Rosaiah
-
చంద్రబాబుకి బుద్ధి చెప్తాం..జగన్ ని గెలిపించుకుంటాం
-
గ్రావెల్ మీద ధూళిపాళ్ల దొంగ ఏడుపు ఏడుస్తున్నారు
-
ప్రపంచ దశ దిశ మార్చే పెద్ద మనిషి... చంద్రబాబుపై రోశయ్య అదిరిపోయే సెటైర్లు
-
చంద్రబాబు, రామోజీలకు ఎమ్మెల్యే కిలారి రోశయ్య సవాల్
-
చర్చకు రెడీ.. చంద్రబాబుకు ఎమ్మెల్యే కిలారి రోశయ్య సవాల్
సాక్షి, గుంటూరు: పొన్నూరు అభివృద్ధిపై చంద్రబాబు చర్చకు రావాలని ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య సవాల్ విసిరారు. బాబు సవాల్ స్వీకరిస్తున్నానని, ఐలాండ్ సెంటర్లో చర్చకు రెడీ అని రోశయ్య స్పష్టం చేశారు. ముస్లిం మైనార్టీలను మోసం చేసిన చంద్రబాబు.. ఏ ముహం పెట్టుకుని పొన్నూరుకు వచ్చారని నిలదీశారు. మూడున్నరేళ్లలో పొన్నూరులో రూ.1200 కోట్లతో అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపట్టామని ఎమ్మెల్యే అన్నారు. చదవండి: ప్రభుత్వంపై బురదజల్లడమే పచ్చపత్రికల పని -
లెక్కలన్నీ చెప్పినా రాద్ధాంతమేల?
సాక్షి,అమరావతి: రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా టీడీపీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య మండిపడ్డారు. ప్రభుత్వ బిల్లులకు సంబంధించి కాగ్ అడిగిన ఒక చిన్న వివరణను పట్టుకుని ఆర్థిక శాఖలో ఏదో జరిగిపోతోందంటూ టీడీపీ రాద్ధాంతం చేస్తోందని ధ్వజమెత్తారు. రూ.41 వేల కోట్లకు సంబంధించి లెక్కలు, బిల్లులు లేవంటూ పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్, టీడీపీ నేతలు ప్రచారం చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పీఏసీ చైర్మన్ కోరినట్లుగా రూ.41 వేల కోట్లకు సంబంధించి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పూర్తి లెక్కలు చెప్పినా ఇంకా స్పష్టత కావాలంటూ పయ్యావుల కేశవ్ అవే అబద్ధాలను వల్లిస్తున్నారని విమర్శించారు. స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎస్డీసీ)కు సంబంధించిన రూ.25 వేల కోట్లకు బ్యాంకు గ్యారెంటీ నేటివరకు ఇవ్వలేదని స్పష్టంగా చెప్పినా ఎందుకు రభస చేస్తున్నారని ప్రశ్నించారు. కాగ్ అడిగిన క్లారిఫికేషన్ను పట్టుకుని ప్రభుత్వంపై నిందలు మోపడానికి సిగ్గులేదా? అని దుయ్యబట్టారు. టీడీపీ ఆరోపణలు చేస్తున్నట్లుగా తెలంగాణ వాటా అప్పులు మనం తీసుకోవడం అసలు సాధ్యమేనా? నిధులు ఇచ్చే సంస్థలు అంత గుడ్డిగా ఉంటాయా? అని నిలదీశారు. మసాలా బాండ్ల పేరుతో రూ.2 వేల కోట్లు ఏమయ్యాయి? టీడీపీ హయాంలోనే రూ.300 కోట్లు ఖర్చు చేసి సీఎఫ్ఎంఎస్ విధానం తెచ్చారని, ఓ ప్రైవేట్ వ్యక్తికి అప్పగించి సాఫ్ట్వేర్, టెక్నాలజీ పేరుతో దోపిడీ చేశారని ఎమ్మెల్యే రోశయ్య పేర్కొన్నారు. టీడీపీ హయాంలో మసాలా బాండ్ల పేరిట రూ.2 వేల కోట్లు వసూలు చేశారని, అది ఎవరికైనా చెప్పారా? అని ప్రశ్నించారు. ఈ అవినీతి బాగోతాలన్నీ ఒక్కొక్కటిగా ఏపీ ఫైబర్ నెట్, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లలో బయటపడుతూనే ఉన్నాయని గుర్తు చేశారు. రూ.41 వేల కోట్ల సంగతి అయిపోయాక ఇప్పుడు రూ.17 వేల కోట్ల గురించి మాట్లాడుతున్నారని, అందులో రూ.16,818 కోట్లు ఎక్సెస్గా వాడింది టీడీపీ హయాంలోనేనన్నారు. ఈ ప్రభుత్వం వాడింది కేవలం రూ.300 కోట్లేనని తెలిపారు. నిధుల్లో కేంద్రం కోత విధించిందంటూ అసత్య కథనాలు ప్రచురిస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి అంటే.. సంక్షేమ పథకాల అమల్లో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉండటాన్ని చూసి ఓర్వలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కిలారి దుయ్యబట్టారు. నిజమైన అభివృద్ధి అంటే ప్రజల జీవన విధానంలో మార్పు తేవడమని, అది సీఎం జగన్ ప్రభుత్వంలో జరుగుతోందన్నారు. చంద్రబాబు మాదిరిగా నాలుగు బిల్డింగులు చూపి ప్రజలను కడుపు నింపుకోమంటే ఎలాగని ప్రశ్నించారు. భ్రమరావతిని చూపి ప్రజలను మోసం చేయడం లేదని, అన్ని ప్రాంతాల అభివృద్ధికి సీఎం జగన్ కృషి చేస్తున్నారని తెలిపారు. -
‘ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపించాలని టీడీపీ కుట్ర’
సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా టీడీపీ ఆరోపణలు చేస్తోందని పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య మండిపడ్డారు. ఆయన బుధవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపించాలని టీడీపీ కుట్ర చేస్తోందని దుయ్యబట్టారు. టీడీపీ నాయకుల వైఖరిని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి సీఎం జగన్ కృషి చేస్తున్నారని గుర్తుచేశారు. 41వేల కోట్ల పద్దుల గురించి ఆర్థిక మంత్రి వివరణ ఇచ్చారని, మళ్లీ టీడీపీ నేత పయ్యావుల కేశవ్ మొదటికి వచ్చారని మండిపడ్డారు. టీడీపీ నేతలకు వారి నాయకుడు చంద్రబాబుకు నిజాలు మాట్లాడే అలవాటే లేదన్నారు. టీడీపీ వాళ్లు చెప్పిన పద్దుల్లో ఏజీ ఆఫీస్కి వివరణ ఇచ్చామని తెలిపారు. ఇదంతా చంద్రబాబు పెట్టిన సీఎఫ్ఎంఎస్ వల్లే సమస్య వచ్చిందన్నారు. చంద్రబాబు ఇలాంటి టెక్నాలజీ పేరుతో అనేక అక్రమాలు చేశారని మండిపడ్డారు. అవి ఫైబర్నెట్, స్కిల్ డెవలప్మెంట్లో బయట పడుతున్నాయని చెప్పారు. అసలు సీఎఫ్ఎంఎస్ను ఒక ప్రైవేట్ వ్యక్తికి అప్పజెప్పడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. -
రాష్ట్ర ప్రభుత్వం పై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం
-
రైతుల లాభాలన్నీ ధూళిపాళ్ల జేబులోకే..
సాక్షి, అమరావతి: రైతుల కష్టార్జితమైన సంగం డెయిరీని తెలుగుదేశం నేత ధూళిపాళ్ల నరేంద్ర తన సొంత ఆస్తిగా మలుచుకున్నాడని, రైతులకు దక్కాల్సిన లాభాలను తన జేబుల్లో నింపుకొన్నాడని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కిలారు వెంకట రోశయ్య ధ్వజమెత్తారు. దోపిడీదారుడిని అరెస్టు చేస్తే తెలుగుదేశం పార్టీ రాజకీయం చేస్తోందని విమర్శించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ అర్హులైన రైతులు అందరికీ ఈ నెల్లో మరోసారి రైతు భరోసా జమ చేయనున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 18 వేల కోట్లు రైతు శ్రేయస్సుకు వెచ్చించిందని, రైతు భరోసా కేంద్రాలు, ఇన్పుట్ సబ్సిడీలు.. అన్నీ సమకూర్చడం వంటివి రైతులపై వైఎస్ జగన్ ప్రేమకు నిదర్శనమన్నారు. ఆయన ఇంకేమన్నారంటే.. ధూళిపాళ్ల మోసం చెప్పరేం? సంగం డెయిరీని అమూల్కు కట్టబెడుతున్నారని ఆరోపించే టీడీపీ నేతలు.. ధూళిపాళ్ల నరేంద్ర చేసిన మోసమేంటో ప్రజలకు చెప్పకపోవడం దారుణం. 1977లో రైతుల కృషితో రూపుదిద్దుకున్న ఈ డెయిరీని ధూళిపాళ్ల దొడ్డిదారిన హస్తగతం చేసుకున్నారు. సహకార చట్టం ప్రకారం రెండేళ్లు డెయిరీకి పాలుపోస్తేనే డైరెక్టర్గా ఎన్నికయ్యే అర్హత ఉంటుంది. ఇవేవీ లేకుండా నరేంద్ర చైర్మన్ అయ్యారు. సహకార డెయిరీని సొంత వ్యాపార సంస్థగా మార్చారు. అసలు సహకార డెయిరీలను నిర్వీర్యం చేసింది టీడీపీ కాదా? చిత్తూరు డెయిరీని మూసేసి హెరిటేజ్ను లాభాల్లోకి తెచ్చుకున్నారు. దీనివల్ల చంద్రబాబు రూ. వేల కోట్లు సంపాదించారు. డీవీసీ ట్రస్టు పేరుతో అక్రమాలు రైతులకు చెందాల్సిన సంగం డెయిరీ లాభాలను ధూళిపాళ్ల వీరయ్య చౌదరి (డీవీసీ) ట్రస్టుకి నరేంద్ర మళ్లిస్తున్నారు. లాభాలు ప్రకటించే ముందే సొసైటీల దగ్గర్నుంచి ఖాళీ చెక్కులు తీసుకున్నారు. బోనస్ను రైతు ఖాతాల్లో వేసి, తర్వాత డీవీసీ ట్రస్టుకు మళ్లించారు. సంవత్సరానికి రూ. 50 వేలు లాభాలుండని సొసైటీలు డీవీసీ ట్రస్టుకు రూ. లక్షల్లో చందాగా ఇచ్చారు. దీన్ని బట్టి చూస్తే రైతుల లాభాలు ధూళిపాళ్ల కాజేస్తున్నట్టా? కాదా? అసలు సంగం డెయిరీకి, డీవీసీ ట్రస్టుకు సంబంధమేంటి? డెయిరీ నుంచి వచ్చే లాభాల్లో 3 నుంచి 5 శాతం ట్రస్టుకు ఇవ్వొచ్చని తీర్మానం చేశారు. ఆ ప్రాంత ప్రజా ప్రతినిధిగా అక్కడి రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని అవినీతి నిరోధక సంస్థకు తెలియజేయడం నా బాధ్యత. టీడీపీ హయాంలో మూతపడ్డ సహకార డెయిరీలను అమూల్ సంస్థ ద్వారా మళ్లీ దారికి తెస్తుంటే తప్పుబట్టడం శోచనీయం. సంగం డెయిరీని కూడా సహకార సంఘం కిందకు తీసుకొచ్చేలా, రైతులకు ఉపయోగపడేలా చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. -
‘దోపిడీ సొమ్ములో చంద్రబాబు వాటా ఎంతో చెప్పాలి’
సాక్షి, తాడేపల్లి: టీడీపీ హయాంలో డెయిరీలను నిర్వీర్యం చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య అన్నారు. కోపరేటివ్ డెయిరీలను టీడీపీ నాయకులు దోచుకున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే కిలారి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో రైతులకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుల గురించి చంద్రబాబు, లోకేష్కు మాట్లాడే అర్హత లేదని దుయ్యబట్టారు. ప్రైవేట్ డెయిరీలను టీడీపీ నేతలు సొంత ఆస్తుల్లా భావించారని, సంగం డెయిరీలో మోసాలకు పాల్పడి అరెస్టైన వ్యక్తికి వత్తాసు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘సంగం డెయిరీలో దొంగ సర్టిపికెట్లతో 70 ఎకరాలకు పైగా భూమి దోచుకున్నారు. సంగం డెయిరీ పేరిట దొంగ సర్టిఫికెట్లు సృష్టించి దోపిడీ చేశారు. దోపిడీ చేసిన సొమ్ములో చంద్రబాబు వాటా ఎంతో చెప్పాలి. ప్రభుత్వ ఆస్తులన్నీ యథేచ్ఛగా దోపిడీ చేశారు. టీడీపీ హయాంలో రైతులను నిలువునా మోసం చేశారు. టీడీపీ నాయకులు పాల రైతులను మోసం చేసి సంపాదించారు. రైతులు పూర్తిగా లాభపడాలనే ధ్యేయంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పనిచేస్తున్నారు. రైతులు వారికి రావాల్సిన లాభాలు వారు స్వేచ్ఛగా పొందాలి’’ అని ఎమ్మెల్యే రోశయ్య అన్నారు. -
కార్మికుల సంక్షేమమే సీఎం వైఎస్ జగన్ ధ్యేయం
-
మీ తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదు: రోశయ్య
సాక్షి, గుంటూరు: రాజధాని ప్రాంతంలో మహిళలను ముందుపెట్టి తేదేపా గుండాలు బాపట్ల ఎంపీ నందిగం సురేష్పై దాడి చేయడాన్ని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే కిలారి రోశయ్య తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ఉనికిని కాపాడుకోవటానికే ఇటువంటి ఘటనలకు పాల్పడుతోంది. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున దాడులు జరుగుతాయనడానికి దీనిని నిదర్శనంగా భావిస్తున్నాం. రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం, భూముల విలువలు తగ్గిపోతాయన్న బాధతోనే.. వివిధ ప్రాంతాల నుంచి డబ్బులు వసూళ్లు చేసి మరీ రాజధాని పేరుతో దీక్షలు చేస్తున్నారు. మీరు చేస్తున్న ఉద్యమం ఒక కృత్రిమ ఉద్యమం. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవడానికి టీడీపీ నాయకులు, ఎల్లో మీడియా రోజుకోరకంగా తప్పుడు ప్రచారం చేస్తూ కుయుక్తులు పన్నుతున్నారు. మీరెన్ని కుయుక్తులు పన్నినా మీ తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, విడుదల రజిని, నందిగం సురేష్లపై దాడులకు పాల్పడటం హేయమైన చర్యగా భావిస్తున్నామంటూ ఎల్లో గ్యాంగ్పై నిప్పులు చెరిగారు. (చదవండి: వాళ్లకు కారం ప్యాకెట్లు ఎందుకు?: ఎంపీ సురేష్) ఎంపీ సురేష్పై టీడీపీ నేతల దాడి -
పవన్కు కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్యే కిలారి రోశయ్య
సాక్షి, తాడేపల్లి : చంద్రబాబు నాయుడు పాలన పేరుతో ఆర్భాటాలకు పోయి వందలకోట్లు వృధా చేశారని, ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నారని ఎమ్మెల్యే కిలారి రోశయ్య పేర్కొన్నారు. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ పాలనతో రాజన్న రాజ్యం తిరిగి వచ్చినట్లుగా అనిపిస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రైతాంగం సంతోషంగా ఉందని తెలిపారు. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రోశయ్య స్పందిస్తూ.. చంద్రబాబుకు పవన్ రహస్య స్నేహితుడిగా వ్యవహరిస్తూ, ఆయన తయారు చేసిన స్క్రిప్టునే చదవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. గత ఐదేళ్లలో చంద్రబాబు చేసిన అక్రమాలను ఎన్నడూ ప్రశ్నించని పవన్ ఇప్పుడు పనిగట్టుకొని జగన్ను విమర్శించడం వెనుక ఓర్వలేనితనం స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో 19 చారిత్రాత్మక బిల్లులను ప్రవేశపెట్టిన సంగతి పవన్కు గుర్తుకు రావడం లేదా అని ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ బాధితులను పరామర్శించిన సమయంలో అప్పటి సీఎం చంద్రబాబు అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని మాట తప్పితే, అదే ఉద్దానంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 200 పడకల ఆసుపత్రిని కట్టిస్తున్నారన్న విషయం పవన్ మర్చిపోయారంటూ ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు రూ. 1.50 వేల కోట్లు అప్పుతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా జగన్ అనేక సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారని, వంద రోజుల్లోనే నాలుగు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం పవన్కు గుర్తులేదా అని మండిపడ్డారు. ఉగాది రోజున 25 లక్షల మందికి ఇల్లు పట్టాలు ఇస్తామన్న సీఎం మాటలు పవన్ కళ్యాణ్కు కనిపించడం లేదా అని మండిపడ్డారు. రాజధానిని మార్చుతామని సీఎం జగన్, మంత్రి బొత్స సత్యనారాయణ ఎప్పుడైనా మీకు చెప్పారా అంటూ పవన్ను సూటిగా ప్రశ్నించారు. రైతులను నిర్లక్ష్యం చేసింది చంద్రబాబు కాదా అని, ధైర్యం ఉంటే నిజాయితీగా మాట్లాడాలని కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. అది పవన్కు మాత్రమే చెల్లుతుంది : అమరావతిలో భూసేకరణకు మొదట ఒప్పుకోని పవన్ ఆ తర్వాత మాట మార్చడం ఆయనకు మాత్రమే చెల్లుతుందని ఎమ్మెల్యే కిలారి రోశయ్య వ్యాఖ్యానించారు. జగన్పై హత్యాయత్నం జరిగితే డీజీపీ ఇచ్చిన స్టేట్మెంట్ పవన్కు కనిపించడం లేదన్నారు. లింగమనేని ఎస్టేట్స్ అధినేత.. చంద్రబాబుకు, పవన్లకు కామన్ ఫ్రెండ్ అన్న విషయం అందరికీ తెలిసిన విషయమేనని, ఆయన ఇచ్చిన ఇళ్లలో ఉంటూ జగన్పై విమర్శలు చేస్తూ జనసేన ఎప్పటికీ టీడీపీ తోక పార్టీ అని నిరూపించిందన్నారు. ఇప్పటికైనా పవన్ చెప్పుడు మాటలు వినకుండా తన సొంత ఎజెండాతో వస్తే బాగుంటుందని హితవు పలికారు. 'ఛలో ఆత్మకూరు' కార్యక్రమం పేరుతో చంద్రబాబు నవ్వులపాలయ్యారని తెలిపారు. కాగా, వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ వేగవంతంగా జరుగుతోందని పేర్కొన్నారు. -
ఈ తెలుగు – ఆ తమిళం
తమిళనాడులో స్థిరపడిన తెలుగు ప్రొఫెసర్... డాక్టర్ ప్రభు కుమారి వనమా. తెలంగాణ సంస్కృతి మీద ఆమె అధ్యయనం చేశారు.తమిళ జానపద నృత్యాలు,తెలంగాణ సాంస్కృతిక కళల మధ్య భావసారూప్యతలపై విస్తృతమైన పరిశీలన జరిపారు.తమిళ మహిళ ‘తమిళిసై’ తెలుగు రాష్ట్రానికి గవర్నర్గా వచ్చిన సందర్భంలో... ఈ రెండు ప్రాంతాల సాంప్రదాయిక బాంధవ్యం గురించి సాక్షితో ముచ్చటించారు. డాక్టర్ ప్రభుకుమారి పుట్టింది విజయవాడలో, బాల్యం హైదరాబాద్లో గడిచింది. తర్వాత తమిళనాడు బాట పట్టింది వాళ్ల కుటుంబం. సంగీతం, నాట్యం ఆమెకు రెండు కళ్లు. తనకు ఇష్టమైన కళలను కొనసాగించడం కోసమే ఆమె చరిత్ర, పర్యాటక రంగాల్లో అధ్యాపక వృత్తిని ఎన్నుకున్నారు. సరిగమల గురువు అమ్మ ‘‘మా అమ్మ జ్ఞాన ప్రసూన గాయని, కర్ణాటక, హిందూస్తానీ సంగీతంలో నిష్ణాతురాలు. సినిమాల్లో నేపథ్య గాయని. నాన్న పుల్లారావు ఫార్మాసుటికల్ కంపెనీ నిర్వహించేవారు. నన్ను కళారంగంలో అత్యున్నత స్థాయిలో చూడాలనేది మా అమ్మ కోరిక. అందుకోసమే మా కుటుంబం చెన్నైకి మారింది. అమ్మ స్వయంగా నాకు కర్నాటక, హిందూస్తానీ సంగీతంలో సరిగమలు నేర్పించారు. హైదరాబాద్లో ఉన్న కాలంలో భరతనాట్యం, కూచిపూడి కథక్తోపాటు జానపద నృత్యాలు నేర్చుకున్నాను. జానపద నృత్యంలో... నేను సంగీతానికి అనుగుణంగా అడుగులు వేయడం వరకే పరిమితమైపోయి ఉంటే నా ప్రయాణం ఒక ‘కళాకారిణి’ అనే మైలురాయి దగ్గరే ఆగిపోయేది. జానపద నృత్యాలకు ఆధారమైన సాహిత్యం మీద నాకు కలిగిన మమకారమే నన్ను అధ్యయనకారిణి చేసింది. వీటితోపాటు తబలా, హార్మోనియం, తంబూరా, మృదంగం నేర్చుకోవడం మీద ఆసక్తి కలిగింది. నేను ఎప్పుడు దేని మీద ఇష్టాన్ని కనబరిస్తే వెంటనే అందులో శిక్షణ ఇప్పించేది మా అమ్మ. ప్రతి రంగంలో మేటి అయిన గురువుల దగ్గర శిక్షణ ఇప్పించింది. కూచిపూడి, భరతనాట్యం సుమతీ కౌశల్ గారి దగ్గర నేర్చుకున్నాను. అంజుబాబు గారి శిక్షణలో కథక్, ఫోక్ డాన్సులు నేర్చుకున్నాను. ఆ తర్వాత బెనాసర్లో విజయశంకర్ గారి దగ్గర కథక్లో ప్రావీణ్యం సాధించగలిగాను. ప్రతి కళనూ దాని మూలాల వరకు వెళ్లి అధ్యయనం చేయాలనే కోరిక... ఈ రోజు నన్ను ప్రపంచదేశాలకు పరిచయం చేసింది. జనాన్ని కలిపేది జానపదాలే జానపద గేయాలు సాధారణంగా బృందగానాలే అయి ఉంటాయి. జానపద నృత్యాలను కూడా సామూహికంగానే చేస్తారు. జన సామాన్యాన్ని ఒక త్రాటి మీదకు తీసుకువచ్చే మాధ్యమాలివి. ముఖ్యంగా తమిళనాడు – తెలంగాణ రాష్ట్రాల మధ్య సాంస్కృతిక బంధం చాలా బలమైనదనే చెప్పాలి. భావసారూప్యాల విశ్లేషణ చేస్తే... రెండు సంప్రదాయాలు కూడా ప్రకృతి మీద ఆధారపడి మనిషి జీవికను నిర్మించుకున్నవే అని తెలుస్తుంది. తెలంగాణలో బోనాలు అని చేస్తారు. ఈ వేడుకలో భక్తులు అమ్మవారికి పసుపు నీటిని చల్లుతూ భోజనాన్ని సమర్పిస్తారు. తమిళనాడులో చేసే ‘కరగాట్టం’ వేడుకలో కూడా కుండ తల మీద పెట్టుకుని నృత్యం చేస్తూ దేవుడికి ఆహారం, నీటిని సమర్పిస్తారు. రెండు వేడుకల్లోనూ ఘటాన్ని తల మీద పెట్టుకుని లయబద్ధంగా డాన్స్ చేయడమే ప్రధానంగా కనిపిస్తుంది. ఇక్కడ కోలాటం– అక్కడ కోలాఠం తెలుగు రాష్ట్రాల్లో కోలాటం బాగా ప్రసిద్ధి. ఇదే ఆట తమిళనాడులోనూ ఉంది. అయితే అక్కడ ‘కోలాఠం’ అని ఠని ఒత్తి పలుకుతారు. ఆటంతా దాదాపుగా ఒకటే. ప్రత్యేకంగా ఆడపిల్లలకు నేర్పిస్తారు. తమిళనాడులో కోలాఠం ఆడడానికి ప్రత్యేకంగా పండుగలేవీ అక్కర్లేదు. ఆడవాళ్లు పనులు లేని సమయంలో ఆటవిడుపుగా కోలాఠం ఆడుకుంటారు. ఇక తెలంగాణలో మహిళలు ప్రధానంగా జరుపుకునే బతుకమ్మ వేడుకలాంటిదే తమిళనాడులో ‘కుమ్మి’. ఆంధ్రప్రదేశ్లో గొబ్బెమ్మ ఆడినట్లన్న మాట. బతుకమ్మ అమరికలో పూలే ప్రధానంగా ఉంటాయి. గొబ్బెమ్మ ఆటలో, కుమ్మి ఆటలో ముగ్గు వేసి మధ్యలో పూలను అమర్చి చుట్టూ తిరుగుతూ ఆడుతారు. బతుకమ్మ అయినా, గొబ్బెమ్మ అయినా, కుమ్మి అయినా... అలంకరించే పూలలోనే ఉంది అసలు రహస్యం. బతుకమ్మను అలంకరించే పూలు కానీ, కుమ్మి ఆట కోసం ముగ్గు మధ్య అమర్చే పూలు... ఆడవాళ్లు జడలో పెట్టుకోని పూలే. ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఒకటుంది. మనదేశంలో పూచే ప్రతి పువ్వూ ఔషధగుచ్ఛమే. ఈ వేడుకలు జడలో పెట్టుకోని పూలలో ఉన్న ఔషధగుణాలను దగ్గర చేస్తాయి. గొప్ప బంధం సాంస్కృతికంగా తమిళనాడుకి తెలుగు రాష్ట్రాలకు విశ్వాసాల పరంగా కూడా చాలా అవినాభావ సంబంధం ఉంది. మహాభారతం, రామాయణం వంటి పౌరాణిక ఇతిహాసాల ఇతివృత్తాలతో మనం వీధి భాగవతాలు చెప్పుకుంటాం. వాటిని తమిళనాడులో తేరుకూట్ అంటారు. తమిళనాడు, తెలంగాణలు కల్చర్ను చాలా బాగా కాపాడుకుంటున్నాయి. ఏపీలో గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు పోవడం, ఆధునికత వైపు పరుగుల మధ్య సంస్కృతి పరిరక్షణ కుంటుపడుతోంది. సంప్రదాయం– సాధికారత మనదేశం గత కొన్ని దశాబ్దాలుగా మహిళ సాధికారత కోసం ఎన్నో ఉపాధి మార్గాలను చూపిస్తోంది, శిక్షణనిస్తోంది. అన్నింటికంటే పెద్ద ఉపాధి మార్గం మన సంప్రదాయ జానపద నృత్యంలోనే ఉంది. కల్చరల్ టూరిజం ద్వారా ప్రధానంగా మూడు అంశాలు అభివృద్ధి చెందుతాయి. స్థానిక సంప్రదాయాన్ని అంతరించి పోకుండా కాపాడుకోగలగడం సాధ్యమవుతుంది. కళారీతులను మెరుగుపరుచుకోవడంలో సృజనాత్మకత మెరుగుపడుతుంది. మూడవది టూరిజానికి నిరంతరతను సాధించడం. టూరిజానికి నిరంతరత అని ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే... ఎంత గొప్ప టూరిస్ట్ స్పాట్ అయినా సరే... ఒక ప్రదేశానికి ఒకసారి వెళ్లిన వాళ్లు సాధారణంగా మళ్లీ వెళ్లరు. కల్చరల్ టూరిజమ్ అలా కాదు. స్థానిక సంప్రదాయాలకు అనుగుణంగా వేడుకలు జరుగుతుంటాయి. ఒక్కో వేడుకలో ఒక్కో రకమైన సాంస్కృతిక కళల ప్రదర్శన జరుగుతుంటుంది. దాంతో ఒక టూరిస్టు... ఒక ప్రదేశానికి మళ్లీ మళ్లీ రావడానికి అవకాశాలు పెరుగుతాయి. ఒక టూరిస్ట్ రావడం వల్ల ఆదాయం వచ్చేది ఆ కళా ప్రదర్శనకు మాత్రమే కాదు. ఆ టూరిస్ట్ బస, భోజనాల కోసం హోటల్, రెస్టారెంట్ వ్యాపారాలు పెరుగుతాయి. అక్కడి ప్రత్యేకమైన వస్తువులను కొంటారు కాబట్టి హస్తకళాకృతుల అమ్మకాలు పెరుగుతాయి. అందుకే మహిళల ఆర్థిక స్వావలంబనకు మన సంప్రదాయ కళలను మించిన మార్గాలు మరేవీ ఉండవనే చెప్తాను. మన ఆట, పాట, హస్తకళ... ప్రతిదీ మనకు అన్నం పెట్టే వనరే. ఆర్థిక స్వావలంబనకు పెద్ద ఆలంబన మన ఫోక్ ఆర్ట్స్. వృత్తి– ప్రవృత్తి నేను చదివిన కోర్సు ఎంపిక నా అభిరుచికి అనుగుణంగా జరిగింది. అందుకే వృత్తి ప్రవృత్తి ఒకటిమిళితమై పోయాయి. ఒక తబలా వాదన, ఒక కథక్ ప్రదర్శన, శాస్త్రీయ– జానపద సంప్రదాయ కళలను పాఠంగా చెప్పడం... ప్రతిదీ సంతోషాన్నిచ్చే అంశాలే అయ్యాయి. ఇవన్నీ నన్ను విదేశాల్లో మన సాంస్కృతిక ప్రదర్శనల వైపు, పుస్తక రచన వైపు నడిపించాయి. ఇక నేను ఎడిటర్గా మరో అవతారం ఎత్తడానికి కారణం కూడా భారతీయ సంప్రదాయం, సంస్కృతి, సాంస్కృతి కళల ప్రచురణ కోసమే. మెడికల్, హోటల్, సినిమా ఇండస్ట్రీ తమ రంగాల కోసం జర్నల్స్ నడుపుతున్నాయి. భారతీయ కళలు, సంస్కృతి, సంప్రదాయం, పర్యాటకం కోసం ఒక పత్రిక రూపకల్పన చేశాను. మనదేశం గురించి తెలుసుకోవాలనుకునే విదేశీయులకు ఇది బాగా ఉపయోగపడుతోంది’’ అని చెప్పారు ప్రభుకుమారి. తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్యకు అమ్మానాన్నలతో కలిసి సాంస్కృతిక పత్రిక కాపీని అందచేస్తున్న ప్రభుకుమారి సమాజమే పెద్ద పాఠశాల ప్రభుకుమారి వనమా చెన్నైలోని భారతి ఉమెన్స్ కాలేజ్లో డిపార్ట్మెంట్ ఆఫ్ హిస్టారికల్ స్టడీస్లో అసిస్టెంట్ ప్రొఫెసర్. ఆమె ఎంఏ, ఎమ్టిటిఎమ్, ఎమ్ఫిల్, డబుల్ పీహెచ్డీ. తమిళ్ లిటరేచర్లో డిప్లమో, సిటిజెన్స్ లీగల్ రైట్స్లో డిప్లమో, డీలిట్ చేశారు. ప్రస్తుతం జానపద కళల మీద విస్తృతంగా పరిశోధన చేస్తున్నారు. భారతీయ సంప్రదాయ కళల పరిరక్షణ కోసం చెన్నైలో ‘వనమా ఆర్ట్, ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ ట్రస్ట్’ను నిర్వహిస్తున్నారు. భారతీయ సంస్కృతి, చరిత్ర పరిశోధనాంశాల మీద రీసెర్చ్ చేసే పరిశోధక విద్యార్థుల కోసం ‘బై యాన్యువల్ జర్నల్ ఆఫ్ ఇండియన్ ఆర్ట్, కల్చర్, హెరిటేజ్ అండ్ టూరిజమ్’ (జెఐఏసిహెచ్టి) పేరుతో జర్నల్ను నడుపుతున్నారు. పరిశోధనలు, జానపద కళల కోసం ఆమె చేస్తున్న కృషికి గుర్తింపుగా ‘ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య గారి చేతుల మీదుగా ‘కంట్రీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ పురస్కారాన్ని అందుకున్నారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ నుంచి ‘బాల సహ్యోగ్ అవార్డ్ ఫర్ ఎక్స్లెన్స్ ఇన్ ఎడ్యుకేషన్’ పురస్కారం అందుకున్నారు. చంఢీఘర్లో హిస్టరీ అండ్ టూరిజమ్ నిర్వహించిన సదస్సులో బెస్ట్ అకడమీషియన్ అవార్డు అందుకున్నారు. ‘ఉమెన్ స్టడీస్ అండ్ సోషల్ సైన్సెస్’ అంశం మీద ఆమె ప్రసంగించారు. ఆమె సూచించిన అనేక అంశాలను ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలుగా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటోంది. ‘‘మనం అక్షరాలు నేర్చుకుని, పుస్తకాలతో చదవడం ద్వారా విజ్ఞానాన్ని సొంతం చేసుకోగలుగుతున్నాం... అని అనుకుంటాం. కానీ అక్షరాలు, పుస్తకాలు కేవలం మనకు విజ్ఞానాన్ని అందించే మాధ్యమాలు మాత్రమే. మనం నిజంగా నేర్చుకునేది సమాజం నుంచే’’ అంటారు ప్రభుకుమారి. ‘‘ప్రపంచం గ్లోబల్ విలేజ్గా మారిన నేపథ్యంలో జ్ఞానం... ఏదో ఒక మారుమూల అలా ఉండిపోవడం లేదు. ఒక మూల నుంచి మరో మూలకు సులువుగా చేరుతోంది. ఒకరి కల్చర్ మీద మరొకరికి ఆసక్తి పెరుగుతోంది. ఇలాంటి తరుణంలో మన కల్చర్ మనకు అన్నం పెట్టే మాధ్యమం అవుతోందని మాత్రం మర్చిపోవద్దు’’ అన్నారు ప్రభుకుమారి.– వాకా మంజులారెడ్డి -
ఎన్టీఆర్ గొప్ప నటుడు
హైదరాబాద్ : నందమూరి తారకరామారావు గొప్ప నటుడని తమిళనాడు మాజీ గవర్నర్ డాక్టర్ కె.రోశయ్య అన్నారు. మంగళవారం ఎన్టీఆర్ విజ్ఞాన్ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలను రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ అస్సామీ రచయిత, మాజీ పార్లమెంటు సభ్యుడు డాక్టర్ నగేన్ సాకియాకు ఎన్టీఆర్ జాతీయ సాహితీ పురస్కారం–2019 ప్రదానం చేశారు. అనంతరం రోశయ్య మాట్లాడుతూ, రాజకీయంగా వైరుధ్యం ఉన్నప్పటికి నటుడిగా ఎన్టీఆర్ను ఎంతో అభిమానించానని అన్నారు. ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ కె.వి.రమణాచారి మాట్లాడుతూ, రాజకీయం విడదీస్తుందని.. సాహిత్యం మాత్రం అందరినీ కలుపుకుపోతుందని అన్నారు. ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ చైర్పర్సన్ ఎన్.లక్ష్మీపార్వతి మాట్లాడుతూ ఎన్టీఆర్ పేరిట సేవచేయడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా నృత్య గురువు ఇందిరా ముస్నూరి శిష్యబృందం చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీనటి జీవిత రాజశేఖర్, ఆర్టీఐ మాజీ కమిషనర్ పి.విజయ్బాబు, ప్రముఖ రచయిత్రి డాక్టర్ అనంతలక్ష్మి, చింత కిరణ్కుమార్, యువ కళావాహిని అధ్యక్షులు వై.కె.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
పొన్నూరులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కిలారి రోశ్యయ్య ప్రచారం
-
పొన్నూరులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కిలారి రోశ్యయ్య ప్రచారం
-
వైఎస్ జగన్కు ప్రముఖుల పరామర్శ
సాక్షి, హైదరాబాద్: విశాఖపట్నం ఎయిర్పోర్టులో హత్యాయత్నం నుంచి సురక్షితంగా బయటపడిన ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని శనివారం పలువురు ప్రముఖులు ఫోన్లో పరామర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కె.రోశయ్య ఫోన్ చేసి, హత్యాయత్నం ఘటన గురించి జగన్ను అడిగి తెలుసుకున్నారు. ఇకపై మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు చిరంజీవి ఫోన్చేసి జగన్ యోగక్షేమాలను తెలుసుకున్నారు. సంఘటన జరిగిన తీరును ఆరా తీశారు. జగన్మోహన్రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాను. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి శుక్రవారం జగన్కు ఫోన్ చేసి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని అడిగారు. -
‘రోశయ్యను విమర్శించే స్థాయి కేటీఆర్కు లేదు’
సాక్షి, హైదరాబాద్: రాజకీయ భీష్ముడిగా పేరుగాంచిన మాజీ సీఎం రోశయ్యను విమర్శించే స్థాయి, వయసు మంత్రి కేటీఆర్కు లేదని, తక్షణమే ఆయన క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి నిరంజన్ డిమాండ్ చేశారు. సోమవారం గాంధీభవన్లో ఆయన మాట్లాడుతూ.. రోశయ్యను అవమానించడం ముమ్మాటికీ ఆర్యవైశ్య సమాజాన్ని అవమానించినట్లేనని పేర్కొన్నారు. రాజీవ్గాంధీ సద్భావన యాత్ర సందర్భంగా రోశయ్యకు అవార్డు ఇవ్వడాన్ని కేటీఆర్ అవమానించడం విచారకరమన్నారు. రోశయ్య సీఎంగా ఉన్న సమయంలో 2 సార్లు మత కల్లోలాలు జరిగాయన్న కేటీఆర్ వ్యాఖ్యలను నిరంజన్ ఖండించారు. -
అలాంటి వ్యక్తి మోదీ దృష్టిలో వీరుడా!
