హైదరాబాద్: కిలారి వెంకట రోశయ్యను పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది. రోశయ్య గుంటూరు జిల్లా, తెనాలి నియోజకవర్గానికి చెందిన వ్యక్తి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.