చదవండి: రూ. 75 కోట్లు విలువ చేసే హోటల్ని జస్ట్ రూ. 875లకే అమ్మకం..!) -
‘మ్యాన్ ఈటర్’ హతం..ఇతర పులుల దాడిలోనే..!
తిరువనంతపురం:కేరళలో మనుషులపై దాడి చేసి చంపుతున్న మ్యాన్ ఈటర్ ఆడపులి మృతిచెందింది. పులి కళేబరాన్ని సోమవారం ఉదయం వయనాడ్లో అటవీశాఖ అధికారులు గుర్తించారు. కళేబరం తాము వెతుకున్న మ్యాన్ ఈటర్దేనని ధృవీకరించారు. 6నుంచి7 ఏళ్ల వయసు ఉండి ఒంటిపై గాయాలున్న ఆడపులి కళేబరాన్ని తాము స్వాధీనం చేసుకున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. గత వారం పులి 45 ఏళ్ల గిరిజన మహిళపై దాడి చేసి చంపిందని కేరళ అటవీశాఖ మంత్రి ఏకే శశీంద్రన్ తెలిపారు. దీంతో దానిని కాల్చి చంపేందుకు ఆదేశాలిచ్చినట్లు చెప్పారు. మ్యాన్ ఈటర్ పులిని పట్టుకునేందుకు తాము సాగించిన వేట దాని కళేబరం దొరకడంతో ముగిసినట్లు ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ తెలిపారు. పులి ఒంటిపై ఉన్న గాయాలు కొన్ని పాతవి కాగా మరికొన్ని తాజాగా అయినవని వెటర్నరీ డాక్టర్లు తెలిపారు. ఇతర పులుల దాడిలోనే అది మరణించి ఉండొచ్చని చెప్పారు. తమపై వన్యమృగాల దాడులు ఎక్కువయ్యాయని,వాటిని ఆపేందుకు చర్యలు తీసుకోవాలని వయనాడ్లో గిరిజనులు ఇటీవల ఆందోళనలు నిర్వహించడం గమనార్హం.ఇదీ చదవండి: జగిత్యాలలో పులి సంచారం.. భయాందోళనల్లో ప్రజలు -
జగిత్యాలలో పులి సంచారం..భయాందోళనల్లో ప్రజలు
సాక్షి,జగిత్యాలజిల్లా:జగిత్యాల జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. పులి తిరుగుతోందన్న ప్రచారంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. పులి జనవరి 23న గుండు బాబు అనే రైతుకు చెందిన ఆవుపై దాడి చేసింది. పులి ఆచూకీ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అటవీశాఖ అధికారులు గాలిస్తున్నారు.ఎంత గాలించినా పెద్దపులి ఆచూకీ దొరకలేదు. తాజాగా పులి అడుగులు కనిపించడంతో ప్రజల్లో భయాందోళనలు ఎక్కువయ్యాయి. అధికారుల పరిశీలనలో అవి పులి అడుగులుగానే గుర్తించారు. పులి రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి అడవుల వైపు వెళ్లినట్టుగా అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండ: ఆ సినిమా చూసి..మృతదేహం మాయం చేశాడు -
రోడ్డుపై వెల్కమ్ చెప్తున్న పులి
-
టైగర్కి ఈ టెంపర్మెంట్ ఏంటి?
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా పెద్ద పులులు జనసంచారానికి ఆమడదూరంలో ఉంటూ అడవుల్లోనే సంచరిస్తుంటాయి. కానీ మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా విరూర్ అటవీ రేంజ్ పరిధిలోని రాజూరా తాలూకాలో రెండు రోజుల కిందట అధికారులు బంధించిన ఓ పులి మాత్రం భిన్నంగా కొన్ని రోజులపాటు అసాధారణ రీతిలో ప్రవర్తించింది. తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రోడ్ల వెంబడి, జనావాసాలు, వ్యవసాయ భూముల వద్ద తచ్చాడుతూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. దీంతో ఆ పులిని బంధించిన అధికారులు దాని ప్రవర్తనకు గల కారణాలు ఏమిటో కనిపెట్టే పనిలో పడ్డారు.పులి నుంచి పలు నమూనాలు సేకరించి వాటిని హైదరాబాద్లోని సీసీఎంబీతోపాటు బెంగళూరులోని మరో ల్యాబ్కు పరీక్షల నిమిత్తం పంపారు. అలాగే మరిన్ని పరీక్షలు చేపట్టేందుకు వీలుగా దాన్ని చంద్రాపూర్లోని ట్రాన్సిట్ ట్రీట్మెంట్ సెంటర్ (టీటీసీ)కు తరలించారు. ఈ అంశంపై స్పష్టత వచ్చాక తెలంగాణ అటవీ అధికారులతో వివరాలు పంచుకుంటామని చెబుతున్నారు.మనుషులపై దాడి ఆ పులి పనేనా?మహారాష్ట్ర–తెలంగాణ సరిహద్దులో ఇటీవల ఓ పులి పలువురిని హతమార్చింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒకరిని చంపడంతోపాటు మరొకరిపై దాడి చేసింది. అలాగే మహారాష్ట్ర సరిహద్దు వెంబడి ఉన్న గ్రామాల్లోనూ పలువురిని చంపింది. పత్తి ఏరివేత సీజన్లో చోటుచేసుకున్న ఈ ఘటనలు ఇరు రాష్ట్రాల్లోని అటవీ ప్రాంత గ్రామాల ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా పట్టుబడిన పులి అదేనా అని నిర్ధారించుకొనేందుకు అటవీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. పులి నేపథ్యం ఏమిటో, అది ఎక్కడిదో తెలుసుకొనే ప్రయత్నాలు మొదలుపెట్టారు.ఆ పులి ప్రవర్తన తెలుసుకోవడం కష్టమే.. పులుల సహజ స్వభావాన్ని బట్టి చూస్తే వాటికి మనుషుల పొడ గిట్టదు. అకస్మాత్తుగా పులి ఎదురైతే మనిషి ఎలా భయాందోళనకు గురవుతాడో అంతకంటే ఎక్కువగా పులి భయానికి గురవుతుంది. మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి ప్రవేశిస్తున్న పులులను గమనిస్తే అవి అక్కడ కూడా మనుషులు, పశువులపై దాడులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ పులులు ఇక్కడకు వచ్చాక కూడా ఆ అలవాటును మానుకోలేక పోతున్నట్లు అంచనా వేస్తున్నాం. పులుల కదలికలు ఎలా ఉంటాయో కచ్చితంగా చెప్పలేం. చంద్రాపూర్లో బంధించిన పులి నుంచి సేకరించిన నమూనాలతో వాటి అసాధారణ ప్రవర్తన గురించి తెలుసుకోవడం కొంచెం కష్టమే.– ఎ.శంకరన్, వైల్డ్లైఫ్ ఓఎస్డీ, తెలంగాణ అటవీశాఖ -
మెట్లపల్లిలో మరోసారి పులి కలకలం
గన్నవరం రూరల్: కృష్ణా జిల్లా గన్నవరం మండలం మెట్లపల్లి గ్రామంలో మరోసారి పులి సంచారం కలకలం రేపింది. గతేడాది డిసెంబర్ 18న ఇదే గ్రామంలో తోటలో పులి ఉచ్చులో చిక్కుకుని మరణించింది. తాజాగా ఆదివారం తెల్లవారుజామున ఇదే ప్రాంతంలో రోడ్డు దాటుతున్న పులిని చూసినట్లు ఆర్టీసీ కండక్టర్ చెప్పారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం కలటూరుకు చెందిన బొకినాల రవికిరణ్ గన్నవరం ఆర్టీసీ డిపోలో కండక్టర్. విధుల నిమిత్తం గన్నవరం డిపోకు తెల్లవారుజాము 3 గంటల సమయంలో బైక్పై వస్తుండగా సగ్గూరు–మెట్లపల్లి దారిలో పులి పిల్ల ఎదురైంది.దానిని చూసిన రవి కిరణ్ భయాందోళనకు లోనై సమీపంలోని సగ్గూరు వెళ్లి గ్రామస్తులకు చెప్పారు. వారు పోలీసులకు సమాచారమిచ్చారు. మెట్లపల్లి, వీరపనేనిగూడెం గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించగా ఫారెస్ట్ గార్డు కుమారి గ్రామానికి వచ్చారు. పులి సంచరించిన ఆనవాళ్లను గుర్తించేందుకు ప్రయత్నించారు. జొన్న చేను వెంట పులి అడుగులు ఉన్నట్లుగా రైతులు ఆమెకు చూపించారు. ఈ అటవీ ప్రాంతంలో పులులు ఉన్నాయని ఆ ప్రాంత ప్రజలు, రైతులు ఆందోళన చెందుతున్నారు. అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
మగ తోడును వెతుక్కుంటూ ఓ ఆడపులి యాత్ర
ఒడిశా టైగర్ రిజర్వు నుంచి తప్పించుకున్న ఆడ పులి జీనత్.. 21 రోజుల్లో 3 రాష్ట్రాల్లోని 300 కిలోమీటర్ల పయనంరేడియో కాలర్ ఉన్నా ఎక్కడా ఉచ్చులో పడకుండా ముప్పుతిప్పలు పెట్టిన పులి.. దొరికినట్టే దొరికి జారిపోవడంతో పరుగులు పెట్టిన అటవీ శాఖఎట్టకేలకు బెంగాల్లోని బంకురా జిల్లాలో బంధించిన అధికారులుమొన్నటికి మొన్న జానీ అనే మగ పులి.. తోడు కోసం మహారాష్ట్ర ఆడవుల నుంచి వచ్చి.. తెలంగాణలో వందల కిలోమీటర్లు చక్కర్లు కొట్టింది. ఇప్పుడేమో జీనత్ అనే ఈ ఆడపులి మగతోడు కోసం ఒడిశాలోని టైగర్ రిజర్వు నుంచి తప్పించుకొని 3 రాష్ట్రాల్లో 300 కిలోమీటర్లు పయనించింది. లవ్.. ఇష్క్.. కాదల్.. పేరేదైనా ఓసారి ప్రేమలో పడితే.. ఇదిగో ఇలా లవర్ కోసం పడరాని పాట్లు పడాల్సిందే. జానీ ప్రేమ కథ మనకు తెలిసిందే.. జీనత్ లవ్ స్టోరీని ఇప్పుడు తెలుసుకుందాం.సాక్షి, అమరావతి : మగ తోడును వెతుక్కుంటూ దట్టమైన అటవీ ప్రాంతం నుంచి తప్పించుకున్న ఒక ఆడ పులి మూడు రాష్ట్రాల అధికారులను ముప్పతిప్పులు పెట్టింది. దాని శరీరానికి అమర్చిన రేడియో కాలర్ ద్వారా అది ఎక్కడె క్కడికి వెళుతుందో తెలుసుకుంటూ అనేకచోట్ల ఉచ్చులు వేసినా ఎక్కడా చిక్కకుండా తప్పించుకుని తిరిగింది. 21 రోజులపాటు ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ అటవీ ప్రాంతాల్లోని 300 కిలోమీటర్ల మేర అది ప్రయాణించింది. మధ్యలో కొన్నిసార్లు జనావాసాలకు దగ్గరగా రావడంతో ఆయా ప్రాంతాల ప్రజలు వణికిపోయారు. మూడు రాష్ట్రాల అటవీ శాఖల అధికారులు దాని పాదముద్రలు, ఇతర గుర్తులు, రేడియో కాలర్ ద్వారా ఎప్పటికప్పుడు జాడ తెలుసుకుని వెళ్లినా అది వారి కళ్లు గప్పి తప్పించుకుని వెళ్లిపోయేది. చివరికి 21 రోజుల తర్వాత పశ్చిమ బెంగాల్లోని బంకురా జిల్లాల్లో దానికి మత్తు మందు ఇచ్చి బంధించడంతో ఆయా రాష్ట్రాలు ఊపిరి పీల్చుకున్నాయి.మహారాష్ట్ర నుంచి తెచ్చి..ఒడిశాలోని సిమ్లిపాల్ టైగర్ రిజర్వు ప్రాంతంలో పులుల సంతతిని పెంచేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా నవంబర్ 14న మహారాష్ట్రలోని తడోబా–అంధారి టైగర్ రిజర్వ్ నుంచి జీనత్, యమున అనే ఆడ పులులను ఒడిశాలోని సిమ్లిపాల్ టైగర్ రిజర్వుకు తీసుకొచ్చారు. కొత్త ప్రాంతం కావడంతో జీనత్ను 10 రోజులపాటు అలవాటు పడేందుకు సాఫ్ట్ ఎన్క్లోజర్లో ఉంచి నవంబర్ 24న సిమ్లిపాల్ కోర్ ఏరియాలో వదిలారు. మొదట్లో రెండు పులులు సిమ్లిపాల్ పరిధిలోనే తిరిగాయి. డిసెంబర్ 8న మూడేళ్ల జీనత్ టైగర్ రిజర్వు పరిధి దాటేసి తప్పించుకోవడంతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. దాని శరీరానికి రేడియో కాలర్ అమర్చి అది తిరిగే ప్రాంతాలను అధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకునేవారు. కొన్నిసార్లు రేడియో కాలర్ సిగ్నల్ బలహీనంగా ఉండటంతో దాన్ని ట్రాక్ చేయడం సాధ్యమయ్యేది కాదు. అందుకే పలుచోట్ల నైలాన్ ఉచ్చులు వేసి, మత్తు బాణాలు వదిలినా అది దొరకలేదు. ట్రాన్స్లొకేషన్ షాక్తోనే..అలా వెళుతూ అది ఒడిశా నుంచి జార్ఖండ్లోని అటవీ ప్రాంతంలోకి ప్రవేశించడంతో అక్కడి అటవీ గ్రామాల ప్రజలు వణికిపోయారు. పులి పాదముద్రలు గుర్తించేలోపే మరో చోటుకు వెళ్లిపోయేది. ఆ తర్వాత జార్ఖండ్ దాటి మరో వంద కిలోమీటర్లు ప్రయాణించి పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశించింది. మొదట ఝార్గ్రామ్లో స్థానికుల్ని హడలెత్తించింది. చివరకు అడపాదడపా వచ్చిన సిగ్నల్స్ ఆధారంగా 21 రోజుల తర్వాత బంకురా జిల్లాలోని గోసైందిహి ప్రాంతంలో జీనత్ జాడ కనిపెట్టి మత్తు మందు ఇచ్చి బంధించారు. మూడు వారాల్లో మూడు రాష్ట్రాల్లో కలకలం రేపిన పులిని బంధించారన్న సమాచారంతో ఆయా రాష్ట్రాలు ఊపిరి పీల్చుకున్నాయి. పశి్చమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పులిని బంధించడంపై సంతోషం వ్యక్తం చేశారు. పట్టుకున్న తర్వాత పరీక్షించగా అది ఆరోగ్యంగా, చురుగ్గా ఉన్నట్టు గుర్తించారు. అయితే.. తన భూభాగం కాకపోవడంతో అది ట్రాన్స్లొకేషన్ షాక్కు గురైనట్టు భావిస్తున్నారు. పులులు సాధారణంగా తమ భూభాగం దాటి తిరగవు. బయట ప్రాంతం కావడం, ఆ ప్రాంతంలో ఇతర పులులు కూడా ఉండటంతో అది సర్దుకోలేక, దిక్కు తెలియక ఎటు పడితే అటు వెళ్లినట్టు అటవీ శాఖాధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా మగ తోడు కోసం వెతుకులాట కూడా ఒక కారణం కావచ్చని అంటున్నారు. -
పులి తిరుగుతోంది.. జాగ్రత్త
నర్సంపేట: వరంగల్ జిల్లాలో పులి సంచారం వార్త ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో పెద్దపులి పాదముద్రలను గుర్తించిన అధికారులు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా వ్యవసాయ పనులకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. ఇటీవల ఆదిలాబాద్ జిల్లా నుంచి ఉమ్మడి వరంగల్లోకి ప్రవేశించిన పెద్దపులి నల్లబెల్లి, ఖానాపురం, నర్సంపేట ఏజెన్సీ పల్లెల్లో తిరుగుతున్నట్లు ఆనవాళ్లు గుర్తించారు. మూడు రోజుల క్రితం నల్లబెల్లి మండలం రుద్రగూడెం సమీప అడవిలో పులి తిరిగింది. స్థానికుల సమాచారంతో అటవీ అధికారులు పులి పాద ముద్రలు పరిశీలించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.గ్రామాల్లో చాటింపు చేశారు. తర్వాత ఖానాపురం మండలంలో కూడా పులి సంచరించినట్లు సమాచారం రాగా అధికారులు స్థానికులకు జాగ్రత్తలు చెప్పారు. ఆదివారం నర్సంపేట మండల పరిధిలోకి పెద్దపులి వచ్చినట్లు తెలియడంతో ఇక్కడి పల్లెల్లో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా పశువులు, గొర్రెలు, మేకలను అటవీ ప్రాంతానికి తీసుకెళ్లే కాపరులు కొద్ది రోజులు మైదాన ప్రాంతాల్లోనే మేపుకోవాలని నర్సంపేట ఇన్స్పెక్టర్ రమణమూర్తి సూచించారు. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని, గుంపులుగా వెళ్లి పనులు త్వరగా ముగించుకొని సాయంత్రం కాక ముందే ఇళ్లకు చేరుకోవాలని చెప్పారు. డ్రోన్ కెమెరాలతో.. మూడు రోజులుగా నల్లబెల్లి మండలంలో సంచరిస్తున్న పెద్ద పులి రుద్రగూడెం, కొండాయిపల్లి శివారులోని పలుగు ఏనే (కొండ ప్రాంతం) నుంచి అటవీ బాట పట్టింది. పులి పాదముద్రల ఆధారంగా అది మహబూబాబాద్ జిల్లా పరిధిలోని అటవీ ప్రాంతానికి వెళ్లినట్లు ఫారెస్ట్ అధికారులు నిర్ధారించారు. రుద్రగూడెం, కొండాయిల్పల్లి గ్రామస్తుల అభ్యర్థన మేరకు నర్సంపేట ఎఫ్ఆర్ఓ రవికిరణ్ పర్యవేక్షణలో అటవీ సిబ్బంది.. డ్రోన్ కెమెరా సహాయంతో పలుగు ఏనే ప్రాంతాన్ని చిత్రీకరించి పరిశీలించారు. ఇక్కడే పులి సేద తీరినట్లు ఎఫ్ఆర్ఓ తెలిపారు. కాగా, పెద్దపులి అటవీ ప్రాంతానికి తరలివెళ్లినట్లు స్పష్టం కావడంతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. -
పెద్దపులి కనిపిం‘చేను’!
నల్లబెల్లి/మన్ననూర్: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని కొండాపూర్, మూడుచెక్కలపల్లి, ఒల్లేనర్సయ్యపల్లి, రుద్రగూడెం, కొండాయిల్పల్లి గ్రామాల శివారులో పెద్దపులి సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ ప్రాంతాలను వదిలి గ్రామాల సమీపంలోని పంటచేలల్లో పెద్దపులి సంచరించడంతో.. రైతులు, కూలీలు వ్యవసాయ పనులకు వెళ్లేందుకు జంకుతున్నారు. కొండాపూర్ అటవీ ప్రాంతం నుంచి ఆడపులి, పిల్ల పులి మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని కోనాపురం వైపు వెళ్లినట్లు అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. కొండాపూర్ అటవీ ప్రాంతం నుంచి మగ పెద్దపులి మూడుచెక్కలపల్లి, ఒల్లేనర్సయ్యపల్లి గ్రామాల మీదుగా రుద్రగూడెం, కొండాయిపల్లి గ్రామాల మధ్యలోని పలుగుఏనె (గుబురు చెట్లతో కూడుకున్న అటవీ ప్రాంతం) వరకు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. కానీ, ఒల్లేనర్సయ్యపల్లి, రుద్రగూడెం గ్రామాల్లో శనివారం తిరుగు ప్రయాణంలో పెద్దపులి సంచరించినట్లు పలువురు చెబుతున్నారు. కాగా పోలీసులు, అటవీ శాఖ, స్ట్రైక్ఫోర్స్ అధికారులు పంట చేలలో పులి కదలికలను పరిశీలించి పాదముద్రలను సేకరించారు. మొక్కజొన్న చేనులో సేదదీరిన ప్రాంతాన్ని గుర్తించారు. అవన్నీ పెద్దపులి పాదముద్రలేనని, తిరిగి వెళ్లలేదని నిర్ధారించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సఫారీలో పెద్దపులి సందడి అమ్రాబాద్ పులుల రక్షిత అభయారణ్యం సఫారీ వాహన సందర్శకులకు శనివారం ఉదయం పెద్ద పులి కనిపించింది. ఫర్హాబాద్ సఫారీ పాయింట్ నుంచి వ్యూ పాయింట్కు సందర్శకులు వాహనంలో వెళ్తుండగా.. మార్గమధ్యలో పెద్దపులి అటవీశాఖ ఇంటర్నల్ రోడ్డు దాటుతూ కనిపించింది. అకస్మాత్తుగా చెట్ల మధ్యనుంచి వాహనం సమీపంలోకి పెద్దపులి రావడంతో సందర్శకులు కొంత భయపడినా.. దగ్గరి నుంచి చూశామని సంతోషపడ్డారు. -
మళ్లీ కనిపించిన పులి
మంచిర్యాలరూరల్ (హాజీపూర్): మంచిర్యాల జిల్లా ముల్కల్ల, పాతమంచిర్యాల అటవీ సెక్షన్ పరిధిలోని గఢ్పూర్లో పులులు కెమెరాకు చిక్కాయి. గఢ్పూర్ సఫారీ మార్గంలోని ఓ చెట్టుకు అటవీశాఖ ఏర్పాటు చేసిన కెమెరాకు రెండుసార్లు వేర్వేరు పులులు చిక్కడం గమనార్హం. గత నెల 12న ఇదే కెమెరా మగపులి వెళుతున్న ఫొటోను తీయగా, తాజాగా బుధవారం ఉదయం ఇదే దారి వెంట వెళుతున్న ఆడపులి ఫొటోను తీసింది. అటవీ అధికారులు అడుగులను పరిశీలించి పులిగా నిర్ధారించారు. మిరప చేనులో పెద్దపులి కౌటాల: కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఓ మిరప చేనులో పెద్దపులి సంచారం కలకలం రేపింది. కౌటాల మండలం గుండాయిపేటకు చెందిన జాడే నవీన్ మిరప చేనుకు గురువారం ఉదయం నీళ్లు పెట్టేందుకు వెళ్లాడు. చేనులో పడుకుని ఉన్న పులిని చూసి భయపడి గ్రామానికి పరుగులు తీశాడు. సమాచారం అందుకున్న కాగజ్నగర్ ఎఫ్డీవో వినయ్కుమార్ సాహూ, అధికారులు పాదముద్రలు పరిశీలించి పెద్దపులి అడుగులుగా నిర్ధారించారు. మహారాష్ట్ర నుంచి వార్దానది దాటి వచ్చినట్టు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. -
బెబ్బులి బెదురుతోంది!
దేశంలోనే విస్తీర్ణంలో అతి పెద్దదైన పెద్దపులుల అభయారణ్యం శ్రీశైలం – నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ (ఎన్ఎస్టీఆర్). అలాంటి చోటే వాటికి పెను ముప్పు ఎదురవుతోంది. పెరుగుతున్న పులుల సంతతికి తగ్గట్టు ఆవాసం, ఆహార లభ్యత దొరకడం లేదు. వీటి ప్రధాన ఆహార జంతువులైన దుప్పులు, కణుతుల సంఖ్య పెరగకపోగా రోజురోజుకు వాటి సంఖ్యలో తరుగుదల కనిపిస్తోంది. ఇందుకు అటవీ పరిధిలో వేటగాళ్లు మాటు వేయడం.. వారిని కట్టడి చేసే స్థాయిలో సిబ్బంది సంఖ్య లేకపోవడంతో ఎంతో భద్రమైనదిగా భావించే నల్లమలలోనే వాటి సంరక్షణ గాలిలో దీపంలా మారింది.ఆత్మకూరు రూరల్: అటవీ ఆవరణ వ్యవస్థలో అగ్రభాగాన ఉండే పెద్దపులులు అధికారిక లెక్కల ప్రకారం శ్రీశైలం– నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్లో 87 ఉన్నాయి. అయితే, పులులు పెరిగే కొద్ది వాటి ఆవాస ప్రాంతం, ఆహార లభ్యత పెరగడం లేదు. ఇందుకు తగినన్ని గడ్డి మైదానాలు అభివృద్ధి కాలేదు. పులుల ప్రధాన ఆహార జంతువుల సంఖ్య పెరగడమూ లేదు. నల్లమలలోని ఆత్మకూరు, నంద్యాల , గిద్దలూరు,మార్కాపురం డివిజన్లలో వేటగాళ్ల కదలికలు రోజురోజుకు పెరుగుతుండడమే అందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. అటవీ సమీప గ్రామాల్లో తిష్టవేసిన కొందరు వేటగాళ్లు గడ్డితినే జంతువులు సంచరించే నీటివనరుల వద్ద, జేడ (సాల్ట్ లిక్)మైదానాల వద్ద ఉచ్చులు వేసి మాటు గాస్తున్నారు. ఆ ఉచ్చులకు చిక్కిన వన్యప్రాణులను మాంసంగా మార్చి పట్టణాల్లో పెద్ద మొత్తానికి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రమాదకర స్థితిలో పులి ఎంతో భద్రమైనదని భావించే ఎన్ఎస్టీఆర్ లో ప్రాణాంతక వైరస్లా వేటగాళ్ల చొరబాటు పెరుగుతోంది. ఇందుకు ప్రధాన కారణం సిబ్బంది కొరతేనన్నది విస్పష్టం.ఎన్ఎస్టీఆర్ సర్కిల్లో మొత్తం నాలుగు డివిజన్లలో 750 (ఇది పాత లెక్క)మంది సిబ్బంది ఉండాల్సిన చోట కేవలం 250 మందే ఉన్నారు. ఈ అరకొర సిబ్బందితో వేటగాళ్లను నియంత్రించ లేని పరిస్థితి. ఫలితంగా పులి సంరక్షణ ప్రమాదకర స్థితిలో పడింది. ఫుట్ పెట్రోలింగ్కు అదే సమస్య అటవీ సంరక్షణలో రోజువారి ఫుట్ పెట్రోలింగ్ ( కాలి నడకతో ప్రదేశాన్ని చుట్టి రావడం)కు కూడా సిబ్బంది కొరతే ప్రధాన అడ్డంకిగా ఉంది. సుమారు 3,750 చ.కిమీ విస్తీర్ణంలో ఉన్న విశాలమైన ఎన్ఎస్టీఆర్లో ఫుట్ పెట్రోలింగ్కు ఉన్న వనరులు కేవలం బేస్ క్యాంప్ సిబ్బంది మాత్రమే. పులి సంరక్షణలో మేటి అని చెప్పుకునే ఆత్మకూరు అటవీ డివిజన్లో ఉన్న 23 బేస్ క్యాంపుల్లో సుమారు వంద మంది ప్రొటెక్షన్ వాచర్లు పని చేస్తుంటారు.అయితే, వీరిలో కొందరు వీక్లీ ఆఫ్లో ఉంటారు. మిగతా వారిని ప్రత్యేకించి ఫుట్ పట్రోలింగ్కు కేటాయించలేని పరిస్థితి. ప్రొటెక్షన్వాచర్లను పర్యవేక్షించేందుకు ఒక్కో బేస్ క్యాంపులో ఒక రెగ్యులర్ అటవీ సిబ్బంది ఉండాలి. ఈ రూల్ పుస్తకాలకు మాత్రమే పరిమితమైంది. వేధిస్తోన్న ఆహార కొరత .. శ్రీశైలం – నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్లో ఉన్న ఆహార లభ్యతను బట్టి ఒక్కో పెద్దపులి తన అధీన ప్రాంతం (టెరటరీ)గా సుమారు 40 చ.కిమీ పరిధిని ఉంచుకుంటోంది. పులి సాధారణంగా ఆరు సార్లు దాడులు చేస్తే ఒకసారి వేట సాఫల్యమవుతుంది. ఇందుకోసం అది ఆరు రోజులు కూడా ఆకలితో నకనకలాడాల్సి ఉంటుంది. కనీసం వారానికో జంతువును వేటాడినా ప్రస్తుతం నల్లమలలో ఉన్న పులులకు వారానికి సుమారు 90 ఆహార జంతువులు అవసరమవుతాయి. నెలకు 360, సంవత్సరానికి దరిదాపుగా నాలుగు వేలకు పైగా జంతువులు అందుబాటులో ఉండాలి. ఇది కనిష్ట అవసర స్థితి. ఈ నిష్పత్తిలో ఆహార లభ్యత లేక పోతే పులుల ఆధీన ప్రాంతం క్రమేపీ పెరుగుతుంది. దీంతో పులుల మధ్య ఆహారం కోసం యుద్ధాలు జరుగుతాయి. ఈ పోరులో ఎన్నో పులులు మరణించే అవకాశం ఉంది. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో పులి ఆహారం వేటగాళ్ల చౌర్యానికి గురైతే జరిగే నష్టం లెక్కకట్టలేనిది. అడపాదడపా కేసులు... శిక్షలు శూన్యం? అటవీ అధికారులు అడపాదడపా ఎవరో ఒకరిని వన్యప్రాణి వేట కేసుల్లో పట్టుకుని కేసులు పెడుతున్నారు. అయితే, వారిలో ఏ ఒక్కరికీ కఠిన శిక్షలు పడిన దాఖలాలు లేవు. ఇందుకు ప్రధాన కారణం కూడా సిబ్బంది కొరతే. కనీసం పీఓఆర్ను కాని చార్జ్ షీట్ను కాని ముద్దాయిలకు శిక్ష పడేలా రాసుకోలేని పరిస్థితి. ఈ ఏడాది జనవరిలో ఆత్మకూరు రేంజ్ లోని గుమ్మడాపురం కు చెందిన కొందరు దుప్పి తలతో అధికారులకు చిక్కారు.ఇదే రేంజ్ లోని శివపురం సమీపంలో ఏప్రిల్ నెలలో ఇద్దరు ఎలుగు బంటి మాంసంతో చిక్కారు. ముసలమడుగు సమీపంలో అక్టోబర్ నెలలో కొందరు అడవి పంది మాంసంతో పట్టుబడ్డారు. వీరందరిపై పీఓఆర్ నమోదు అయి కోర్టు ముందు హాజరు పరిచారు. అయితే వారిపై సరైన సెక్షన్లు పెట్టకపోవడంతో నిందితులు 24 గంటల్లో బెయిల్పై తిరిగి వస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.ఉచ్చులతో పులికీ ప్రమాదంవేటగాళ్లు పులి ఆహార జంతువులైన జింకల కోసం నీటి వనరుల వద్ద ఉచ్చులు పన్ని ఉంచు తారు. అయితే ఈ ఉచ్చులలో ప్రమాదవశాత్తు అప్పుడప్పుడు పెద్ద పులులు కూడా చిక్కు కుని మరణిస్తుంటాయి. గతంలో సిద్దాపురం చెరువులో పన్నిన ఉచ్చులకు ఓ పెద్దపులి చిక్కుకుని ప్రాణాలు కోల్పోగా రెండేళ్ల కిందట ఆత్మకూరు డివిజన్ లోని నల్లకాల్వ సెక్షన్ లో ఓ పులి కళేబరం గాలేరు ప్రవాహంలో కొట్టుకు వచ్చింది. దాని మెడలో ఒక ఉచ్చు బిగిసి ఉంది. ఇలా వేటగాళ్ల వల్ల పులుల ఆహార జంతువులు తగ్గిపోవడంతో పాటు కొన్నిసార్లు అవి కూడా ప్రాణాలు కోల్పోవాల్సి రావడం ఆందోళన కలిగిస్తోంది. అదే పూర్తి స్థాయిలో సిబ్బంది ఉంటే వేటగాళ్లను నియంత్రిచవచ్చు. ఆ దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాగా దీనిపై ఎన్ఎస్టీఆర్ ఆత్మకూరు డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ సాయిబాబా వివరణ కోరగా ప్రస్తుతం సిబ్బంది కొరత ఉందని, కింది స్థాయిలో రిక్రూట్మెంట్ జరగడం లేదని, తమ వరకు పులుల సంరక్షణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు.ఎవరీ వేటగాళ్లు... నల్లమల పులి ఆహారానికి పీడగా మారిన వేటగాళ్ల గురించి ఆరా తీస్తే కొన్ని ఆసక్తి కర విషయాలు బయట పడుతున్నాయి. ప్రధానంగా ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలో వేటగాళ్ల కదలికలను గమనిస్తే అవి ఎక్కువగా మండలంలోని వెంకటాపురం, నల్లకాల్వ, కొత్తరామాపురం,సిద్దాపురం పరిధిల్లోనే కనిపిస్తున్నాయి. మండలంలోని మాజీ నేరస్తుల ఆవాస గ్రామానికి చెందిన కొందరు దాదాపు ప్రతి గ్రామంలోనూ తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకుని అక్కడ అక్రమ మద్యం దుకాణాలు నడుపుతున్నారు. ఆయా గ్రామాల్లో ఉండే లుంపెన్ తరగతులకు చెందిన యువకులను తమ వెంట తిప్పుతూ ఇటు నాటుసారా అక్రమ రవాణాకు, అటు వన్యప్రాణుల వేటకు వినియోగించుకుంటున్నారు. -
తాడ్వాయి అడవుల్లో పెద్దపులి!
మంగపేట: కొద్దిరోజులుగా ములుగు జిల్లా ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న పెద్దపులి.. తాజాగా తాడ్వాయి మండలం పంబాపూర్ అటవీ ప్రాంతం నార్త్ బీటు పరిధిలో సంచరించినట్లు అటవీశాఖ మంగపేట రేంజ్ అధికారి అశోక్ తెలిపారు. పంబాపూర్కు చెందిన రమేష్ అనే వ్యక్తి పులి గాండ్రింపులు వినిపించాయని చెప్పడంతో తాడ్వాయి రేంజ్ అధికారి సత్తయ్యతో కలిసి ఆ ప్రాంతానికి వెళ్లి పులి జాడ కోసం గాలించారు. పంబాపూర్ అటవీ ప్రాంతంలోని వట్టివాగు సమీపం వరకు వెళ్లిన పులి, తిరిగి వెనక్కి వచి్చనట్లు ఆనవాళ్లను గుర్తించారు. అది మంగపేట మండలం కొత్తూరు మొట్లగూడెం లేదా మల్లూరువాగు ప్రాజెక్టు అటవీ ప్రాంతానికి లేదా కాటాపురం, గంగారం మీదుగా లవ్వాల అడవుల్లోకి వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో అటవీ సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. పాదముద్రల సేకరణ ములుగు జిల్లా మంగపేట మండల పరిధి చుంచుపల్లి, తిమ్మాపురం అటవీ ప్రాంతంలో రెండు రోజుల నుంచి పెద్ద పులి సంచరించిన ప్రాంతాన్ని జిల్లా అటవీశాఖ అధికారి (డీఎఫ్ఓ) రాహుల్ కిషన్జాదవ్ గురువారం సందర్శించారు. చుంచుపల్లి, పాలాయిగూడెం గ్రామాల మధ్య గోదావరి నదిని దాటివచ్చిన ప్రాంతంలో పులి పాదముద్రలను పరిశీలించారు. అనంతరం తిమ్మాపురం అటవీ ప్రాంతంలోని చౌడొర్రె వద్ద పులి పాద ముద్రలను పీఓపీ విధానం ద్వారా సేకరించారు. -
పులి కలకలం.. నాలుగేళ్ల క్రితం కూడా ఆడ పులి కోసమే..
ఇల్లెందురూరల్/చుంచుపల్లి: ఆదిలాబాద్ జిల్లాలో కొంతకాలం హడలెత్తించిన పెద్దపులి క్రమంగా కరీంనగర్, వరంగల్, ములుగు జిల్లాలు దాటుకుంటూ భద్రాద్రికొత్తగూడెం జిల్లాకి ప్రవేశించింది. పాదముద్రల ఆధారంగా పులి భద్రాద్రి జిల్లాలోకి వచ్చినట్లు ములుగు జిల్లా తాడ్వాయి అటవీశాఖ అధికారులు తెలిపినట్లు ఇక్కడి అధికారులు చెబుతున్నారు. గురువారం కరకగూడెం మీదుగా గుండాల వైపునకు పెద్దపులి ప్రయాణం సాగినట్లు అటవీశాఖ అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో జిల్లాలోని అడవికి ఆనుకుని ఉన్న ఏజెన్సీ మండలాల్లో అటవీశాఖ అప్రమత్తమైంది.మేటింగ్ సీజన్ కావడంతో..సాధారణంగా చలికాలం అంటే నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు పులులకు మేటింగ్ (సంభోగం) సీజన్. ఈ సమయంలోనే మగ పెద్దపులి ఆడతోడు కోసం వెదుకుతుంది. దశాబ్దాల క్రితం పులులకు ఆవాసాలుగా ఉన్న ప్రాంతాల్లో కలియతిరిగే అలవాటు ఉంటుంది. ఈ క్రమంలో గోదావరి పరీవాహక ప్రాంతం వెంట అక్టోబర్లో తన ప్రయాణాన్ని ప్రారంభించిన పులి తాజాగా జిల్లాలోకి ప్రవేశించింది.నాలుగేళ్ల క్రితం కూడా ఆడ పులి కోసమే..నాలుగేళ్ల క్రితం జిల్లాలో పెద్దపులి సంచారం కనిపించింది. 2020 నవంబర్లో మగపెద్దపులి ఆడతోడు కోసం ములుగు జిల్లా నుంచి కరకగూడెం, ఆళ్లపల్లి, మామకన్ను అటవీ ప్రాంతాలలో సంచరించింది. అక్కడి నుంచి ఇల్లెందు మండలంలో పాండవుల గుట్ట మీదుగా మహబూబాబాద్ జిల్లాలోకి ప్రవేశించి తిరిగి ఆదిలాబాద్ దిశగా తన ప్రయాణం కొససాగించింది. ఆ సమయంలో జిల్లాలో ఎక్కడా మనుషులపై దాడి చేసిన ఘటన లేకపోవడంతో మ్యాన్ఈటర్ కాదని, ఆడతోడు కోసమే ఇటుగా వచ్చినట్లు అటవీశాఖ అధికారులు అప్పట్లో పేర్కొన్నారు. ఆ తర్వాత 2022లో మరోసారి పెద్దపులి సంచారం తిరిగి చలికాలంలోనే సాగింది.పూర్వం పులులకు అడ్డాగా..పూర్వం భద్రాద్రి జిల్లాలోని ఇల్లెందు, గుండాల, పాండవుల గుట్ట, పూర్వ వరంగల్ జిల్లా పాఖాల కొత్తగూడెం అటవీ ప్రాంతం పెద్దపులుల సంచారానికి అడ్డాగా ఉండేది. 2000 సంవత్సరంలోనూ ఈ ప్రాంతం దట్టమైన అడవులతో అల్లుకుపోయి ఉండేది. పులుల నివాసానికి అనుగుణంగా కనిపించే గుహలు పాండవుల గుట్ట ఏడు బావుల ప్రదేశాల్లో నేటికీ దర్శనమిస్తాయి. ఆ సముదాయాన్ని పులి గుహగా పిలుస్తుంటారు. 2000 సంవత్సరంలో నవంబర్లోనే ఈ ప్రాంతంలో పెద్దపులి సంచరించినట్లు ప్రచారంలో ఉంది. బయ్యారం మండలం మిర్యాలపెంట గ్రామానికి చెందిన ఓ గిరిజన రైతుకు చెందిన రెండు ఆవులను పెద్దపులి సంహరించింది. గ్రామ సమీపం వరకు దట్టమైన అడవి ఉండటంతో పులి సంచారాన్ని నాడు గిరిజనులు పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత పులుల ఆవాసంగా గుర్తింపు పొందిన పాండవుల గుట్ట అటవీ ప్రాంతంలో రెండు దశాబ్దాల తరువాత అంటే 2020లో, ఆ తర్వాత 2022లో పెద్దపులి సంచరించింది. ప్రస్తుతం మరో రెండేళ్ల తర్వాత తాజాగా మరోసారి పెద్దపులి జిల్లాలోకి ప్రవేశించి పాండవుల గుట్టకు చేరుకునే దిశగా తన ప్రయాణం సాగిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు అనుమానించి అప్రమత్తమయ్యారు.అప్రమత్తమైన అధికారులుపెద్దపులి సంచారం జిల్లాలోకి ప్రవేశించడంతో అటవీశాఖ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. అడవిని ఆనుకొని ఉన్న ములుగు జిల్లా సరిహద్దు గుండాల, ఆళ్లపల్లి మండలాలకు పెద్దపులి చేరుకుందన్న ప్రచారం జరగడంతో జాడ కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఇల్లెందు మండలం కొమరారం అటవీరేంజ్ పరిధిలో కూడా గాలింపు చేపట్టారు. ఆళ్లపల్లి మండలంతోపాటు అడవికి సరిహద్దున ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో పాదముద్రలను పరిశీలిస్తున్నారు. పలు చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిఘా పెంచారు. కాగా ఉన్నతాధికారుల ఆదేశాలతో ములుగు జిల్లాకు సరిహద్దున ఉన్న అటవీ ప్రాంతంలో గాలింపు, పాదముద్రల పరిశీలన చేపడుతున్నట్లు కొమరారం రేంజ్ అధికారి ఉదయ్ తెలిపారు. పాండవుల గుట్ట, ఏడు బావుల ప్రాంతంలో నిఘా పెంచామని వివరించారు.కిన్నెరసాని అభయారణ్యంలోకి ప్రవేశించిందా..?గుండాల: మూడు, నాలుగేళ్లుగా జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో పులి సంచరిస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చలికాలంలో జాతీయ జంతువు అడుగుజాడలు కనిపిస్తుండగా, ఏజెన్సీ గ్రామాల్లో ప్రజలకు కంటిమీద కునుకు ఉండటంలేదు. మళ్లీ పులి వచ్చిందని అటవీశాఖ అధికారులు చెబుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో పులి వచ్చినట్లు ప్రచారం సాగుతుండటంతో ప్రజలు వణికి పోతున్నారు. మూడు రోజులపాటు ములుగు జిల్లాలో సంచరించిన పులి మంగపేట, మల్లూరు అటవీ ప్రాంతాల నుంచి సరిహద్దు దాటి జిల్లాలోకి అడుగుపెట్టిందనే సమాచారం అటవీశాఖ అధికారులకు అందింది. దీంతో గుండాల, ఆళ్లపలి, రేగళ్ల, కాచనపల్లి ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. గురువారం తెల్లవారు జామున మల్లూరు గుట్టవైపు వెళ్లిందని పేర్కొంటున్నారు. దామరతోగు, రేగళ్ల, మర్కోడు, అడవిరామారం, కొమరారం అటవీ ప్రాంతాల్లోని నీటి కొలను, దారి మార్గాల్లో పులి అడుగుజాడలను గుర్తించే పనిలో ఉన్నారు. అడవుల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. పశువుల కాపరులు అడవులకు వెళ్లొద్దని, వ్యవసాయ పనులకు వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. తాడ్వాయి అడవి దాటిన పెద్దపులి దామరతోగు, రేగళ్ల, అడవిరామారం అడవి మార్గంలోని కిన్నెరసాని అభయారణ్యంలోకి ప్రవేశించవచ్చని భావిస్తున్నారు. ఎక్కడ ఏం జరుగుతుందోనని గిరిజన గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. -
పెద్దపులి ఎక్కడ?