సావర్కర్ వీరుడా? హిందూ జాతీయవాది సావర్కర్ ఫొటోను ప్రధాని పార్లమెంటులో ఏర్పాటు చేయడాన్ని రాహుల్ గాంధీ తప్పుబట్టారు. సావర్కర్ చరిత్ర ఏమిటో తెలుసా అని ప్రశ్నించారు. స్వాతంత్య్ర పోరాటంలో గాంధీజీతోపాటు మిగతా కాంగ్రెస్ నేతలు జైల్లోనే ఉండగా సావర్కర్ మాత్రం తనను జైలు నుంచి విడుదల చేయాలని బ్రిటిషర్లకు లేఖ రాశారని గుర్తుచేశారు. జైలు నుంచి వదిలేయాలని బ్రిటిష్ వాళ్లను సావర్కర్ వేడుకున్నారని, కాళ్లు పట్టుకుంటా, మీరు చెప్పినట్టు చేస్తానని సావర్కర్ ప్రాధేయపడ్డాడని ఆరోపించారు. అలాంటి వ్యక్తి మోదీ దృష్టిలో వీరుడా అంటూ రాహుల్ నిలదీశారు. ఇదేం దేశభక్తి అంటూ ప్రశ్నించారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్ఎస్, ఎంఐఎంలకు ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనన్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలతోపాటు నోట్ల రద్దు అంశంలోనూ బీజేపీకి టీఆర్ఎస్ అండగా నిలిచిందని, ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ చెంచాలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బీజేపీకి మద్దతిస్తున్న టీఆర్ఎస్కు ఐంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఎందుకు మద్దతిస్తున్నారో చెప్పాలన్నారు. సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ విచ్ఛిన్న రాజకీయాలు చేస్తున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జాతి, మతం, కులం పేరుతో దేశాన్ని విభజించి పాలిస్తున్నారని దుయ్యబట్టారు. ‘దేశ సమైక్యత, సమగ్రత కోసం గాంధీ, నెహ్రూ, పటేల్ ఎంతో పాటుపడ్డారు. కానీ నేడు జాతి, మతం, కులం పేరుతో దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు. దేశ ప్రజలకు శాంతి, ప్రేమ, సోదరభావంతో జీవించే హక్కు ఉంది. కానీ ప్రధాని దేశాన్ని విభజించి పాలించాలని చూస్తున్నారు’అని రాహుల్ ఆరోపించారు. మోదీ విధానాలతో ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్తాన్లలో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని, ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు మహిళలు జంకుతున్నారన్నారు. విచ్ఛిన్న ధోరణుల వల్లే దళితుడైన రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. ఇలాంటి ప్రధానికి టీఆర్ఎస్, ఎంఐఎం కొమ్ముకాస్తున్నాయని మండిపడ్డారు. బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం ఒకే ఆలోచనా విధానంతో ముందుకెళ్తున్నాయని ఆరోపించారు. శనివారం సాయంత్రం హైదరాబాద్లోని చార్మినార్ వద్ద జరిగిన రాజీవ్ సద్భావన యాత్ర సభలో రాహుల్ పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కె. రోశయ్యకు రాజీవ్ సద్భావన అవార్డును రాహుల్ ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశాన్ని మోదీ విభజిస్తుంటే ఎంఐఎం ఎందుకు పరోక్షంగా మద్దతిస్తోందని ప్రశ్నించారు. మహారాష్ట్ర, బిహార్, యూపీ ఎన్నికల్లో ఎంఐఎం హిందూ, ముస్లింల ఓట్లను చీల్చి బీజేపీకి పరోక్షంగా మద్దతిచ్చిందన్నారు. ఎంఐఎం ఆలోచన సైతం దేశాన్ని విచ్ఛిన్నం చేయడమేనని దుయ్యబట్టారు. రాష్ట్రంలో నియంత పాలన... తెలంగాణలో నియంత పాలన నడుస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. కేసీఆర్కు వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి లేదని, ఐదేళ్లలో తెలంగాణలో బాగుపడింది కేసీఆర్ కుటుంబం ఒక్కటేనని ఆయన విమర్శించారు. పాతబస్తీకి మెట్రో రైలు రాలేదని, మెట్రో వస్తే తమ రాత మారుతుందని చిన్న వ్యాపారులు ఆశించినా అలా జరగలేదన్నారు. నోట్ల రద్దుకు సీఎం కేసీఆర్ సంపూర్ణ మద్దతు ప్రకటించారని, అలాంటి కేసీఆర్కు ఎంఐఎం అండగా నిలిచిందన్నారు. నోట్ల రద్దు తర్వాత క్యూలలో మాల్యా, నీరవ్ మోదీ, అనిల్ అంబానీ నిలబడ్డారా? అని రాహుల్ ప్రశ్నించారు. నోట్ల రద్దుతో దోపిడీదారులు నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకున్నారని దుయ్యబట్టారు. -
ఆర్యవైశ్యులు అన్ని విధాలా ఎదగాలి: రోశయ్య
హైదరాబాద్: ఆర్యవైశ్యులు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య అన్నారు. ఆదివారం నాగోలులో నిర్వహించిన ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర శాఖ, మహిళా విభాగం, యూత్ విభాగాల ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆర్యవైశ్యులు క్రమశిక్షణ, ఐక్యతతో ముందుకు సాగాలని కోరారు. ఉమ్మడి ఏపీలో ఉన్న సంఘం తెలంగాణలో కూడా శాఖను ఏర్పాటు చేసి సభలు నిర్వహించడం అభినందనీయమన్నారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. ఆర్యవైశ్యుల్లో నిరుపేదలు కూడా ఉన్నారని, వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈబీసీ వర్గాల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వానికి ఉందన్నారు. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర కమిటీతో ప్రమాణస్వీకారం చేయించారు. కార్యవర్గం ఇదే..: ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా పాండుగుప్త, ప్రధాన కార్యదర్శిగా విశ్వేశ్వరయ్యగుప్త, కోశాధికారిగా నాగభూషణం, ఉపాధ్యక్షుడిగా కృష్ణ, మహిళా విభాగం అధ్యక్షురాలిగా స్వరూపరాణి, ప్రధాన కార్యదర్శిగా రోజారమణి, కోశాధికారిగా శాంతి, హైదరాబాద్ అధ్యక్షురాలిగా యాద మంజుల, యూత్ వింగ్ అధ్యక్షుడిగా సంపత్, సెక్రెటరీగా సందీప్, కోశాధికారిగా ఆకాశ్ తదితరులను ఎన్నుకున్నారు. -
పార్టీ మారేటప్పుడు పదవులు త్యజించాలి
-
పార్టీ మారేటప్పుడు పదవులు త్యజించాలి
సాక్షి, హైదరాబాద్: రాజకీయ నాయకులు పార్టీలు మారేటప్పుడు పదవులు త్యజించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామని, పార్టీలు మారటం మంచిది కాదని సూచించారు. ప్రస్తుతం ఉన్న పార్టీ మారాలనుకున్నప్పుడు, ఆ పార్టీ ద్వారా వచ్చిన, పొందిన పదవిని వదులుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం రాగ సప్తస్వరం ఆధ్వర్యంలో తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్యకు వెంకయ్యనాయుడు జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహుముఖ ప్రజ్ఞాశాలి, కార్యదక్షుడు, భాషా కోవిదుడు, అజాత శత్రువు రోశయ్యకు సన్మానం చేయడం పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నానని అన్నారు. ప్రస్తుత రాజకీయ నాయకులందరూ ఆయన జీవితం నుంచి స్ఫూర్తి పొందాలని సూచించారు. జవాబుదారీతనం, పారదర్శకత, క్రమశిక్షణ వంటి లక్షణాలు అలవర్చుకొని తద్వారా దేశ ఔన్నత్యాన్ని కాపాడాలని కోరారు. నమ్మిన సిద్ధాంతం కోసం క్రమశిక్షణతో వ్యవహరించాలన్నారు. ప్రస్తుతం అసెంబ్లీ, చట్టసభలు జరిగే తీరు చూస్తుంటే బాధ కలుగుతోందన్నారు. పదవులన్నీ యాదృచ్ఛికమే: రోశయ్య రోశయ్య మాట్లాడుతూ శాసనమండలి, పార్లమెంట్, శాసనసభల్లో వివిధ హోదాల్లో దాదాపు 35 ఏళ్లు పని చేశానని చెప్పారు. ఏ హోదాలో పని చేసినా అప్పగించిన బాధ్యతలకు నూటికి నూరుపాళ్లు న్యాయం చేయాలన్న ధ్యేయంతోనే పనిచేశానని తెలిపారు. పదవులన్నీ యాదృచ్ఛికంగా వచ్చినవే తప్ప వెంపర్లాడి తెచ్చుకున్నవి కావని స్పష్టం చేశారు. వెంకయ్యనాయుడు, టి. సుబ్బరామిరెడ్డి తదితర పెద్దల ఆధ్వర్యంలో ఆత్మీయ సత్కారం జరగడం జీవితంలో మర్చిపోలేని సంఘటనగా ఆయన అభివర్ణించారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ తదితరులు పాల్గొన్నారు. -
చిరస్మరణీయుడు ఎన్టీఆర్: రోశయ్య
సాక్షి, హైదరాబాద్: ఎన్టీఆర్ చిరస్మరణీయుడని తమిళనాడు మాజీ గవర్నర్ డాక్టర్ కొణిజేటి రోశయ్య అన్నారు. గురువారం రవీంద్రభారతిలో ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ లలితకళా పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. ఎన్టీఆర్ 22వ వర్ధంతి సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సినీరంగంలో ఎన్టీఆర్ను మించినవారు లేరన్నారు. కొన్ని పాత్రలకైతే ఆయనకు ఆయనే సాటి అని కొనియాడారు. తెనాలిలో తన స్నేహితుడి సినిమా థియేటర్ ప్రారంభోత్సవానికి ఆనాడు ఎన్టీఆర్ను ఆహ్వానిస్తే వచ్చారని గుర్తుచేసుకున్నారు. తర్వాతి కాలంలో రాజకీయంగా విభేదించుకోవటం లాంటి విషయాలు జరిగి పోయాయని తెలిపారు. తెలుగు మహాసభల్లో ప్రస్తావనేదీ? తెలంగాణ గడ్డపై ఎంతోమంది దళితులను చేరదీసి, వారికి రాజకీయ భవిష్యత్తు కల్పించిన మహామనిషి ఎన్టీఆర్ అని సమాచార హక్కు పూర్వ కమిషనర్ విజయబాబు అన్నారు. కానీ ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొన్నవారు ఎన్టీఆర్ పేరును ప్రస్తావించకపోవడం విషాదకరమన్నారు. అనంత రం ఎన్టీఆర్ లలితకళా పురస్కారాలను సినీనటుడు టి.చలపతిరావు, ప్రముఖ రచయిత్రి డాక్టర్ వాసా ప్రభావతి, ప్రవాసాంధ్రుడు సిడ్నీ బుజ్జికి రోశయ్య చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వారిని ఘనంగా సత్కరించి, మెమెంటో, నగదు పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఎన్టీఆర్ చలనచిత్ర సంగీత విభావరి అలరించింది. కార్యక్రమంలో ప్రముఖ సినీనటి అన్నపూర్ణ, కార్యక్రమ నిర్వాహకుడు వైకే నాగేశ్వరరావు, సినీ దర్శకుడు గీతాకృష్ణ, సాహితీవేత్త డాక్టర్ వోలేటి పార్వతీశం తదితరులు పాల్గొన్నారు. పోరాట స్ఫూర్తి ఎన్టీఆర్ ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ చైర్పర్సన్ డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ.. ‘నా జీవితం ఎన్టీఆర్ మలచిన శిల్పం. ఎన్టీఆర్తో గడిపిన ప్రతిక్షణం మరచిపోలేను. జనవరి 17 నా జీవితంలో ఎప్పుడూ గుర్తుండిపోతుంది. కన్నీళ్లు వస్తే బయటకు ఏడ్వవద్దు అనేవారు. మన కన్నీళ్లు మనమే తుడుచుకొని పోరాటం చేయాలని నాలో స్ఫూర్తిని నింపేవారు. ఎన్టీఆర్ భార్య అన్న గొప్ప పదవి ఇచ్చి వెళ్లారు. ఎన్ని జన్మలెత్తినా ఆయన రుణం తీర్చుకోలేను. ఆయనకు జరిగిన అన్యాయంపై ఎన్నో విధాలుగా పోరాటం చేశాను. జీవితంలో తుదిశ్వాస వరకు ఆయన ఆశయ సాధన కోసం పోరాటం చేస్తూనే ఉంటాను. ఆయన లేరని నేననుకోవడం లేదు. రాజకీయం నా భర్త ఎన్టీఆర్కు శాపం అయింది’ అని వాపోయారు. -
రోశయ్యను వదలని ‘అమీర్పేట భూవివాదం’
సాక్షి, హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్యను అమీర్పేట భూ కేటాయింపుల వివాదం వదిలేలా లేదు. కాంగ్రెస్ సీనియర్ నేతగా గవర్నర్గా ఎన్నో హోదాల్లో పని చేసిన ఆయనను ఈ కేసు నీడలా వెంటాడుతూనే ఉంది. తాజాగా ఈ భూ వివాదం మరోసారి తెరమీదకు వచ్చింది. ఈ కేసుకు సంబంధించి రోశయ్యపై వచ్చిన ఆరోపణలను ఆరు నెలల్లోగా తేల్చాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. కాగా రోశయ్య సీఎంగా ఉన్న సమయంలో అమీర్పేటలో ఉన్న హెచ్ఎండీఏ భూమిని డీనోటిఫై చేసి 9.14 ఎకరాలను కొందరికి కేటాయించారు. దీనిపై అప్పట్లోనే వివాదం తలెత్తింది. 2009-10 మధ్యలో రోశయ్యమీద భూవివాదం కేసు నమోదు అయ్యింది. ఏసీబీ కోర్టు సమన్లు కూడా ఇచ్చింది. అనంతరం ఆయనకు ఏసీబీ క్లీన్ చిట్ ఇచ్చింది. ఆ తర్వాతి కాలంలో రోశయ్య గవర్నర్ కావడం, సమన్లను హైకోర్టులో సవాలు చేయడంతో న్యాయస్థానం వాటిపై స్టే ఇచ్చింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఏసీబీ నమోదు చేసిన అభియోగాలను కొట్టివేస్తూ రోశయ్యకు ఊరట కలిగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో మార్చి 2016లో మోహన్లాల్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పలు వాయిదాల తర్వాత విచారణకు వచ్చిన ఈ కేసులో సుప్రీంకోర్టు పిటిషన్ను స్వీకరిస్తున్నట్టు తెలిపింది. ఆరు నెలల్లోగా ఈ కేసును విచారణ జరుపుతామని జస్టిస్ రంజన్ గగోయ్ ధర్మాసనం ఈ మేరకు స్పష్టం చేసింది. ఎంతో విలువైన భూముల విషయంలో తీసుకున్న నిర్ణయాలను ప్రాథమికంగా పరిశీలించిన కోర్టు.. ఈ కేసు తీవ్రమైందని వ్యాఖ్యానించింది. మరింత లోతుగా విచారించాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఆరు నెలల్లో కేసు ముగించాలని కూడా తెలిపింది. -
రోశయ్యా..! ఇదేమిటయ్యా?
నరసరావుపేట ఈస్ట్: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ఏఎన్యూ) యూజీ పరీక్షల విభాగం ముప్పుతిప్పలు పెడుతోందని విద్యార్థులు, అధ్యాపకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూజీ (అండర్ గ్యాడ్యూయేషన్) పరీక్షల విభాగం పనితీరు అస్తవ్యస్తంగా ఉండటం, యూజీ విభాగం కో–ఆర్డినేటర్ ఏకపక్ష నిర్ణయాలతో వర్సిటీ పరిధిలో ప్రతిష్టంభన నెలకొన్నట్లు కనిపిస్తోంది. విద్యార్థుల నుంచి శాస్త్రీయత లేకుండా ఫీజుల వసూళ్లు చేపడుతున్నారని, అధ్యాపకుల సమాధాన పత్రాల మూల్యాంకనంలో గౌరవ వేతనాల చెల్లింపులు సక్రమంగా లేవని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వెళితే ప్రయోజనం ఏంటని ప్రశ్నలు.. ఈ అక్టోబరులో నిర్వహించిన సెమిస్టర్ పరీక్షల మూల్యాంకనం బుధవారం నుంచి ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో మూల్యంకనానికి వెళ్తున్న అధ్యాపకుల్లో రెమ్యూనరేషన్ వస్తుందా? లేదా రాదా? అనే సందిగ్ధంలో ఉన్నట్లు తెలిసింది. గతంలో విధులు నిర్వహించిన దానికే గౌరవ వేతనం రాలేదని, ఇప్పుడు తిరిగి వెళితే ప్రయోజనం ఏంటని అధ్యాపకుల్లో చర్చ మొదలుకావడం గమనార్హం. సాక్షాత్తూ వర్సిటీ వైస్ ఛాన్స్లర్ సమక్షంలో రెండు నెలల్లో బకాయిలు విడుదల చేస్తానని ఒప్పుకుని ఇప్పటివరకూ విడుదల చేయకపోవడంపై అధ్యాపకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి బాధితులు గుంటూరు, నరసరావుపేట, ఒంగోలు, చీరాల, ప్రాంతాల్లో వందల మంది ఉన్నారు. వర్సిటీ పరిధిలోని వాల్యూయేషన్ కేంద్రాల పరిధిలో పనిచేసిన వారికి కూడా వేతనాలు అందించడం లేదని తెలిసింది. గతేడాది మార్చిలో చేసిన వాల్యూయేషన్కు ఇంకా బకాయిలు ఉన్నాయని వర్సిటీ క్యాంపు అధికారులు చెబుతున్నారు. వర్సిటీ యూజీ విభాగం తప్పిదాలతో అధ్యాపకులు సమ్మె చేసే పరిస్థితి నెలకొందంటున్నారు. వాల్యూయేషన్కు హాజరయ్యే అధ్యాపకులకు కూడా 2016 నవంబర్, 2017 మార్చి లో జరిగిన మూల్యాంకనానికి సంబంధించిన గుర్తింపు కార్డులే ఇచ్చారని, తాము కళాశాల మారినప్పటికీ పాత గుర్తింపు కార్డులతో వెళ్లాల్సివస్తోందని అధ్యాపకులు చెబుతున్నారు. రెమ్యునరేషన్లు అందజేస్తాం.. పాత బకాయిలతో కలిపి ప్రస్తుత మూల్యాం కనానికి సంబంధించిన నగదును త్వరలో విడుదల చేస్తాం. ఒకటి, రెండురోజుల్లో దీనికి సంబంధించిన చెక్కులను ఆయా కేంద్రాలకు పంపిస్తాం. గుర్తింపుకార్డుల విషయంలో అధ్యాపకులు సీనియారిటీ నిరూపించుకోవాల్సి ఉంది. కొత్తగుర్తింపు కార్డులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం.– జి.రోశయ్య, వర్సిటీ యూజీ కో– ఆర్డినేటర్ ఆయన నిర్ణయాల వల్లే.. యూజీ కో–ఆర్డినేటర్గా రోశయ్య బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అన్ని విషయాల్లోనూ అవకతవకలు చోటుచేసుకుంటున్నట్లు యూనివర్సిటీ వర్గాలే భావించడం గమనార్హం. ఏటా మార్చిలో నిర్వహించే పరీక్షలను ఎప్పుడూ లేని విధంగా ప్రకటించిన షెడ్యూలు కంటే ముందుగా పరీక్షలు నిర్వహించి విద్యార్థులు ఒక ఏడాది నష్టపోయేలా చేయడం వీరికే చెల్లిందనే విమర్శలు ఉన్నాయి. ఫీజు వసూళ్లలో ఎలాంటి వెసులుబాటు ఇవ్వకుండా జరిమానాతో సహా వసూలు చేసే విధానానికి ఆయన ఊపిరిలూదారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటికి తోడు పరీక్షల మూల్యాంకనంలో అవకతవకలు చోటు చేసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. గౌరవ వేతనాలు రూ.లక్షల్లో పెండింగ్.. డిగ్రీ పరీక్షల సమాధాన పత్రాలను మూల్యాంకనం చేసిన అధ్యాపకులకు అప్పటికప్పుడే వేతనాలను చెల్లించడం ఆనవాయితీగా ఉండేది. రోశయ్య బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి అధ్యాపకులకు రెమ్యూనరేషన్ చెల్లింపులో మెలిక పెడుతున్నట్లు అధ్యాపకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదాహరణకు నరసరావుపేట ఎస్.ఎస్.ఎన్ కళాశాలలో 2016 నవంబరులో సెమిస్టర్ పరీక్ష పత్రాల మూల్యంకనం నగదు ఇప్పవరకూ విడుదల చేయలేదు. అలాగే 2017 మార్చిలో జరిగిన మూల్యాంకన నగదు రూ.11 లక్షలు, గుంటూరు ప్రభుత్వ మహిళా కళాశాలకు రూ.4 లక్షలు, ఒంగోలు ప్రభుత్వ కళాశాలకు రూ.10 లక్షలు, చీరాల వై.ఆర్.ఎన్ కళాశాలకు రూ.6 లక్షల బకాయిలు చెల్లించాల్సి ఉంది. -
డబ్బులొచ్చాయా! లేదా?
