రైల్వే జోన్ కోసం వైఎస్ఆర్సీపీ పాదయాత్ర
Published Thu, Mar 30 2017 12:46 PM | Last Updated on Tue, May 29 2018 4:37 PM
విశాఖపట్టణం: విశాఖపట్టణం రైల్వే జోన్ డిమాండ్తో మరో ఉద్యమానికి వైఎస్ఆర్సీపీ శ్రీకారం చుట్టింది. విశాఖకు రైల్వే జోన్ వెంటనే ప్రకటించాలంటూ విశాఖపట్టణం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యకుడు అమర్నాథ్ రెడ్డి అనకాపల్లి నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నారు. అనకాపల్లి నుంచి భీమిలి వరకూ ఈ పాదయాత్ర కొనసాగనుంది.
అంతకుముందు అనకాపల్లిలో బహిరంగ సభను నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ నేతలు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, అంబటి రాంబాబు తదితరులు హాజరయ్యారు.
Advertisement
Advertisement