మంగపేట: ములుగు జిల్లా వెంకటాపురం (కె), మంగపేట మండలాల పరిధి చుంచుపల్లి అటవీప్రాంతానికి వచ్చిన పెద్దపులి ఎటువైపు వెళ్లిందోనని అటవీ శాఖ అధికారులు సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. సుమారు 15 మంది అధికారులు బుధవారం గోదావరి తీర ప్రాంతం వెంట పులి ఆనవాళ్లను పరిశీలించారు. నిమ్మగూడెం పంచాయతీ పరిధి తిమ్మాపురం ముసలమ్మవాగు సమీపంలోని చౌడొర్రె ప్రాంతంలోని వరి పొలం వద్దకు వెళ్లిన రామచంద్రునిపేట గ్రామానికి చెందిన పగిళ్ల రంగయ్య, వెంకటేశ్వర్లుకు కొంతదూరంలో పెద్దపులి కనిపించింది.దీంతో భయపడిన రైతులు విషయాన్ని గ్రామస్తులకు చెప్పగా, సుమారు 30 మంది కలిసి పులి కనిపించిన ప్రాంతానికి వెళ్లారు. అప్పటికే అక్కడినుంచి పెద్దపులి సమీపంలోని ముసలమ్మగుట్ట అటవీ ప్రాంతంలోని మల్లూరు వాగు మధ్యతరహా ప్రాజెక్టువైపు ఉన్న రాళ్లవాగువైపు వెళ్లినట్లు అడుగులు కనిపించడంతో విషయాన్ని అటవీశాఖ అధికారులకు తెలిపారు. మంగపేట అటవీశాఖ ఇన్చార్జ్ రేంజ్ అధికారి అశోక్ మరో 20 మంది సెక్షన్, బీట్ ఆఫీసర్లతో ఆ ప్రాంతానికి చేరుకున్నారు. పులి పాద ముద్రలను గుర్తించిన అధికారులు అక్కడినుంచి సెర్చింగ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ముసలమ్మగుట్ట, కొప్పుగుట్ట అటవీప్రాంతంనుంచి అవతలి వైపు ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని కొత్తగూడెం, గోళ్లగూడెం మీదుగా కిన్నెరసాని అభయారణ్యంలోకి వెళ్లినట్లుగా భావిస్తున్నారు. రెండు రోజులుగా జిల్లాలో పెద్దపులి సంచరిస్తున్నా ఎలాంటిì ప్రాణనష్టం జరగకపోవడంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నట్లయింది. -
మకోడి–సిర్పూర్ రైల్వే ట్రాక్పై పెద్దపులి
కాజీపేట రూరల్/ సిర్పూర్ (టి)/ములుగు/వెంకటాపురం(కె): రైల్వే ట్రాక్ పై ఒక్కసారిగా పెద్దపులి కనిపించడంతో రైల్వే గ్యాంగ్మన్లు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని గజగజ వణికిపోయారు. తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు రైల్వే స్టేషన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కాజీపేట రైల్వే సబ్ డివిజన్ పరిధి తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులో సిర్పూర్ కాగజ్నగర్–మకోడి రైల్వే స్టేషన్ల మధ్య అన్నూర్ గ్రామంలో మంగళవారం ఉదయం రైల్వే ట్రాక్పై నుంచి వెళ్తున్న పులిని గ్యాంగ్మన్లు చూశారు. ట్రాక్ దాటుతున్న వీడియో తీశారు. వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందించారు. అధికారులు అప్రమత్తమై బందోబస్తు చర్యలు చేపట్టారు. ఆయా సెక్షన్లలో గల దట్టమైన అటవీ ప్రాంతాల సమీపంలో గల రైల్వే స్టేషన్ల యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. పులి తెలంగాణ సరిహద్దులో నుంచి మహారాష్ట్ర సరిహద్దులోకి ప్రవేశించి కావలి కారిడార్ దట్టమైన ఫారెస్ట్లోకి వెళ్లినట్లు గుర్తించారు. కాగా, సిర్పూర్ (టి) మండలం హుడికిలి గ్రామానికి చెందిన దంద్రే రావూజీ ఇంటి వద్ద కట్టేసి ఉన్న గేదె దూడపై మంగళవారం వేకువజామున పెద్దపులి దాడి చేసి చంపింది. గ్రామంలోకి పెద్దపులి రావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. అటవీశాఖ అధికారులు ఘటనాస్థలిని పరిశీలించి పాదముద్రలు గుర్తించారు. బోధాపురం అటవీ ప్రాంతంలో బెంగాల్ పులి ఆనవాళ్లు ఏడాదికాలంగా ప్రశాంతంగా ఉన్న ములుగు ఏజెన్సీ జిల్లాలో మళ్లీ పెద్ద పులి కలవరం మొదలైంది. రాయల్ బెంగాల్ టైగర్గా భావిస్తున్న ఈ పెద్దపులి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల, నిర్మల్ అటవీ ప్రాంతాలను దాటి ములుగు జిల్లా వెంకటాపురం (కె) మండలం బోధాపురం అటవీ ప్రాంతంలోకి ప్రవేశించినట్లుగా అటవీశాఖ అధికారి చంద్రమౌళి నిర్ధారించారు. ఈ పులి బోధాపురం గ్రామ సమీపంలోని గోదావరి నదిని దాటి మంగపేట మండలం మల్లూరు వైల్డ్ లైన్ జోన్ అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్లుగా అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. బోధాపురంతో పాటు ఆలుబాక గ్రామాల శివారుల్లోని గోదావరి లంకల్లో సాగు చేసిన పుచ్చతోట వద్ద సోమవారం రాత్రి సంచరించిందని, పెద్దగా గాండ్రించినట్లు ఆయా గ్రామాల ప్రజలు తెలిపారు. తోటల వద్ద కాపలాకు వెళ్లిన రైతులు మంగళవారం ఉదయం పరిశీలించగా పులి పాదముద్రలు కనిపించాయి. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆ ప్రాంతాన్ని పరిశీలించి పులి అడుగులుగా నిర్ధారించారు. పులులకు ఇది మేటింగ్ సమయం కావడం వల్ల గత ఏడాది ఇదే సమయంలో ఆడపులి ఒకటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లానుంచి ఏటూరునాగారం వైల్డ్ లైన్లో (ఎస్1) సంచరించింది. -
వనాలు వదిలి జనాల పైకి..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : వన్య మృగాలు వనాలు వదిలి జనాలపైకి పడుతున్నాయి. ఆవులు, మేకలను పులి తినేసి భయపెడుతుండగా, ఏనుగులు, ఎలుగుబంట్లు ఏకంగా మనషుల్నే చంపేస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో కొత్తూరు, వజ్రపుకొత్తూరు, మందస, వీరఘట్టం, సీతంపేట, పాతపట్నం, పలాస తదితర ప్రాంతాల్లో ఈ రకమైన ఘటనలు ఇప్పటికే జరిగాయి. దీంతో వన్య మృగాలు సంచరిస్తున్న వార్తలు వస్తే చాలు ఈ ప్రాంతాలు వణికిపోతున్నాయి. సరిగ్గా ఏడాది క్రితం..శ్రీకాకుళం జిల్లాలో కొంతకాలంగా పులులు, ఎలుగుబంట్లు, ఇతర జంతువులు జనారణ్యంలో సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. వజ్రపుకొత్తూరు, మందస మండలాల్లో ఎలుగుబంట్లు దాడులు చేస్తుండగా, కొత్తూరు, పాలకొండ, భామిని తదితర ప్రాంతాల్లో ఏనుగులు విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఇవి చాలదన్నట్టు మధ్యలో పులులు కూడా సంచరిస్తున్నాయి. గత ఏడాది నవంబర్లో ఇదే రకంగా పులి సంచరించగా సరిగ్గా ఏడాదికి మళ్లీ పులి జిల్లాలోకి ప్రవేశించింది. తగ్గుతున్న అటవీ విస్తీర్ణం, పెరుగుతున్న ఆక్రమణల వల్లే జంతువులు ఇలా ఊళ్లమీదకు వస్తున్నట్లు తెలుస్తోంది. పులి సంచారమిలా.. » ఒడిశా నుంచి మందస రిజర్వు ఫారెస్టు మీదుగా సాబకోట, బుడంబో తదితర గిరిజన ప్రాంతాలను దాటుకుంటూ వజ్రపుకొత్తూరు తీర ప్రాంతం మీదుగా సంత»ొమ్మాళి వైపునకు చేరుకుంది. ఈ మండలంలోని హనుమంతునాయుడుపేట పంచాయతీ కేశనాయుడుపేటలో పులి తిరిగిందన్న ప్రచారం జరిగింది. ఇదే సమయంలో భద్రాచలం శాంతమూర్తికి చెందిన ఆవు మృతి చెందింది. పులి కారణంగా చనిపోయిందా? మరే జంతువు కారణంగా చనిపోయిందో స్పష్టత లేదు. » కోటబోమ్మాళి మండలం పొడుగుపాడు సమీపంలో పెద్దపులి ఆనవాళ్లు కనిపించాయి. సారవకోట మండలం జమ చక్రం, సోమయ్యపేట, అన్నుపురం, వాబచుట్టు, బోరుభద్ర పరిసర ప్రాంతాల్లో సంచరించిన పులి పాతపట్నం మండలంలోకి ప్రవేశించింది. బోరుభద్ర, దాసుపురం, గురండి, తీమర, తామర, పెద్దసీదిలో సంచరించింది. తీమరలోని బెండి రామారావు మామిడితోటలో బైరి లక్ష్మణరావుకు చెందిన ఆవుదూడను చంపేసింది. » ఇదే సమయంలో ఉద్దానంలో గుర్తు తెలియని జంతువు కూడా తిరుగుతోంది. దాని దాడి ఎక్కువగా ఉంది. వజ్రపుకొత్తూరు, మందస, పలాస మండలాల్లోని ఒంకులూరు, మెట్టూరు, కొండపల్లి, అనకాపల్లి, బహడపల్లి, కొండలోగాం గ్రామాల్లో ఈ జంతువు సంచరించింది. పలాస మండలంలో నీలావతిలో రెండు ఆవు దూడలను చంపేసింది. ఇదే కారణమా..? ‘పులులు చాలా అరుదుగా అడవులను వదిల జనావాసాల వైపు వస్తుంటాయి. నవంబర్, డిసెంబర్ నెలల్లో మగ, ఆడ పులులు జతకట్టే సమయం కావడంతో తమ జోడు కోసం అవి సాధారణం కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి. అలాంటి సందర్భాల్లో అడవిని దాటి సరిహద్దు ప్రాంతాల్లోని పంటపొలాలు, గ్రామాల్లోకి వస్తుంటాయి. ఈ సమయంలో దాడులు అధికంగా జరిగే అవకాశం ఉంది. వేసవి ఎండలతో అటవీ ప్రాంతంలో తాగునీటి వనరులు తగ్గినప్పుడు కూడా అవి జనావాసాల వైపు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. రైతులు పశువులను మేత కోసం అడవుల్లోకి తీసుకెళ్లడంతో వాటిని వేటాడేందుకు యత్నిస్తాయి. అటవీ సరిహద్దు ప్రాంతంలోని పంట పొలాల్లో పశువులు, మేకలు, గొర్రెలను మందలుగా ఉంచడంతో వాటిని కూడా వేటాడే అవకాశాలు ఉంటాయి.’ అని నిపుణులు చెబుతున్నారు. జాగ్రత్త సుమా » అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలు వన్య మృగాల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు పాటించాలి. » సాయంత్రం 5గంటల నుంచి ఉదయం 7గంటల వరకు అటవీ ప్రాంతాల్లోకి వెళ్లకూడదు. పులులు గ్రామాల్లోకి, పొలాల్లోకి వస్తే శివారు ప్రాంత ప్రజలు వెంటనే అప్రమత్తమై శబ్దం చేస్తూ చాకచక్యంగా తిరిగి అడవిలోకి పంపించాలి. » పులి అరుపులు, పాద ముద్రలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలి. » పంటల కాపలాకు రాత్రి సమయంలో ఒంటరిగా వెళ్లకుండా బృందంగా వెళ్లాలి. » పొలాల్లో మంచెలు ఏర్పాటు చేసుకుని గుంపులుగా ఉండాలి. » పశువుల కాపరులు పగలంతా మేత కోసం సంచరించి రాత్రి అటవీ ప్రాంతంలో మందను ఉంచి బస చేస్తుంటారు. » పులులు వాటిని వేటాడేందుకు వస్తుంటాయి. » రాత్రి సమయంలో అటవీ ప్రాంతంలో ఉండటం సురక్షితం కాదని అటవీశాఖ సిబ్బంది చెబుతున్నారు. ఇబ్బందికరంగానే ఉంది... మా మండలంలో పులి తిరుగుతుందని పేపర్లు, వాట్సాప్లలో చూస్తుంటే భయమేస్తుంది. మేము నిత్యం కొండలు, పంట పొలాలలో మేకలు, గొర్రెలతో మందలు వేసుకుని పడుకుంటున్నాం. మా ఊరికి దగ్గర్లో ఉన్న జమచక్రం, సోమయ్యపేట గ్రామాలలో పులి అడుగులు గుర్తించడంతో ఆయా గ్రామాల నుంచి మందలు తీసుకొచ్చి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నాం. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో మరింత ఇబ్బంది పడుతున్నాం. – పల్ల ముఖలింగం, వడ్డినవలస, సారవకోట మండలం.భయం.. భయం.. పులి మా గ్రామ పంట పొలాల్లో తిరగడంతో మాకు భయంగా ఉంది. పశువులు మేతకు తీసుకు వెళ్లడానికి, ఉదయం పొలాలకు వెళ్లాలన్నా భయంగా ఉంది. ఇప్పటికే ఆవుదూడను తీనేసింది. పులి ఉందని అటవీశాఖ అధికారులు ధ్రువీకరించారు. – మద్ది నారాయణరెడ్డి, పెద్దసీది గ్రామం,పాతపట్నం మండలంఆందోళనకరమే.. పులి సంచరిస్తున్న వార్తలతో ఆందోళనగా ఉంది. మా గ్రామం వైపు పులి వచ్చిందని మాకు తెలియదు, మంగళవారం ఉదయం ఆవుదూడపై దాడి చేయడంతో మాకు పులి వచ్చిందని తెలిసింది. దీంతో పంట పొలాలవైపు వెళ్లాలంటే భయంగా ఉంది. – బండి ఆనంద్,తీమర గ్రామం, పాతపట్నం మండలం -
వైఎస్సార్, అల్లూరి జిల్లాల్లో పులుల సంచారం
లింగాల/రాజవొమ్మంగి/అడ్డతీగల: వైఎస్సార్ జిల్లా లింగాల మండలం తాతిరెడ్డిపల్లె గ్రామ సమీపంలోని పొలాల్లో పులి, పులి పిల్లలు సంచరిస్తున్న దృశ్యాలను రైతులు చంద్రశేఖర్, తన చెల్లెలు తమ సెల్ఫోన్ల్లో సోమవారం వీడియో రికార్డు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రెవెన్యూ, అటవీశాఖ అధికారులు తాతిరెడ్డిపల్లె గ్రామానికి చేరుకుని పులులు సంచరిస్తోన్న ప్రదేశాలను తనిఖీలు చేశారు. అయితే సోమవారం రాత్రి వర్షం కురవడంవల్ల వాటి జాడలు కనిపించలేదు. గ్రామస్తులకు తహశీల్దార్ ఈశ్వరయ్య తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల్లోపు పొలం పనులు పూర్తి చేసుకుని రావాలని రైతులకు, చీకటి పడేలోపు ఇళ్లకు చేరుకోవాలని గొర్రెల కాపరులకు సూచించారు. పులుల సంచారంపై నిఘా ఏర్పాటు చేస్తామని డీఆర్వో శ్రీనివాసులు తెలిపారు. అనంతపురం, కడప జిల్లాల సరిహద్దుల్లో ఈ పులులు సంచరిస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వాటి సంచారాన్ని పసిగట్టి వాటిని అక్కడ నుంచి తరిమివేసేలా చర్యలు తీసుకుంటామని డీఎఫ్వో దివాకర్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం డీఆర్వో శ్రీనివాసులు, ఎఫ్బీవోలు మహబూబ్ బాషా, గోపాల్ పులులు సంచరించిన ప్రదేశాలను పరిశీలించారు.అల్లూరి జిల్లా రాజవొమ్మంగి మండలంలోని జడ్డంగి నుంచి గొబ్బిలమడుగు వెళ్లే ఘాట్రోడ్/అటవీప్రాంతంలో పులి సంచారంపై మంగళవారం సాక్షిలో ‘అమ్మో పులి’ శీర్షికన ప్రచురితమైన కథనం ఆధారంగా రాజవొమ్మంగి అటవీక్షేత్రాధికారి జి.ఉషారాణి ఘటనాస్థలికి వెళ్లి పులి పాదముద్రలు పరిశీలించారు. పాద ముద్ర 14 సెం.మీ. పొడవు, వెడల్పు ఉన్నట్లు రికార్డు చేశారు. లోతట్టు అటవీ ప్రాంతంలోకి వెళ్లి సెలయేరు వద్ద పులి సంచరించిన చోట పరిశీలించగా అక్కడ పులి అడుగు జాడలు కనిపించడంతో ఫోటోలు తీశారు. ఇది పులా? చిరుత పులా? అనే సమాచారాన్ని అధికారులతో సంప్రదించి వెల్లడిస్తామన్నారు.పులి దాడిలో మేకలు చనిపోయిన ఘటనపై విచారణ కోసం మేకల కాపరి ఉండే అడ్డతీగల అటవీ సబ్ డివిజన్ పాపంపేట సెక్షన్ పరిధి కినపర్తికి అడ్డతీగల సబ్ డీఎఫ్వో సుబ్బారెడ్డి పర్యవేక్షణలో సిబ్బంది వెళ్లారు. పులిని చూసిన మేకల కాపర్లతో మాట్లాడి వివరాలు సేకరించారు. మేకలపై దాడి సమయంలో చెట్లెక్కి తమ ప్రాణాలు కాపాడుకున్నట్లు వారు తెలిపారు. -
ఎక్కడ ఆ పులి.. ఇక్కడ ఆడ బెబ్బులి..
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్–టి మండలంలోని పలు గ్రామాల్లో పులి సంచారం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. వ్యవసాయ పనులకు వెళ్లాలంటేనే పరిసర ప్రాంతాల ప్రజలు వణికిపోతున్నారు. అయితే, అదే మండలంలోని పులిదాడి జరిగిన దుబ్బగూడ గ్రామానికి చెందిన ఓ మహిళా రైతు ఏమాత్రం వణుకులేకుండా ఎద్దుల బండిని తోలుతూ వ్యవసాయ పనులకు వెళ్తుండటం ఆమె ధైర్యానికి ప్రతీకగా నిలుస్తోంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ -
పులి కోసమే వెతుకుతున్నాం సర్..
కాగజ్నగర్ డివిజన్లో ఇటీవల ఇద్దరిపై దాడి చేసిన పులి ఆచూకీ కోసం అటవీ అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. సిర్పూర్ రేంజ్లో అటవీ అధికారి ఫోన్లో మాట్లాడుతుండగా.. ఆయన కార్యాలయంలో నిజమైన పులిని తలపిస్తున్న పులి బొమ్మ ఆసక్తి రేపుతోంది.పులి భయంతో.. జ్వరం!ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టి మండలం దుబ్బగూడలో రైతు రౌత్ సురేశ్పై పులి దాడి చేయడాన్ని చూసిన అతని భార్య సుజాత జ్వరంతో మంచం పట్టింది. ఏ క్షణాన ఎవరిపై పులి దాడి చేస్తుందో తెలియక.. దుబ్బగూడ.. పరిసర ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. – ఫొటోలు: సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ -
గండిచెరువు సమీపంలో పెద్దపులి సంచారం
పెద్దదోర్నాల: ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలం పెద్దబొమ్మలాపురం గండిచెరువు ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నదనే సమాచారం ఆ ప్రాంతవాసులను ఆందోళనకు గురి చేస్తోంది. రైతులు పంట పొలాలకు వెళ్లాలంటేనే హడలిపోతున్నారు. గ్రామానికి చెందిన రైతులు శుక్రవారం వ్యవసాయ పనుల నిమిత్తం సమీపంలోని పంట పొలాలకు వెళ్లారు. వారికి అదే ప్రాంతంలో సంచరిస్తున్న పెద్దపులి కంటబడింది. దీంతో హడలిపోయిన రైతులు అటవీశాఖాధికారులకు సమాచారం అందించారు. దీంతో స్పందించిన అధికారులు పెద్దపులి సంచరించిన ప్రాంతాల్లో పులి పాదముద్రలు సేకరించడంతో పాటు, అది సంచరించిన ప్రాంతాలను గుర్తించే పనిలో పడ్డారు. ఇదిలా ఉండగా కొద్ది రోజుల కిందట అదే ప్రాంతంలో ఓ రైతుకు సంబంధించిన ఎద్దుపై పులి దాడి చేసిందన్న వార్త కూడా రైతుల్లో భయాందోళనలు కలగజేస్తోంది. ఈ ప్రాంతంలో చాలా కాలం నుంచి పెద్దపులి సంచారం ఉందని, దేవలూరు వద్ద బేస్ క్యాంప్ను ఏర్పాటు చేశామని అధికారులు పేర్కొంటున్నారు. -
Srikakulam District: సంతబొమ్మాళి మండలంలో పెద్దపులి సంచారం
-
శ్రీకాకుళం: అమ్మో మళ్లీ వచ్చింది.. ‘పెద్దపులి’ అలజడి
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: గత ఏడాది సరిగ్గా ఇదే నవంబర్ నెలలో ఒడిశా నుంచి ఆంధ్రాలోకి ప్రవేశించిన పెద్ద పులి మళ్లీ ఇప్పుడు మరో సారి అలజడి సృష్టిస్తోంది. గత రెండు రోజుల నుంచి టెక్కలి, కాశీబుగ్గ డివిజన్ల పరిధిలో పలు ప్రాంతాల్లో సంచరిస్తూ ఆ యా గ్రామాల ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. శుక్రవారం కోటబొమ్మాళి మండలం పొడుగుపాడు గ్రామం సమీపంలో పెద్దపులి అడుగుల ఆనవాలు కనిపించడంతో అటవీ శాఖాధికారులు ఆ ప్రాంతానికి పరుగులు తీశారు.గత రెండు రోజులుగా పెద్దపులి ఈ ప్రాంతంలో గల గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఒక వైపు తుఫాన్ ప్రభావంతో పంటను కాపాడుకునేందుకు రైతులు పంట పొలాల్లో ముమ్మరంగా కోత లు, నూర్పులు చేస్తున్న సమయంలో పెద్దపులి సంచారంపై అధికారుల హెచ్చరికలతో రైతులు మరింత భయాందోళన చెందుతున్నారు. అటవీ శాఖా ఎఫ్ఆర్ఓ జగదీశ్వరరావు, ఏసీఎఫ్ నాగేంద్ర, బీట్ అధికారులు జనప్రియ, రంజిత్, ఝాన్సీ తో పాటు సిబ్బంది గ్రామాల్లో అప్రమత్తత చర్యలు చేపడుతున్నారు.ప్రస్తుతం భయాందోళనకు గురి చేస్తున్న పెద్దపులి ఒడిశా నుంచి మందస రిజర్వ్ ఫారెస్ట్ మీదుగా సాబకోట, బుడంబో తదితర గిరిజన ప్రాంతాలను దాటుకుంటూ వజ్రపుకొత్తూరు తీ ర ప్రాంతంలో గల తోటల నుంచి సంత బొమ్మాళి వైపునకు చేరుకుంది. ప్రస్తుతం కోట»ొ మ్మాళి మండలం పొడుగుపాడు సమీపంలో పెద్దపులి ఆనవాలు కనిపించాయి.పులి సంచారంపై అప్రమత్తం పెద్దపులి సంచరిస్తున్న నేపథ్యంలో అటవీశాఖాధికారులు అప్రమత్తత చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా కొన్ని రకాల జాగ్రత్తలు దండోరా ద్వారా తెలియజేస్తున్నారు.ప్రజలు వేకువజామున, చీకటి పడిన తర్వాత సాధ్యమైనంతవరకు బయట తిరగకుండా ఇళ్ల వద్ద ఉండాలిఇంటి ఆరుబయట లేదా పశువుల పాకల వద్ద నిద్రించకూడదుపులి తిరుగుతున్న ప్రాంతంలో అడవి లోపలకు వెళ్లేందుకు సాహసించకూడదువ్యవసాయ పనులు, బయటకు వెళ్లినపుడు ఒంటరిగా కాకుండా గుంపులుగా వెళ్లాలివ్యవసాయ పనుల్లో కింద కూర్చున్నప్పుడు లేదా వంగి పని చేస్తున్నపుడు అప్రమత్తంగా ఉండాలిపంట పొలాలకు వెళ్లినపుడు బిగ్గరగా శబ్దాలు చేయాలిపులులు సంచరించే ప్రాంతాల్లో పశువులను బహిరంగ ప్రదేశాల్లో ఉంచకూడదుపులి తిరుగుతున్న ఆనవాళ్లు, పాదముద్రలు కనిపిస్తే తక్షణమే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలి.పులి సంచరిస్తున్న ప్రాంతాల్లో అటవీశాఖాధికారుల పర్యవేక్షణ ఉంటుంది. ఎక్కడైనా పులి సంచరించే ఆనవాలు కనిపిస్తే తక్షణమే.. 6302267557, 9440810037,9493083748 ఫోన్ నంబర్లకు సమాచారం అందజేయాలి. -
TG: మళ్లీ పులి దాడి.. వ్యక్తికి తీవ్ర గాయాలు
సాక్షి,కొమరంభీంజిల్లా: జిల్లాలో పులి మళ్లీ పంజా విసిరింది. తాజాగా మరొకరిపై పులి దాడి చేసింది. సిర్పూర్ (టీ) మండలం దుబ్బగూడకు చెందిన రైతు సురేష్పై శనివారం(నవంబర్30) పులి దాడి చేసి గాయపరిచింది. సురేష్ పొలంలో పనిచేస్తుండగా పులి ఒక్కసారిగా దాడి చేసింది.పులి గాట్లతో సురేష్ తీవ్రంగా గాయపడ్డాడు. సురేష్ను చికిత్స కోసం సిర్పూర్(టీ) ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదే ప్రాంతంలో పులి దాడిలో శుక్రవారమే ఒక మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. పులి కోసం కాగజ్నగర్ కారిడార్లో ఫారెస్ట్ అధికారులు ఆపరేషన్ మ్యాన్ఈటర్ నిర్వహస్తున్నారు.మొత్తం 15 గ్రామాల్లో పులి కోసం వేట కొనసాగుతోంది.ఇదీ చదవండి: పులి కోసం డ్రోన్లతో వేట.. కాగజ్నగర్లో హై అలర్ట్ -
పులికి చుక్కలు చూపించిన ఫారెస్ట్ ఆఫీసర్స్..
-
ఒంగోలు జిల్లాలో పులి సంచారం
-
పులి కోసం డ్రోన్లతో వేట.. కాగజ్నగర్లో హై అలర్ట్
సాక్షి,కొమురంభీంజిల్లా: ఆసిఫాబాద్లో ఆపరేషన్ మ్యాన్ ఈటర్ కొనసాగుతోంది. కాగజ్నగర్ కారిడార్లో అటవీ శాఖ హైఅలర్ట్ ప్రకటించింది. ఇక్కడ మొత్తం 15 గ్రామాల్లో పులి కోసం సెర్చ్ ఆపరేషన్ను ఫారెస్ట్ అధికారులు నిర్వహిస్తున్నారు.పులి భయం నెలకొన్ని ఈ 15 గ్రామాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు.గగ్రామాల్లోని వారంతా పులి భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.పులి ఆచూకీ కనుగొనేందుకు ఫారెస్ట్ అధికారులు డ్రోన్ సహాయంతో వేట కొనసాగిస్తున్నారు. తాజాగా పులి దాడిలో ఈ ప్రాంతంలో ఇప్పటికే ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: పులి పంజాకు మహిళ బలి -
దారి లేకనే దాడులు!
సాక్షి, హైదరాబాద్: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రజలను పెద్దపులుల దాడులు వణికిస్తున్నాయి. శుక్రవారం కాగజ్నగర్ మండలం నజ్రుల్ నగర్ గ్రామం వద్ద మోర్లె లక్ష్మి అనే యువతిపై పెద్దపులి దాడిచేసి చంపేయగా, తాజాగా మరోక్తిపై ఇవాళ దాడి చేసింది. దీంతో.. జిల్లాలో ప్రజలకు మరోసారి పులి భయం పట్టుకొంది. పొరుగు రాష్ట్రాల నుంచి వస్తున్న పులులు.. రిజర్వు అడవుల్లోని కోర్ ఏరియాలకు వెళ్లే దారిలో రోడ్లు, గ్రామాలు అడ్డుగా ఉండటంతోనే అవి మనుషులపై దాడులు చేస్తున్నాయని అటవీశాఖ అధికారులు అంటున్నారు. గత నాలుగేళ్లలో ఈ ప్రాంతంలో పులుల దాడిలో నలుగురు మరణించారు.ఈ ప్రాంతం మహారాష్ట్ర– తెలంగాణ మధ్యలోని టైగర్ కారిడార్లో భాగంగా ఉన్నది. మహారాష్ట్రలోని తడోబా, తిప్పేశ్వర్ టైగర్ రిజర్వ్ల నుంచి ఆవాసం, తోడు వెతుక్కుంటూ పులులు వస్తున్నాయి. దీంతో మనుషులు–పులుల మధ్య ఘర్షణ ఏర్పడుతున్నది. నవంబర్–డిసెంబర్ నెలలు పులుల సంతానోత్పత్తికి అనువుగా ఉంటాయి. ఈ సమయంలో వాటికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే కోపంతో దాడులకు దిగే అవకాశాలున్నాయని అటవీ అధికారులు చెబుతున్నారు. పెరిగిన సంచారం ఆదిలాబాద్ జిల్లా సరిహద్దుల్లోని టైగర్ కారిడార్, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో నాలుగైదు పులులు సంచరిస్తున్నట్టు గుర్తించారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం బండికాన, ధాబా గ్రామాల శివార్లలో ఆదివారం పశువులపై ఒక పులి దాడి చేసింది. అది మంగళవారం కూడా అక్కడే సంచరించింది. ఆ తర్వాత ఎకో వంతెన సమీపంలోని ఖిండి దేవస్థానం మీదుగా వెళ్లినట్లు కొందరు గ్రామస్తులు తీసిన వీడియోల్లో వెల్లడైంది. ఈ నెల 21న ఆదిలాబాద్ జిల్లా నార్నూర్, గాదిగూడ మండలాల్లో ఓ పెద్దపులి పశువులపై దాడి చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది.ఈ నెల 17న నిర్మల్ జిల్లా నుంచి ఆదిలాబాద్ జిల్లాలోకి వచి్చన పెద్దపులి.. ఉట్నూరు మండలం చాండూరు గ్రామ శివారులో రాజుల్గూడ గ్రా మానికి చెందిన ఓ రైతు ఎద్దుపై దాడి చేసింది. గతంలో పెద్దపులుల సంచారం అంతగా లేని ఉమ్మడి వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి పరిధిలోనూ పులి కనిపించింది. ఆదిలాబాద్ జిల్లా సరిహద్దులతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ పులుల సంచారం పెరగడాన్ని పర్యావరణ ప్రేమికులు, అటవీ అధికారులు స్వాగతిస్తుండగా, ఆయా పరిసర గ్రామాల ప్రజలు మాత్రం ఆందోళన చెందుతున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి వలస ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ (కేటీఆర్)లోని కోర్ ఏరియాలోకి పులులు వెళ్లలేకపోవడం సమస్యగా మారిందని అటవీ అధికారులు అభిప్రాయపడుతున్నారు. మహారాష్ట్రలోని తడోబా, తిప్పేశ్వర్తోపాటు ఛత్తీస్గఢ్లోని ఇంద్రావతి టైగర్ రిజర్వ్లలో పులుల సంతతి బాగా పెరిగింది. దీంతో శాశ్వత ఆవాసానికి తగిన అటవీ ప్రాంతం, ఆహారం లభించక కొన్ని పులులు తెలంగాణలోకి ప్రవేశిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఆడ పులుల తోడును వెతుక్కుంటూ మగ పులులు ఆదిలాబాద్ జిల్లాలోని పులుల కారిడార్లోకి, సమీప గ్రామాల్లోకి అడుగు పెడుతున్నాయి. దాదాపు నెలరోజుల వ్యవధిలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బోధ్, కుంటాల, సారంగాపూర్, మామడ, పెంబి మండలాలు.. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట, బెల్లంపల్లి.. కెరమెరి మండలంలోని లక్మాపూర్, కరంజివాడ ప్రాంతాల్లో నాలుగైదు పులులు కనిపించాయి. కవ్వాల్ టైగర్ రిజర్వు అనుకూలమైనా.. కవ్వాల్ టైగర్ రిజర్వులోని కోర్ ఏరియాలో పులుల శాశ్వత ఆవాసాలకు అనుకూల పరిస్థితులున్నా.. మధ్యలో రోడ్లు, పోడు భూములు, గ్రామాలు ఉండడం వల్ల అవి అక్కడికి చేరుకోలేకపోతున్నాయని అధికారులు చెబుతున్నారు. టైగర్ రిజర్వుల్లోని కోర్ ఏరియా, పులుల అవాస ప్రాంతాల నుంచి కొన్ని గ్రామాల తరలింపు జరగకపోవడం వల్లే ఈ సమస్య పెరిగిందనే అంటున్నారు. కవ్వాల్, అమ్రాబాద్ రిజర్వు ఫారెస్టులోని కోర్ ఏరియాలో ఉన్న పలు గ్రామాలను మైదాన ప్రాంతాలకు తరలించాలని కేంద్ర ప్రభుత్వ పరిధిలో నేషనల్ టైగర్ కన్జర్వేషన్¯ అథారిటీ నిర్ణయించింది.ఇప్పటికే కవ్వాల్ టైగర్ రిజర్వులోని రెండు గ్రామాలను బయటకు తరలించగా, మరో రెండు గ్రామాల తరలింపునకు ప్రతిపాదించారు. కేటీఆర్లోని మూడు గ్రామాలను మొదటి దశలో, మరో పెద్ద గ్రామాన్ని రెండోదశలో బయటకు పంపించేందుకు ప్రతిపాదనలు తుదిదశకు చేరుకున్నాయి. ఈ గ్రామాల తరలింపు పూర్తయితే పులుల స్థిర నివాసానికి మరింత సానుకూల వాతావరణం ఏర్పడుతుందని అటవీశాఖ అంచనా వేస్తోంది. -
ఆదిలాబాద్లో పెద్దపులి హల్చల్
నార్నూర్: ఆదిలాబాద్ జిల్లా నార్నూర్, గాదిగూడ మండలాల్లో గత నాలుగు రోజులుగా పెద్దపులి హల్చల్ చేస్తోంది. గత రెండ్రోజులుగా నార్నూర్ మండలం చోర్గావ్ గ్రామంలో తిష్టవేసి ఆవును తింటున్న దృశ్యం అటవీశాఖ అధికారులు అమర్చిన కెమెరాకు చిక్కింది. దీంతో చోర్గావ్, సుంగాపూర్, బాబేఝరి, మంజ్రి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. గురువారం గాదిగూడ మండలం ఖడ్కి గ్రామం మీదుగా బుడుకుంగూడ, సావురి గ్రామం మీదుగా రాంపూర్ చేరుకుంది. వేకువజామున గిరిజన రైతు ప్రకాశ్కు చెందిన ఆవుపై దాడి చేసింది. కుటుంబ సభ్యులు అప్రమత్తమై చప్పుడు చేయడంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇదేరోజు మధ్యాహ్నం నార్నూర్ మండలం తాడిహత్నూర్ గ్రామ శివారులో పత్తి ఏరుతున్న మహిళలకు పులి కనిపించడంతో భయంతో పరుగులు తీశారు. అక్కడి నుంచి గంగాపూర్, మాన్కాపూర్ వైపు పులి వెళ్లిందని ప్రచారం జరగడంతో మాన్కాపూర్, రాజులగూడ, నార్నూర్, మహగావ్, నాగల్కొండ, భీంపూర్ గ్రామాల ప్రజలు అప్రమత్తం అయ్యారు. వ్యవసాయ పనులకు వెళ్లిన వారంతా మధ్యాహ్నం ఇంటిబాట పట్టారు. ఎఫ్ఎస్వో సుదర్శన్ ఆధ్వర్యంలో అటవీ అధికారులు బృందాలుగా విడిపోయి పులి జాడకోసం గాలిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. -
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పెద్దపులి సంచారం
-
ఆవును హతమార్చిన పెద్దపులి
నార్నూర్: మండలంలో ని చోర్గావ్ గ్రా మ శివారులో సోమవారం సాయంత్రం తార్యానాయక్ అనే రైతుకు చెందిన ఆవుపై పెద్దపులి దాడి చేసి హతమార్చింది. ఆదివారం ఉదయం ఉట్నూర్ చిన్నునా యక్ తండా, హస్నాపూర్, చాందోరి మీదుగా మండలంలోని గుంజాల శివారుకు చేరుకున్న పెద్దపులి మధ్యాహ్నం నుంచి అదే ప్రాంతంలో తలదాచుకుంది. రాత్రి జైనూర్ లేదా బేల మీదుగా వెళ్లిపోతుందని అటవీశాఖ అధికారులు భావించారు. కానీ సోమవారం గుంజాల వద్ద ప్రత్యక్షం కావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. సాయంత్రం చోర్గావ్ శివారులో ఆవుపై దాడి చేసి బాబేఝరి వైపు మళ్లిందని స్థానికులు పేర్కొంటున్నారు. -
పులి మీ ఎదురుగా ఉంటే.. ఇలా తప్పించుకోండి!
పులి మనకు ఎదురొచ్చినా.. మనం పులికి ఎదురెళ్లినా.. ‘పోయేది’ మనమేనన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే, ఒకవేళ మన టైం బాగోక పులిని మనం చూసినా లేదా అది మనల్ని చూసినా ఏం చేయాలిమీరు పులిని చూశారు.. అది మిమ్మల్ని చూడలేదు. అలాంటప్పుడు ఎక్కడున్నారో అక్కడే కదలకుండా నిశ్శబ్దంగా నిల్చోండి. శ్వాస వేగంగా తీసుకోకూడదు. చెప్పడం ఈజీగానీ.. పులిని చూశాక.. ఎవరైనా గాబరా పడటం సహజం, అయితే.. ఇక్కడ మీరు ఎంత కామ్గా ఉంటారన్న దాని మీదే మీ జీవితం ఆధారపడి ఉంటుంది. అది వెళ్లేంతవరకూ ఆగండి. వెళ్లాక.. అది వెళ్లిన దిశకు వ్యతిరేక దిశలో వెంటనే వెళ్లిపోండి. ఇక్కడ తప్పించుకుపోవడం ఒక్కటే మీ లక్ష్యంగా ఉండాలి. అంతే తప్ప.. ఏదైనా కొత్తగా చేసి హీరోయిజం చూపిద్దాం అనుకుంటే.. అడవిలో అదే హీరో అన్న విషయాన్ని మరోసారి గుర్తు చేసుకోండి. ఈసారి పులే మిమ్మల్ని చూసింది. మొట్టమొదట చేయకూడని పని పరుగెత్తడం. మీరు ఉసేన్ బోల్ట్ కాదు.. అదైతే కన్ఫర్మ్. పైగా వెంటాడుతూ.. వేటాడటంలో పులులు స్పెషలిస్టులు. అందుకే అలా చేయొద్దు.. ఒకవేళ మీరు కూర్చునే పొజిషన్లో ఉంటే.. ముందుగా లేచి నిల్చొండి. ఎందుకంటే.. పులులు సాధారణంగా జింకల్లాంటి వాటిపై వెనుక నుంచి దాడి చేస్తాయి.. ముఖ్యంగా అవి కూర్చునే పొజిషన్లో ఉన్నప్పుడు వేటాడతాయి. పైగా.. అవి తాము వేటాడే జంతువులకు, మనుషులకు మధ్య తేడాను గుర్తించలేవు. అందుకే లేచి నిల్చోవడం ద్వారా మీరు పులి వేటాడే జంతువు కాదన్న విషయాన్ని తెలియజేయాలి. గతంలో కూడా మన దేశంలో అడవుల్లో వంగి.. కట్టెలు ఏరుకుంటున్న వారు లేదా వంగి పనిచేసుకుంటున్న మనుషులపై వెనుక నుంచే అత్యధిక శాతం పులి దాడులు జరిగాయి. లేచి నిల్చున్నారు సరే.. తర్వాతేం చేయాలి? పులికి మీ మీద దాడి చేసే ఉద్దేశం ఉందో లేదో తెలుసుకోవాలి.. దాన్ని అడిగి కాదు.. దాన్ని గమనించడం ద్వారా.. సాధారణంగా పులికి మీ మీద దాడి చేసే ఉద్దేశం ఉంటే.. అది ఒక్కసారిగా అక్కడే ఆగిపోతుంది.. మీ మీదే దృష్టి పెడుతుంది.. కాళ్లను వంచుతుంది.. దాని చెవులు ఇలా వెనక్కి వెళ్లినట్లుగా అవుతాయి. ఆగ్రహంగా గాండ్రించి.. ముందుకు దూకుతుంది. ఆగండాగండి.. ఇక్కడో విషయం చెప్పాలి. కుక్కల చెవులు కూడా వెనక్కి వెళ్తాయి మనపట్ల స్నేహభావంతో.. ఇక్కడ కూడా చెవులు వెనక్కి వెళ్లాయి కదా.. ఫ్రెండే అని అనుకోకండి.. బాలయ్య బాబు ఏదో సినిమాలో చెప్పినట్లు బోత్ ఆర్ నాట్ సేమ్ అని తెలుసుకోండి. పులి చెవులు వెనక్కి వెళ్లాయంటే.. అది వార్నింగ్ కిందే లెక్క.. నువ్వక్కడ ఉండటం దానికి ఇష్టం లేదన్నమాట.ఉన్నచోట ఉన్నట్లే ఒక్కొక్క అడుగు వెనక్కి వేసుకుంటూ.. వెళ్లండి. వీపు చూపొద్దు. చూపితే వెంటనే దాడి తప్పదు. గతంలో మధ్యప్రదేశ్లోని భాందవ్గఢ్ నేషనల్ పార్కులో మూడు పులులు రావడంతో ఓ ఏనుగు భయపడి.. మావటిని కిందన పడేసి వెళ్లిపోయింది. దాంతో ఆ మావటి వెనక్కి తిరిగి పరిగెట్టకుండా.. ఇలాగే ఒక్కో అడుగూ నెమ్మదిగా వెనక్కి వేసుకుంటూ.. రెండు గంటల తర్వాత ఆ ప్రాంతం నుంచి బయటపడ్డాడట. ఒకవేళ దగ్గర్లో చెట్టు ఉంది.. పులి కొంచెం దూరంగా ఉంది. మీకు చెట్లెక్కడం బాగా వస్తే.. వెంటనే ఎక్కేయండి. కనీసం 15 అడుగుల ఎత్తు ఎక్కేదాకా ఆగొద్దు. చాన్స్ ఉంటే ఇంకా పైకి ఎక్కండి. మీకు వేగంగా చెట్లు ఎక్కగలిగే సామర్థ్యం ఉంటేనే ట్రై చేయండి. లేకపోతే వద్దు. పులులు 15 అడుగుల ఎత్తు దాకా ఎగరగలవు. పులులు చెట్లెక్కడంలో స్పెషలిస్టులు కావు. ఒకవేళ దగ్గర్లో చెరువు ఉంది.. పులి కొంచెం దూరంగా ఉంది.. అయినా సరే.. ఎట్టి పరిస్థితుల్లోనూ నీటిలో దూకొద్దు.. మీకు ఒలింపిక్స్లో గోల్డ్ వచ్చి ఉంటే మాత్రం దూకండి. ఎందుకంటే.. పులులు మనకన్నా బాగా ఈదగలవు. ఇంకో ఆప్షన్ కూడా ఉంది. బాగా సౌండ్ చేయగల మెటల్ వస్తువులు ఉంటే.. హోరెత్తించేయండి. చేతిలో ఏం లేదు.. పులి దాడి చేయడానికి వస్తుంటే.. అప్పుడు చాలా గట్టిగా అరవండి. ఎంతలా అంటే.. దాని చెవులకు చిల్లులు పడేలా.. ఇలాంటి టైంలో అది కన్ఫ్యూజ్ అవుతుంది. అన్ని ఆప్షన్లు అయిపోయాయి.. ఇక చేసేదేమీ లేదంటే మాత్రం పోరాడాల్సిందే. దగ్గర్లో ఏది దొరికితే.. అది పట్టుకోండి. రాయి, కర్ర ఏదైనా సరే. పులి శరీరంలో కళ్లు, ముక్కు బలహీన ప్రదేశాలు. అక్కడే బలంగా దాడి చేయాలి. పులి బలం దాని పంజా, కోరలు.. వాటి నుంచే తప్పించుకోవాలి. అది దాడి చేయడానికి వచ్చినప్పుడు పులికి ఎంత దగ్గరగా అయితే.. అంత దగ్గరగా ఉండి పోరాడాలి. దాని పీకను పట్టుకొని.. గట్టిగా హత్తుకోవాలి. ధృతరాష్ట్ర కౌగిలిలాగ.. ఊపిరి పీల్చుకునే అవకాశం ఇవ్వకూడదు.చదవండి: ఇదో జానీ.. వాకర్.. ప్రేమ కథగట్టిగా అదిమి పట్టుకుంటే.. అది ఆశ్చర్యపోతుంది. పులులు సాధారణంగా దాన్ని ఇష్టపడవు. అవి ప్రేమలో ఉన్నప్పుడు లేదా వేరే పులులతో పోరాడుతున్నప్పుడు కూడా బాగా దగ్గరగా అలముకున్నట్లు ఉండవు. మెడ జాగ్రత్త. పులికి దొరికితే అంతే. పోరాడుతున్నంత సేపు.. గట్టిగా అరుస్తూనే ఉండాలి. పులులు సాధారణంగా పోరాటాలను ఇష్టపడవు. కానీ అది పోరాటానికి దిగిందంటే మాత్రం చంపడానికే దిగుతుంది. అది తప్పించుకోవాలని అనుకుంటేనో.. లేదా మనం చేసిన ఏ పనితోనైనా అది ఆశ్చర్యపోతేనో తప్ప.. చివరగా అన్నింటికన్నా ముఖ్యమైన విషయం.. పైన చెప్పినవన్నీ చేస్తున్న సమయంలో దేవుడిని ప్రార్థించడం మాత్రం మరువద్దు. ఈ టిప్స్ ఫెయిలయినా.. ఆ దేవుడు మిమ్మల్ని కాపాడవచ్చు. అల్ ది బెస్ట్ మరి.. ఓ పులి రేపు రా.. -
అడవికి అదే హీరో! మరి ఎదురుపడితే.. ఇలా చేస్తే సేఫ్గా బయటపడే ఛాన్స్
-
అమ్మో.. పులి!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఏటా శీతాకాలంలో మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతాల నుంచి వస్తున్న పులులు.. ఉమ్మడి ఆదిలాబాద్ వాసుల్లో అలజడి రేపుతున్నాయి. జనావాసాలకు సమీపంలో సంచరిస్తూ.. పశువులపై దాడి చేసి చంపి తింటున్నాయి. ప్రస్తుతం జానీ, ఎస్–12గా పిలుస్తున్న రెండు పులులు తిరుగుతున్నట్టు గుర్తించారు. ఇలా పులుల రాకను అటవీ అధికారులు, పర్యావరణవేత్తలు స్వాగతిస్తుండగా.. అడవి సమీప ప్రాంతాల ప్రజల్లో భయాందోళన వ్యక్తమవుతోంది. పత్తి పంట చేతికొచ్చే వేళ పొలాలకు వెళ్లలేకపోతున్నామని గిరిజన రైతులు వాపోతున్నారు.అక్కడ సరిపోక.. మ హారాష్ట్రలోని తిప్పేశ్వర్, తడోబా, ఛత్తీస్గఢ్లోని ఇంద్రావతి అభయారణ్యాలలో పులుల సంఖ్య పెరిగింది. అక్కడి ఇరుకు ఆవాసం వల్ల ఆ పులులు తెలంగాణ వైపు వస్తున్నాయి. వాటిలో మగపులులే అధికమని అధికారులు చెప్తున్నారు. గత నెల రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్, కుంటాల, సారంగాపూర్, మామడ, పెంబి మండలాల్లో ఎనిమిదేళ్ల మగపులి(జానీ) సంచరిస్తున్నట్టు గుర్తించారు. సుమారు రెండేళ్ల వయసున్న మరో మగ పులి (ఎస్ 12) మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట, బెల్లంపల్లి అటవీ ప్రాంతంలో తిరుగుతోంది. ఇంకో పులి కెరమెరి మండలంలోని లక్మాపూర్, కరంజివాడ ప్రాంతాల్లో కనిపించి వెళ్లిపోయింది.ఇక్కడ కోర్ ఏరియాలోకి వెళ్లలేక.. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్, తడోబా, ఛత్తీస్గఢ్లోని ఇంద్రావతి టైగర్ రిజర్వ్ జోన్ల నుంచి వస్తున్న పులులు.. కవ్వాల్లోని కోర్ ఏరియాకు చేరుకోవాలంటే, 200 కిలోమీటర్లకుపైగా నడవాలి. ఇది వాటికి పెద్ద సమస్య కాకపోయినా.. మధ్యలో జాతీయ రహదారులు, బొగ్గు గనులు, సాగునీటి ప్రాజెక్టులు, పోడు సాగు, పంట పొలాలు పులుల రాకకు ఆటంకంగా మారాయి. రహదారుల వెంట అండర్ పాస్లు, ఓవర్ పాస్లు ఏర్పాటు చేసినా ప్రయోజనం కనిపించడం లేదు. అయితే ఆ పులులు అడవి అంచుల్లోనే సంచరిస్తుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు కవ్వాల్ బయట కాగజ్నగర్ డివిజన్లో ఐదు పెద్దవి, నాలుగు చిన్నవి కలిపి 9 పులులు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు.మనుషులపై దాడులతో కలకలం రాష్ట్రంలోకి వస్తున్న పులులు.. పశువులు, మనుషులపై దాడి చేస్తున్నాయి. 2020 నవంబర్లో 18 రోజుల వ్యవధిలో ఏ2 అనే మగపులి ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం దిగిడకు చెందిన సిడాం విగ్నేశ్ (21)పై, పెంచికల్పేట మండలం కొండపల్లికి చెందిన పసుల నిర్మల (18)పై పొలాల్లో దాడిచేసి చంపేసింది. గత ఏడాది నవంబర్లో మరో పులి ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఖానాపూర్కు చెందిన రైతు సిడాం భీము (69)పై దాడి చేసి ప్రాణాలు తీసింది. నాటి ఘటనల నేపథ్యంలో.. ఇప్పుడు అటవీ అధికారులు ఏజెన్సీ ప్రజలను అప్రమత్తం చేశారు.కోర్ ఏరియాలోకి వెళ్లేలా చూస్తున్నాం.. టైగర్ జోన్ వెలుపల సంచరించే కొత్త పులులు కోర్ ఏరియాలోకి వెళ్లేలా ప్రయత్నాలు చేస్తున్నాం. వేటగాళ్లు ఉచ్చులు వేయకుండా, స్థానికులకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పులి దాడి చేసిన పశువుల యజమానులకు వెంటనే పరిహారం ఇస్తున్నాం. పులి సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. – శాంతారామ్, ఫీల్డ్ డైరెక్టర్, ప్రాజెక్టు టైగర్, కవ్వాల్ టైగర్ రిజర్వుపులుల సంచారంతో భయంగా ఉందిపులి భయంతో పత్తి తీసే పనులు సాగడం లేదు. మా చేన్ల వైపు పులి రాకుండా అటవీ అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే రైతులు చాలా నష్టపోతారు. – ఆత్రం జైతు, భుర్కరెగడి గ్రామం, నిర్మల్ జిల్లా -
ఇదో జానీ.. వాకర్.. ప్రేమ కథ
ప్రేమ కథ అన్నారు.. పులి బొమ్మ వేశారేంటనేగా మీ డౌటు.. ఏం.. మనుషులకేనా ప్రేమ కథలు.. పులులకుండవా.. ఇది జానీగాడి ప్రేమ కథ.. లవర్ కోసం వందల కిలోమీటర్లు వాకింగ్ చేసొచ్చిన ఓ పెద్ద పులి కథ.. కట్ చేస్తే.. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యం.. జానీ ఉండేది ఇక్కడే. గత నెల్లో ఒకానొక శుభముహూర్తాన మనోడికి ‘ప్రేమ’లో పడాలనిపించింది. తీరా చూస్తే.. తనకు ఈడైన జోడు అక్కడ ఎవరూ కనిపించలేదు. దాంతో తోడు కోసం తన ప్రేమ ప్రయాణం మొదలుపెట్టాడు. వెతుక్కుంటూ.. వెతుక్కుంటూ.. ఏకంగా 200 కిలోమీటర్లు నడిచి మన రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా అడవుల్లోకి వచ్చేశాడు.అక్టోబర్ 25న నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం అడెల్లి ప్రాంతంలోకి వచ్చిన జానీ.. ఎక్కడా కుదురుగా ఉండటం లేదు. ఓసారి వెనక్కి మహారాష్ట్ర సరిహద్దు దాకా వెళ్లాడు.. మళ్లా తిరిగొచ్చాడు. రోజుకో మండలమన్నట్లు తిరుగుతూనే ఉన్నాడు. ఈ నెల 10వ తేదీనైతే.. రాత్రిపూట మహబూబ్ ఘాట్ రోడ్డుపై కనిపించి అందరికీ కంగారు పెట్టించేశాడు. పెద్ద పులంటే మాటలా మరి.. మంగళవారం మామడ–పెంబి అటవీ ప్రాంతంలో ఎద్దుపై దాడిచేసి చంపేశాడు. ప్రస్తుతం జానీ అదే ప్రాంతంలో తిరుగుతున్నాడు. తన తోడు కోసం.. గూడు కోసం.. ఇంతకీ అటవీ అధికారులేమంటున్నారు? మిగతా క్రూర జంతువులతో పోలిస్తే పులులు కొంచెం డిఫరెంటుగానే ఉంటాయట. మేటింగ్ సీజన్లో తగిన తోడు, గూడు దొరికేదాకా ఎంత దూరమైనా వెళ్తాయట. ఇప్పటివరకూ జానీ.. 500 కిలోమీటర్ల దూరం నడిచాడట. నిర్మల్– ఆదిలాబాద్ మధ్య దట్టమైన అడవులు, నీటి వనరులు, వన్యప్రాణులు ఉండటంతో ఈ ప్రాంతంలోనే తిరుగుతున్నాడట. ఇలా వచ్చిన పులులను సంరక్షించేందుకు చర్యలు చేపడుతున్నామని.. ‘జానీ’ అనే ఈ పులి ఎటువైపు వెళ్తుందో గమనిస్తూ ఆయా ప్రాంతాల వారిని అప్రమత్తం చేస్తున్నామని, పులి సంరక్షణకు సంబంధించిన సూచనలు చేస్తున్నామని నిర్మల్ డీఎఫ్వో నాగిని భాను తెలిపారు. చదవండి: ‘బాహుబలి’ ఏనుగులకు పెద్ద కష్టం... భూమాతకు తీరని శోకం! -
ఆంధ్రా-ఒడిశా బోర్డర్ లో పెద్దపులి కలకలం
-
ఆంధ్రా ఒడిషా బోర్డర్లో పెద్దపులి కలకలం
సాక్షి,శ్రీకాకుళం: ఆంధ్రా-ఒడిశా బోర్డర్లో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. పెద్దపులి కదలికలతో సరిహద్దు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. కాశీబుగ్గ రేంజ్ ఫారెస్ట్ అధికారి ఏ.మురళీకృష్ణ ఆదేశాల మేరకు ఇచ్ఛాపురం మండలంలోని పలు గ్రామాలలో పులి కోసం అటవీ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.ఒంటరిగా రాత్రిపూట పొలాలకు వెళ్లొద్దని గ్రామస్తులకు అటవీ అధికారులు సూచించారు.ఇటీవలే ఒడిశాలోని గంజాం జిల్లా జయంతిపురంలో యువకుడిపై పెద్దపులి దాడిచేసి తీవ్రంగా గాయపరిచింది.ఇదీ చదవండి: AP: ఆమెకు టెర్రర్ -
అడవిలో పెద్దపులికైనా తప్పని కష్టంరా సామీ అది!
మాంసాహారం తిన్నతరువాత ఒక విచిత్రమైన ఇబ్బంది ఉంటుంది. చికెన్ లేదా మటన్ కర్రీని లొట్టలేసుకుంటూ తిన్నంత సేపు బాగానే ఉంటుంది కానీ మాంసపు తునకలు పళ్ల సందుల్లో ఇరుక్క పోయినపుడు ఇబ్బంది ఉంటుంది కదా నా సామి రంగా. వాటిని తొలగించేందుకు టూత్ పిక్లు, పిన్సీసులతో పెద్ద యుద్ధమే చేయాలి. ఏదీ లేకపోతే.. చివరికి నాలుకతో అయినా సరే దాన్ని లాగి పడేసేదాకా మనశ్శాంతి ఉండదు. అడవిలో ఒక పులికి కూడా ఇలాంటి సమస్యే ఎదురైంది. ఒక పెద్ద మాంసం ముక్క దాని పంటిలో చిక్కుకుంది. దీంతో నానా కష్టాలు పడుతున్న పులిని చూసిన వెటర్నరీ వైద్యులు దాని కోరల్లో ఇరుక్కున్న మాంసం ముక్కను లాగి పడేశారు. కేవలం 16 సెకన్లుఉన్న ఈ వీడియో 30.3 లక్షలకుపైగా వ్యూస్ను దక్కించుకుంది. నేచర్ ఈజ్ అమేజింగ్ అనే ట్విటర్ హ్యాండిల్ దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది.Vet removing a bone stuck to a tigers tooth pic.twitter.com/WjmqFNw8fZ— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) October 15, 2024 -
పులి భయపడింది
-
టై‘ఘర్’
అడవిలో పెద్దపులి... ఉంటే ఆ ప్రాంతమంతా వృక్ష సంపద, పచ్చదనం, వన్యప్రాణులతో పరిఢవిల్లుతుంది. వాతావరణం సమతుల్యంగా ఉంటుంది. అందువల్ల అంతరించిపోతున్న పెద్దపులులను సంరక్షించేందుకు పర్యావరణవేత్తలు, ప్రభుత్వాలు చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. క్రమంగా దేశంలో పులుల సంఖ్య పెరుగుతోంది. దేశవ్యాప్తంగా 2006లో 1,411 పులులు ఉండగా, 2023లో ఆ సంఖ్య 3,682కు చేరినట్లు ‘ప్రాజెక్ట్ టైగర్’ ప్రారంభించి 50 ఏళ్లు అయిన సందర్భంగా ప్రధాని మోదీ ప్రకటించారు. ప్రపంచంలోని పులుల్లో 75శాతం మన దేశంలోనే ఉన్నట్లు అంచనా. రాష్ట్రంలోనూ పులుల సంతతి సంఖ్య గణనీయంగా వృద్ధి చెందుతోంది. కొత్త ప్రాంతాల్లోనూ పులులు సంచరిస్తున్న ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. దేశంలో పులుల సంతతి పెరుగుదల ఇలా..2006 - 1,4112010 - 1,7062014 - 2,2262018 - 2,9672022 - 3,1672023 - 3,682 సాక్షి నెట్వర్క్: ఒకప్పుడు పులులకు భారతదేశం పుట్టినిల్లు. అటువంటిది వివిధ కారణాల వల్ల పులుల సంఖ్య అనూహ్యంగా తగ్గిపోయింది. దానివల్ల వాతావరణ సమతుల్యం దెబ్బతింటోంది. ఈ క్రమంలో పులులను కాపాడుకోవడంతోపాటు వాటి సంతతిని పెంచాల్సిన ఆవశ్యకతను పర్యావరణవేత్తలు, పాలకులు గుర్తించారు. ఇందులో భాగంగా మన దేశంలో 1972లోనే వైల్డ్ లైఫ్ యాక్ట్ చేశారు. అప్పటి నుంచి పులుల వేటను నిషేధించారు. దానికి కొనసాగింపుగా అంతరించిపోతున్న పులులను కాపాడుకునేందుకు 1973లో ‘ఆపరేషన్ టైగర్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా పులులను పరిరక్షించాలనే లక్ష్యంతో రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లో 2010 సంవత్సరంలో జరిగిన అంతర్జాతీయ టైగర్ సమ్మిట్లో జూలై 29వ తేదీని ‘ప్రపంచ పులుల దినోత్సవం’ అని ప్రకటించారు. అప్పటి నుంచి ఏటా జూలై 29వ తేదీన ప్రపంచ పులుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. పులుల సంరక్షణ ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఆంధ్రాలో 75 పెద్దపులులు రాష్ట్రంలో కూడా పెద్ద పులుల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలోని నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ ప్రాజెక్ట్ కింద పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రభుత్వం 2007లో ప్రకటించిన ప్రకారం ఆంధ్రాలోని ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, కర్నూలు జిల్లాల అటవీ ప్రాంతాలు టైగర్ రిజర్వ్ జోన్లో ఉన్నాయి. కడప, నెల్లూరు, ఉమ్మడి చిత్తూరు జిల్లాల పరిధిలోని శేషాచలం రిజర్వు, గోదావరి జిల్లాల్లోని పాపికొండలు ప్రాంతంలోనూ పులుల జాడ కనిపించింది. మన రాష్ట్రంలో 2014లో 40 పులులు ఉండగా, 2023 నాటికి 75కు పెరిగాయి. పులులు ఎక్కువగా ఉన్న మూడు రాష్ట్రాలు మధ్యప్రదేశ్ 785 కర్ణాటక 563 ఉత్తరాఖండ్ 560ఆంధ్రాలో పులులు ఎక్కడ ఉన్నాయంటే... నాగార్జునసాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ 64 శేషాచలం అటవీప్రాంతం 9 పాపికొండలు 2 -
తైమూర్-అముర్ విచిత్ర స్నేహం : ఈ మిరాకిల్ స్టోరీ వైరల్
పులికి ఆహారంగా మేకను వేస్తే ఏం చేస్తుంది. చంపి తినేస్తుంది కదా. ఇది మన అందరికి తెలిసిందే. కానీ దీనికి భిన్నంగా తనకు ఆహారంగా వచ్చిన మేకతో స్నేహం చేసిన ఘటన విస్మయానికి గురి చేస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన పోస్ట్ ఒకటి ఎక్స్లో సందడి చేస్తోంది.రష్యాలోని ప్రిమోర్స్కీ సఫారీ పార్క్లో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ క్రూర జంతువులకు వారానికి రెండుసార్లు ప్రాణాలతో ఉన్న జంతువులను ఆహారాన్ని ఇస్తారు. ఇందులో భాగంగానే సైబీరియన్ పులి అమూర్కు, తైమూర్ అనే మేకను రాత్రి భోజనంగా అందించారు. కానీ విచిత్రంగా ఇవి రెండూ స్నేహితులుగా మారిపోయాయి.గతంలో ఇలా చాలాసార్లు పంపించిన మేకలను పులి చంపి తినేసింది ఈ సారి మాత్రం అలా చేయలేదు. తైమూర్, అముర్ విరోధులు కాస్త ఫాస్ట్ స్నేహితులుగా మారిపోవడం మాత్రమే కాదు. కలిసి దోబూచు లాడుకోవడం, కలిసి తినడం, ఆడుకోవడం, మంచులో ఒకర్నొకరు వెంబడించుకోవడం , సరదాగా తలలతో కొట్టుకోవడం లాంటివి చేస్తున్నాయని ఎన్క్లోజర్ కెమెరాల ఆధారంగా పార్క్ అధికారులు ప్రకటించారు.2015లో తైమూర్ , అముర్ విచిత్ర స్నేహం వెలుగు చూడగా ఇపుడు మళ్లీ ఎక్స్లో వైరల్ అవుతోంది. నేచర్ ఈజ్ అమేజింగ్ అనే ట్విటర్ ఖాతా ఈ ఫోటోను షేర్ చేయడంతో 11 మిలియన్ల వ్యూస్ను దక్కించుకుంది.Tiger refuses to eat goat who was given to him as live food, instead, they became friends. pic.twitter.com/u6PlxdaKXW— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) July 21, 2024 ఈ స్నేహం ఎలా జరిగింది?మేకను ఎన్క్లోజర్లోకి విడుదల చేసినప్పుడు అది ఎటువంటి భయాన్ని చూపలేదు. బెదిరిపోలేదు. అది మృత్యు వేటగా భావించలేదు. అలా వ్యవహరించ లేదు. అసలు పులులకు భయపడాలని మేకకు ఎవరూ నేర్పించలేదు అంటూ జూ చీఫ్ డిమిత్రి మెజెంట్సేవ్ వ్యాఖ్యానించారు. అందుకే ఇవి స్నేహితులుగా మారాయని, ఇది మిరాకిల్ అని పేర్కొన్నారు. -
రైలు ఢీకొని పులిపిల్ల మృతి.. మరో రెండింటికి గాయాలు
మధ్యప్రదేశ్లోని సెహోర్లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. బుధ్ని ప్రాంతంలో రైలు ఢీకొని ఒక పులి పిల్ల మృతి చెందగా, మరో రెండు పులి పిల్లలు తీవ్రంగా గాయపడ్డాయి. గాయపడిన ఈ పులి పిల్లలను చికిత్స కోసం ప్రత్యేక రైలులో భోపాల్లోని వనవిహార్కు తరలించారు. మృతి చెందిన పులి పిల్లకు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం దానికి అంత్యక్రియలు చేశారు.ఈ ఉదంతం గురించి చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (సీసీఎఫ్) రాజేష్ ఖరే మాట్లాడుతూ ఉదయం వేళ పులి తన పిల్లలతో కలిసి నీరు తాగడానికి వెళ్లి ఉంటుంది. ఆ సమయంలోనే మూడు పిల్లలు రైలు ప్రమాదం బారిన పడ్డాయి. ఈ ఘటనలో ఒక పులి పిల్ల మృతి చెందగా, రెండు పులి పిల్లలు గాయపడ్డాయి. దీనిపై సమాచారం అందగానే ఘటనా స్థలానికి వెళ్లాం. గాయపడిన రెండు పులి పిల్లలను చికిత్స కోసం భోపాల్లోని వన విహార్కు తరలించామని తెలిపారు. #WATCH | Madhya Pradesh | A tiger cub died and 2 other cubs were injured after being hit by a train in the Budhni area of Sehore. Both the injured cubs were rescued and taken to Van Vihar, Bhopal by a special train for treatment. The dead cub was cremated after post-mortem.… pic.twitter.com/3WkaRDD2p2— ANI (@ANI) July 16, 2024 -
పులిపై దాడి చేసి చంపిన గ్రామస్తులు
రాయ్చూర్: ఆ పులి గ్రామంలో నలుగురిపై దాడి చేసి గాయపరిచింది. దీంతో గ్రామస్తులకు పులిపై ఎక్కడలేని కోపం వచ్చింది. ఇంకేముంది వందలాది మంది గ్రామస్తులు కర్రలు,రాళ్లతో పులిపై దాడి చేసి చంపేశారు. ఫారెస్ట్ అధికారులు వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటన రాయ్చూర్ జిల్లాలోని దేవదుర్గ ఫారెస్ట్ రేంజ్లో జరిగింది. పులిని చంపిన ఘటనపై కర్ణాటక అటవీ శాఖ మంత్రి విచారణకు ఆదేశించారు. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్లోనూ ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. అయితే ఫారెస్ట్ అధికారులు వెంటనే స్పందించి ట్రాప్లో చిక్కుకున్న పులిని కాపాడారు. -
నిజమే... ఇది చిరుతలాంటి అడవిపిల్లి!!
చూడటానికి ఇది అచ్చంగా చిరుతపులిలా ఉంటుంది గాని, నిజానికి ఇది అడవిపిల్లి. సహారా ఎడారి చుట్టుపక్కల ఉండే ఆఫ్రికా దేశాల్లోని అడవుల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. దీనిని ‘సెర్వల్’ అంటారు.ఇది దాదాపు రెండు అడుగుల పొడవు వరకు పెరుగుతుంది. దీని బరువు తొమ్మిది నుంచి పద్దెనిమిది కిలోల వరకు ఉంటుంది. అంటే, చిరుతపులితో పోల్చుకుంటే సగం పరిమాణంలో ఉంటుంది. శరీర పరిమాణంతో పోల్చుకుంటే, దీని కాళ్లు పొడవుగా ఉంటాయి. చిరుత కంటే దీని తల పరిమాణం చిన్నగా ఉంటుంది. ఇది చాలా వేగంగా వేటాడుతుంది.పగలు, రాత్రి కూడా చురుగ్గానే ఉంటుంది. ఎక్కువగా ఎలుకలు, కప్పలు, చిన్న చిన్న పక్షులను వేటాడి తింటుంది. ఆఫ్రికాలో వలస రాజ్యాలు ఏర్పరచుకున్న కాలంలో ఫ్రెంచ్ శాస్త్రవేత్త జార్జస్ లూయీ లెక్లెర్క్ కామ్టే డి బఫన్ 1765లో తొలిసారిగా ఈ జంతువును గుర్తించి, దీని గురించిన విశేషాలను ప్రపంచానికి వెల్లడించాడు.ఇవి చదవండి: ఆ దీవిలో మూడు రోజులు బస ఉచితం! ఎందుకంటే? -
ప్రకాశం: గుంతలో చిరుత.. అధికారుల పరుగులు
ప్రకాశం, సాక్షి: ప్రకాశం జిల్లాలో గిద్దలూరు మండలం దేవనగరంలో చిరుత పులి కలకలం రేపింది. గుంతలో చిక్కుకొని ఉన్న చిరుత పులిని గ్రామస్తులు గుర్తించారు. చిరుత సంచారంతో గ్రామస్తులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు చిరుతపులిని బంధించడానికి వలలు వేసి పట్టుకోవడానికి ప్రయత్నించారు. బుధవారం రాత్రి చీకటి కావడంతో రెస్క్యూకి చర్యలకు అంతరాయం కలిగింది. ఇవాళ తిరుపతి నుంచి వచ్చిన టైగర్ రెస్కూ టీమ్.. చిరుత పులిని బంధించి అడవిలో వదలనున్నారు.ఇదిలా ఉంటే.. నంద్యాల మహానంది క్షేత్రంలో మరోసారి చిరుత సంచారం భక్తులు, స్థానికుల్లో భయాందోళనకు కారణమైంది. గోశాల, అన్నదాన సత్రం దగ్గర చిరుత సంచరించిన సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. -
కారు.. పులి కథ.. అదిరిపోయే ట్విస్ట్..
-
హైవేపై పులిని ఢీ కొట్టిన కారు
-
మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పులి?.. వీడియో వైరల్
న్యూఢిల్లీ: దేశ ప్రధానిగా నరేంద్రమోదీ మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు 71 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. రాష్ట్రపతి భవన్ వేదికగా ఆదివారం అట్టహాసంగా ఈ కార్యక్రమం జరిగింది. దేశ, విదేశాలకు చెందిన రాజకీయ, సినీ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలతో సహా 8 వేల మంది అతిథులు హాజరయ్యారు.అయితే అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయంలో జరిగిన ఈ వేడుకలో ఆహ్వానం లేదని ఓ అతిథి ప్రత్యక్షమైంది. ప్రమాణస్వీకార కార్యక్రమం పూర్తయిన తర్వాత మధ్యప్రదేశ్ బీజేపీ ఎంపీ దుర్గా దాస్ ఉయికే.. రాష్ట్రపతి ముర్ముకు అభివాదం చేస్తుండగా.. స్టేజీ వెనక భాగంలో ఓ జంతువు అటుగా వెళుతూ కెమెరా కంటికి చిక్కింది. ప్రమాణ స్వీకార వేదికకు కాస్త దూరంలోనే సంచరించడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.సోషల్మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. తొలుత ఫేక్ వీడియో లేదా ఏఐ జనరేటెడ్ వీడియో అని కొట్టిపారేశారు. తర్వాత ప్రధానమంత్రి కార్యాలయం నిన్న షేర్ చేసిన యూట్యూబ్ లైవ్ ఫీడ్ను పరిశీలించినప్పుడు.. ఓ జంతువు సంచరించడం నిజమేనని తేలింది.అది చూడటానికి పులిలా కనిపించింది. కానీ ఆ జంతువు పెంపుడు పిల్లి అని, లేదా కు అయి ఉండవచ్చిన పలువురు అభిప్రాయపడుతున్నారు. అంతేగాక కొంతమంది ఈ దృశ్యాలను కూడా నమ్మడం లేదు, బ్యాగ్రౌండ్లో ఎడిట్ చేసి చూపిస్తున్నారని చెబుతున్నారు. మరికొందరైతే అతి కచ్చితంగా చిరుతపులిలా కనిపిస్తుందని, అక్కడి వారు అదృష్టవంతులు దాని బారి నుంచి తప్పించుకున్నారని కామెంట్ చేస్తున్నారు. దీనిపై రాష్ట్రపతి భవన్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.An animal was seen strolling back in the Rashtrapati Bhavan after MP Durga Das finished the paperwork~ Some say it was a LEOPARD while others call it some pet animal. Have a look 🐆 pic.twitter.com/owu3ZXacU3— The Analyzer (News Updates🗞️) (@Indian_Analyzer) June 10, 2024 -
అలా చూసి.. భయంతో పరుగెత్తాను..
కొండాపూర్ అటవీ ప్రాంతంలో బొందె గుట్ట, గొర్లెల్ల గుట్ట మధ్య మా పొలం ఉంది. అక్కడే పశువులు కూడ కట్టేస్తాం. ఎప్పటిలాగే పొలం వద్దకు పడుకోడానికి వెళ్లాను.కొద్దిసేపు మంట పెట్టుకుని పశువులకు మేత వేయడానికి వెళ్లాను. కుక్క అరుస్తూ వచ్చి కంటపడింది. వెంటనే లైట్ వేసి చూడగా చిరుత కొద్ది దూరంలో నిలబడి ఉంది. భయంతో హడలిపోయాను. వెంటనే పరుగెత్తి పక్క పొలంలో ఉన్న వారి వద్దకు వెళ్లాను. తర్వాత ఇంటికి వచ్చి పడుకున్నాం. పొలానికి వెళ్లాలంటేనే భయంగా ఉంది. – రెడ్డిపల్లి అంజిలయ్య, కొండాపూర్ఆనవాళ్లు చిక్కడం లేదు..కొండాపూర్, ఆశిరెడ్డిపల్లి, రెడ్డిపల్లి ప్రాంతాల్లో చిరుత సంచరిస్తుందని సమాచారం వచ్చింది. తమ సిబ్బంది వెళ్లి పరిశీలించారు. చిరుత అనడానికి సరైన ఆధారాలు దొరకడం లేదు. హైనా కూడ చిరుతలాగే కనిపిస్తుంది. అదే ఉండవచ్చని మా అనుమానం. రైతులు చూసినట్లు చెపుతున్నా తమకు స్పష్టత రావాలి. ఒకవేళ చిరుత ఉంటే బోను ఏర్పాటు చేస్తాం. రైతులు పశువులను బయట కట్టేయకూడదు. ఒంటరిగా వెళ్లకపోవడం మచింది. చేతిలో ఎపుడు కర్ర పట్టుకుని పొలానికి వెళ్లాలి. – మక్బూల్ హుస్సేని, రేంజ్ ఆఫీసర్, మహమ్మదాబాద్ -
పెరిగిన నితీశ్ ఇమేజ్.. పాట్నాలో ‘టైగర్ జిందాహై’ పోస్టర్లు
పాట్నా: లోక్సభ ఎన్నికల్లో జేడీయూ అద్భుత ప్రదర్శన తర్వాత ఆ పార్టీ చీఫ్, బిహార్ సీఎం నితీశ్కుమార్ ఇమేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఎన్డీఏ మూడో టర్ము ప్రభుత్వంలో జేడీయూ కీలకంగా మారడం ఆ పార్టీ క్యాడర్కు ఉత్సాహాన్నిస్తోంది. ఇందులో భాగంగానే బిహార్ రాజధాని పాట్నాలోని మెయిన్ సెంటర్లో ఆ పార్టీ కార్యకర్తలు టైగర్ జిందాహై అని పెద్ద హోర్డింగ్ పెట్టారు. ఈ పోస్టర్పై పులి బొమ్మతో పాటు నితీశ్కుమార్ భారీ చిత్రాన్ని ఏర్పాటు చేశారు. ఇదొక్కటే కాకుండా పట్టణంలోని పలు చోట్ల నితీశ్ను కీర్తిస్తూ పెద్ద పెద్ద పోస్టర్లు, ఫ్లెక్సీలు పెట్టారు.‘ఫలితాలకు ముందు నితీశ్ ఇమేజ్ ఫలితాల తర్వాత నితీశ్ ఇమేజ్కు చాలా వ్యత్యాసం ఉంది. బిహార్ ఓటర్లలో నితీశ్ పాపులారిటీ పెరిగింది’అని జేడీయూ నేత నీరజ్కుమార్ చెప్పారు.కాగా, మోదీ మూడో టర్ము ప్రభుత్వంలో జేడీయూ కీలక మంత్రిత్వ శాఖలను ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు బిహార్కు ప్రత్యేక హోదా, అగ్నివీర్ స్కీమ్లో మార్పుల కోసం జేడీయూ కొత్త సంకీర్ణ ప్రభుత్వాన్ని గట్టిగా అడిగే అవకాశం ఉంది. -
చిత్తూరులో పులి హల్చల్.. అసలు కథ ఇదీ!
ఒక పల్లెటూరులో తండ్రిని ఓ పిల్లవాడు నాన్న పులి వచ్చిందంటూ రెండుసార్లు ఆటపట్టిస్తాడు. పావుగంట అయ్యాక మళ్లీ పులి అంటూ పిల్లవాడు కేకలు వేయడంతో ఎవరు పట్టించుకోరు. తీరా నిజంగానే పులి వచ్చి గొర్రెలను తీసుకెళుతుంది. ఈ కథలో నీతి ఏమిటంటే అబద్దాలు ఆడితే పరిహారం తప్పదని.. సరిగ్గా ఇదే విధంగా ప్రస్తుతం జిల్లాలో పలువురు ‘పులి సంచరిస్తోందని’ తప్పుడు ప్రచారం చేస్తూ జనాన్ని భయపెడతున్నారు. ఇవన్నీ ఫేక్గా అటవీశాఖ అధికారులు గుర్తించి ఆకతాయిలను హెచ్చరిస్తున్నా వారిలో మార్పు రావడం లేదు. చిత్తూరు కార్పొరేషన్: అదిగో ఇక్కడ పులి వచ్చింది.. అంటూ వాట్సాప్, ఇన్స్ట్రాగామ్, ఫేసుబుక్ వంటి సామాజిక మాధ్యమాలలో కొందరు ఫొటోలు పెడుతున్నారు. దీంతో సంబంధిత ప్రాంత వాసులు భయాందోళనకు లోనవుతున్నారు. దీన్ని అటవీశాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. ఆ ఫోటోలు, వీడియోలు వైరల్ కావడంతో నిజాలు తెలుసుకునేందుకు అటవీశాఖ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించి అటువంటిదేమీ లేదని సృష్టత ఇస్తున్నప్పటికీ ఆగడాలు ఆగడం లేదు. గడిచిన 9 నెలల్లో ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. అందరిని భయాందోళనకు గురిచేయాలనే శాడిజం మనస్వత్తంతో ఉన్నవారు ఇలా ప్రవర్తిస్తున్నారని నిపుణులు అంటున్నారు. జిల్లాలో ఇలా.. 👉 చిత్తూరు రూరల్ మండలం బీఎన్ఆర్పేట సమీపంలో రోడ్డు పనుల వద్ద బెంగాల్ టైగర్ కనిపించిందని వీడియోను వైరల్ చేశారు. తీరా క్షేత్రస్థాయిలో సిబ్బంది పరిశీలిస్తే అది అస్సాంలో జరిగిన వీడియోగా, సామాజిక మాధ్యమాల నుంచి డౌన్లోడ్ చేసినట్లు అధికారులు తేల్చారు. 👉గుడిపాల మండలం పసుమంద పంచాయతీలో బెంగాల్ టైగర్ను చూశామని ఫోటోలు పెట్టారు. దీంతో మండల వాసులు భయాందోళనకు లోనయ్యారు. అక్కడికెళ్లి అటవీశాఖ సిబ్బంది తనిఖీలు చేస్తే ఇక్కడి వీడియో కాదని తేలింది. ఈ వీడియోను ఉత్తరప్రదేశ్లో తీసినట్లుగా గుర్తించారు. 👉గుడిపాలలోని గొల్లమడుగు అటవీ ప్రాంతంలో పులి కూనలను వదిలి వెళ్లిందని వీడియో పెట్టారు. తల్లి కోసం పిల్లలు ఎదురుచూస్తున్నట్లు ఆ వీడియో సారాంశం. డీఎఫ్ఓ చైతన్యకుమార్రెడ్డి నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించారు. ఎఫ్ఆర్వో థామస్ సిబ్బందితో కలిసి కొండలు, గుట్టలను రెండు రోజులు పాటు జల్లెడ పెట్టి కూనలు లేవని నిగ్గుతేల్చారు. మధ్యప్రదేశ్లో జరిగిన సంఘటన వీడియో పెట్టారని అధికారులు తెలుసుకున్నారు. చిత్తూరు ఈస్ట్ రేంజ్లో వైరల్ చేసిన ఫోటోలు, వీడియోలు ఎక్కువగా బయట రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కారి్మకులు పెట్టినట్లుగా గుర్తించారు. వాటిని స్థానికులు వైరల్ చేసినట్లు తెలుస్తోంది. 👉పాకాల మండలం నేండ్రగుంట వద్ద పులి రోడ్డుపై వచ్చినట్లు ప్రయాణికులు భయాందోళనకు గురైనట్లు వీడియో పెట్టారు. ఆ వీడియో ఉత్తరప్రదేశ్ వీడియో అని అధికారులు తేల్చారు. 👉వడమాలపేట మండలం బంగారెడ్డి కండ్రిగ సమీపం ప్రాంతంలో పులి వచ్చిందని వాట్సాప్ గ్రూప్లో పోస్టులు పెట్టడంతో ప్రాంతవాసులు బిత్తరపోయారు. తీరా అధికారులు రంగంలో దిగి విచారించడంతో గత సంవత్సరం నవంబరులో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ సురేష్ బెంగళూరులో తీసిన ఫోటోగా తేల్చారు. ఇన్స్టాలో పెట్టిన వీడియోలో నుంచి తీసిన ఫోటోగా నిర్దారించారు. ఇలాంటి విషయాల్లో వాస్తవాలు తెలుసుకోకుండా పలువురు వాట్సాప్ స్టేటస్ట్లు పెడుతున్నారు. చదువుకున్న వారు సైతం ఇలా చేయడం సరికాదని అధికారులు సూచిస్తున్నారు.చర్యలు తప్పవు ఇప్పటి వరకు అవాస్తవ వీడియోలపై ఆకతాయిలను హెచ్చరించి వదిలేశాం. వీటిని అటవీశాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. ఇకపై ఎలాంటి అవాస్తవ వీడియోలు వచ్చినా అటవీచట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. యువత సమాజశ్రేయస్సు కోసం బాటలు వేయాలి. – థామస్, ఎఫ్ఆర్వో, చిత్తూరు ఈస్ట్ -
Jr NTR HD Stills: ఎన్టీఆర్ 'దేవర' ఫియర్ సాంగ్ ఫోటోలు వైరల్
-
Jr NTR Unseen Photos: ఎన్టీఆర్ జీవితంలో ప్రత్యేకమైన ఫోటోలు
-
చంపై సోరెన్ను ‘జార్ఖండ్ టైగర్’ అని ఎందుకంటారు?
చంపై సోరెన్ జార్ఖండ్ తదుపరి ముఖ్యమంత్రి కానున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాజీనామా నిర్ణయం తర్వాత జార్ఖండ్ ముక్తి మోర్చా .. చంపై సోరెన్ తదుపరి ముఖ్యమంత్రి అని ప్రకటించింది. చంపై.. హేమంత్ సోరెన్కు దగ్గరి బంధువని చెబుతారు. చంపై ప్రస్తుతం రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జేఎంఎంతో పాటు కాంగ్రెస్ కూడా ప్రభుత్వంలో మిత్రపక్షంగా ఉంది. చంపై సోరెన్ ‘జార్ఖండ్ టైగర్’గా పేరొందారు. చంపై సోరెన్ జార్ఖండ్ శాసనసభ సభ్యుడు. ప్రస్తుతం ఆయన జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ నుంచి సెరైకెలా అసెంబ్లీ స్థానానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. చంపై క్యాబినెట్ మంత్రిగా హేమంత్ సోరెన్ ప్రభుత్వంలో రవాణా, షెడ్యూల్డ్ తెగలు,షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. బీహార్ నుండి ప్రత్యేక జార్ఖండ్ రాష్ట్రం కోసం డిమాండ్ వచ్చినప్పుడు చంపై పేరు వార్తల్లో నిలిచింది. శిబు సోరెన్తో పాటు చంపై కూడా జార్ఖండ్ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. అప్పటి నుంచి రాష్ట్ర ప్రజలు చంపైని ‘జార్ఖండ్ టైగర్’ అని పిలవడం ప్రారంభించారు. చంపై 2005లో తొలిసారిగా జార్ఖండ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2009లో కూడా ఎమ్మెల్యే అయ్యారు. సెప్టెంబర్ 2010 నుండి జనవరి 2013 వరకు సైన్స్ అండ్ టెక్నాలజీ, లేబర్, హౌసింగ్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. చంపై.. జూలై 2013 నుండి డిసెంబర్ 2014 వరకు ఆహార, పౌర సరఫరాలు, రవాణా కేబినెట్ మంత్రిగా వ్యవహరించారు. 2014లో జార్ఖండ్ అసెంబ్లీకి మూడోసారి ఎన్నికయ్యారు. 2019లో నాలుగోసారి ఎమ్మెల్యే అయ్యారు. దీనితో పాటు హేమంత్ ప్రభుత్వంలో రవాణా, షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అక్రమ భూ కుంభకోణం కేసులో చిక్కుకున్న హేమంత్ సోరెన్ బుధవారం జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ నేపధ్యంలో జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) కాంగ్రెస్ కూటమి సోరెన్ ప్రభుత్వంలో శాసనసభా పక్ష నేతగా రవాణా మంత్రి చంపై సోరెన్ను ఎన్నుకున్నాయి. హేమంత్ సోరెన్కు చంపై అత్యంత సన్నిహితుడని చెబుతారు. -
అమ్మో.. పులొచ్చింది!
ద్వారకాతిరుమల: పెద్ద పులి.. కొద్ది రోజులుగా తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సంచరిస్తూ ప్రజలను భయకంపితులను చేస్తోంది. తాజాగా మంగళవారం తెల్లవారుజామున ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం రామసింగవరం పంచాయతీ, కొత్తగూడెంలోకి వచ్చిన పెద్ద పులి ఒక దూడను చంపి తినేసింది. వివరాల్లోకి వెళితే.. కొత్తగూడెం గ్రామానికి చెందిన రైతు ముక్కవల్లి బాలసుందరం గేదెల నుంచి పాలు తీసేందుకు తెల్లవారుజామున తన తోటలోకి వెళ్లాడు. అక్కడ కట్టేసి ఉన్న గేదెలు, దూడలు బెదిరిపోయి అరుస్తుండడాన్ని గమనించాడు. వాటిలో ఒక గేదె దూడ లేకపోవడాన్ని గుర్తించాడు. దూడ కోసం వెతుకుతుండగా సమీప పొదల్లోంచి పులి గాండ్రింపులు వినబడడంతో వెంటనే అక్కడున్న జీడి మామిడి చెట్టెక్కి కూర్చున్నాడు. ఏం చేయాలో పాలుపోక తన వద్ద ఉన్న సెల్ ఫోన్ ద్వారా స్థానిక రైతులకు, గ్రామస్తులకు సమాచారం అందించాడు. ఆనోటా ఈనోటా చుట్టుపక్కల గ్రామాలకు సైతం ఈ వార్త దావానలంలా వ్యాపించడంతో పెద్ద ఎత్తున ప్రజలు అక్కడికి చేరుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా డీఎఫ్వో నాగరాజు, జంగారెడ్డిగూడెం సబ్ డీఎఫ్వో ఎ.వెంకట సుబ్బయ్య, ఏలూరు సబ్ డీఎఫ్వో ఆర్.శ్రీదేవి, ఏలూరు ఎఫ్ఆర్వో ఎస్వీకే కుమార్, నూజివీడు ఎఫ్ఆర్వో దావీదురాజు నాయుడు తదితరులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అక్కడ పులి జాడలు, దూడ రక్తం, ఎముకలు వారికి కనిపించాయి. పులి పరిసర ప్రాంతాల్లోనే ఉన్న ట్లు నిర్ధారించిన అధికారులు దాని కోసం గా లించారు. అవసరాన్ని బట్టి బోను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. పలు ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలను అమర్చారు. గ్రామస్తులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని కొత్తగూడెంలో టాంటాం వేయించారు. ఘటనపై రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటే‹Ùను ఆరా తీయగా, పులి రామసింగవరం అడవిలోకి వెళ్లిపోయిందని ఆయన తెలిపారు. -
ఏలూరు జిల్లా దెందులూరులో పెద్దపులి సంచారం
-
Tiger Tension: ఏలూరు జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం
-
ఏలూరు జిల్లాలో కలకలం రేపుతున్న పెద్దపులి సంచారం
-
Viral Video: కోపంతో వెంబడించిన పులి.. భయపడి పరుగు!
యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ (యూఏఈ) దేశానికి చెందినవారి విలాసవంతమైన జీవితాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడీయాలో చాలానే చూసి ఉంటాం. అక్కడి సంపన్న వర్గానికి చెందిన వారు చాలా వరకు.. పులులు, సింహాలు, చీతాలను పెంచుకోవటం గొప్పగా భావిస్తారన్న విషయం తెలిసిందే. అటువంటి జంతువుల కలెక్షన్ వాటిని బీచ్లకు తీసుకువెళ్లడం యూఏఈ సంపన్న కుటుంబాలకు ఓ సరదా అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే తాజాగా ఓ విలాసవంతమైన భవనంలో ఒక పెంపుడు పులి.. ఓ వ్యక్తిని భయంతో పరుగులు తీయించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Billionaire Life Style (@billionaire_life.styles) బిలియనీర్స్ లైఫ్ స్టైల్ అనే ఓ ఇన్స్టాగ్రామ్ ఈ వీడియోను పోస్ట్చేసింది. ముందు సరదగా వెంబడిస్తున్నట్లు అనుకున్న ఆ వ్యక్తి.. పులి వేగం పెంచి అదే పనిగా కోపంగా తన వెంటపడటంతో ఆ వ్యక్తి భయపడిపోయాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘అందమైన పులి.. ఒక బొమ్మ కాదు’, ‘దాడి చేయడానికి వచ్చిన పులి నుంచి తప్పించుకున్నాడు’, ‘చాలా ఫన్నీగా ఉంది.. ఇది ఖచ్చితంగా బిలియనీర్స్ లైఫ్ స్టైల్!’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చదవండి: వాళ్లను చంపేయండి.. ఇజ్రాయెల్కు గాజా ప్రజల విన్నపం! -
TS: హమ్మయ్యా.. ఆ పులులు సేఫ్!
కొమురం భీం, సాక్షి: కాగజ్ నగర్ అటవీ ప్రాంతంలో కలకలం రేపిన పులుల మృత్యువాత సంఘటనలో అనేక సంచలన విషయాలు బయటకు వచ్చాయి.. రెండు పులులపై విష ప్రయోగం జరిగినట్టు గుర్తించిన అటవీశాఖ సెర్చ్ ఆపరేషన్ ను సీరియస్ గా తీసుకుంది. చివరికి మూడు రోజుల పాటు అడవిని జల్లెడ పట్టిన అనంతరం తల్లి పులి రెండు పిల్లల జాడ ట్రాప్ కెమెరాలకు చిక్కడంతో ఆపరేషన్ ను నిలిపివేసింది. కొమురంభీం జిల్లా కాగజ్ నగర రేంజ్ దరిగాం అడవుల్లో టైగర్ సర్చ్ ఆపరేషన్ సక్సెస్ అయింది. మూడు రోజుల విస్తృత గాలింపు తర్వాత ఎట్టకేలకు కనిపించకుండా పోయిన S6 పులి దాని రెండు పిల్లలు ట్రాప్ కెమెరాకు చిక్కాయి. దరిగాం అడవిలో విష ప్రయోగంతో చనిపోయిన రెండు పులులతో పాటు మరో రెండు పులులు మిస్ అవడంపై అలర్ట్ అయిన జిల్లా అటవీశాఖ సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది.. మూడు వందల మంది సిబ్బందిని రంగంలోకి దింపింది. 72 బృందాలు , 105 ట్రాప్ కెమెరాల తో మూడు రోజుల పాటు అడవిని జల్లెడ పట్టారు అటవీ శాఖ అధికారులు.. అయితే సిబ్బందికి మిస్ అయిన పులులు కనిపించడంతో ఆపరేషన్ సక్సెస్ గా ముగిసింది. ఎస్ 6 తల్లి పులితో పాటు కనిపించకుండా పోయిన పులి పిల్లలు సైతం క్షేమంగా ఉన్నాయంటూ తేల్చింది కొమురంభీం జిల్లా అటవీ శాఖ. గత ఏడాది డిసెంబర్ 27 న దరిగాం అటవి ప్రాంతంలో ఎస్ 9 పులి ఓ పశువు పై దాడి చేయగా.. ఆ పశువును మరోసారి తిన్న కే15 పులి ఈనెల 6 న మృత్యువాత పడింది. ఆ ఘటన జరిగిన మరుసటి రోజే ఐదేళ్ల మగపులి ఎస్ 9 సైతం మరణించింది. దీంతో పులి మరణాల కేసును సీరియస్గా తీసుకున్న ఉన్నతాదికారులు లోతుగా దర్యాప్తు చేయడంతో.. పశువుపై విష ప్రయోగం జరిగినట్టు తేలింది. ఆ పశువు మృతి చెందిన సమీపంలో నాలుగు పులుల పాదముద్రలు లభించడంతో ఆందోళన చెందింది అటవీశాఖ. దీంతో అలర్ట్ అయిన అటవిశాఖ చనిపోయిన పులులతో పాటు పశువు మాంసం తిన్న మరో రెండు పులుల కోసం అన్వేషణ సాగించింది. ఈనెల 9 న టైగర్ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభింవింది.. మొదటి రోజు 14 ట్రాకింగ్ టీములు, 22 ట్రాప్ కెమెరాలతో దరిగాం అటవి ప్రాంతాన్ని జల్లెడ పట్టింది. 24 గంటలు దరిగాం అడవిని జల్లెడ పట్టిన మిస్ అయిన పులుల ఆచూకీ లభించకపోవడంతో ట్రాకింగ్ టీంను 72 కు పెంచింది. దరిగాం అటవీ ప్రాంతంతో పాటు సర్కపల్లి, గోంది అటవి ప్రాంతంలోను సర్చ్ ఆపరేషన్ కంటిన్యూ చేసిన అటవీ శాఖ 105 కెమెరాలను ఏర్పాటు చేసి మానిటరింగ్ చేసింది. దీంతో ఈనెల 11 న దరిగాం గోంది అటవి ప్రాంతంలో మరో పశువుపై పులిదాడి చేసి హతమార్చగా.. ఆ పశువు వద్ద ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాకు పులి చిక్కింది. దాని పాదముద్రల ఆధారంగా మూడేళ్ల వయస్సున ఆడపులి.. ఎస్ 6 గా గుర్తించిన అటవిశాఖ ఊపిరి పీల్చుకుంది. 73వ క్యాంపు వారికి కే 14 పులి పాదముద్రలు 51 క్యాంప్ టీంకు కే 16, 17 పాదముద్రలు లభించడంతో సర్చ్ ఆపరేషన్ ని నిలిపివేసింది. 62 గంటల పాటు ఓ యుద్దంలా సాగిన టైగర్ సర్చ్ ఆపరేషన్ పులులు క్షేమంగా ఉన్నాయన్న సమాచారంతో సక్సెస్ గా ముగియగా.. దరిగాం అటవీ ప్రాంతంలో లెక్కకు మించి పులుల సంచారం సాగుతుందన్న సమాచారంతో అటవిశాఖకు మరింత దృష్టి సారించింది. ఇప్పుడు ఆ పులులను వేటగాళ్ల కంటపడకుంటా క్షేమంగా కాపాడటం.. ఆ పులులతో మనుషులకు ఎలాంటి ప్రమాదం రాకుండా చూడటం తప్పని సరిగా మారింది. మరోవైపు కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం దిందా గ్రామంలోని ఓ రైతుకు పత్తి చేనులో పులి కనిపించింది. వెంటనే రైతు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. పులి కోసం గాలింపు చర్యలు చేపట్టిన పారెస్ట్ అదికారులు గుంపులు గుంపులు చేనులల్లో పనులు చేసుకోవాలని ఫారెస్ట్ కర్జెల్లి రేంజ్ అధికారి నవ్య రైతులకు సూచిస్తున్నారు. ఇటు దరిగాం అటవీ సంఘటన లో పలువురిని అదుపులోకి తీసుకున్న అధికారులు దర్యాప్తు వేగం చేశారు.. నిర్లక్ష్యం వహించిన అధికారులపై సైతం చర్యలు తీసుకునే అవకాశం లేపోలేదని తెలుస్తోంది. -
కొమురంభీం జిల్లాలో టైగర్ సెర్చ్ ఆపరేషన్ సక్సెస్
-
పక్కా ప్లాన్తోనే...
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పశువులను చంపుతున్నాయన్న ప్రతీకారంతోనే కొందరు పులులను మట్టుబెట్టుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కుమురంభీం జిల్లా కాగజ్నగర్ డివిజన్లో రెండు పులుల్లో ఒకటి స్పష్టంగా ఇదే కారణంగా చనిపోయినట్టు సమాచారం. విశ్వసనీయ సమాచారం మేరకు.. తమ పశువులను చంపి తింటున్న పులులను లేకుండా చేయాలని భావించి వాంకిడి మండలం సర్కెపల్లికి చెందిన పశువు యజమాని, ముగ్గురు పశువుల కాపరులు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు సమాచారం. ఇందుకోసం ఉచ్చులు, విష ప్రయోగం కూడా చేసినట్టు తెలుస్తోంది. కళేబరంపై గడ్డి మందు చల్లి.. ఇటీవలే ఓ రైతుకు చెందిన పశువును పులి చంపి తినేసింది. సాధారణంగా ఒకసారి వేటాడితే, పులి ఆ మాంసాన్ని వారం దాకా భుజిస్తుంది. మళ్లీ వస్తుందని తెలుసుకొని ఎద్దు కళేబరంపై గడ్డి మందు చల్లి మట్టుబెట్టారు. మొదట ఉచ్చులు కూడా వేసినట్టు సమాచారం. గడ్డి మందు చల్లిన పశువు కళేబరాన్ని తిని ఎస్9 మగపులి చనిపోగా, ఆ పరిసరాల్లోనే ఉన్న ఎస్6కు చెందిన రెండు పిల్లల జాడ ఇంకా తెలియదు. వాటిని ట్రేస్ చేస్తేనే అసలు విషయం తెలుస్తుంది. సీన్ రీ కన్స్ట్రక్షన్ పులిపై ఎలా విష ప్రయోగం చేశారో నలుగురు నిందితులు బుధవారం అడవిలో అధికారుల ముందు యథాతథంగా చేసి చూపించారు. కేసు దర్యాప్తులో భాగంగా చనిపోయిన పశువుల రైతుల వివరాలు అటవీ అధికారులు సేకరిస్తుండగా, నలుగురు అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో కాగజ్నగర్ పోలీసుల సాయంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో వారు నిజం ఒప్పుకున్నట్టు తెలిసింది. పరిహారంలో జాప్యం కాగజ్నగర్ రేంజ్ దరిగాం, సర్కెపల్లి పరిధిలోనే ఆరు పులులు ఉన్నాయి. తరచూ పశువులపై దా డులు చేస్తూ ఆకలి తీర్చుకుంటున్నాయి. అయితే నిబంధనల ప్రకారం పశువుల విలువ మేరకు వెంటనే రైతులకు నష్టపరిహారం చెల్లించాలి. కానీ నెలల తరబడి జాప్యం జరుగుతోంది. దీంతో పశువులను చంపుతున్నాయనే కోపంతోనే కొందరు విష ప్రయోగం చేసి పులుల మరణానికి కారణమవుతున్నారనే వాదనలు ఉన్నాయి.పులుల సంరక్షణ పకడ్బందీగా చేస్తున్నామని చెప్పే అధికారులు కిందిస్థాయి వాస్తవ పరిస్థితులను తెలుసుకోలేకపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరో పశువుపై దాడి రెండు రోజుల క్రితం కాగజ్నగర్ రేంజ్ ఉట్పల్లి శివారులో ఓ పశువును పులి చంపేసింది. అప్రమత్తమైన అధికారులు కెమెరాలు బిగించారు. అక్కడకు మళ్లీ భుజించేందుకు పులి వస్తే ట్రేస్ అవుతాయి. ఇక్కడ సంచరించే ఆరింటిలో రెండు చనిపోగా, మరో నాలుగింటి జాడపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే అటవీ అధికారులు ఈ కేసు దర్యాప్తు వివరాలు వెల్లడించేందుకు నిరాకరిస్తున్నారు. గురువారం అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. -
మగపులిని మట్టుబెట్టారు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మగపులిది అసహజ మరణమని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. కుమురంభీం జిల్లా కాగజ్నగర్ డివిజన్ దరిగాం–సర్కెపల్లి మధ్య బూడిదమామిడి అడవుల్లో ఈ నెల 6న ఏడాదిన్నర ఆడపులి, ఈ నెల 8న ఐదేరాళ్ల మగపులి (ఎస్9) కళేబరాలను గుర్తించిన విషయం తెలిసిందే. అయితే ఆడపులి మరోపులితో పోరులో చనిపోగా, మగపులి విషంతో చనిపోయినట్టు అధికారులు గుర్తించారు. మంగళవారం ఎన్టీసీఏ (నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ) నియమించిన టీంతో కలిసి పీసీసీఎఫ్ ఆర్ఎం డొబ్రియల్, చీఫ్ వైల్డ్లైఫ్ ఇన్చార్జి ఎంసీ పర్గేన్, సీసీఎఫ్ శాంతారామ్, డీఎఫ్ఓ నీరజ్కుమార్, కాగజ్నగర్ ఎఫ్డీఓ వేణుబాబు, ఎఫ్ఆర్వో వేణుగోపాల్, పశువైద్యాధికారులు, ఎన్జీఓ, ఇతర సిబ్బందితో వివరాలు తీసుకున్నారు. అనంతరం ఎన్టీసీఏ నిబంధనల మేరకు అడవిలోనే పులి, పశుకళేబరాలను దహనం చేశారు. పులిపై విష ప్రయోగం ఒక పులి అంతర్గత పోరులో, మరో పులి విషం పెట్టడంతో చనిపోయినట్టు ప్రాథమికంగా అంచనాకు వస్తున్నాం. మగపులి మెడకు ఉచ్చు కూడా ఉంది. అది వదులుగా ఉంది. పులి ఉచ్చు పడితే తనంతట తాను తీసుకునే ప్రయత్నం చేస్తుంది. కనిపిస్తున్న ఆధారాలను బట్టి పులి వేటాడిన పశుకళేబరంలో ఎవరైనా విషం కలిపి ఉండొచ్చు. దానిని తిన్న పులి చనిపోయి ఉండొచ్చనిపిస్తోంది. నమూనాలు మూడు ల్యాబ్లకు పంపుతున్నాం. నివేదిక వస్తే స్పష్టత వస్తుంది. ఘటనపై కేసు నమోదు చేశాం. విచారణలో స్థానిక పోలీసు సాయంతో నేరస్తులను పట్టుకుంటాం. – ఆర్ఎం డొబ్రియల్ పులులెలా చనిపోతున్నాయి? సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: కవ్వాల్ టైగర్ కారిడార్లో వరుస ఘటనలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. మొదట రెండు పులుల ఆవాస ఆధిపత్య పోరులో ఒకటి చనిపోయిందని తేల్చారు. మరో పులి అదే తీరుగా పొట్లాటలో మృతి చెందిందని చెప్పే ప్రయత్నాలు చేశారు. కానీ ఒకేచోట రెండు మరణించడం, పశువుల కళేబరాలు ఉండడంతో ఆ దిశగా విచారణ మొదలైంది. ‘తడోబా–అందేరి’, ‘తిప్పేశ్వర్’కు పెన్గంగా, ప్రాణహిత పక్కనే ఉన్న కాగజ్నగర్ పులుల రాకపోకలకు ప్రధాన కారిడార్గా ఉంది. దరిగాం సమీపప్రాంతాల్లోనే ఎస్9 మగపులి, ఎస్6 అనే ఆడపులితో జతకట్టడంతో నాలుగు పిల్లలు జన్మించాయి. వాటి వయసు రెండేళ్లు దాటడంతో ఆవాసం వెతుక్కుంటున్నాయి. మరోవైపు ఎస్6 కోసం మరో మగపులి రావడం, అక్కడే ఎస్9 కూడా ఉండడంతో ఆధిపత్య పోరు మొదలైంది. ఇలా తల్లి, నాలుగు పిల్లలు, మగపులులతో అక్కడే సంచరిస్తున్నాయి. అడవిలో వన్యప్రాణుల లభ్యత లేక స్థానిక గిరిజన రైతుల పశువులే వాటికి ఆహారంగా మారాయి. రెండేళ్లుగా ఆరు పశువులను చంపగా, కొందరికే పరిహారం రాగా, మరికొందరికి అందలేదు. పశువులపై దాడులతో ప్రతీకారమా... పశువులను చంపేస్తున్న పులులను హతమార్చాలని ఎవరైనా కోపంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారా? అనే కోణంలో విచారణ మొదలైంది. గతంలో పులులకు ఉచ్చులు బిగిసి ఇబ్బంది పడిన ఘటనలు ఉన్నాయి. ఐదేళ్ల క్రితం చెన్నూరు డివిజన్లో అమర్చిన ఉచ్చుకు కే4 ఆడపులి చిక్కి నడుము భాగంలో ఉండిపోయింది. ఇప్పటికీ ఆ పులి జాడ లేదు. అదే డివిజన్ శివ్వారం, ఉట్నూరు డివిజన్లోనూ ఉచ్చులతో పులులకు ముప్పు జరిగాయి. ఎస్6, ఆ పిల్లలు సురక్షితమేనా? ఎస్6తోపాటు మరో మూడు పిల్లలు క్షేమంగా ఉన్నాయా? అనే అనుమానాలు వస్తున్నాయి. పులుల మరణానికి ముందు చివరగా దరిగాం పరిధిలోనే ఓ పశువును హతమార్చి భుజిస్తుండగా కెమెరాకు చిక్కాయి. ఆ తర్వాత వాటి జాడ లేదు. ఆవాసాల ఆధిప్యత పోరు, కొత్త పులి రాకతో ఘర్షణతో వేరే చోటుకు వెళ్లాయా? లేక విషం, ఉచ్చుల బారిన పడ్డాయా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వీటి ఆచూకీకి 50 మంది యానిమల్ ట్రాకర్స్ వెతుకుతున్నారని, ఈ చుట్టుపక్కల యాభైదాకా కెమెరా ట్రాక్లను అమర్చి పర్యవేక్షిస్తున్నట్టు ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. -
గోడలెక్కి అడ్డంగా బుక్కైన పెద్దపులి!
పులి మనుషుల మధ్యకు వస్తే.. దాని మనోగతం ఎలా ఉంటుందో హ్యూమర్ టచ్తో భావోద్వేగాలను కలగలిపి Tiger Comes to Town(టైగర్ కమ్స్ టూ టౌన్) ద్వారా అందించారు రచయిత ఆర్కే నారాయణ్. అరణ్యా వాసాల్లోకి జనం చేరి.. జనావాసాలుగా మార్చేసుకుని మరీ వన్యప్రాణుల్ని ఇబ్బంది పెడుతుంటే.. అవి ‘రేయ్.. ఎవర్రా మీరంతా’’ అని అనుకోకుండా ఉండగలవంటారా?.. ఉత్తర ప్రదేశ్లో ఇవాళ ఓ పెద్దపులిని అధికారులు బంధించారు. దానిని పట్టుకునే సమయంలో అది ప్రవర్తించిన తీరు ఆశ్చర్యానికి గురి చేసింది. తాజాగా.. పిలిభిత్ జిల్లా అటవీ ప్రాంతాల్లో పులుల బెడద కొనసాగుతోంది. తాజాగా ఓ పులి దారి తప్పి అట్కోనా గ్రామంలోకి వచ్చింది. రాత్రంతా గోడల మీదకు ఎక్కుతూ పడుకుని ఉండి పోయింది. వీధికుక్కలు మొరుగుతుండడంతో గ్రామస్తులు అప్రమత్తం అయ్యి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అయితే ఆశ్చర్యంగా అది ఎవరి మీదా.. పశువుల మీద కూడా దాడి చేయలేదు. రాత్రి నుంచే ఓ ఇంటి గోడ మీద కునుకు తీస్తూ ఉండిపోయింది. దాని ముఖం మీద లైట్లు వేసినా.. అది పట్టించుకోలేదు. ఉదయం చుట్టూ జనం చేరినా.. వాళ్లను పట్టించుకోకుండా గోడ మీద ఎక్కి కూర్చుంది. Tiger was seen in Pilibhit. Pilibhit Tiger Reserve, surrounded by forests, has its own identity among the tourist places of the country. The tiger that came out of the forest gained a foothold in the populated area. The administration should take concrete steps on this #pilibhit pic.twitter.com/pc6v59mY4z — Aasif Ali Official (@aasif_ali__) December 26, 2023 टाइगर कह रहा है अब वह भी इंसानों के साथ रहेगा, वीडियो उत्तर प्रदेश के पीलीभीत जिले का है, टाइगर रिजर्व जंगल से निकलकर रात 2 बजे अटकोना गांव पहुंचा बाघ गुरुद्वारे की दीवार पर बैठकर आराम फरमा रहा है। #tiger #Pilibhit #UP pic.twitter.com/YIDndUsFXd — Sunil Yadav B+ (@sunilyadav21) December 26, 2023 అయితే పెద్దపులితో ఎప్పటికైనా ప్రమాదమే కదా!. అందుకే దానిని బంధించేందుకు ప్రయత్నాలు జరిగాయి. అది ఎటూ పోకుండా బారికేడ్లు, వలలు ఏర్పాటు చేశారు. ఈ లోపు.. దానికి మత్తు మందు ఇచ్చి పట్టుకునే యత్నం చేశారు. ఆ సమయంలో దానిని తోక పట్టి అధికారులు లాగినా.. అది కొంచెం కూడా ఆక్రోశం ప్రదర్శించలేదు. చివరకు దానిని బోనులో వేసుకుని అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. దాని ఆరోగ్య స్థితి.. అది ఎందుకలా ప్రవర్తించింది అనేదానిపై అధికారులు ప్రకటన చేయాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. పిలిభిత్లో అటవీ ప్రాంతాన్ని ఆక్రమిస్తూ.. నివాసాల్ని నిర్మించుకుంటూ పోతున్న గ్రామస్తుల్ని అటవీ శాఖ అధికారులు వారిస్తూ వస్తున్నా ప్రయోజనం లేకుండా పోతోందనే విమర్శ ఒకటి ఉంది. A tiger on a wall. But it’s real. The most difficult thing in such situation is to control humans not the wildlife. Scene is from nearby area of Pilibhit. Via @KanwardeepsTOI pic.twitter.com/IE8eXS1Brm — Parveen Kaswan, IFS (@ParveenKaswan) December 26, 2023 -
మళ్లీ పులి భయం
పులి భయం మళ్లీ మొదలైంది. కుమురంభీం జిల్లా కాగజ్నగర్ మండలం నందిగూడ అటవీ ప్రాంత శివారులో రెండురోజుల కిందట పశువును చంపేసి.. పశువుల కాపరి గులాబ్పై దాడి చేసిన ఘటన దరిమిలా ఆ ప్రాంత సమీప ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఆ ఘటనలో గులాబ్ అప్రమత్తంగా వ్యవహరించి ప్రాణాలతో బయటపడగా, చేతికి గాయాలయ్యాయి. ప్రతీ ఏడాది పత్తి తీసే ఇదే సీజన్లోనే పులుల సంచారం పెరుగుతోంది. దీంతో పత్తి చేన్లకు వెళ్లాలన్నా, జీవాలను మేతకు తీసుకెళ్లాలన్నా కాపర్లు జంకుతున్నారు. – సాక్షి ప్రతినిధి, మంచిర్యాల మూడేళ్లుగా మనుషులపై దాడులు గత మూడేళ్లుగా నవంబర్ నుంచి జనవరి మధ్యే పులుల దాడులు అధికంగా ఉంటున్నాయి. రాష్ట్రంలో తొలిసారిగా 2020 నవంబర్ 11న ఏ2 అనే పులి కుమురంభీం జిల్లా దహెగాం మండలం దిగిడకు చెందిన సిడాం విగ్నేశ్(21) పత్తి చేనుకు వెళ్తుండగా దాడి చేసి చంపేసింది. అదే నెల 29న పెంచికల్పేట మండలం కొండపల్లికి చెందిన పసుల నిర్మల(18)ను పొట్టన పెట్టుకుంది. కేవలం మూడు వారాల వ్యవ«ధిలోనే ఇద్దరి మృతితో స్థానికుల నుంచి నిరసనలు వచ్చాయి. దాంతో అటవీ శాఖ సీరియస్గా తీసుకుని ఆ పులిని బంధించే ప్రయత్నం చేసినా.. సాధ్యపడలేదు. ఆ తర్వాత పులి మహారాష్ట్ర వైపు వెళ్లిపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. మళ్లీ గతేడాది నవంబర్లోనే కుమురంభీం జిల్లా వాంకిడి మండలం ఖానాపూర్కు చెందిన రైతు సిడాం భీము(69)ను పత్తి చేనులో ఉండగా దాడి చేసి చంపేసింది. తాజాగా పశువుల కాపరిపై దాడి జరిగింది. బఫర్ జోన్లోనే సంచారం ఉమ్మడి ఆదిలాబాద్ మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు.. పులుల రాకపోకలకు ప్రధాన కారిడార్గా ఉంది. ఆదిలాబాద్ నుంచి ఆసిఫాబాద్, మంచిర్యాల వరకు పులుల సంచారం ఉంటోంది. పెన్గంగా, ప్రాణహిత తీరాలు దాటి తిప్పేశ్వర్, తడోబా టైగర్ రిజర్వ్ పులుల అభయారణ్యాల నుంచి వలస వస్తుంటాయి. ఎనిమిదేళ్ల క్రితం పాల్గుణ అనే ఆడపులి కాగజ్నగర్లోనే స్థిర నివాసం ఉండటంతో సంతతి పెరిగింది. ఇలా అనేక పులులు ఒక్కొక్కటిగా తెలంగాణ భూభాగంలో ఆవాసం, తోడు వెతుక్కుంటూ అడుగుపెడుతున్నాయి. టైగర్ రిజర్వు పరిధి కోర్ ఏరియా మంచిర్యాల జిల్లా జన్నారం డివిజన్ కవ్వాల్లో మాత్రం ఇప్పటికీ ఒక్క పులి కూడా స్థిరంగా ఉండలేదు. కేవలం బఫర్ ప్రాంతాల్లోనే పులులు సంచరించడంతో సమస్య మొదలవుతోంది. ఆ ప్రాంతాల్లోనే పత్తి చేన్లు, మానవ సంచారం ఉండడంతో ఎదురుపడిన సందర్భంలో దాడి చేస్తున్నాయి. నిత్యం ఆదిలాబాద్ డివిజన్లో తాంసి, భీంపూర్, ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ డివిజన్లో దహెగాం, పెంచికల్పేట, బెజ్జూరు, బెల్లంపల్లి, చెన్నూరు డివిజన్ల వరకు పులులు తిరుగుతుంటాయి. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు పిప్పల్కోట్, కాగజ్నగర్ డివిజన్ అడవుల్లో అనేకసార్లు స్థానికులకు పులులు ఎదురుపడ్డాయి. అడవిలో వన్యప్రాణుల కంటే సులువుగా దొరికే మేతకు వెళ్లిన పశువులు, మేకలు, గొర్రెల పైనే దాడి చేస్తూ ఆకలి తీర్చుకుంటున్నాయి. అలా పశువులు నష్టపోయిన రైతులకు పరిహారం కూడా అటవీ శాఖ చెల్లిస్తోంది. అయితే ఇప్పుడు మనుషులపై దాడి చేయడమే ఆందోళన కలిగిస్తోంది. జత కట్టే సమయంలో? పులులు జత కట్టే సమయం నవంబర్ నుంచి ఏప్రిల్ మధ్యే కావడం, తోడు, ఆవాసం కోసం తోటి పులుల మధ్య ఆధిపత్య పోరు, వాగులు, నదులు, ప్రాజెక్టుల్లో నీటి లభ్యత ఉన్న చోట సంచరిస్తూ అనుకోకుండా మనుషులు ఎదురుపడితే దాడులకు ప్ర«ధాన కారణమవుతున్నాయని అటవీశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
హాయిగా నడుస్తూ వెళ్తున్న వ్యక్తికి హఠాత్తుగా పులి ఎదురైతే?
సింహం, పులి, చిరుత.. వీటి పేర్లు వినగానే మన మనసులో ఎక్కడో భయం నెలకొంటుంది. ఒకవేళ ఈ అటవీ జంతువులు ఎదురైతే ఎవరైనా సరే ఒక్క ఉదుటున పరుగులందుకుంటారు. ఈ ప్రమాదకరమైన జంతువులకు సంబంధించిన వీడియోలు తరచూ ఇంటర్నెట్లో దర్శనమిస్తుంటాయి. వీటిలో కొన్ని ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి వైరల్గా మారింది. ఆ వీడియోలో తొలుత ఒక వ్యక్తి రహదారి గుండా హాయిగా నడుచుకుంటూ వెళుతున్నట్లు కనిపిస్తాడు. ఇంతలో అకస్మాత్తుగా ఒక పులి అతని ముందు నుంచి వేగంగా పరుగులు తీస్తూ వెళుతుంది. దానిని చూసి ఆ వ్యక్తి షాకవుతాడు. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ పర్వీన్ కస్వాన్ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ఎక్స్లో షేర్ చేశారు. వీడియోను షేర్ చేసిన ఆయన దాని క్యాప్షన్లో ఇలా రాశారు. ‘ఇతను అందరికన్నా అదృష్టవంతుడైన వాడా? టైగర్ అతనిని చూసి అస్సలు స్పందించలేదు..’ అని రాశారు. కేవలం 41 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియోను డిసెంబర్ 8న ఎక్స్లో షేర్ చేయగా, దీనిపై వ్యూవర్స్ రకరకాలుగా తమ స్పందనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ వీడియోను 4 లక్షల 76 వేల మంది వీక్షించగా, 5 వేల మందికి పైగా వ్యూవర్స్ ఈ వీడియోను లైక్ చేశారు. ఒక యూజర్.. ‘సర్, ఇది ఉత్తరాఖండ్ ప్రజలకు సాధారణమైన అంశం’ అని రాశారు. మరొకరు ‘ఆ టైగర్ ఉపవాస దీక్షలో ఉంది’ అని రాశారు. ఇది కూడా చదవండి: ఆ మూడు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులెవరు? సస్పెన్స్ వీడేదెన్నడు? Is he the luckiest man alive. Tiger seems least bothered. From Corbett. pic.twitter.com/ZPOwXvTmTL — Parveen Kaswan, IFS (@ParveenKaswan) December 8, 2023 -
పులితో పెట్టుకున్న కోతి.. మరి ఏది గెలిచింది?
సోషల్ మీడియాలో వన్యప్రాణులకు సంబంధించిన వీడియోలు తెగ అలరిస్తుంటాయి. ఇలాంటి కొన్ని వీడియోలు మనకు ఒకపట్టాన నమ్మశక్యం కాదు. తాజాగా ఇటువంటి వింత వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన తర్వాత ‘ఇదేందిది’ అనకుండా ఉండలేరు. అలాగే నవ్వకుండానూ ఉండలేరు. మరి.. అంత వినోదం ఉంది ఈ వీడియోలో.. మనం కోతులకు సంబంధించిన వీడియోలను చూసేవుంటాం. అయితే ఇప్పుడు మనం చూడబోతున్న వీడియోలో ఈ కోతి చేష్టలు తారాస్థాయికి చేరాయనిపిస్తుంది. ఈ వీడియోను చూసిన చాలా మంది.. కోతులకు నిజంగా ఇంత ధైర్యం ఎక్కడినుంచి వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. ఈ వైరల్ వీడియోలో ముందుగా పులులు అడవిలో విశ్రాంతి తీసుకుంటున్న దృశ్యం కనిపిస్తుంది. అయితే అక్కడే చెట్టుపై నుంచి వేలాడున్న ఒక కోతి కిందినున్న పులిని తెగ ఆటపట్టిస్తుంటుంది. ఆ కోతి ఒకసారి పులి తోకను , మరోమారు దాని చెవిని పట్టుకుని లాగుతుంది. ఈ చేష్టలను పులి అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. అయినా ఫలితం లేకపోతుంది. ఈ కోతి చేష్టలు ఆ పులిని తెగ చికాకు పెడతాయి. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో షేర్ చేశారు. ఆ వీడియోను చూసిన యూజర్స్ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఒక యూజర్ ఆ కోతి నిజంగానే పులితో ఒక ఆట ఆడుకున్నదని, ఇకపై ఆ పులులు కోతికి దూరంగా ఉంటాయంటూ కామెంట్ చేశారు. ఇది కూడా చదవండి: ‘టీమిండియా గెలిచేవరకూ మెతుకు ముట్టం’ Gibbons like to live dangerously pic.twitter.com/kNHbYI0TDd — Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) November 16, 2023 -
ఉద్దానంలో పెద్దపులి
కంచిలి/కవిటి: శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో పెద్దపులి మంగళవారం రాత్రి పశువులపై పంజా విసిరింది. కవిటి మండలం సహలాల పుట్టుగలో ఓ ఆవుపై దాడిచేసి చంపేసింది. అదే మండలంలోని కొండిపుట్టుగలో ఓ గేదె దూడను హతమార్చింది. గుజ్జుపుట్టుగలో ఓ ఆవు దూడ తలపై దాడిచేసి గాయపరిచింది. మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో కవిటి–నెలవంక మార్గంలో శీమూరు–నెలవంక గ్రామాల మధ్య రోడ్డు దాటుతూ బస్సు ప్రయాణికులకు కనిపించింది. ఈ ఘటనలతో ఉద్దానం ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కంచిలి మండలం మండపల్లిలో ఆవుపై దాడిచేసిన పులి, కవిటి మండలంలో కనిపించిన పులి ఒక్కటేనా.. వేర్వేరా అనే విషయం తెలియడం లేదు. అటవీ శాఖ అధికారులు ఒక పులి మాత్రమే తిరుగుతోందంటున్నారు. పులికి ఒక రోజులో గరిష్టంగా 70 కిలోమీటర్ల దూరం ప్రయాణించే సామర్థ్యం ఉంటుందని చెబుతున్నారు. ఈ ఘటనపై పలాస ఆర్డీవో భరత్నాయక్ మాట్లాడుతూ.. పులి సంచారంపై రెవెన్యూ, పోలీస్, అటవీ, పంచాయతీ అధికారులతో ఇప్పటికే సమీక్షించామన్నారు. పులి సంచరిస్తున్న గ్రామాలతోపాటు సమీప గ్రామాల ప్రజలు రాత్రిపూట బయట తిరగొద్దని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తోడు లేకుండా బయటకు రావొద్దన్నారు. ఒడిశా నుంచి రాక! పెద్దపులి ఒడిశాలోని గజపతి జిల్లా గండాహతి అటవీ ప్రాంతం నుంచి అక్టోబర్ 21న శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లొత్తూరు వరి పొలాల్లో సంచరించినట్టు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. తరువాత పలాస మండలం టబ్బుగాం, మందస మండలం కొండలోగాం, పట్టులోగాం గ్రామాల్లో తిరిగిందని తెలిపారు. 27న రాత్రి కంచిలి మండలం మండపల్లి పంచాయతీ పరిధి అమ్మవారిపుట్టుగ వచ్చిన పులిని 28న గ్రామస్తులు గుర్తించారు. అక్కడి నుంచి ఆందోళన మొదలైంది. నవంబర్ 1న కంచిలి మండలం మండపల్లి పరిసరాలు, సోంపేట కొబ్బరితోటల్లో సంచరించిందని స్థానికులు చెప్పడంతో అటవీ అధికారులు పరిశీలించారు. -
'వామ్మో.. పులి' కాదు ‘గ్రామ సింహం..' అసలు విషయం తెలిస్తే షాక్..
ఆదిలాబాద్: మండలంలోని సావర్గాంలో ఆదివా రం పులిని పోలిన శునకం దర్శనమిచ్చింది. ఇది పులి పిల్లనా? లేక శునకమా? అని సందిగ్ధంలో పడ్డారు. గ్రామానికి చెందిన రంగన్న అనే మేకల కాపరి తన మేకలకు కాపలాగా శునకాన్ని పెంచుతున్నాడు. ఈ మధ్య తాంసి, భీంపూర్ అటవీ ప్రాంతాల్లో పులులు సంచరిస్తున్న విషయం తెలిసిందే. దీంతో తన పెంపుడు కుక్కకి పులిని పోలిన రంగులను అద్దాడు. విచిత్రంగా ఉన్న శునకం గ్రామంలోకి రావడంతో అంతా అవాక్కయ్యారు. శునకాన్ని పెంచుతున్న మేకల కాపరిని గ్రామస్తులు టైగర్ రంగన్న అని పిలుస్తున్నారు. -
మహారాష్ట్ర సరిహద్దులో పులి
తాంసి: తెలంగాణ– మహారాష్ట్ర సరిహద్దు లోని పెన్ గంగ పరీవాహక ప్రాంతం వెంట పులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. మహా రాష్ట్రలోని తిప్పేశ్వర్ పులుల అభయారణ్యం నుంచి వచ్చిన పులి పెన్గంగ ఒడ్డున మహారాష్ట్ర వైపున్న గ్రామాల్లో సంచరిస్తూ శుక్రవారం రాత్రి కనిపించింది. నదికి అవతల మహారాష్ట్ర వైపు చిన్నార్లి గ్రామానికి సమీపంలోని పంటచేల వద్ద రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ కనిపించగా.. వాహనాల డ్రైవర్లు వీడియో తీశారు. ప్రస్తుతం ఇది వైరల్గా మారింది. నదికి అటువైపు సంచరిస్తున్న పులి నది దాటి తెలంగాణ వైపు వచ్చే అవకాశం లేకపోలేదు. గత ఫిబ్రవరిలో ఒకపులి, మూడు పిల్లలతో భీంపూర్ మండలంలోని పలు గ్రామాల శివారులో సంచరించడం తెలిసిందే. ఈ క్రమంలో సమీప గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. -
చిక్కిన చిరుత.. అటవీ ప్రాంతంలో వదిలిన అధికారులు
మహబూబ్నగర్: రెండేళ్ల నుంచి రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన చిరుత పులి ఎట్టకేలకు అటవీశాఖ అధికారులు పెట్టిన బోనులో శనివారం రాత్రి చిక్కింది. రెండు నెలల నుంచి మరికల్ మండలం రాకొండ శివారులోని గుట్టపై ఓ చిరుత రెండు పిల్లలకు జన్మనించి అక్కడే ఉంటుంది. నిత్యం రాత్రి కాగానే వ్యవసాయ పొలాల వద్ద కట్టేసిన పశువులపై ఎక్కడో ఒక చోట దాడి చేసి ఆకలి తీర్చుకుంటుంది. చిరుత పులిని పట్టుకోవాలని పది రోజుల కిందట గ్రామస్తులు నారాయణపేట అటవీ శాఖ అధికారులను సంప్రందించారు. మూడు రోజుల కిందట రాకొండ గుట్ట సమీపంలో బోనులో మేకపిల్లను ఉంచి చిరుతను పట్టేందుకు చర్యలు తీసుకున్నారు. ఎట్టకేలకు తల్లి చిరుత బోనులో చిక్కడంతో అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు ఆదివారం మేకపిల్లను బయటకు పంపించి క్రేన్ సాయంతో బొలెరొ వాహనంలో శ్రీశైలం అడవిలోకి తరలించారు. బోనులో చిక్కిన చిరుత మండలంలో రాకొండ, పూసల్పహాడ్, మాద్వార్ తదితర గ్రామాల్లోని పశువులపై దాడి చేసి చంపేసిన ఘటనలు ఉన్నాయి. ఈ చిరుతకు సంబంధించిన రెండు చిరుత పిల్లలు తప్పించుకోవడంతో వాటిని కూడా పట్టుకోవాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. లేకుంటే తమ వ్యవసాయ పొలాలకు వెళ్లాలంటే భయమేస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అడవుల్లో వన్యప్రాణులు సంచరిస్తే తమ దృష్టికి తీసుకురావాలని అటవీశాఖ అధికారి వీణావాణి తెలియజేశారు. అటవీ ప్రాంతంలో వదిలిన అధికారులు పట్టుబడిన చిరుతను ఆదివారం అటవీ శాఖ వారు బోనులో బంధించి నల్లమల అటవీ ప్రాంతంలోని లింగాల మండలం గిరిజ గుండాల బేస్ క్యాంపు సమీపంలో అడవిలోకి వదిలిపెట్టారు. -
కారు చీకటిలో పెద్దపులి.. వీడియో వైరల్!
ఒకవేళ మీరు రాత్రి పూట పొలం మీదుగా వెళుతున్నప్పుడు హఠాత్తుగా పెద్ద పులి కనిపిస్తే ఏం చేస్తారు? ఇది ఊహకు వస్తేనే ఒళ్లు జలదరిస్తుంది. ఇటీవల కారులో చెరకు తోట పక్కగా వెళుతున్న కొంతమందికి ఇటువంటి అనుభవమే ఎదురయ్యింది. కారులో ఉన్న వారికి దారిలోపెద్ద పులి కనిపించింది. అంత భయంలోనూ వారు ఆ పెద్ద పులిని వీడియో తీశారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ 17 సెకన్ల వీడియో ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలోని తేరాయ్కు చెందినదని తెలుస్తోంది. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ Xలో @prashant_lmp పేరుతో ఉన్న ఖాతాతో పోస్టు చేశారు. ఈ వీడియోను చూసిన జనం తెగ ఆశ్చర్యపోతున్నారు. వీడియోను చూసినప్పుడు దీనిని వాహనంలో నుండి చిత్రీకరించారని గమనించవచ్చు. కారు బానెట్ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వీడియోను షేర్ చేసిన యూజర్ ‘ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ జిల్లా తేరాయ్లోని కొన్ని చెరకు పొలాల్లో పులులు సరదాగా తిరుగుతాయి. ఈ వీడియో కుక్రా ప్రాంతానికి చెందినది’ అనిరాశారు. ఈ పోస్ట్ను రీపోస్ట్ చేస్తూ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్)అధికారి రమేష్ పాండే ..‘చెరకు పొలాలు అటు వేటగాళ్లకు, ఇటు వేటాడే క్రూర జంతువులకు ఇష్టమైన ప్రదేశం. అందుకే ఇటువంటి చోట్ల మనుషులు, క్రూరమృగాలు ఎదురుకావడం జరుగుతుంటుంది. శీతాకాలంలో ఇలా జరిగేందుకు అవకాశాలున్నాయి. కారు హెడ్ లైట్ల కాంతి పెద్దపులిపై పడుతుండటం వీడియోలో కనిపిస్తుంది’ అని రాశారు. ఇది కూడా చదవండి: ఆశారాం నుంచి రామ్ రహీం వరకూ ఏం చదువుకున్నారు? यूपी के तराई में पड़ने वाले लखीमपुर खीरी जिले में टाइगर्स कुछ ऐसे गन्ने के खेतों में मस्ती भरी चाल से घूमते हैं। वीडियो कुकरा इलाके की बताई जा रही। #Canetigers@rameshpandeyifs @DudhwaTR @raju2179 pic.twitter.com/ewhdJvbcPJ — Prashant pandey (@prashant_lmp) September 30, 2023 -
నల్లమలకు పులికూనలు
నల్లమల అభయారణ్యానికి మరో మూడు పులికూనలు రానున్నాయి. తిరుపతి జూపార్కులో ఉన్న వీటిని చిన్నమంతనాల బీటు పరిధిలో వదిలిపెట్టేందుకు అటవీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 11 నెలలుగా జూ అధికారుల సంరక్షణలో ఉన్న పులిపిల్లలను వాటి సహజ సిద్ధ ఆవాసానికి తరలించేందుకు ముందుగా అడవిలో ఎన్క్లోజర్లు ఏర్పాటు చేసి వాటికి ఇతర జంతువులను వేటాడే శక్తి యుక్తులు కలిగేలా చేసి ఆపై అడవిలో వదలనున్నారు. పెద్దదోర్నాల: తల్లి నుంచి విడిపోయి తిరుపతి జూ పార్క్లో పెరుగుతున్న పులి పిల్లలు త్వరలోనే వాటి సహజసిద్ధ వాతావరణమైన నల్లమల అభయారణ్యంలోకి అడుగిడనున్నాయి. పులి పిల్లలను నల్లమలకు తరలించేందుకు కొన్ని రోజులుగా అటవీశాఖ తీవ్రంగా కసరత్తులు ప్రారంభించింది. సుమారు ఎనిమిది నెలల కిందట నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్దగుమ్మడాపురంలో నాలుగు ఆడపులి పిల్లలు తల్లి నుంచి విడిపోయి స్థానికులకు కనిపించిన విషయం పాఠకులకు విదితమే. ఫిబ్రవరి మొదటి వారంలో పులి పిల్లలు దొరికిన నాటి నుంచి తల్లి పులి కోసం అన్ని ప్రాంతాలను అన్వేషించిన అటవీశాఖ అధికారులు తల్లిపులి దొరకక పోవటంతో పులి పిల్లలను తిరుపతిలోని వెంకటేశ్వర జూ పార్కుకు తరలించి నాటి సంరక్షణ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఆరోగ్యం విషమించి ఓ పులిపిల్ల జూ పార్కులోనే మృతి చెందింది. ఈ క్రమంలో పులి పిల్లలకు రుద్రమ్మ, హరిణి, అనంతగా నామకరణం చేశారు. క్రమేపి అవి పెరిగి పెద్దవవుతుండటంతో వాటిని సహజ సిద్ధంగా ఉండే అటవీ ప్రాంత వాతావరణంలో వదిలి పెట్టాలని అటవీశాఖ అధికారులు నిర్ణయించారు. నల్లమలలో అనువైన ప్రాంతాల పరిశీలన పులిపిల్లలను సంరక్షించేందుకు అవసరమైన ప్రాంతాలను అడిషనల్ పీసీసీఎఫ్ ఏకే.నాయక్, ఆంధ్రప్రదేశ్ జూ పార్కుల డైరక్టర్ శాంతి ప్రియ పాండే, రాహుల్ పాండే లాంటి ఉన్నత స్థాయి అధికారులు మూడు రోజుల క్రితం నల్లమలలో పర్యటించి కొన్ని ప్రాంతాలను పరిశీలించి వెళ్లారు. ఇందులో భాగంగా దట్టమైన అటవీ ప్రాంతమైన చిన్న మంతనాల బీటు పరిధిలోని పెద్దపెంట ప్రాంతాన్ని అనువుగా ఉందని నిర్ధారించారు. దీంతో పెద్దపెంటలోనే పులికూనలను సంరక్షించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. పెద్దపెంట ప్రాంతంలో వాతావరణం పులులు సంచరించేందుకు అనువుగా ఉండటంతో పాటు, అక్కడి శీతోష్ణస్థితి వన్యప్రాణులు జీవించేందుకు అనువుగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అయితే పులుల సంరక్షణకు సంబంధించి ఎన్ఎస్టీఆర్ అధికారులు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్థానిక అధికారులు పేర్కొంటున్నారు. పులిపిల్లల సంరక్షణకు ప్రత్యేకమైన ఎన్క్లోజర్లు: నల్లమలలోని పెద్దపెంట వద్ద పెద్దపులి పిల్లల సంరక్షణకు ప్రత్యేకమైన ఎన్క్లోజర్లు ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. సహజంగా తల్లిని వీడిన వన్యప్రాణుల పిల్లలకు ప్రత్యేక క్యాంపును ఏర్పాటు చేసి కొన్ని రోజుల పాటు వేటాడే ప్రక్రియను నేర్పిస్తారు. తరువాత వాటిని అభయారణ్యంలో వదిలి పెట్టే రీ వైల్డింగ్ ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు. సహజంగా కొత్తపల్లిలో దొరికిన నాటికి పులిపిల్లల వయస్సు మూడు నెలలు. నాటి నుంచి నేటి వరకు 11 నెలల కాలంగా ఆ పిల్లలు వేటాడే తమ సహజసిద్ధ గుణాలను మరిచి కేవలం జూ అధికారులు అందజేసే అహారంతోనే జీవిస్తున్నాయి. అడవికి రారాజుగా పేరొందిన పులుల విషయంలో ఈ పక్రియ అంత మంచిది కాదనే అభిప్రాయం సర్వత్రా వినవస్తోంది. పులి అంటేనే వన్యప్రాణులను వేటాడే స్వభావం కలిగింది. అటువంటి పెద్దపులి పిల్లలను ప్రస్తుత పరిస్థితుల్లో జూ పార్కు నుంచి తరలించి నేరుగా అభయారణ్యంలో వదిలి పెడితే అవి అడవి కుక్కలు, అడవి పందులతో పాటు స్వజాతికి చెందిన పులుల దాడిలోనే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. అంతే కాక దొరికిన జంతువుల పిల్లలకు రీ వైల్డింగ్లో భాగంగా ప్రత్యేకమైన ఆహారపు అలవాట్లు నేర్పిస్తారు. ఎన్క్లోజర్లలో పెరిగే పులి పిల్లలు వ్యక్తిగతంగా 50 జంతువులను స్వంతంగా వేటాడి తినగలిగిన నాడే దాన్ని అభయారణ్యంలోకి వదిలి వేసే పరిస్థితిలు ఉంటాయి. అలా వేటాడలేక పోయిన నాడు వాటికి ఎదురు పడిన జింకల కొమ్ములు, అడివి పందుల దంతాల ధాటికి ప్రమాదం బారిన పడే అవకాశం ఉంది. దీంతో పాటు మగపులులు ఎదురుపడితే మేటింగ్కు ప్రయత్నిస్తాయని, అలా కాకుండా ఆడపులులు ఎదురు పడితే వీటిపై దాడికి పాల్పడే ప్రమాదం ఉందని పలువురు అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు. అందు వల్లే ఎన్క్లోజర్లు ఏర్పాటు చేసి వాటికి ఇతర జంతువులను వేటాడే శక్తి యుక్తులు కలిగేలా పులిపిల్లలను సంరక్షించేందుకు చర్యలు తీసుకోబోతున్నారు. ఒకే కాన్పులో నాలుగు ఆడపులి పిల్లలు పుట్టడం అపూర్వ సంఘటన తిరుపతి వెంకటేశ్వర జూ పార్కులో తల్లిపులి నుంచి విడిపోయి అధికారుల సంరక్షణలో పెరుగుతున్న పులి పిల్లల పుట్టుక అపురూపమైందిగా పలువురు జంతు ప్రేమికులు పేర్కొంటున్నారు. సాధారణంగా అంతరించి పోతున్న పులుల సంతతిపై పర్యావరణ ప్రేమికుల్లో కొంత మేర ఆందోళన ఉంది. ఈ నేపథ్యంలో ఒకే కాన్పులో నాలుగు పులిపిల్లలు పుట్టడంతో పాటు, అవి తల్లి పులి నుంచి విడిపోయి బాహ్య ప్రపంచానికిలోకి రావటం ఎంతో అరుదని వారు పేర్కొంటున్నారు. దీంతో పిల్లల సంరక్షణ బాధ్యతను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఆడపులి పిల్లల వల్ల భవిష్యత్తులో మరెన్నో లాభాలు ఉన్నాయని, దీని వల్ల ఎక్కువ పులుల సంతానోత్పత్తి ప్రక్రియ కొనసాగే అవకాశం ఉందని వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
బోనులో చిక్కిన హంతక పులి
మైసూరు: ఇటీవల బాలున్ని చంపి తిన్న పులిని అటవీ శాఖాధికారులు పట్టుకోగలిగారు. హెచ్డీ కోటె తాలూకా కల్లహట్టి గ్రామంలో రైతు కృష్ణనాయక, మాదేవీబాయి దంపతుల కుమారుడు చరణ్ నాయక్ (9)ను తీసుకుని సెప్టెంబర్ 4న పొలానికి వెళ్లారు, అప్పుడు పులి బాలున్ని ఎత్తుకెళ్లి చంపి తినింది. ఈ ఘటనతో చుట్టుపక్కల ప్రాంతాల్లో భయాందోళనలు మొదలయ్యాయి. పులిని వెంటనే పట్టుకోవాలని ఒత్తిడి పెరిగింది. ప్రభుత్వం కూడా పులిని బంధించాలని అటవీశాఖ అధికారులను ఆదేశించింది. ఇదే సమయంలో దసరా వేడుకల కోసం మైసూరుకు వచ్చిన గజ బృందంలోని అర్జున్ ఏనుగు ద్వారా పులి కోసం అడవుల్లో అన్వేషణ సాగించారు. సుమారు 16 రోజులపాటు అన్వేషణ సాగించినా ఫలితం దక్కలేదు. దీంతో అర్జున్ ఏనుగు వెనక్కి వెళ్లిపోయింది. ఈ క్రమంలో డ్రోన్ ద్వారా వెతుకులాట చేయగా, పులి కదలికలు కనిపించాయి. ఆ కదలికల ఆధారంగా పులి తరచూ తిరిగే స్థలాలను ఊహించారు. మంగళవారం రాత్రి కల్లటి గ్రామానికి చెందిన తావరే నాయక అనే వ్యక్తి పొలం వద్ద బోనును ఉంచగా పులి అందులోకి చిక్కింది. తరువాత పులిని నాగరహోలె అడవికి తరలించారు. -
11 దేశాల్లో మాత్రమే కనిపించే అరుదైన జాతి బావురు పిల్లి గుంటూరులో..
గుంటూరు డెస్క్: దక్షిణ ఆగ్నేయ ఆసియా దేశాల్లో మాత్రమే కనిపించే అరుదైన జాతి బావురు పిల్లి అంతరించి పోతున్న జాబితాలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా రెండువేలలోపే ఈ జాతి పిల్లులు ఉన్నట్టు అంచనా. కృష్ణా, బాపట్ల అభయారణ్యం ప్రాంతంలో వీటిజాడ గతంలో కంటే ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. వీటిని మనుషులు వేటాడకుండా తీరప్రాంత గ్రామాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 11 దేశాల్లో మాత్రమే.. చేపలను వేటాడి జీవించే ఈ అరుదైన జాతి పిల్లిని ప్రాంతాలను బట్టి బావురుపిల్లి, పులి బావుర, మరక పిల్లి, నీటి పిల్లి, ఫిషింగ్ క్యాట్ అని పిలుస్తారు. దీని శాసీ్త్రయ నామం రౖపైనెలూరుస్ వైవెర్రినస్ (prionailurus viverrinnus). మడ అడవులు, చిత్తడి నేలలలో ఎక్కువగా ఇవి జీవిస్తుంటాయి. ప్రపంచ వ్యాప్తంగా 11 దేశాల్లో మాత్రమే వీటి జాడను కనుగొన్నారు. 2013లో మడ అడవులపై రీసెర్చ్ చేస్తున్న తరుణంలో సముద్ర తీరం వెంబడి వీటి ఆచూకీ తెలిసింది. ప్రపంచ వ్యాప్తంగా కేవలం 1,500 నుంచి 2,000 వరకూ ఉండొచ్చని అంచనా. ఈ జాతులు ప్రత్యుత్పత్తి చెందకపోతే త్వరలోనే అంతరించిపోతాయని అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి హెచ్చరించింది. రాత్రివేళల్లోనే వేట.. 78 సెం.మీ పొడవు, 8.8 కిలోల వరకూ బరువు పెరిగే ఈ బావురు పిల్లి రాత్రి వేళల్లో మాత్రమే చేపలను వేటాడి జీవిస్తుంది. మన ఇళ్లలో తిరిగే పిల్లుల కంటే పెద్దవిగాను చిరుత పులికంటే చిన్నదిగానూ ఉంటుంది. అచ్చు చిరుత పులిని పోలి ఉంటుంది. ఇది చేపల వేటకు వెళ్లే సమయంలో ఆ పరిసరాల్లో మల, మూత్ర విసర్జన చేస్తుంది. ఈ వాసన గమనించిన ఇతర జాతి పిల్లులు, జంతువులు ఆ పరిసరాలకు రావు. పర్యావరణ పరిరక్షణకు దోహదం.. సముద్రంలో ఉండే పలు రకాల చేపలు పెట్టే గుడ్లు, కొన్ని రకాల చేపలను తినే పలు రకాల చేపలను ఈ బావురు పిల్లి తింటుంది. దీనివల్ల ఇది సంచరించే ప్రాంతంలో మత్స్య సంపద పెరగడంతోపాటు పర్యావరణ పరిరక్షణకు దోహద పడుతుంది. తీర ప్రాంత ప్రజలకు అవగాహన అంతరించిపోతున్న ఈ జాతిని పెంపొందించే కార్యక్రమంలో భాగంగా ఏటా వణ్యప్రాణి వారోత్సవాలను పురస్కరించుకొని అక్టోబర్ 2 నుంచి 8వ తేదీ మధ్య బాపట్ల, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని అటవీ తీర గ్రామాల్లో అటవీశాఖ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అక్టోబర్లో లెక్కింపునకు చర్యలు.. అటవీ తీర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో వీటి జాడను కనుగొన్నామని అవనిగడ్డ ఫారెస్ట్ రేంజ్ అధికారి రాఘవరావు తెలిపారు. అక్టోబర్ నుంచి వీటి సంఖ్యను లెక్కించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. -
పులిని ఫాలో చేసిన ఎలుగు, అది వెనక్కి తిరిగినంతనే శరణుకోరుతూ..
ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఒక వీడియో చాలా మందిని షాక్కు గురిచేసింది. పులి, ఎలుగుబంటి మధ్య చోటుచేసుకున్న విచిత్రమైన సీన్ ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఒక ఎలుగుబంటి పులి వెనుకగా వెళుతున్నట్లు కనిపిస్తుంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే ఆ ఎలుగుబంటి.. పులికి దూరంగా వెళ్లేందుకు బదులు.. వెనుక కాళ్లపై దానిముందు నిలబడి శరణాగతి వేడుతున్నట్లు చూస్తుంది. కొంతసేపటి తరువాత ఆ ఎలుగుబంటి పక్కకు వెళ్లిపోతుంది. ఈ వీడియోను షేర్ చేసిన ఐఎఫ్ఎస్ అధికారి రమేష్ పాండే .. ‘ఈ పులి సన్యాసి అయివుండాలి లేదా ఆ ఎలుగుబంటికి కంటి చూపు తక్కువగా అయినా ఉంటుందని’ రాశారు. ఈ వీడియోను చూసిన ఒక యూజర్ ‘ఇది చాలా ఆసక్తికరమైన వీడియో. అడవిలో ఎలా ప్రవర్తించాలో మాకు నేర్పుతున్నది’ అని రాశారు. మరో యూజర్.. ‘ఎలుగుబంటి ఆ పులి దృష్టిని మళించడానికి ప్రయత్నించింది. తనకు తానుగా లొంగిపోతున్నట్లు తెలియజేసిందని’ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ‘... అయితే ఇండిగో ‘భాగో’ కానుందా?’... ‘ఇండియా vs భారత్’ తెగ నవ్విస్తున్న మీమ్స్! While people in safari wanted- fight hone de- it was an affable interaction… Tiger use their tails to communicate with each other. An upright, slowly wagging tail indicates friendliness. Bear understood the language☺️ pic.twitter.com/huDRjStLot — Susanta Nanda (@susantananda3) September 3, 2023 -
చిరుత ఎదురుపడితే ఇలా చేయండి చాలు..! వెంటనే..
కుమరం భీం: ఎవరైనా అడవిలోకి వెళ్లినప్పుడు అకస్మాత్తుగా చిరుతపులి ఎదురుపడితే ఏం చేయాలి? దాని భారినుంచి ఎలా తప్పించుకోవాలి? అనే అంశాలపై డెప్యూటీ కన్జర్వేటర్, జన్నారం ఎఫ్డీవో మాధవరావు పలు సూచనలు చేశారు. ఇటీవల తిరుమలలో కాలినడకన వెళ్లిన బాలికను చిరుతపులి హతమార్చిన సంఘటన చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో వాటి ద్వారా ప్రమాదం పొంచి ఉన్నప్పుడు తప్పించుకునే మెలకువల గురించి వివరించారు. ఆయన మాటల్లోనే.. పిల్లి జాతి జంతువు.. చిరుతపులి పిల్లి జాతికి చెందిన సిగ్గరి. మనుషుల కంట పడేందుకు ఇష్టపడదు. మనుషుల అలికిడి వినిపిస్తే దూరంగా వెళ్లిపోతుంది. సాధారణంగా ఫారెస్ట్ సఫారీకి వెళ్తే పులి కనిపిస్తుంది. కానీ చిరుతపులి కనబడటం చాలా తక్కువ. అది ఒంటరిగా నివసించేందుకు ఇష్టపడుతుంది. కలయిక సమయంలో సహచరిణితో, చిన్న పిల్లలతో ఉన్నప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది. అడవిలో ఇవి గుహల్లాంటి ఆవాసాల్లో నివసిస్తాయి. జింకలు, సాంబర్లు, అడవి పందులను చిరుతలు ఎక్కువగా వేటాడుతాయి. పైకి చూస్తే శరీరంపై మచ్చలు చూడటానికి ఒకేలా కనిపించినా రెండు చిరుతలకు ఒకే విధంగా ఉండవు. ఎదురుపడితే ఎలా తప్పించుకోవాలి? దేశంలో పులుల సంఖ్య కంటే చిరుతల సంఖ్య ఎక్కువగా ఉంది. కవ్వాల్ టైగర్ జోన్లో సుమారుగా 80 వరకు చిరుతలు ఉన్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా చిరుత పులుల జాతి ఉంది. చిరుతలు జనావాసాల్లోకి ఊరికే రావు. వాటికి ఆహారం, నీటి సమస్యలు ఏర్పడినప్పుడు మాత్రమే జనావాసాల్లోకి వస్తాయి. చిరుత వేగంగా కదిలే జంతువు కావడంతో జనాల్లోఎక్కువ అలజడి సృష్టిస్తుంది. జనాల మఽ ద్యకు వచ్చిన చిరుతను బంధించడం సులువుకాదు. చిరుత పులి ఎంతదూరంలో ఎదురుపడిందన్న అంశంపై ప్రమాద తీవ్రత ఆధారపడి ఉంటుంది. దూరంగా ఎదురుపడితే సాధారణంగా అదే పక్కకు వెళ్లిపోతుంది. అలాంటి సమయంలో మనుషులపై దాడి చేయాల్సిన అవసరం చిరుతకు ఉండదు. అనుకోని పరిస్థితుల్లో అతి సమీపంలో ముఖాముఖిగా ఎదురుపడితే దాడి చేసే అవకాశాలున్నాయి. అలాంటి సమయంలో రెండు చేతులు పైకెత్తి గట్టిగా అరవాలి. అడవి జంతువుల సైకాలజీ ప్రకారం ఆకారంలో తమకన్నా పెద్దగా ఉన్న జంతువులపై సాధారణంగా చిరుతలు దాడికి దిగవు. చిరుత పులి ఎదురుపడితే ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తిరిగి పరుగెత్తడం, లేదా పొదల చాటున దాక్కోవడం లాంటివి చేయకూడదు. అలా చేస్తే చిరుత వెంటపడి దాడిచేసే అవకాశం ఉంది. ఒకవేళ పారిపోతే ఎంత పరుగెత్తినా చిరుత వేగం ముందు మనం నిలువలేం. కాబట్టి చిరుత కాస్త దూరంలో ఎదురుపడితే చేతులు పైకెత్తి నెమ్మదిగా వెనక్కి నడవడం, దగ్గరగా ఉంటే చేతులు పైకెత్తి గట్టిగా అరుస్తూ వెనక్కి నడిస్తే చిరుత అక్కడి నుంచి వెళ్లే అవకాశం ఉంటుంది. ఒకవేళ మనం చెట్లు ఎక్కినా వేటాడాలనుకునే చిరుత సులభంగా చెట్లు ఎక్కుతుంది. కూలీలు ఏంచేయాలి? అడవిలోకి పనికి వెళ్లే కూలీలు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. చిరుత పులి వెనుక వైపు నుంచి వేటాడుతున్నందున కూలీలు మాస్కులు, తలకు వెనుకవైపు ఫేస్ మాస్కులు పెట్టుకోవడం మంచిది. వ్యవసాయ కూలీలు, ఉపాధి కూలీలు ఫేస్ మాస్కులు ధరించి, మాట్లాడుకుంటూ వెళ్లాలి. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చిరుత పులి బారి నుంచి తప్పించుకోవచ్చని మాధవరావు సూచించారు. -
సరిహద్దుల్లో పులి సంచారం
రాయగడ: జిల్లాలోని గుణుపూర్ సరిహద్దు ప్రాంతమైన మన్యం జిల్లా భామిని అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్న వార్త దావానంలా వ్యాపించడంతో గుణుపూర్ అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు అటవీ శాఖ డిప్యూటీ రేంజర్ నీలమాధవ పాఢి సిబ్బందితో గుణుపూర్లోని అటవీ ప్రాంతాన్ని సోమవారం సందర్శించారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని, అడవుల్లోకి పశువులను మేతకు విడిచిపెట్టవద్దని హెచ్చరించారు. ఇదిలాఉండగా భామిని ఫారెస్ట్ సిబ్బంది పులి సంచరిస్తున్న ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ పులి అడుగుల నమూనాలను సేకరించారు. ఒడిశా, ఆంధ్రాలకు చెందిన అటవీ శాఖ అధికారులు ఈ మేరకు దీనిపై స్పందించి, సంయుక్తంగా అడవుల్లో నిఘా ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేపట్టాల్సిన అవసరం ఉందని డిప్యూటీ రేంజర్ పాఢి పేర్కొన్నారు. -
అమ్మో పులి..!
పార్వతీపురం మన్యం: ఏజెన్సీలో పులి సంచారం అలజడి రేపుతోంది. ఏనుగుల భయం వీడిందనేసరికి పులి సంచారంతో ఒడిశా సరిహద్దు గ్రామాల ప్రజలు ఉలిక్కిపడుతున్నారు. భామిని మండలం చిన్నదిమిలి–పెద్దిదిమిలి గ్రామాల సమీపంలో బుధవారం పులి పాదముద్రలను స్థానికులు గుర్తించారు. చిన్నదిమి లి క్వారీ సమీపంలో మంగళవారం రాత్రి వింత జంతువు అలికిడి గుర్తించినట్టు వాచ్మన్ తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు పాలకొండ ఫారెస్ట్ రేంజర్ తవిటినాయుడు ఆధ్వర్యంలో కొత్తూరు సెక్షన్ అధికారి కృష్ణారావు, అటవీశాఖ సిబ్బంది చిన్నదిమిలి సమీపంలో పులిసంచరించే ప్రాంతాన్ని పరిశీలించారు. పులి పాదముద్రలుగా నిర్ధారించా రు. భామిని, సీతంపేట, కొత్తూరు మండలాల ప్రజలు అప్రతమత్తంగా ఉండాలని తవిటినాయు డు హెచ్చరికలు జారీ చేశారు. వేకువ జామున బయటకు వెళ్లే రైతులు, వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. బత్తిలి పోలీసుల ఆదేశాల మేరకు వీఆర్వో వినోద్కుమార్, ఏఎస్సై గురుమూర్తి, సర్పంచ్ రవికుమార్లు గ్రామాల్లో దండోరా వేయించారు. సీతంపేటలోనూ పులిజాడ సీతంపేట: సీతంపేట ఏజెన్సీలో పులిజాడ కనిపించడంతో గిరిజనులు భయాందోళన చెందుతున్నారు. దోనుబాయి–చెక్కాపురం పరిసర ప్రాంతంలో ఉన్న గుగ్గిలంతోటల గుండా పులి పాదముద్రలు కనిపించడంతో స్థానికులు అటవీశాఖాధికారులకు సమాచారం ఇచ్చారు. ఎఫ్బీఓ దాలినాయుడుతో పాటు సిబ్బంది చేరుకుని పులిపాదముద్రలు పరిశీలించారు. దోనుబాయిలోని అటవీశాఖ కార్యాలయం వెనుక నుంచి పుబ్బాడ గ్రామం కొండలపైకి పులి వెళ్లినట్టు పాదముద్రలు ఆధారంగా గుర్తించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. -
అయ్యో..! కారు ప్రమాదంలో గాయపడిన పులి.. కుంటుకుంటూ..
నాగ్పూర్: మహారాష్ట్రలోని అభయారణ్యంలో వేగంగా వెళుతున్న కారు ఓ పులిని ఢీకొట్టింది. ఈ ఘటనలో పులి తీవ్రంగా గాయపడిన పులి ప్రాణాలను కోల్పోయింది. గోండియా జిల్లాలోని నావగావ్- నజ్రియా కారిడార్లో ఈ ప్రమాదం జరిగింది. రెండేళ్ల పులి రోడ్డు దాటుతుండగా.. ముర్డోలీ అటవీ ప్రాంతంలోని కోహ్మారా-గోండియా రోడ్డులో ఈ ప్రమాదం జరిగిందని డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారి ప్రమోద్ పంచభాయ్ తెలిపారు. ఈ ఘటనలో ప్రమాదం జరిగిన చోటే రోడ్డుపైనే గాయంతో పులి కాసేపు కూర్చుండిపోయింది. కారు అక్కడే ఆగడంతో మళ్లీ ఏం ప్రమాదం పొంచి ఉందో? అనే భయంతో నొప్పి ఉన్న కాలుతోనే పొదల్లోకి కింద పడుతూ వెళ్లింది. ఈ ఘటనకు సంబంధించిన దశ్యాలను వెనుక ఉన్న వాహనదారులు వీడియో తీశారు. అటవీ అధికారి ప్రవీణ్ కాశ్వాన్ ట్విట్టర్ వేదికగా ఆ వీడియోను పంచుకున్నారు. Dear friends Wildlife has first right of way in #wildlife habitats. So always travel safely & slowly. This tiger hit by vehicle at Nagzira. Via @vijaypTOI pic.twitter.com/fpx6zlKQDI — Parveen Kaswan, IFS (@ParveenKaswan) August 11, 2023 అటవీ ప్రాంతంలో వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని ప్రవీణ్ కాశ్వాన్ కోరారు. జంతువులకు హాని కలగకుండా వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదానికి కారణమైన కారులో ఉన్న వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు జంతు ప్రేమికులు. గాయపడిన పులి కోసం అధికారులు ఉదయం వెతికి జంతు సంరక్షణ శిబిరానికి తీసుకువచ్చే క్రమంలో బాధిత పులి మరణించినట్లు చెప్పారు. ఇదీ చదవండి: పంజాబ్లో దారుణం.. ఇంట్లో చెప్పకుండా వెళ్లిందన్న కోపంలో ఓ తండ్రి ఘాతుకం