డిజప్పాయింట్మెంట్ అనేది అసలెక్కడా లేదు... రాజమౌళిలో! సో, అభిమానులూ డోంట్ వర్రీ! ఆస్కార్కు ‘బాహుబలి’కి నామినేషన్ దక్కలేదనే అంశాన్ని దర్శకధీరుని దగ్గర ప్రస్తావించగా... లైట్ తీసుకున్నారు! ఈ ఏడాది ఆస్కార్స్కు ఫారిన్ లాంగ్వేజ్ కేటగిరీలో హిందీ సినిమా ‘న్యూటన్’ను అఫిషియల్ ఎంట్రీగా సెలెక్ట్ చేశారు. పలువురు ప్రేక్షకులు ‘బాహుబలి’కే ఆ ఛాన్స్ వస్తుందనుకున్నారు. మీరేమనుకున్నారు? అని రాజమౌళిని అడిగితే.. ‘‘సినిమా తీసేటప్పుడు అవార్డుల గురించి ఆలోచించను. నా లక్ష్యం అవార్డులు కాదు. ముందు కథ నన్ను శాటిస్ఫై చేయాలి. తర్వాత మ్యాగ్జిమమ్ నంబర్ ఆఫ్ ఆడియన్స్కి రీచ్ అవ్వాలి. సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేసినోళ్లకు డబ్బులు రావాలి’’ అన్నారు. అవార్డుల కంటే ప్రేక్షకుల ప్రశంసలే గొప్ప అని రాజమౌళి భావిస్తున్నట్టున్నారు! రాజమౌళి దర్శకత్వంలో ధనుష్? రజనీకాంత్ అల్లుడు, తమిళ హీరో ధనుష్తో రాజమౌళి సినిమా చేయాలనుకుంటున్నారట. తమిళ్తో పాటు హిందీలోనూ ధనుష్కి మంచి మార్కెట్ ఉంది. హిందీలో ‘రాంఝనా, షమితాబ్’ సినిమాలు చేశారాయన. తెలుగులో రాజమౌళి బ్రాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా? వీళ్లు సినిమా చేస్తే... మూడు (తెలుగు, తమిళ్, హిందీ) లాంగ్వేజెస్ కవర్ అవుతాయి. రాజమౌళి దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటించే సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తారట! త్వరలోనే ఈ సినిమా గురించి అఫిషియల్ అనౌన్స్మెంట్ వస్తుందని ఫిల్మ్ నగర్ టాక్. -
టైటిల్స్... తెలుగు మరచిపోయేలా ఉంటున్నాయి!
‘‘ఒకప్పుడు తెలుగు చిత్రాలు చూసేవాణ్ణి. విలువలతో కూడిన ఆ చిత్రాల ప్రభావం సమాజంపై ఉండేది. ఇప్పటి చిత్రాల టైటిల్స్ తెలుగుని మరచిపోయేలా చేస్తున్నాయి. ఈ చిత్రానికి తెలుగులో టైటిల్ పెట్టడం నాకు నచ్చింది.’’ అన్నారు తమిళనాడు మాజీ గవర్నర్ కె. రోశయ్య. దినేశ్, మియా జార్జ్, నివేథా పేతురాజ్, రిత్విక ముఖ్యతారలుగా నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘ఒరు నాల్ కొత్తు’. తెలుగులో ‘పెళ్లిరోజు’ పేరుతో బల్లా సురేశ్, మృదుల మంగిశెట్టి, ప్రవీణ్ మంగిశెట్టి విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం పాటల్ని రోశయ్య, లోగోను సీనియర్ నటి జమున ఆవిష్కరించారు. ‘‘యాభై ఏళ్ల క్రితం ‘పెళ్లిరోజు’ అనే చిత్రంలో నటించాను’’ అన్నారు జమున. ‘‘పెళ్లికోసం ఆరాటపడే ముగ్గురు యువతుల కథే ఈ సినిమా. కొన్ని మార్పులతో తెలుగులో విడుదల చేస్తున్నాం’’ అన్నారు వెంకటేశన్. -
విద్యతోనే దేశాభివృద్ధి
తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య హైదరాబాద్: విద్యతోనే దేశాభివృద్ధి సాధ్యమని, విద్యాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమవంతుగా కృషి చేయాలని తమిళనాడు మాజీ గవర్నర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య పిలుపునిచ్చారు. కాచిగూడలోని వైశ్యహాస్టల్ ఆడిటోరియంలో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిభా పురస్కా రాల ప్రదానోత్సవ కార్యక్రమంలో రోశయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మెరిట్ సాధించిన 800 మంది వైశ్య విద్యార్థులకు బంగారు, వెండి పత కాలతోపాటు ప్రోత్సాహక బహుమతులను ఆయన ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ చరిత్రను తిరగరాయగలిగే సత్తా విద్యార్థులపైనే ఉందన్నారు. ప్రతిభ గల విద్యార్థులను ప్రోత్సహించడం మంచి సంప్రదాయమని, ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న కుల సంఘాల ప్రతినిధులకు అభినందనలు తెలియజేశారు. విద్య విజ్ఞా నాన్ని పెంచడంతో పాటు ఉపాధికి మార్గం కావా ల్సిన అవసరం ఉందని పలువురు వక్తలు సూచిం చారు. కార్యక్రమంలో బీజేపీ శాసనసభ పక్షనేత, ఎమ్మెల్యే జి.కిషన్రెడ్డి, బి.గణేశ్గుప్త, తెలంగాణ పోలీస్ హౌసింగ్బోర్డు చైర్మన్ కొలేటి దామోదర్, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహిళావిభాగం డాక్టర్ ఉప్పల శారద, అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ, కొండ్లె మల్లికార్జున్, మహిళా విభాగం ప్రధానకార్యదర్శి బొడ్డు తిరుమలేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ఆర్సీపీ కార్యదర్శిగా రోశయ్య నియామకం
హైదరాబాద్: కిలారి వెంకట రోశయ్యను పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది. రోశయ్య గుంటూరు జిల్లా, తెనాలి నియోజకవర్గానికి చెందిన వ్యక్తి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. -
వైభవ్ జ్యూయలరీ షోరూమ్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్లో కొత్తగా ఏర్పాటు చేసిన వైభవ్ జ్యూయలర్స్ 9వ, జ్యూయలరీ షోరూమ్ను తమిళనాడు మాజీ గవర్నర్ డాక్టర్ కొణిజేటి రోశయ్య ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. వైభవ్ జ్యూయలర్స్ తెలంగాణలో తొలి షోరూమ్ను ప్రారంభించి, విస్తృతమైన శ్రేణిలో ఆభరణాలను అందించడం శుభపరిణామమన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ.. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ప్రజల ఆదరాభిమానాలు చూరగొనాలని ఆకాంక్షించారు. ఏపీలో 8 శాఖలు... ఆంధప్రదేశ్లో విశాఖపట్నం, గాజువాక, కాకినాడ, రాజమండ్రి, పార్వతీ పురం, బొబ్బిలి, అనకాపల్లి, ఏలూరులో 8 బ్రాంచీలను నిర్వహిస్తున్నట్లు వైభవ్ సంస్థ చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ గ్రంధి మల్లికా మనోజ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద బంగారు ఆభరణాల షోరూమ్గా వైభవ్ జ్యూయలర్స్ (మనోజ్ వైభవ్ జెమ్స్ అండ్ జ్యూయలర్స్ ప్రైవేట్ లిమిటెడ్) విభిన్న డిజైన్లలో బంగారు ఆభరణాలు, వజ్రాభరణాలు, ప్లాటినం, రత్నాలు, వెండి ఆభరణాలు.. అసంఖ్యాక శ్రేణిని ఉత్తమ ధరలలో అందిస్తున్నామన్నారు. వ్యాపార సేవలతో పాటు సామాజిక సేవలను అందిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. వైజాగ్ పరిసరప్రాంతాలలో ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుని సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిసర ప్రాంతాలలోని ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుంటామని, రెండు నెలల్లో సౌకర్యాల కల్ప నపై దృష్టి సారిస్తామన్నారు. ప్రారంభోత్సవ ఆఫర్ 9% నుంచి తరుగు హైదరాబాద్లో వివిధ ప్రదేశాల్లో విస్తరింపదలచి వినియోగదారులకు ప్రపంచ శ్రేణి షాపింగ్ అనుభవంతో పాటు విస్తృత శ్రేణిలో 916 హాల్మార్క్డ్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ డైమండ్స్, ఫైన్ జ్యూయలరీ, 925 స్వచ్చత కలిగి 100 శాతం తిరిగి కొనుగోలు హామీ గల స్టెర్లింగ్ సిల్వర్ ఆభరణాలను అందించాలనే ఉద్దేశ్యంతో దిల్సుఖ్నగర్లో 9వ, జ్యూయలరీ షోరూమ్ను ప్రారంభిస్తున్నామని జనరల్ మేనేజర్ మార్కెటింగ్ జె. రఘునాధ్ తెలిపారు. ఈ సందర్భంగా సాధారణ బంగారు ఆభరణాలకు తరుగు 9 శాతం నుంచి అందిస్తున్నామని తెలిపారు. ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ గ్రంధి అమరేంద్ర, డైరెక్టర్ కుమారి కీర్తన, చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ ఆర్. సతీష్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఎన్టీఆర్ జ్ఞాపకాలు ఎంతో పదిలం
ప్రజా జీవితంలో ఆయనది చెరగని ముద్ర: రోశయ్య ముగ్గురికి ఎన్టీఆర్ లలిత కళా పురస్కారాలు ప్రదానం హైదరాబాద్: సినీ జగత్తులో, రాజకీయ, ప్రజా జీవితంలో నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) చెరగని ముద్ర వేశారని తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య కొనియాడారు. ఆ మహానటుడి జ్ఞాపకాలు ప్రజల్లో పదిలంగా ఉంటాయన్నారు. బుధవారం ఎన్టీఆర్ 21వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఎన్టీఆర్ లలిత కళా పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రమణాచారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రోశయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రముఖ సినీ దర్శకుడు కోడి రామకృష్ణ, గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, ప్రముఖ రచయిత్రి శారద అశోక వర్ధన్లకు పురస్కారాలను అందజేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ఎన్టీఆర్ సినిమాల్లో ఏ పాత్ర ధరించినా ఔచిత్యం ఉండేదని... నటుడిగానే కాకుండా గొప్ప వక్తగా ఆయన ప్రజల హృదయాల్లో నిలిచిపోతారని రోశయ్య పేర్కొన్నారు. ఎన్టీఆర్ పేరుతో నందమూరి లక్ష్మీపార్వతి లలిత కళా పురస్కారాలను అందజేయడమే కాకుండా.. గత 20 ఏళ్లుగా నిరాటంకంగా కొనసాగించడం గొప్ప విషయమని అభినం దించారు. ఎన్టీఆర్ను స్మరించుకోవడమంటే ఆయనతో ఉన్న ఆత్మీయతను పంచుకోవడ మని రమణాచారి పేర్కొన్నారు. దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో ఎన్టీఆర్ పేరుతో పురస్కారాన్ని ఇవ్వాలా వద్దా అన్న ప్రస్తావన వచ్చినప్పుడు.. తాను ఎన్టీఆర్ అభిమానంటూ వైఎస్సార్ నిర్మొహమాటంగా చెప్పడమే కాకుండా పురస్కారాలను అందజేసినట్లు గుర్తు చేశారు. సినీ రంగంలోనే కాకుండా పరిపాలనలోనూ అనితర సాధ్యమైన కృషితో ఎన్టీఆర్ ప్రజల హృదయాల్లో నిలిచిపోయారన్నారు. ఎన్టీఆర్ భౌతికంగా దూరమైనప్పటికీ.. ఆయన మనలో శాశ్వతంగా నిలిచిపోయినందునే ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపా ర్వతి వివరించారు. ఆర్థికపర ఇబ్బందులు తలెత్తినప్పటికీ ఆయన పేరిట ప్రత్యేక కార్య క్రమాలను చేపడుతున్నానని, ఇందుకోసం బంజారాహిల్స్లో తనకు ఉన్న ఇంటిని కూడా అమ్మేసుకున్నాని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ తనతోనే ఉండి నడిపిస్తున్నారనే ధైర్యంతో ముందుకెళుతున్నానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఒడిశా ఆంధ్రా సంఘం అధ్యక్షుడు గంగరాజు, యువ కళావాహిని నిర్వాహకులు వై.కె.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో తేజస్విని సుధాకర్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చలన చిత్ర సంగీత విభావరి అలరింపజేసింది. -
మూఢ నమ్మకాలపై... ‘అవంతిక’
‘అవంతిక’ చిత్రం ట్రైలర్ చాలా బాగుంది. సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది. మిత్రుడు రామసత్యనారాయణ స్వయం కృషితో ఇప్పటికి 90 చిత్రాలు నిర్మించారు. త్వరలోనే వంద చిత్రాలు పూర్తి చేస్తారనే నమ్మకం ఉంది’’ అని తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య అన్నారు. పూర్ణ ప్రధాన పాత్రలో శ్రీరాజ్ బళ్లా దర్శకత్వంలో భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించిన చిత్రం ‘అవంతిక’. ఈ సినిమా ట్రైలర్ను రోశయ్య విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ– ‘‘ప్రస్తుతం సమాజంలో పలువురు మూఢ నమ్మకాలను నమ్ముతున్నారు. దాన్ని సొమ్ము చేసుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో సాగే మా చిత్రాన్ని శ్రీరాజ్ బాగా తెరకెక్కించాడు. 2017లో వంద సినిమాల మైలురాయిని పూర్తి చేయాలనుకుంటున్నా. నా వందో చిత్రం ప్రారంభోత్సవం రోశయ్యగారి చేతుల మీదుగానే జరుపుతా’’ అన్నారు. శ్రీరాజ్ బళ్లా, నిర్మాతలు ప్రతాని రామకృష్ణ గౌడ్, సాయివెంకట్, నటీనటులు గీతాంజలి, శివాజీరాజా, కృష్ణుడు, సత్యారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కర్ణ ప్యారసారి, సంగీతం: రవిరాజ్ బళ్లా, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ధీరజ అప్పాజీ, సమర్పణ: కె.ఆర్.ఫణిరాజ్. -
చట్టసభల్లో మండలిది కీలక భూమిక
- తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య - ‘శాసనమండలిలో షబ్బీర్ అలీ ప్రసంగాలు’ పుస్తకావిష్కరణ సాక్షి, హైదరాబాద్: మేధావులు, అనుభవజ్ఞులు, నిపుణులు ప్రాతినిధ్యం వహించే శాసనమండలిది చట్టసభల్లో కీలకభూమిక అని తమిళనాడు మాజీ గవర్నర్ కె.రోశయ్య అన్నారు. శాసనమం డలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ ప్రసంగాలతో రూపొందించిన పుస్తకాన్ని హైదరాబాద్లో సోమవారం ఆవిష్కరించారు. శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్, కేంద్ర మాజీమంత్రి ఎస్.జైపాల్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి హరీశ్ రావు, మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ గవర్నర్ కె.రోశయ్య మాట్లాడుతూ శాసనమండలితో తనకున్న 22 ఏళ్ల అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. షబ్బీర్ పుస్తకావిష్కరణ సందర్భంగా మండలికి రావడం తో పాతగుర్తులు మదిలోకి వస్తున్నాయన్నారు. షబ్బీర్ అలీ ప్రసంగాల పుస్తకం భావితరాలకు ఉపయోగపడుతుందన్నారు. కె.స్వామిగౌడ్ మాట్లాడుతూ ఈ పుస్తకం భావితరాలకు స్ఫూర్తి గా ఉంటుందన్నారు. జానారెడ్డి మాట్లాడుతూ ప్రతీ అంశంపై సమగ్ర అధ్యయనం తర్వాత చేసిన ప్రసంగాలు ఒక పుస్తకరూపంలో రావడం అభినందనీయమన్నారు. జైపాల్ మాట్లాడుతూ నేతల ప్రసంగాల్లో వ్యంగ్యం ఉండాలని, అవేవీ ప్రత్యర్థిని వ్యక్తిగతంగా బాధపెట్టే విధంగా ఉండకూడదని అన్నారు. హరీశ్రావు మాట్లాడుతూ ప్రజాస్వా మ్యంలో ప్రతిపక్ష నేతల పాత్ర గొప్పదన్నారు. షబ్బీర్ మాట్లాడుతూ చట్టసభల గౌరవాన్ని, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత సభ్యులపై ఉంద న్నారు. శాసనమండలిలో పనిచేసే అవకాశం రావడం తన అదృష్టమన్నారు. -
దేశంకోసం ఇందిర ప్రాణత్యాగం: రోశయ్య
-
దేశంకోసం ఇందిర ప్రాణత్యాగం
మాజీ ప్రధానికి రోశయ్య నివాళి సాక్షి, హైదరాబాద్: పేద ప్రజల బతుకుల్లో మార్పుకోసం అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్న ఇందిరాగాంధీ దేశంకోసం ప్రాణ త్యాగం చేశారని తమిళనాడు మాజీ గవర్నర్ కె.రోశయ్య అన్నారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ శతజయంతి ఉత్సవాలను శనివారం గాంధీభవన్లో ప్రారంభించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, సీఎల్పీనేత కె.జానారెడ్డి, పార్టీనేతలు పొన్నాల లక్ష్మయ్య, పొంగులేటి సుధాకర్రెడ్డి తదితరులు ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు నేరెళ్ల శారద ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రోశయ్య మాట్లాడుతూ ఎంతో సంపన్నమైన కుటుంబంలో జన్మించినా బాల్యంలో చాలా కష్టాలు ఎదుర్కొన్న మహిళ.. ఇందిరాగాంధీ అని అన్నారు. దేశ సంక్షేమంకోసం ఆమె కఠినమైన నిర్ణయాలు తీసుకుని ఉక్కుమహిళగా పేరుతెచ్చుకున్నారని గుర్తుచేశారు. ఇందిరాగాంధీ సూచించిన మార్గంలో నడవడమే ఆమెకు అర్పించే నిజమైన నివాళి అని రోశయ్య పేర్కొన్నారు. ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ ఇందిర శతజయంతి ఉత్సవాలను ఏడాదిపాటు రాష్ట్రంలో నిర్వహిస్తామన్నారు. రోశయ్యకు సన్మానం మాజీ గవర్నర్ రోశయ్యను శనివారం కాంగ్రెస్ నేతలు గాంధీభవన్లోనూ, అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలోనూ సన్మానించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, కార్య నిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, సీఎల్పీనేత కె.జానారెడ్డి, నేతలు టి.జీవన్రెడ్డి, పొంగులేటి సుధాకర్రెడ్డి, రామ్మోహన్రెడ్డి తదితరులు రోశయ్యను సత్కరించారు. గాంధీ భవన్కు రావడం తనకు సొంతఇంటికి వచ్చి నంత సంతోషంగా ఉందని ఈ సందర్భంగా రోశయ్య అన్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొ నాలని ఉన్నప్పటికీ ఆరోగ్య పరిస్థితుల కారణంగా రాలేకపోతున్నానని చెప్పారు. -
మరింత మెరుగ్గా జయ ఆరోగ్యం!
-
మరింత మెరుగ్గా జయ ఆరోగ్యం!
- మాట్లాడేందుకు ప్రయత్నించిన సీఎం - మాజీ గవర్నర్ రోశయ్య,కరుణానిధి సతీమణి రాజాత్తి అమ్మాళ్ పరామర్శ - జయ ఆరోగ్యంపై బెంగతో మరొకరు ఆత్మహత్య సాక్షి ప్రతినిధి, చెన్నై: అపోలో ఆస్పత్రిలో 23 రోజులగా చికిత్స పొందుతున్న ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం శుక్రవారం నాటికి మరింత మెరుగుపడినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. చిన్నపాటి గొంతుతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. లండన్ నుంచి వచ్చిన వైద్య నిపుణుడు డాక్టర్ రిచర్డ్ జాన్ బిలే, ఢిల్లీ నుంచి ఎయిమ్స్ వైద్యుల బృందం రోజుకు రెండుసార్లు అపోలో వద్దకు వచ్చి జయ పరిస్థితిని పరిశీలిస్తున్నారు. చికిత్సకు జయలలిత స్పందిస్తున్నందున అవసరమైనపుడు మాత్రమే వెంటిలేటర్ను అమరుస్తున్నారు.కాగా తమిళనాడు రాజకీయాల్లో కేంద్రం జోక్యం చేసుకోదని హోంశాఖ ఉన్నతాధికారి స్పష్టం చేశారు.సీఎం జయ అనారోగ్యంపై అవమానకరంగా మాట్లాడిన నేరంపై కోయంబత్తూరు జిల్లాకు చెందిన సురేష్, రమేష్ అనే ఇద్దరు బ్యాంకు ఉద్యోగులను శుక్రవారం అరెస్ట్ చేశారు. జయలలిత ఆరోగ్యంపై దిగులుపెట్టుకున్న మరో ఇద్దరు అన్నాడీఎంకే కార్యకర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఒకరు మృతి చెందగా.. మరొకరు చికిత్స పొందుతున్నారు. నేరుగా చూడలేదు: రోశయ్య ముఖ్యమంత్రి జయలలితను పరామర్శించేందుకు తమిళనాడు మాజీ గవర్నర్ కే రోశయ్య శుక్రవారం రాత్రి అపోలో ఆస్పత్రికి వచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, జయలలిత వద్దకు ఎవ్వరినీ అనుమతించడం లేదనీ, తనకూ నేరుగా చూసే అవకాశం కలగలేదన్నారు. వైద్యుల సమాచారం ప్రకారం ఆమె బాగా కోలుకుంటున్నారని చెప్పారు. సీఎంగా జయ మళ్లీ బాధ్యతలు స్వీకరించి రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి సతీమణి రాజాత్తి అమ్మాళ్ కూడా శుక్రవారం ఆస్పత్రికి వచ్చారు. శశికళను కలుసుకుని మాట్లాడారు. కాగా అమ్మ కోలుకోవాలని కోరుకుంటూ అన్నాడీఎంకే నేతలు అనేక ఆలయాల్లో ప్రార్థనలు, పేదలకు అన్నదానాలు నిర్వహించారు. పన్నీర్ సెల్వంతోస్టాలిన్ భేటీ ప్రతిపక్ష నేత స్టాలిన్ శుక్రవారం ఉదయం సచివాలయంలో మంత్రి పన్నీర్ సెల్వంతో భేటీ అయ్యారు.రాష్ట్రంలోని రైతన్నల కన్నీరు తుడవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కావేరీ అంశంలో ప్రజలు ఏకతాటిపై ఉన్నారని కేంద్రానికి తెలియజేయాలని, సుప్రీం తీర్పును కర్ణాటక ప్రభుత్వం ధిక్కరించడాన్ని తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా ఖండించే విధంగా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. అసెంబ్లీ అత్యవసర సమావేశాలు జరిపి కావేరీపై తీర్మానాన్ని ఆమోదించాలని డీఎంకే చేసిన తీర్మానాల ప్రతిని పన్నీర్ సెల్వంకు అందజేశానని స్టాలిన్ చెప్పారు. -
బాధ్యతలు స్వీకరించిన విద్యాసాగర్రావు
చెన్నై: తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్గా మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్రావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈరోజు సాయంత్రం రాజ్ భవన్లోని దర్బార్ హాల్లో ఆయన ఇన్ఛార్జ్ గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేశారు. మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్కౌల్.. విద్యాసాగర్రావుతో ప్రమాణ స్వీకారం చేయించారు. తమిళనాడు గవర్నర్గా రోశయ్య పదవీ కాలం బుధవారంతో ముగిసిన విషయం తెలిసిందే. ప్రమాణ స్వీకారం అనంతరం తన బాధ్యతల్ని రోశయ్య... విద్యాసాగర్రావుకు అప్పగించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జయలలితతోపాటుగా మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. -
తమిళనాడు ఇంఛార్జ్ గవర్నర్గా విద్యాసాగర్
-
తమిళనాడు ఇంఛార్జ్ గవర్నర్గా విద్యాసాగర్ రావు
న్యూఢిల్లీ : తమిళనాడు ఇంఛార్జ్ గవర్నర్గా సీహెచ్ విద్యాసాగర్ రావు నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నారు. తమిళనాడు గవర్నర్ రోశయ్య పదవీకాలం నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో కేంద్రం తమిళనాడు ఇంఛార్జ్ గవర్నర్గా విద్యాసాగర్రావుకు అదనపు బాధ్యతలు అప్పగించింది. యూపీఏ హయాంలో తమిళనాడు గవర్నర్గా 2011 ఆగస్టు 31న కొణిజేటి రోశయ్య బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి తన సేవల్ని తమిళనాడుకు అందిస్తున్నారు. కేంద్రంలో అధికారం మారినా, ఆయనే గవర్నర్గా కొనసాగుతూ వచ్చారు. తమిళనాడు ప్రభుత్వంతో సన్నిహితంగా ఉంటూ తన పదవీ కాలాన్ని లాగించారు. కాగా ఇవాళ్టితో రోశయ్య అయిదేళ్ల పదవీ కాలం ముగిసింది. అయితే కర్ణాటకకు చెందిన శంకరమూర్తిని తమిళనాడు గవర్నర్గా నియమించాలన్న ప్రతిపాదనను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచినట్టు సమాచారం. అయితే, ప్రస్తుతం కర్ణాటకతో కావేరి వివాదం సాగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్రానికి చెందిన వ్యక్తిని తమిళులు గవర్నర్గా స్వీకరించేనా అన్న ప్రశ్న కేంద్రాన్ని వెంటాడుతూ వచ్చినట్టు ప్రచారం సాగింది. ఓ దశలో రోశయ్యనే మరలా గవర్నర్గా కొనసాగిస్తారనే ప్రచారం జరిగినా చివరకూ తమిళనాడు గవర్నర్గా సీహెచ్. విద్యాసాగర్రావుకు కేంద్రం అదనపు బాధ్యతలు అప్పగించింది. మరోవైపు గుజరాత్ గవర్నర్ ఓంప్రకాశ్ కోహ్లీ మధ్యప్రదేశ్ గవర్నర్గా అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ గవర్నర్గా రాంనరేష్ యాదవ్ ఉన్నారు. అయితే ఆయన పదవీ కాలం సెప్టెంబర్ 7తో ముగియనుంది. -
రోశయ్య కొనసాగేనా.. లేదా?
చెన్నై : రాష్ట్ర గవర్నర్గా కొణిజేటి రోశయ్య కొనసాగేనా లేదా, కొత్త గవర్నర్ వచ్చేనా అన్న..? చర్చ తమిళనాడు రాష్ట్రంలో సాగుతున్నది. అయితే, రోశయ్య పదవీ కాలం ముగియడానికి రెండు రోజులు మాత్రం సమయం ఉన్న దృష్ట్యా, ఆయన్నే కొనసాగించవచ్చన్న ప్రచారం సాగుతోంది. యూపీఏ హయాంలో తమిళనాడు గవర్నర్గా 2011 ఆగస్టు 31న కొణిజేటి రోశయ్య బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి తన సేవల్ని తమిళనాడుకు అందిస్తున్నారు. కేంద్రంలో అధికారం మారినా, ఆయనే గవర్నర్గా కొనసాగుతూ వచ్చారు. తమిళనాడు ప్రభుత్వంతో సన్నిహితంగా ఉంటూ తన పదవీ కాలాన్ని లాగించారు. కాగా ఈనెల 31వ తేదీతో రోశయ్య పదవీ కాలం ముగియనుంది. ఇప్పటికే కొత్త గవర్నర్ నియామకానికి సంబంధించి కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే, ఇంత వరకు అలాంటి ప్రయత్నాలు జరగనట్టు సమాచారం. అదే సమయంలో కర్ణాటకకు చెందిన శంకరమూర్తిని తమిళనాడు గవర్నర్గా నియమించాలన్న ప్రతి పాదనను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచినట్టు సమాచారాలు ఉన్నాయి. అయితే, కర్ణాటకతో కావేరి వివాదం సాగుతు న్న నేపథ్యంలో ఆ రాష్ట్రానికి చెందిన వ్యక్తిని తమిళులు గవర్నర్గా స్వీకరించేనా అన్న ప్రశ్న కేంద్రాన్ని వెంటాడుతూ వచ్చినట్టు ప్రచారం సాగింది. తదుపరి శంకర మూర్తి నియామకానికి సంబంధించి ఎలాంటి ప్రకటన వెలువడకపోవడంతో ఆ పేరు కాస్త తెర మరుగైనట్టు అయింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర గవర్నర్గా రోశయ్య మళ్లీ కొనసాగుతారా..? లేదా, కొత్త వాళ్లెవరైనా నియమించబడతారా..? అన్న చర్చ రాష్ట్రంలో బయలు దేరింది. కొత్త గవర్నర్ నియామకం సంబంధించి పాత గవర్నర్ పదవీ కాలం ముగియడానికి పది హేను రోజుల ముందుగా ఉత్తర్వులు జారీ కావాల్సి ఉంది. అయితే, ఇంతవరకు అలాంటివి జరగలేదు. ఇక, మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉన్న దృష్ట్యా, కొణిజేటి రోశయ్య పదవీ కాలాన్ని పొడిగించేనా అన్న చర్చ రాజ్భవన్ వర్గాల్లో సాగుతున్నది. తమిళనాడు ప్రభుత్వం కూడా రోశయ్యకు సానుకూలంగా ఉన్న దృష్ట్యా, మరో ఏడాది లేదా, రెండేళ్ల పదవీ కాలం పొడిగించవచ్చన్న ప్రచారం బయలుదేరింది. ఇందుకు తగ్గ ఉత్తర్వులు వెలువడేనా, లేదా కొత్త గవర్నర్ నియామకం జరిగేనా అన్నది ఒకటి రెండు రోజుల్లో తేలే అవకాశాలు ఉన్నాయని సమాచారం. -
కన్యకాపరమేశ్వరికి బంగారు చీర, వజ్ర కిరీటం
♦ తమిళనాడు గవర్నర్ రోశయ్య ♦ చేతుల మీదుగా సమర్పణ విశాఖ పాత నగరం కన్యకాపరమేశ్వరి దేవస్థానంలోని మూల విరాట్కు కోటిన్నర రూపాయల వ్యయంతో నాలుగు కేజీల బంగారాన్ని వినియోగించి రూపొందించిన బంగారు చీరను తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య శుక్రవారం అమ్మవారికి సమర్పించారు. విజయనగరం పట్టణంలోని వాసవీ మాతకు విశాఖపట్నం వాసవీ జ్యూవెలర్స్ సమర్పించిన వజ్ర కిరీటాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయా ఆలయాల్లో ఆయన మాట్లాడుతూ విశాఖలోని ప్రాచీన దేవాలయాల్లో ఒకటైన కన్యకాపరమేశ్వరి ఆలయం అభివృద్ధికి ఆర్య వైశ్యులు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా రోశయ్యను ఆలయ కమిటీ సత్కరించింది. - విశాఖపట్నం/విజయనగరం రూరల్ -
వివాహ వైభవం
-
రోశయ్య మనువడి పెళ్లిలో వైఎస్.జగన్
సాక్షి,సిటీబ్యూరో: తమిళనాడు గవర్నర్ రోశయ్య మనుమడు అనిరుద్, బొమ్మిడాల కాశీవిశ్వనాథం మనుమరాలు లక్ష్మీప్రదీప్తిల వివాహం మాదాపూర్లోని ఎన్.కన్వెన్షన్లో ఆదివారం ఉదయం ఘనంగా జరిగింది. తెలంగాణ స్పీకర్ మధుసూధనాచారి, ముఖ్యమంత్రి కేసీఆర్, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, మాజీ కేంద్రమంత్రి జైపాల్రెడ్డి, ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, కవిత, తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ తదితర ప్రముఖులు వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. -
శ్రీశైలంలో తమిళనాడు గవర్నర్ రోశయ్య
శ్రీశైలం: శ్రావణమాసం సందర్భంగా శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల దర్శనార్థమై తమిళనాడు రాష్ట్ర గవర్నర్ కొణిజెటి రోశయ్య సోమవారం రాత్రి శ్రీశైలం చేరుకున్నారు. స్థానిక వీవీఐపీ అతిథి గహం వద్ద ఈవో భరత్గుప్త, డీఐజీ రమణకుమార్, ఎస్పీ రవికృష్ణ, వాసవీ సత్రసముదాయం అధ్యక్షుడు, దేవస్థానం మాజీ ట్రస్ట్బోర్డు చైర్మెన్ ఇమ్మడిశెట్టి కోటేశ్వరరావు తదితరులు ఆయనకు సాదరంగా ఆహ్వానం పలికారు. మంగళవారం ఉదయం స్వామిఅమ్మవార్లను దర్శించుకుంటారని, అనంతరం వాసవీసత్ర ఫేజ్ 2 వసతిగృహ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొంటారని అధికారవర్గాల ద్వారా తెలిసింది. -
11న ఆర్యవైశ్య ప్రాంతీయ సదస్సు
తమిళనాడు గవర్నర్ రోశయ్య రాక సదస్సు కన్వీనర్ కోలేటి దామోదర్ కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఈ నెల 11న గోదావరిఖనిలో ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రాంతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు ప్రాంతీయ సదస్సు కన్వీనర్ కోలేటి మారుతి తెలిపారు. జిల్లా కేంద్రంలోని జిల్లా ఆర్యవైశ్య సంఘం పట్టణ కార్యాలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఆర్యవైశ్యులను రాజకీయ పార్టీలు విస్మరిస్తున్నాయన్నారు. పన్నుల రూపేణ రాష్ట్ర ఖజానాకు ఆదాయాన్ని సమకూర్చే ఆర్యవైశ్యులను రాజకీయ పార్టీలు ఎన్నికల సమయాల్లో టికెట్లు కేటాయించేలా చొరవ చూపాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న డబుల్ బెడ్రూం పథకం, కల్యాణలక్ష్మి లాంటి పథకాలను పేద ఆర్యవైశ్యులకు అందజేయాలని డిమాండ్చేశారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను సదస్సులో చర్చించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించనున్నట్లు తెలిపారు. సదస్సుకు ముఖ్య అతిథిగా తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ, మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్, చీఫ్విప్ కొప్పుల ఈశ్వర్, ఎంపీ బాల్క సుమన్, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, సీఎల్పీ ఉపనేత జీవన్రెడ్డి హాజరవుతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సదస్సు పోస్టర్ను ఆవిష్కరించారు. సమావేశంలో కన్న కృష్ణ, యాద అంజయ్య, ఎలగందుల మునీందర్, పెద్ది విద్యాసాగర్, మాడిశెట్టి శ్రీనివాస్, చింతకింది శ్రీనివాస్, తోడుగునూరి కరుణాకర్, సుధాకర్, గుండ చంద్రమౌళి, చిట్టుమల్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. -
11న తమిళనాడు గవర్నర్ రోశయ్య రాక
గోదావరిఖని : ఈ నెల 11న గోదావరిఖనిలో జరిగే ఆర్యవైశ్య మహాసభ ఉత్తర తెలంగాణ ప్రాంతీయ సదస్సులో పాల్గొనడానికి తమిళనాడు గవర్నర్ రోశయ్య హాజరవుతున్నారని మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ, సదస్సు కన్వీనర్ కోలేటి దామోదర్ తెలిపారు. స్థానిక అడ్డగుంటపల్లిలోని ఆర్యవైశ్య సంఘం భవనంలో ఆరు జిల్లాలకు చెందిన వైశ్య ప్రముఖులతో సోమవారం సమావేశం జరిగింది. గోదావరిఖని ఆర్జీ–1 కమ్యూనిటీహాల్లో నిర్వహించే సదస్సుకు మంత్రి ఈటల రాజేందర్, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే గణేష్గుప్తా, రామగుండం నగర మేయర్ కొంకటి లక్ష్మీనారాయణతదితరులు హాజరవుతున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆర్యవైశ్యుల అభివృద్ధి, సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తామని చెప్పారు. ఓసీలలో ఉన్న పేదలకు రిజర్వేషన్లు కల్పించాలని, ప్రభుత్వ రాయితీలు వర్తింపచేయాలని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. వైశ్యుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని, ఈ విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి వినతిపత్రం అందజేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిత్తింటి వెంకటేశ్వర్లు, కోశాధికారి జి.మల్లికార్జున్, వివిధ జిల్లాల బాధ్యులు రాజన్న, యాద అంజయ్య, నర్సిన సంతోష్, చిదురాల రవీందర్, నాగన్న, జగన్మోహన్, అశోక్, వైకుంఠం, కాంతయ్య, విజయ్కుమార్, బల్లు చంద్రప్రకాష్ గుప్తా, వెనిశెట్టి నటరాజశేఖర్, గుండా లక్ష్మికాంతం, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
పుస్తకావిష్కరణ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్
తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య ప్రొద్దుటూరులో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టణంలోని వాసవీ కల్యాణ మండలంలో దివ్యశతాధిక రజతోత్సవ సావనీర్ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో గవర్నర్ రోశయ్య మాట్లాడుతూ..ఆర్యవైశ్యులు ఎప్పుడూ ఐకమత్యంతో మెలగాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్యసంఘం అధ్యక్షుడు రాంమోహన్, ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ సంస్థ చైర్మన్ మల్లెల లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రోశయ్యకు శుభాకాంక్షలు తెలిపిన జయ
చెన్నై: తమిళనాడు గవర్నర్ కొనిజేటి రోశయ్య(83) కు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు ఒక లేఖను రాశారు. పూల బొకేను రాజ్ భవన్ కు పంపారు. రోశయ్యకు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడిన జయ ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని, దేశానికి మరిన్ని సేవలు అందించాలని ఆకాక్షించారు. రోశయ్య కుమారుడు నారాయణ మూర్తి ఆగస్టు 14 న జరిగే తన కుమారుని వివాహానికి హాజరు కావాల్సిందిగా సతీసమేతంగా కలిసి జయను ఆహ్వానించారు. రోశయ్య 1933 జులై 4 న గుంటూరు జిల్లా వేమూరు గ్రామంలో జన్మించారు. 2011 నుంచి ఆయన తమిళనాడు గవర్నర్ గా పనిచేస్తున్నారు. -
గూడు వైపు అడుగు పడేనా ?
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జిల్లాలో ఒక కొత్త పక్కా ఇల్లు కూడా మంజూరు కాలేదు. ఎన్టీఆర్ గృహ పథకం పేరుతో ప్రతి జిల్లాలో భారీ సంఖ్యలో ఇళ్లు నిర్మిస్తామని ప్రభుత్వం ఏడాది కిందట ప్రటించినా ఇంత వరకు అడుగు ముందుకు పడలేదు. జిల్లాలో వివిధ పథకాల కింద 11,118 ఇళ్ల నిర్మాణానికి, 10,000 పక్కా గృహాల మరమతులకు ఏర్పాట్లు చేసిన అధికారులు ప్రభుత్వ ఆదేశం కోసం ఎదురు చూస్తున్నారు. శుక్రవారం విజయవాడలో సీఎం చంద్రబాబు నాయుడు గృహ నిర్మాణ శాఖ సమీక్ష నిర్వహించనున్నారు. ప్రతి పేద వాడికి పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలనే లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ఇందిరమ్మ పథకంలో వేలాది కుటుంబాలు లబ్ధి పొందాయి. ఆయన మరణానంతరం ముఖ్యమంత్రులు వచ్చిన రోశయ్య, కిరణ్కుమార్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వాలు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై పెద్దగా శ్రద్ధ వహించలేదు. ఎన్నికలకు ఏడాది ముందు ఇళ్ల కోసం వేలాది దరఖాస్తులు అందాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఈ దరఖాస్తులు అటకెక్కాయి. అప్పటికే నిర్మాణంలో ఉన్న వేలాది ఇళ్లను అనర్హుల సాకుతో రద్దు చేశారు. గృహ నిర్మాణాలపై విచారణ జరిపించే పేరుతో రెండేళ్లుగా ఒక్క కొత్త ఇంటిని మంజూరు చేయలేదు. దీంతో జిల్లాలో గృహ నిర్మాణ శాఖకార్యకలాపాలు అటకెక్కాయి. నిధులేవీ..? ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద జిల్లాలో రూ.30,450 లక్షలతో 10,500 ఇళ్ల నిర్మాణానికి సర్కారు ఆమోదం తెలిపింది. అధికారులు 9052 మంది లబ్ధిదారులను గుర్తించి ఇంటి నిర్మాణానికి అవసరమైన అధికారిక ప్రక్రియ పూర్తి చేశారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో నిర్మించిన 10,000 పక్కా ఇళ్ల మరమ్మతులకు రూ.10 కోట్ల నిధులు మంజూరు చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది. దీంతో అధికారులు ఈ పథకం కింద 5366 మంది లబ్ధిదారులను గుర్తించారు. అందరికీ పక్కా ఇళ్లు (హౌసింగ్ ఫర్ ఆల్ ) పథకం కింద 20681 ఇళ్ల నిర్మాణానికి రూ. 1,13,745 లక్షలు కేటాయించడానికి రాష్ర్ట ప్రభుత్వం అంగీకారం తెలిపింది. జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారులు ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు తయారు చేసి ఆర్నెల్లు కావస్తున్నా ప్రభుత్వం వైపు నుంచి స్పందన లేదు. దరఖాస్తుదారులు ఇళ్ల నిర్మాణానికి అనుమతుల కోసం జిల్లా గృహ నిర్మాణ సంస్థ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వం నుంచి తగిన ఉత్తర్వులు, నిధులు విడుదలయ్యే వరకు తామేమీ చేయలేమని వారు లబ్ధిదారులకు సమాధానం ఇచ్చి పంపుతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం విజయవాడలో సీఎం చంద్రబాబు నాయుడు గృహ నిర్మాణ శాఖపై సమీక్ష జరపనున్నారు. ఈ సమావేశంలోనైనా ఇళ్ల నిర్మాణానికి, అవసరమైన నిధుల విడుదలకు ఉత్తర్వులు వెలువరించేలా నిర్ణయం తీసుకుంటారేమో చూడాల్సి ఉంది. -
సర్వం.. జయం..
తమిళనాడు ప్రజల గుండెల్లో అమ్మగా కొలువైన జయలలిత ముఖ్యమంత్రిగా ఆరోసారి బాధ్యతలు చేపట్టారు. సోమవారం మధ్యాహ్నం మద్రాసు వర్సిటీలోని సెంటినరీ ఆడిటోరియంలో అట్టహాసంగా జరిగిన వేడుకల్లో నాయకులు, అభిమానులు జయజయ ధ్వానాలమధ్య పురిట్చితలైవి ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం 28 మంది మంత్రులు రెండు బృందాలుగా నిలబడి సామూహికంగా ప్రమాణం చేశారు. ప్రమాణస్వీకారోత్సవంలో సర్వం జయలలిత మయంగా కనిపించింది. అన్నీ తానై ఆమె వ్యవ హరించారు. అంతకు ముందు వేలసంఖ్యలో అభిమానులు రోడ్డు కిరువైపులా నిలబడి అమ్మకు స్వాగతం పలికారు. * ఆరోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన జయలలిత * 28 మంత్రులతో క్యాబినెట్ * 25న మరో నలుగురు మంత్రుల ప్రమాణం సాక్షి ప్రతినిధి, చెన్నైః అన్నాడీఎంకే అధినేత్రి జే జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా సోమవారం ఆరోసారి పదవీ ప్రమాణం చేశారు. జే జయలలిత అనే నేను.. అంటూ తమిళనాడు గవర్నర్ కే రోశయ్య ఆమె చేత ప్రమాణం చేయించారు. ఆ తరువాత అమ్మ కేబినెట్లోని 28 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. జయలలితకు అనాదిగా ఆనవాయితీగా వస్తున్న చెన్నైలోని మద్రాసు యూనివర్సిటీ సెంటినరీ ఆడిటోరియం ప్రమాణస్వీకారోత్సవానికి ఆదివారానికే ముస్తాబైంది. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు సీఎంగా ప్రమాణం చేయనుండగా ఉదయం 9గంటలకే పార్టీ నేతలు, అధికారులు అక్కడికి చేరుకోవడం ప్రారంభించారు. 11.40 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకున్న జయకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జ్ఞానదేశికన్, సలహాదారు షీలా బాలకృష్ణన్ తదితరులు స్వాగతం పలికారు. ఆహూతులకు అభివాదం చేస్తూ 11.50 గంటలకు జయలలిత వేదికపైకి వచ్చారు. 12 గంటలకు వేదికపైకి చేరుకున్న గవర్నర్ కే రోశయ్యకు జయలలిత పుష్పగుచ్చం ఇచ్చి అభివాదం చేశారు. జాతీయగీతం, తమిళ్తాయ్ గీతం తరువాత మంత్రివర్గంలో చేరబోతున్న వారిని గవర్నర్కు జయ పరిచయం చేశారు. 12.10 గంటలకు జయలలిత చేత గవర్నర్ రోశయ్య పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. తమిళంలో ‘నాన్’(నేను) అని రోశయ్య పలుకగా జయలలిత కొనసాగించారు. దేవుడిపైన అంటూ ఆమె ప్రమాణం సాగించారు. ప్రమాణం పూర్తయిన తరువాత జయలలిత ను అభినందిస్తూ రోశయ్య పుష్పగుచ్చం అందజేశారు. జయ తరువాల మంత్రులు ప్రమాణం చేశారు. సహజంగా ఒక్కో మంత్రి ప్రమాణం చేయాల్సి ఉంది. అయితే కొత్త సంప్రదాయానికి తెరదీస్తూ మొత్తం 28 మంది మంత్రులను రెండుగా బృందాలుగా విభజించి మూకుమ్మడిగా ప్రమాణం చేయించారు. ప్రధాని నరేంద్రమోదీ ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సి ఉంది. అయితే ఆయన విదేశాల్లో ఉన్నందున ప్రధాని తర ఫున కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు హాజరైనారు. అలాగే కేంద్రమంత్రి పొన్ రాధాకృష్ణన్ హాజరయ్యారు. ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ కొంత వెనుక వరుసలో కూర్చుని కార్యక్రమాన్ని వీక్షించారు. అమ్మ టీంలో మరో నలుగురు 28 మందితో జయలలిత తన మంత్రివర్గ బృందాన్ని ప్రకటించగా తమకు న్యాయం జరుగలేదని ఓ సామాజికవర్గం నిరసన తెలిపింది. మంత్రుల ఎంపికలో సామాజిక న్యాయం చోటుచేసుకోలేదనే విమర్శల నేపథ్యంలో కొత్తగా మరో నలుగురిని కేబినెట్లోకి తీసుకోవాలని సోమవారం సాయంత్రానికి సీఎం జయలలిత నిర్ణయం తీసుకున్నారు. జీ భాస్కరన్-ఖాదీ, గ్రామీణ పరిశ్రమలు, సెవ్వూరు ఎస్ రామచంద్రన్-దేవాదాయ ధర్మాదాయ శాఖ, డాక్టర్ నిలోఫర్ కబిల్-కార్మికశాఖ, పీ బాలకృష్ణారెడ్డి -పశుసంవర్దకశాఖ..ఈ నలుగురు మంత్రులు 25వ తేదీన రాజ్భవన్లో ప్రమాణం చేస్తారు. అన్నిరంగాల వారికి ఆహ్వానం ముఖ్యమంత్రిగా జయలలిత ప్రమాణస్వీకారోత్సవానికి అన్నిరంగాల వారికీ ఆహ్వానాలు అందాయి. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం ప్రతినిధిగా డీఎంకే కోశాధికారి స్టాలిన్ 12వ వరుసలో కూర్చున్నారు. మిత్రపక్షానికి చెందిన సమత్తువ మక్కల్ కట్చి అధ్యక్షులు,నటుడు శరత్కుమార్ ముందు వరుసలో కూర్చున్నారు. సీపీఐ రాష్ట్ర మాజీ కార్యదర్శి త పాండియన్, పలువురు పారిశ్రామికవేత్తలు, ఆధ్యాత్మిక వేత్త మధురై ఆదీనం హాజరైనారు. కోలీవుడ్ నుంచి దక్షిణ భారత నటీ నటుల సంఘం అధ్యక్షుడు నాజర్, ప్రధాన కార్యదర్శి విశాల్, నటులు ప్రభు, ఆనందరాజ్,సెంధిల్, మనోబాల, నటిలు వింధ్య, ఆర్తీగణేష్, సంగీత దర్శకులు శంకర్ గణేష్, గాయనిమణులు పీ సుశీల, వాణీజయరాం హాజరయ్యారు. అమ్మ..ఆకుపచ్చ అమ్మ గత రెండేళ్లుగా పాటిస్తున్న ఆకుపచ్చదనం సెంటిమెంట్ను అధికారులు అంతటా పాటించారు. వేదిక తెర, అలంకరించిన పూలు మొదలుకుని సర్వం ఆకుపచ్చమయం అయిపోయింది. చివరకు మీడియాకు ఇచ్చిన పాస్లు సైతం పచ్చదనాన్ని సంతరించుకున్నాయి. అమ్మ సహా ఇద్దరు మహిళా మంత్రులు పచ్చని చీరలు కట్టుకుని వచ్చారు. మిన్నంటిన అభిమానం.. తమ అభిమాన నేత జయలలిత ముఖ్యమంత్రిగా ఆరోసారి పదవీప్రమాణం చేస్తున్న వేళ జనం తండోపతండాలుగా తరలివచ్చారు. ఉదయం 11.30 గంటలకు పోయిస్గార్డెన్ నుంచి బయలుదేరిన జయలలితకు దారిపొడవునా జనం బ్యాండుమేళాలు వాయిస్తూ బ్రహ్మరథం పట్టారు. రెండాకుల చిహ్నాన్ని చూపుతూ జే జేలు కొట్టారు. రాష్ట్రం నలుమూలల నుంచి బస్సులు, కార్లు, వ్యాన్లలో అన్నాడీఎంకే కార్యకర్తలు పెద్దసంఖ్యలో ప్రాంగణానికి చేరుకున్నారు. సరిగ్గా 12.30గంటలకు ప్రమాణ స్వీకారోత్సవం పూర్తికాగానే జయలలిత అక్కడి నుంచి నేరుగా సచివాలయానికి వెళ్లారు. ఉన్నతాధికారుల స్వాగతం, బాధ్యతల స్వీకరణ, ఐదు పథకాలపై సంతకం పూర్తి చేసుకుని సుమారు 1.30 గంటలకు సచివాలయం నుండి తిరుగుప్రయాణం అయ్యారు. అమ్మను మరోసారి చూడాలన్న ఆతృతతో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అభిమాన జనం అంతసేపూ ఎండలోనే నిలబడి ఆమెకు బ్రహ్మరథం పట్టారు. -
సీఎంగా జయ ప్రమాణం
- తమిళనాట 28 మంది మంత్రులుగా ప్రమాణం - కేబినెట్ కూర్పుపై విమర్శలతో మరో నలుగురికి అవకాశం - ఎన్నికల హామీ నెరవేరుస్తూ ఐదు పథకాలపై సంతకం - స్టాలిన్ను వెనుక కూర్చోబెట్టడంపై కరుణ ఆగ్రహం సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా అన్నాడీఎంకే అధినేత్రి జె.జయలలిత ఆరోసారి ప్రమాణస్వీకారం చేశారు. మద్రాసు వర్సిటీ సెంటినరీ ఆడిటోరియంలో సోమవారం మధ్యాహ్నం 12.10 గంటలకు గవర్నర్ రోశయ్య ఆమెతో ప్రమాణం చేయించారు. 28 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రెండు బృందాలుగా మంత్రులుగా ప్రమాణం చేశారు. మంత్రివర్గ కూర్పులో సామాజిక న్యాయం జరగలేదన్న విమర్శలతో మరో నలుగురికి కేబినెట్లో జయ అవకాశమిచ్చారు. ఆమె సిఫార్సు మేరకు గవర్నర్ నలుగురు మంత్రుల్ని కేబినెట్లోకి తీసుకున్నారని రాజ్భవన్ వర్గాలు తెలిపాయి. వీరు మంగళవారం మంత్రులుగా ప్రమాణం చేస్తారు. కాగా, జయ ప్రమాణం అనంతరం గత కేబినెట్లో పనిచేసిన 15 మందితో పాటు కొత్తగా 13 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, పొన్ రాధాకృష్ణన్, లోక్సభ ఉప సభాపతి ఎం.తంబిదురై, జయ సన్నిహితురాలు శశికళలు ముందు వరుసలో కూర్చున్నారు. మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలోపన్నీర్సెల్వం(ఆర్థిక), సి.విజయభాస్కర్(వైద్యం) తదితరులు ఉన్నారు. ఏడాది కాలంలో జయ రెండు సార్లు సీఎంగా ప్రమాణస్వీకారం చేయడం విశేషం. ఆస్తుల కేసులో కర్ణాటక హైకోర్టు నిర్దోషిగా ప్రకటించడంతో మే 23, 2015న జయ ఐదోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఐదు పథకాలపై తొలిసంతకం.. ప్రమాణం పూర్తికాగానే ఆడిటోరియం నుంచి నేరుగా సచివాలయానికి వెళ్లిన జయ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. రైతు రుణాల రద్దు, పెళ్లి కుమార్తెకు తాళికోసం 8 గ్రాముల బంగారం, చేనేత రంగానికి అదనంగా విద్యుత్, వంద యూనిట్ల లోపు ఉచిత కరెంట్ పథకాలపై సంతకం చేసి ఎన్నికల హామీని నిలబెట్టుకున్నారు. 500 మద్యం షాపుల మూసివేతతో పాటు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు షాపులు తెరవొద్దని ఆదేశాలిచ్చారు. కావాలనే అవమానించారు: కరుణానిధి జయ ప్రమాణ కార్యక్రమంలో తన కుమారుడు స్టాలిన్ను వెనుక వరుసలో కూర్చోపెట్టడంపై డీఎంకే చీఫ్ కరుణానిధి అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్నాడీఎంకే మద్దతుతో పోటీ చేసి ఓడిన శరత్ కుమార్ను ముందువరుసలో కూర్చోపెట్టి స్టాలిన్ను జనం మధ్య కూచో బెట్టడమేమిటన్నారు. జయను ప్రధాని మో దీ ట్విటర్లో అభినందించారు. ఆమె ప్రభుత్వం తో కేంద్రం కలసి పనిచేస్తుందని చెప్పారు. -
జయలలిత తొలి సంతకం ఇదే..
