నేడు పశ్చిమలో వైఎస్ జగన్ పర్యటన | ys jagan mohan reddy to tour in west godavari today | Sakshi

నేడు పశ్చిమలో వైఎస్ జగన్ పర్యటన

Published Fri, Mar 14 2014 9:39 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

నేడు పశ్చిమలో వైఎస్ జగన్ పర్యటన - Sakshi

నేడు పశ్చిమలో వైఎస్ జగన్ పర్యటన

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం వచ్చి, అక్కడినుంచి రోడ్డు మార్గంలో ఆయన నరసాపురం చేరుకుంటారు. ఈలోపు గన్నవరం రోటరీ క్లబ్బులో వైఎస్ జగన్ సమక్షంలో కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గానికి చెందిన కొంతమంది నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.

శుక్రవారం సాయంత్రం నరసాపురం స్టీమర్ రోడ్డులో వైఎస్ఆర్ జనభేరి కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో నరసాపురం కాంగ్రెస్ ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఆయనతో పాటు మరికొందరు నాయకులు కూడా పార్టీలో చేరనున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement