
న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ (ఎంఎస్ఐఎల్) సరికొత్త మైలురాయిని అధిగమించింది. గురుగ్రామ్, మానెసర్ ప్లాంట్ల నుంచి ఉత్పత్తి అయిన వాహనాల సంఖ్య 2 కోట్లకు చేరుకున్నట్లు కంపెనీ ప్రకటించింది.1983 నుంచి ఉత్పత్తిని కొనసాగిస్తున్న ఈ సంస్థ 34 ఏళ్ల 6 నెలలకాలంలో ఈ ఘనతను సాధించినట్లు తెలిపింది.
ఇంతటి రికార్డును సాధించిన తొలి దేశీయ కంపెనీగా చరిత్ర సృష్టించినట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ – సీఈఓ కెనిచి అయుకవా వెల్లడించారు. ప్రస్తుతం 16 మోడ ల్ కార్లను కంపెనీ ఉత్పత్తి చేస్తోంది. ప్రపంచవ్యాప్తం గా 100 దేశాలకు ఎగుమతులు కొనసాగిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment