హైదరాబాద్: ఈ నెల 7వ తేదీన జరుగనున్న రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల పోలింగ్లో పాల్గొనరాదని వైఎస్సార్ కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలకు విప్ను జారీ చేసింది. పార్టీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి మంగళవారం ఈ మేరకు ఎమ్మెల్యేలందరికి విప్ను ఇచ్చారు.
ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి కావాల్సినంత సంఖ్యాబలం లేదు కనుక తాము ఈ ఎన్నికలకు దూరంగా ఉంటామని పార్టీ ఇది వరకే ప్రకటించింది. బాలినేని జారీ చేసిన విప్లో కూడా రాజ్యసభ ఎన్నికల్లో పాల్గొనరాదనేది పార్టీ విధానం కనుక పోలింగ్కు దూరంగా ఉండాలని ఆయన ఎమ్మెల్యేలను కోరారు.
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు విప్ జారీ
Published Tue, Feb 4 2014 10:47 PM | Last Updated on Fri, May 25 2018 9:12 PM
Advertisement
Advertisement