సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన సోదరుడు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని టీఆర్ఎస్ నేత శ్రావణ్ మంగళవారం హైదరాబాద్లో ఆరోపించారు. నందగిరి హిల్స్ భూ కుంభకోణం, చిత్తూరు జిల్లా నీటి కుంభకోణంపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం జైలుపాలు కాక తప్పదని ఆయన జోస్యం చెప్పారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీఎం కిరణ్ వ్యవహరిస్తున్న తీరుపై టీ.మంత్రుల ఆగ్రహంగా ఉన్నారని తెలిపారు.