చెన్నై: ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే జయలలిత రైతు రుణమాఫీ ఫైలుపై తొలి సంతకం చేశారు. అంతేకాకుండా పలు కొత్త పథకాలతో ప్రజలకు అమ్మ వరాల జల్లు కురిపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం అల్పాహారం, మద్యం దుకాణాలకు సమయం కుదింపు, వంద యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్, చేనేత కార్మికులకు 700 యూనిట్లు ఉచితంగా విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ కొత్త పథకాలు జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ నేపథ్యంలో మద్యం దుకాణాల సమయం కుదింపుపై జయలలిత తన హామీని నిలబెట్టుకున్నారు. అలాగే 500 రిటైల్ మద్యం షాపుల మూసివేతకు ఆమె ఆదేశాలు ఇచ్చారు. కాగా తమిళనాడులో అంతకు ముందు ఉదయం 10 గంటల నుంచి రాత్రి పది గంటల వరకూ మద్యం దుకాణాలు తెరిచి ఉండేవి. అయితే కొత్త విధానం అమల్లోకి రావడంతో మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల నుంచి తెరుచుకోనున్నాయి. కాగా జయలలితతో పాటు 28 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. గతంలో మాదిరిగానే మంత్రులందరూ సామూహికంగా ప్రమాణం చేశారు. జయ కేబినెట్లో ఈసారి 13 మంది కొత్తవారికి అవకాశం దక్కింది. వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లో 232 సీట్లు ఎన్నికలు జరగ్గా, అన్నాడీఎం 134 స్థానాల్లో విజయం సాధించి సంపూర్ణ మెజార్టీతో తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుంది. మంత్రులు-శాఖలు 1. జయలలిత : హోంశాఖ, రెవెన్యూ, జనరల్ అడ్మినిస్ట్రేషన్ 2. పన్నీరుసెల్వం : ఆర్థిక శాఖ 3. శ్రీనివాసన్ - అటవీశాఖ 4. ఈదప్పడి కె. పలానీస్వామి - రహదారులు, పబ్లిక్ వర్క్స్ 5. సెల్లూర్ కె. రాజు - సహకార మరియు కార్మిక శాఖ 6. తంగమణి - విద్యుత్ మరియు ఎక్సైజ్ శాఖ 7. వీపీ వేలుమణి - గ్రామీణాభివృద్ధి మరియు మున్సిపల్ శాఖ 8. డి. జయకుమార్ - మత్స్యశాఖ 9. శణ్ముగమ్ - న్యాయ, జైళ్ల శాఖ 10. కేపీ అన్భజ్హగన్ - ఉన్నత విద్య 11. ఆర్బీ. ఉదయ్కుమార్ - రెవెన్యూ 12. కేటీ. రాజేంత్ర బాలాజీ - గ్రామీణ పరిశ్రమలు 13. కేసీ వీరమణి - వాణిజ్య పన్నుల శాఖ 14. పి. బెంజీమెన్ - పాఠశాల విద్య, ఆటలు మరియు యువజన సంక్షేమం 15. వెల్లమండి ఎన్. నటరాజన్ - పర్యాటక శాఖ 16. ఎస్. వలార్మఠి - వెనుకబడిన తరగతులు మరియు మైనార్టీ సంక్షేమ శాఖ 17. వీఎం. రాజలక్ష్మీ - ఆది ద్రవిడర్ మరియు గిరిజన సంక్షేమ శాఖ 18. ఎమ్. మణికందన్ - ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ(ఐటీ) 19. ఎంఆర్. విజయ్భాస్కర్ - రవాణా శాఖ. 20. డాక్టర్ వీ. సరోజ - సాంఘీక సంక్షేమ శాఖ 21. కేసీ కరుప్పన్నన్ - పర్యావరణ శాఖ 22. ఎంసీ సంపత్ - పరిశ్రమలు 23. ఆర్. కామరాజ్ - ఆహార, పౌరసరఫరాల శాఖ 24. ఓఎస్ మనేన్ - చేనేత మరియు జౌళి శాఖ 25. ఉడుమలై రాధాకృష్ణన్ - గృహ మరియు పట్టణాభివృద్ధి శాఖ 26. సీ. విజయ్భాస్కర్ - ఆరోగ్య శాఖ 27. ఎస్పీ శణ్ముగనాథన్ - పాలు మరియు పాడి పరిశ్రమ అభివృద్ధి 28. ఆర్. దురైకన్ను - వ్యవసాయం మరియు పశు సంరక్షణ శాఖ 29. కదంబూర్ రాజు - సమాచార శాఖ -
కొత్త సంసారంలా ఉంది:రోశయ్య
తాడేపల్లిగూడెం: కోస్తా జిల్లాల వారికి చైతన్యం ఎక్కువని, ఆ కారణంతోనే అన్ని రాజకీయ పార్టీల దృష్టీ ఇటువైపే ఉంటుందని తమిళనాడు గవర్నర్ రోశయ్య అన్నారు. శనివారం ఉదయం ఆయన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో విలేకర్లతో మాట్లాడారు. ఇక్కడి వారి ఆదరణ, అభిమానం పొందేందుకు పార్టీలు అనేక సేవా కార్యక్రమాలను చేపడుతున్నాయని తెలిపారు. అయితే, ఇది మోతాదు మించకుండా చూసుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన తర్వాత రాష్ట్రంలో ఎన్నోమార్పులు సంభవించాయన్నారు. కొత్త సంసారం మాదిరిగా ఎక్కడికక్కడ సర్దుబాట్లు జరుగుతున్నాయని, త్వరలోనే అన్నీ చక్కబడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాలు కూడా సుభిక్షంగా ఉండాలని కోరారు. -
పేద కుటుంబాలకు చేయూతనివ్వాలి
తమిళనాడు గవర్నర్ రోశయ్య పేదజిల్లా ధనికంగా మారాలి: మంత్రి సి.లక్ష్మారెడ్డి జడ్చర్ల : కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు అమలు చేసే ప్రజాహిత కార్యక్రమాలు అందుకోలేని వారికి సంఘాలు చేయూతనిచ్చి వారిని ప్రోత్సహించాలని తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య కోరారు. శనివారం బాదేపల్లి వాసవీకన్యకా పరమేశ్వరీ దేవాలయంలో జరిగిన ఆర్యవైశ్య యువజన సంఘం రజతోత్సవ కార్యక్రమానికి రోశయ్యతో పాటు మంత్రి లక్ష్మారెడ్డి, నిజామాబాద్ ఎమ్మెల్యే గణేష్ గుప్త తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రోశయ్య మాట్లాడుతూ ఈ ప్రభుత్వం అందించే పలు కార్యక్రమాలను అట్టడుగుస్థాయిలో ఉన్న ఆర్యవైశ్యులు ఆందుకోలేని స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. మీకేం లక్ష్మిపుత్రులు మీకేందుకండి ఈ పథకాలు అంటారేమోనన్న సందేహంతో ఎన్నో వైశ్య కుటుంబాలు పేదరికంలో పూటగడవని స్థితిలో ఉన్నా ప్రభుత్వ పథకాలను వినియోగించుకునే స్థితిలో లేవన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర ప్రభుత్వ హాస్టళ్లలో చేరడానికి సైతం బిడియ పడుతున్నారన్నారు. ఇటువంటి సందర్భంలో చదువుకు తదితర సంక్షేమ పథకాలను వారికి అందించేందుకు సేవాదృక్పథంతో సహకరించాలని సూచించారు. ధనిక జిల్లాగా మారబోతుంది రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ పేద జిల్లాగా పేరొందిన పాలమూరు జిల్లా సీఎం కేసీఆర్ చేపట్టే పలు అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతో రాబోయే రోజుల్లో ధనిక జిల్లాగా మారబోతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాజకీయాల్లో విలువలు తగ్గుతున్న కాలంలో గవర్నర్ రోశయ్య తనదైన శైలిలో విలువలతో కూడిన రాజకీయాలు నేర్పారని కొనియాడారు. పాలమూరు జిల్లా అభివృద్ధికి సీఎం కేసీఆర్ విశేష కృషి చేస్తున్నారన్నారు. పెండింగ్ ప్రాజెక్ట్లను పూర్తి చేయడంతో పాటు కొత్తగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు. తాగు, సాగునీరుతో జిల్లా సస్యశ్యామలం కానుందన్నారు. వైద్య రంగంలో వినూత్న మార్పులు తీసుకొచ్చి ప్రజలకు మంచి వైద్యం అందించడం జరుగుతుందన్నారు. తమిళనాడు రాష్ట్రంలో గల వైద్య విధానాలను తెలంగాణలో అమలు చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఆర్యవైశ్యుల సేవలు ప్రశంసనీయమన్నారు. ఎమ్మెల్యే గణేష్ గుప్త మాట్లాడుతూ వైశ్యులు రాజకీయరంగంలో వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహాత్మాగాంధీ, రోశయ్య తమకు రోల్మోడల్గా నిలిచారని ప్రశంసించారు. 16సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టిన మంత్రిగా రోశయ్య ప్రత్యేకత కలిగి ఉన్నారని కొనియాడారు. కార్యక్రమంలో జేసీ రాంకిషన్, ఆర్యవైశ్య రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మినర్సింహ, యువజన సంఘం అధ్యక్షుడు జయకృష్ణ, రాంమోహన్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. -
అమీర్ పేట భూములపై సుప్రీంలో వ్యాజ్యం
భూములు పొందిన వారికి నోటీసులు జారీ తమిళనాడు గవర్నర్కు నోటీసులు అవసరం లేదని స్పష్టీకరణ సాక్షి, న్యూఢిల్లీ: అమీర్పేట భూముల కేసులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు గవర్నర్ రోశయ్యకు ఏసీబీ ప్రత్యేక కోర్టు జారీ చేసిన సమన్లను హైకోర్టు కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కె.మోహన్లాల్ అనే వ్యక్తి ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ ప్రఫుల్ల సి పంత్తో కూడిన ధర్మాసనం దీన్ని మంగళవారం విచారించింది. పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్డే, న్యాయవాది శ్రీహర్ష వాదనలు వినిపిస్తూ.. ఏసీబీ ప్రత్యేక కోర్టు జారీ చేసిన సమన్లను హైకోర్టు కొట్టివేయడం సరికాదని, దానిపై స్టే ఇవ్వాలని కోరారు. ఆర్టికల్ 361 ప్రకారం గవర్నర్కు సమన్లు జారీచేయడం సాధ్యం కాదన్న హైకోర్టు తీర్పు సబబేనని రోశయ్య తరపు సీనియర్ న్యాయవాది పీపీ రావు కోర్టుకు విన్నవించారు. కాగా, హైకోర్టు తీర్పులో ఎక్కడా ఆర్టికల్ 361 ప్రస్తావన లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. రోశయ్య తరపున న్యాయవాది కేవియట్ పిటిషన్ వేసి హాజరైనందున రోశయ్యకు నోటీసులు అవసరం లేదని పేర్కొంటూ, భూములు పొందిన వారికి నోటీసులు జారీ చేస్తూ విచారణను ధర్మాసనం ఆరు వారాల పాటు వాయిదా వేసింది. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉండగా అమీర్పేట్లోని 9.14 ఎకరాల ప్రభుత్వ భూమిని డీనోటిఫై చేస్తూ ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేకూర్చారన్న ఆరోపణలపై ఏసీబీ కేసు నమోదైన సంగతి తెలిసిందే. -
మహాశౌర్య యాగంలో తమిళనాడు గవర్నర్
సామర్లకోట మండలం కాకినాడ-ఏడీబీ రోడ్డులో ఉండూరు వద్ద జరిగిన మహాశౌర్యయాగంలో తమిళనాడు గవర్నర్ రోశయ్య పాల్గొన్నారు. ఈ యాగాన్ని కాకినాడకు చెందిన పారిశ్రామికవేత్త కొంతేటి విశ్వేశ్వర సూర్య ప్రకాశ్ నిర్వహిస్తున్నారు. -
యాగానికి వచ్చిన గవర్నర్ రోశయ్య
-
ఇది కనివినీ ఎరుగని విపత్తు: రోశయ్య
-
ఇది కనివినీ ఎరుగని విపత్తు: రోశయ్య
చెన్నై: తమిళనాడులో కురిసిన భారీ వర్షాల కారణంగా అక్కడి పరిస్థితి చాలా దారుణంగా ఉందని తమిళనాడు గవర్నర్ రోశయ్య చెప్పారు. ఇది కనివినీ ఎరుగని విపత్తు అంటూ ఆయన అభివర్ణించారు. ఈ విపత్తు కారణంగా సామాన్యుల నుంచి అందరికి నష్టం జరిగిందని రోశయ్య ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడు ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, సేవాతత్పరులు ముందుకు వచ్చి వరద బాధితులను ఆదుకోవాలని కోరారు. కేంద్రం నుంచి మరిన్ని నిధుల కోసం తాము ప్రయత్నిస్తామని రోశయ్య పేర్కొన్నారు. -
సాహితీవేత్త పాలాది లేరిక
కడప కల్చరల్ : ప్రముఖ సాహితీ వేత్త, వైశ్య ప్రముఖుడు, వాసవీ గ్రాఫిక్స్ అధినేత పాలాది లక్ష్మీకాంతం శ్రేష్ఠి (79) శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటలకు కడప నగరంలోని ఎన్జీఓ కాలనీలోని తన స్వగృహంలో కన్నుమూశారు. జిల్లాలోని ఎర్రగుంట్ల మండలం కలమల్ల గ్రామంలో జన్మించిన ఆయన కన్నగి, చారుగుప్తా చారిత్రక నవలలు, వాసవీ పేరిట ఐతిహాసిక నవల, సంస్కృతి, అక్షర సుమాలు తదితర పద్య రచనలతోపాటు తెలుగులో జంట కవులు, మహాభాగవత పరిశీలన, విమర్శన గ్రంథం, పలువురు కవుల జీవిత చరిత్రలు రాశారు. దేవతల పూజా విధానాలు, పద్యకావ్యాలు, దండకాలు రచించారు. 20కి పైగా గ్రంథాలు రాసిన ఆయన ఆకాశవాణిలో పలు సాహి త్య ప్రసంగాలు చేశారు. ఏడు ఆధ్యాత్మిక గ్రంథాలు, మరో ఏడు ఇతరుల గ్రంథాలను ఆయన సొంతంగా ముద్రింపజేశా రు. ఎన్నో పుస్తకాలకు పీఠి కలు రాశారు. మరెన్నో పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. కడపోత్సవాల సంచికలన్నింటికీ సంపాదక సభ్యుడిగా వ్యవహరించారు. వైశ్య ప్రబోధిని 1969లో వైశ్యుల కోసం ప్రత్యేకంగా వైశ్య ప్రబోధిని మాస పత్రికను ప్రారంభించారు. సాహిత్య, సామాజిక, కళా వ్యాపార రంగాలకు సంబంధించిన విషయాలతో ఆ పత్రికను విజయవంతంగా నిర్వహించారు. ఆ పత్రిక పలువురు సాహితీవేత్తలు, విశ్వ విద్యాలయాల నుంచి ప్రశంసలందుకుంది. 1991లో శ్రీ దోమా వెంకటస్వామిగుప్తా సాహిత్య పీఠాన్ని ఏర్పాటు చేసిన ఆయన ప్రతి ఫిబ్రవరి 13న సాహితీవేత్తలకు పురస్కారాలు అందజేశారు. పాలాది శివలక్షుమమ్మ, లక్ష్మికాంతం శ్రేష్ఠి సాహిత్య పీఠం ద్వారా మరిన్ని సాహితీ సేవలు అందించారు. ప్రముఖ సాహితీవేత్తలకు, అవధానులకు పురస్కారాలు అందజేశారు. మహాకవి పుట్టపర్తి నారాయణాచార్యులను ఎంతో ఆరాధించే ఆయన సీవీ సుబ్బన్న కవిని ప్రాణంగా భావిస్తారు. సామాజిక సేవలు అభాగ్య సోదర సహాయనిధి, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య యువజన సంఘాల సమాఖ్య, శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీదేవి ఆలయాలు, ఆర్యవైశ్య ధర్మ సంస్థల సమాఖ్యల ద్వారా ఆర్యవైశ్య వర్గానికి ఎన్నో సేవలందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రాచీనభాషగా తెలుగు ప్రతిపాదిత కార్యచరణ ప్రణాళిక రచన కమిటీ సభ్యుడిగా, చిన్న పత్రికల జాతీయ సంఘం, ఆలిండియా వైశ్య సమాజ్లకు ఉపాధ్యక్షుడిగా సేవలందించారు. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు పలు సామాజిక, ఆర్యవైశ్య సేవా సంస్థల ద్వారా సంఘోద్దారక, వైశ్య భూషణ, సమాజక సేవ నిష్ణాత, సాహిత్యరత్న బిరుదులతో పాటు ప్రతిష్టాత్మకమైన 13 పురస్కారాలు పొందారు. విశిష్ఠ వ్యక్తిత్వం ‘పాలాది’ విశిష్ఠమైన వ్యక్తిత్వం కలవారు. అనుకున్నది సాధించే వరకు పట్టుదలగా ఉండేవారు. స్నేహితులు, బంధుమిత్రులను ఆప్యాయంగా పలుకరించేవారు. యువ సాహితీవేత్తలను ‘నాయనా’ అంటూ సంబోధిస్తూ ఎంతో ప్రోత్సహించేవారు. మంచి కార్యక్రమాలకు తన తోడ్పాటు ఉంటుందని వెన్నుతట్టేవారు. ప్రస్తుత తమిళనాడు రాష్ట్ర గవర్నర్ కొణజేటి రోశయ్యతో పాలాదికి ఆత్మీయ అనుబంధం ఉంది. అన్నా అంటూ ఆయనతో ఎంతో ఆత్మీయంగా ఉండేవారు. పలుమార్లు ఆయనను కడపకు తన సాహిత్య కార్యక్రమాల కోసం పిలిపించారు. కాగా, పాలాది మృతి విషయం తెలిసిన వెంటనే జిల్లాలోని సాహితీ వేత్తలు, రాజకీయ ప్రముఖులు తరలివచ్చి ఆయన భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. -
రోశయ్యకు 'కొరియర్' ఆహ్వానం
-
తెలుగైతేనే స్పందిస్తారా ?
చెన్నై : అధికార అన్నాడీఎంకే పార్టీ బీజేపీకి చేరువయ్యే కొద్దీ రాష్ట్ర కాంగ్రెస్ ఆరోపణల పర్వం, విమర్శల స్వరం పెంచుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే మధ్య పొత్తుకుదిరి సమష్టిగా పోటీకి దిగిన పక్షంలో ఎలా ఎదుర్కొవాలనే అంశంలో అన్ని పార్టీల్లో కంగారు నెలకొంది. తాజా పార్లమెంటు ఎన్నికల్లో దేశవ్యాప్తంగా సాగిన నరేంద్రమోదీ ప్రభంజనాన్ని సైతం నిలువరించి రాష్ట్రంలో అమ్మ జయకేతనం ఎగురవేశారు. ఏడాది పాలనలో ఎంతో కొంత ప్రతిష్టను మూటగట్టుకున్న బీజేపీ... అమ్మతో కలిసి అసెంబ్లీకి తలపడితే బలీయమైన శక్తిగా అవతరించగలదనే అభిప్రాయం అందరిలో నెలకొంది. ఆస్తుల కేసులో జయ జైలుపాలు కావడాన్ని అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాన అస్త్రంగా ప్రయోగించాలని ప్రతిపక్షాలు అంచనా వేశాయి. అయితే ఆమె నిర్దోషిగా బైటపడడంతో సదరు అస్త్రాన్ని అటకెక్కించక తప్పలేదు. ప్రతిపక్షాలకు ఇక మిగిలింది అమ్మ కేబినెట్. అమ్మ కేబినెట్ అవినీతిమయం అంటే జయ ప్రభుత్వం అక్రమాలమయం అని చెప్పక చెప్పినట్లే అవుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. అమ్మ ప్రభుత్వాన్ని ప్రజల్లో అప్రతిష్టపాలు చేయాలంటే అవినీతి ఆరోపణలు ఒక్కటే మార్గమని కాంగ్రెస్ రాష్ట్ర రథసారథి ఈవీకేఎస్ ఇళంగోవన్ తలపోశారు. అమ్మ కేబినెట్లోని మంత్రులు భారీ అవినీతి పరులను ఆరోపిస్తూ గవర్నర్ రోశయ్యకు గత ఏడాది వినతిపత్రం సమర్పించారు. అంతేగాక మంత్రుల అవినీతి వివరాలతో కూడిన జాబితాను సమర్పించినట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. తమిళ మంత్రులపై తాము చేసిన ఆరోపణలు గవర్నర్ బంగ్లాలో బుట్టదాఖలైనాయని వారు కలవరపడుతున్నారు. కులమతాలు, భాషా భేదాలు, రాజకీయాలకు అతీతంగా వ్యవహరించే హోదాలో ఉన్న రోశయ్య మాతృభాషైన తెలుగును ఇళంగోవన్ ప్రస్తావిస్తూ పరుషపూరితమైన వ్యాఖ్యానాలు చేశారు. చెన్నై సత్యమూర్తి భవన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇళంగోవన్ మాట్లాడుతూ, తమిళ మంత్రులు పాల్పడుతున్న అవినీతి చిట్టాను రాష్ట్రగవర్నర్ కే రోశయ్యకు సమర్పించి ఎనిమిది నెలలు అవుతోంది, ఆ చిట్టా ఏమైందో ఇంత వరకు తెలియలేదని అన్నారు. ఆ అవినీతి చిట్టాను ఆంగ్లం, తమిళంలో ఇచ్చాము, ఒకవేళ రోశయ్యకు తెలుగులో రాసిస్తేనే అర్థం అయ్యేలా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. మంత్రులపై మరో అవినీతి చిట్టాను సిద్ధం చేసేందుకు తాను ఎటువంటి జాప్యానికి పాల్పడటం లేదని అన్నారు. -
రోశయ్యకు హైకోర్టులో ఊరట
ఏసీబీ కోర్టు ఉత్తర్వులు కొట్టివేత సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లోని అమీర్పేట భూముల వ్యవహారంలో తమిళనాడు గవర్నర్ రోశయ్యకు హైకోర్టులో ఊరట లభిం చింది. రోశయ్యపై అభియోగాలు మోపుతూ న్యాయవాది మోహన్లాల్ దాఖలు చేసిన ఫిర్యాదును విచారణకు స్వీకరిస్తూ హైదరాబాద్ అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక న్యాయస్థానం 2012, జూన్ 18న జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టేసింది. ఈ వ్యవహారంతో సంబంధమున్న ప్రైవేటు వ్యక్తులను విచారించాలన్న అభ్యర్థనను తోసిపుచ్చుతూ ఏసీబీ స్పెషల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ మోహన్లాల్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ను సైతం హైకోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇళంగో మంగళవారం తీర్పు వెలువరించారు. అమీర్పేట్లో దాదాపు రూ. 300 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని టీడీపీ నేత డాక్టర్ జి.ఎన్ నాయుడు తదితరులకు కట్టబెడుతూ రోశయ్య నేతృత్వంలోని అప్పటి ప్రభుత్వం 2010లో జీవో 288 జారీ చేసింది. ఈ జీవో వెనుక అక్రమాలు జరిగాయని న్యాయవాది మోహన్లాల్ చేసిన ఫిర్యాదు మేరకు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం, దీనిపై విచారణ జరపాలని ఏసీబీ డెరైక్టర్ జనరల్ను ఆదేశించింది. విచారణ జరిపిన ఏసీబీ అధికారులు రోశయ్యకు క్లీన్చిట్ ఇస్తూ కోర్టుకు నివేదిక సమర్పించారు. ఈ నివేదిక సరిగా లేదని, కేసును పునః సమీక్షించాలని మోహన్లాల్ కోరగా ప్రత్యేక కోర్టు అంగీకరించింది. ప్రైవేటు వ్యక్తుల్ని విచారించాలంటూ చేసిన అభ్యర్థనను మాత్రం తోసిపుచ్చింది. రోశయ్యతో పాటు పలువురి వ్యక్తిగత హాజరుకు సమన్లు జారీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ రోశయ్య హైకోర్టులో క్రిమినల్ పిటిషన్ దాఖలు చేశారు. మోహన్లాల్ రివిజన్ పిటిషన్ వేశారు. ఈ 2 వ్యాజ్యాలను న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇళంగో విచారించారు. రోశయ్య వ్యక్తిగత హాజరుకు ఏసీబీ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి మంగళవారం తుది తీర్పు ఇచ్చారు. -
హైకోర్టులో రోశయ్య స్క్వాష్ పిటిషన్
-
హైకోర్టులో రోశయ్య క్వాష్ పిటిషన్
హైదరాబాద్: అమీర్పేట భూ వివాదం కేసు నుంచి తనకు విముక్తి కల్పించాలని తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య మంగళవారం హైకోర్టును ఆశ్రయించారు. అమీర్పేట భూ వివాదంలో ఏసీబీ పెట్టిన కేసును కొట్టివేయాలని కోరుతూ రోశయ్య వేసిన క్వాష్ పిటిషన్ను మంగళవారం ఉమ్మడి హైకోర్టు స్వీకరించింది. ఈ కేసు నుంచి తప్పించాలని గవర్నర్ రోశయ్యతో పాటు మరో 15 మంది హైకోర్టును అభ్యర్థించారు. 9 ఎకరాల భూమిని నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారని రోశయ్యపై అభియోగాలు మోపిన విషయం తెలిసిందే. -
'ప్రజలంతా సంతోషంగా ఉండాలని కోరుకున్నా'
-
రోశయ్యతో జయలలిత భేటీ
-
రోశయ్యతో జయలలిత భేటీ
చెన్నై: అన్నా డీఎంకే అధినేత్రి జయలలిత తమిళనాడు గవర్నర్ రోశయ్యతో సమావేశమయ్యారు. శుక్రవారం ఉదయం అన్నా డీఎంకే శాసనసభ పక్ష నాయకురాలిగా ఎన్నికైన జయలలిత రేపు సీఎంగా ప్రమాణం చేయనున్నారు. ఈ నేపథ్యంలో జయలలిత గవర్నర్ను కలసి చర్చించారు. జయలలిత రేపు ప్రమాణం చేయనున్న మంత్రుల జాబితాను రో్శయ్యకు అందజేశారు. ఈ రోజు ఉదయం తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం రాజీనామా చేయగా రోశయ్య ఆమోదించారు. అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు జయలలితను ఆహ్వానించారు. -
ప్రభుత్వ ఏర్పాటుకు జయకు ఆహ్వానం
చెన్నై: తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా అన్నా డీఎంకే అధినేత్రి జయలలితను ఆ రాష్ట్ర గవర్నర్ కే రోశయ్య ఆహ్వానించారు. రాజ్భవన్ ఈ మేరకు ఓ ప్రకటనలో తెలిపింది. తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం రాజీనామాను రోశయ్య ఆమోదించినట్టు వెల్లడించింది. ఈ రోజు మధ్యాహ్నం జయలలిత గవర్నర్తో సమావేశంకానున్నారు. రేపు తమిళనాడు సీఎంగా జయ ప్రమాణం చేస్తారు. ఈ రోజు ఉదయం అన్నా డీఎంకే శాసనసభ పక్ష నాయకురాలిగా జయలలిత ఎన్నికయ్యారు. అనంతరం పన్నీరు సెల్వం రాజ్భవన్కు వెళ్లి రాజీనామా లేఖ అందజేశారు. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోశయ్య
-
‘ప్రాంతాలు వేరుపడినా భాష వేరుపడదు’
విశాఖపట్నం: తెలుగు ప్రాంతాలు వేరుపడినా భాష వేరుపడదని తమిళనాడు గవర్నరు కె.రోశయ్య అన్నారు. లోక్నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం విశాఖలోని కళాభారతి ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ రచయిత, సినీ నటుడు గొల్లపూడి మారుతీరావుకు లోక్నాయక్ పురస్కారాన్ని ప్రదానం చేశారు. అలాగే ఫ్రాన్సు విశ్వవిద్యాలయ తెలుగు భాషాచార్యులు డేనియల్ నిగర్స్, కెనడాలో బంజారా ఇండియా రెస్టారెంట్ల నిర్వహణ ద్వారా తెలుగువారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న వీరెళ్ల రాజేశ్వరరావులకు జీవితసాఫల్య పురస్కారాలను అందజేశారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ మాట్లాడుతూ.. తెలుగు సాహిత్యం, సంస్కృతిని బతికించాలనే లక్ష్యంతో పురస్కారాలు అందించడం అభినంద నీయ మన్నారు. ఈ పురస్కారం లభించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని లోక్నాయక్ పురస్కార గ్రహీత గొల్లపూడి మారుతీరావు చెప్పారు. ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఏపీ శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, జస్టిస్ జి.రఘురామ్, అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాస్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, మాజీ ఎంపీలు ఎంవీవీఎస్ మూర్తి, సబ్బం హరి పాల్గొన్నారు. -
అంతా అభివృద్ధి పథాన నడవాలి
కొత్త సంవత్సర ఆగమన వేళ పలువురు ప్రముఖుల ఆకాంక్ష ప్రజలకు గవర్నర్, తెలంగాణ సీఎంల శుభాకాంక్షలు నేడు గవర్నర్ నరసింహన్ ప్రజా దర్బార్ ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు సాక్షి, హైదరాబాద్: కొత్త సంవత్సరం 2015 ఆగమనం సందర్భంగా పలువురు ప్రముఖులు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఇరురాష్ట్రాల ప్రజలకు బుధవారం కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో రెండు రాష్ట్రాల అభివృద్ధి పథంలో పయనించాలని కోరారు. ప్రజలు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్దిల్లాలని ఆకాంక్షించారు. కొత్త సంవత్సరం తొలిరోజైన గురువారం రాజ్భవన్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రజలను, ప్రజాప్రతినిధులను కలవడానికి గవర్నర్ నరసింహన్ అందుబాటులో ఉంటారు. సామాన్య ప్రజలంతా ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలపవచ్చని రాజ్భవన్ వర్గాలు పేర్కొన్నాయి. కొత్త ఏడాదిలో ఆకాంక్షలు నెరవేరాలి : తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలు, అవసరాలు తీరాలని ఆకాంక్షించారు. ఎన్నో పోరాటాల తర్వాత ప్రజల తెలంగాణ రాష్ట్ర కల 2014లో నెరవేరిందని, ఈ ఏడాది చరిత్రలో నిలిచిపోతుందన్నారు. 2015 సంవత్సరం ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ముందుకు పోతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. బంధం బలపడాలి..:తమిళనాడు గవర్నర్ కొత్త ఏడాది ప్రజల్లో నూతనోత్సాహాలను కలిగించాలని తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య ఆకాంక్షించారు. ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరం కొత్త విజ్ఞానాన్ని అందించాలని, ప్రజల మధ్య బంధాలు బలపడి, శాంతిసామరస్యాలు వెల్లివిరియాలన్నారు. ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి: కిషన్రెడ్డి కొత్త ఏడాది సందర్భంగా ఆయురారోగ్యాలు, పాడిపంటలతో అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎమ్మెల్యే జి.కిషన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి లక్ష్యంగా, సుపరిపాలనతో కూడిన సమాజ నిర్మాణం కోసం ప్రజలు ముందుకు రావాలన్నారు. -
రోశయ్యకు నాయిని క్షమాపణ
తప్పుడు సమాచారం వల్లే మల్లేపల్లి భూమిపై ప్రకటన చేసినట్లు వివరణ సాక్షి, హైదరాబాద్: అధికారులు ఇచ్చిన సమాచార లోపంతో తమిళనాడు గవర్నర్ రోశయ్య అల్లుడికి కేటాయించిన భూమి విషయంలో తప్పుడు ప్రకటన చేశానంటూ తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. ఈ విషయంలో రోశయ్యకు క్షమాపణ చెప్పారు. మల్లేపల్లి ఐటీఐకి చెందిన భూమిలో ఒక ఎకరాన్ని తక్కువ ధరకే రోశయ్య అల్లుడికి కేటాయించారని తాను చేసిన ప్రకటన తప్పు అని స్పష్టంచేశారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మల్లేపల్లి ఐటీఐ స్థలాన్ని నైస్ ఆసుపత్రికి కేటాయించడంపై విచారణ జరిపి పూర్తి వివరాలు తెలుసుకుంటామని, ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రివర్గంలో చర్చిస్తానని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అందించే సాయంతో మల్లేపల్లి ఐటీఐని ఆధునీకరిస్తామని, రాష్ర్టంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలనూ అభివృద్ధిపరుస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయిస్తే కేంద్రాన్ని ఒప్పించి రాష్ట్రంలో ‘స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని’ మంజూరు చేయిస్తానని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ హామీ ఇచ్చారని, స్థలం కేటాయింపునకు సీఎం కె.చంద్రశేఖర్రావు కూడా హామీ ఇచ్చారని నాయిని చెప్పారు. నాయిని సమక్షంలో చేరికలు వరంగల్ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకులు శుక్రవారం నాయిని సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. నియోజకవర్గ పరిధిలోని గణపురం మండలానికి చెందిన సింగిల్విండో వైస్ చైర్మన్, డెరైక్టర్లు, టీడీపీ నాయకులకు కండువాలు కప్పి పార్టీలోకి నాయిని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు నిరంజన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రోశయ్య అల్లుడికిచ్చిన స్థలం వెనక్కి
విలువైన మల్లెపల్లి ఐటీఐ స్థలాన్ని రూ.కోటికే కట్టబెట్టారు తెలంగాణ హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని కేంద్ర మంత్రి దత్తాత్రేయతో కలసి ఐటీఐలో తనిఖీ సాక్షి, హైదరాబాద్: కొణిజేటి రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన తన అల్లుడికి చెందిన నియోనాటల్ ఇన్టెన్సివ్ కేర్ అండ్ ఎమర్జెన్సీస్(నైస్) ఆస్పత్రికి అప్పనంగా కట్టబెట్టిన ఎకరా స్థలాన్ని వెనక్కి తీసుకుంటామని రాష్ట్ర హోం, కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి ప్రకటిం చారు. హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్న మల్లెపల్లి పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ)కు చెందిన 22 ఎకరాలపై కన్నేసిన నాటి సీఎం రోశయ్య.. అందులో నుంచి ఎకరా స్థలాన్ని తన అల్లుడికి చెం దిన నైస్ ఆస్పత్రికి కేవలం కోటి రూపాయలకే కారుచౌకగా కట్టబెట్టారని నాయిని ఆరోపించారు. కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయతో కలసి బుధవారం మల్లెపల్లి ఐటీఐలో తనఖీలు నిర్వహించారు. అనంతరం మంత్రి నాయిని విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ శిక్షణ సంస్థకు చెందిన స్థలాన్ని ప్రైవేటు ఆస్పత్రికి కేటాయించడం చట్టవిరుద్ధమని అభ్యం తరం తెలుపుతూ నాటి కార్మిక, ఉపాధి కల్పన శాఖ సంచాలకులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినా.. పట్టించుకోకుండా బంధుప్రీతికి పాల్పడ్డారన్నా రు. స్థలానికి చెల్లించాల్సిన రూ. కోటి కూడా ఇప్పటికీ ఉపాధికల్పన శాఖకు ఇప్పటికీ జమ చేయలేదని, కానీ.. నైస్ ఆస్పత్రి యాజమాన్యం దర్జాగా భవనాన్ని నిర్మించుకుం దని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీఐల ఆధునికీకరణ : దత్తాత్రేయ దేశంలోని ఐటీఐల స్థాయిని పెంచుతున్నట్టు కేంద్ర కార్మికశాఖ మంత్రి బం డారు దత్తాత్రేయ తెలిపారు. శిక్షణ పొం దిన వారిలో 85 శాతం విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. రూ.41 కోట్ల వ్యయంతో తెలంగాణలో ని ఎనిమిది ప్రభుత్వ ఐటీఐల ను ఆధునికరిస్తామని చెప్పారు. ఎంప్లాయీమెం ట్ ఎక్స్ఛేంజ్ల ద్వారా ఉద్యోగావకాశాల సమాచారాన్ని నిరుద్యోగులకు ఎప్పటికప్పుడు ఎస్ఎంఎస్ల రూపంలో పం పే సేవలను ప్రారంభిస్తున్నామన్నారు. -
ఆర్యవైశ్యులు రాజకీయంగా ఎదగాలి
తమిళనాడు గవర్నర్ రోశయ్య గుంటూరు: ఆర్యవైశ్యులు రాజకీయంగా మరింత ఎదగాల్సిన అవసరం ఉందనీ తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య అన్నారు. ఏపీ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో గుంటూరులోని వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఎమ్మెల్యే, మునిసిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందిన ఆర్యవైశ్య ప్రజాప్రతినిధులకు అభినందన కార్యక్రమం మంగళవారం జరిగింది. మహాసభ అధ్యక్షుడు కాళ్లకూరి శ్రీరామనాగేశ్వరరావు(నాగబాబు) అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి రోశయ్య మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పుడు 14 మంది ఆర్యవైశ్య ప్రజాప్రతినిధులు ఉన్నారని, నేడు వారి సంఖ్య ముగ్గురికి పడిపోవటం బాధాకరమన్నారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులకు రోశయ్య శాలువాకప్పి సత్కరించారు. జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్(తాతయ్య) మాట్లాడుతూ ఎన్నికల్లో గెలవటం సాధారణమైన విషయం కాదని సేవచేస్తూ నలుగురి నోట్లో నాలుకలాగా మెలిగితే ఏ పార్టీ అయినా పిలిచి సీటు ఇస్తుందని చెప్పారు. మాజీ మంత్రి టీజీ వెంకటేశ్, మాజీ ఎమ్మెల్యేలు అంబికా కృష్ణ, వెల్లంపల్లి శ్రీనివాస్, మంత్రి శిద్దా రాఘవరావు సతీమణి లక్ష్మీపద్మావతి, పలు జిల్లాలకు చెందిన ఆర్యవైశ్య సంఘాల అధ్యక్షులు, మహిళా విభాగం, వాసవి సేవాదళ్ నాయకులు పాల్గొన్నారు. -
‘తమిళ’ హెచ్ఆర్సీ చీఫ్గా మీనాకుమారి
సాక్షి, హైదరాబాద్: తమిళనాడు రాష్ట్ర మానవ హక్కుల సంఘం చైర్ పర్సన్గా మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి. మీనాకుమారి నియమితులయ్యారు. తమిళనాడు గవర్నర్ రోశయ్య ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామక ఉత్తర్వులను జారీ చేశారు. గతంలో ఈమె మేఘాలయ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి గత ఏడాది రిటైరయ్యారు. అంతకుముందు ఈమె ఆంధ్రప్రదేశ్, మద్రాస్, పాట్నా రాష్ట్ర హైకోర్టులలో న్యాయమూర్తిగా పనిచేశారు. తెలుగు వ్యక్తి అయిన ఈమె రిటైరయ్యాక హైదరాబాద్లో స్థిరపడ్డారు. -
మోహన్ బాబుకు బెజవాడ గోపాల్ రెడ్డి అవార్డు
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు బెజవాడ గోపాలరెడ్డి అవార్డు అందుకున్నారు. మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ రోశయ్య ఈ అవార్డును మోహన్ బాబుకు అందజేశారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ.. అవార్డు రావడం తనకెంతో సంతోషంగా ఉందని అన్నారు. -
మోడీ ఆర్ధిక సహాయం అందిస్తారు: రోశయ్య
చెన్నై: హుదూద్ తుఫాన్ తాకిడితో ధ్వంసమైన ప్రాంతాలకు ప్రధాని నరేంద్రమోడీ సానుకూలంగా ఆర్దికంగా సహాయం అందిస్తారని తమిళనాడు గవర్నర్ రోశయ్య తెలిపారు. తుఫాన్ లో మృతి చెందిన కుటుంబాలకు రోశయ్య ప్రగాఢ సానుభూతి తెలిపారు. తుఫాన్ బాధితులకు సహాయం అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు.