Maruti Suzuki India
-
మారుతీ సుజుకీ నుంచి చిన్న ఈవీ!
న్యూఢిల్లీ: పరిమాణం, మార్కెట్ వాటాలో భారత్లో అతిపెద్ద కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ) విభాగంపై దృష్టి సారిస్తోంది. దేశీయ ఈవీ మార్కెట్లో కంపెనీ ఎంట్రీ కాస్త ఆలస్యం అయిన సంగతి తెలిసిందే. ‘ఈవీ మార్కెట్ను అధ్యయనం చేస్తున్నాం. మా పోటీదారుల ఉత్పత్తులు ఎలా పనిచేశాయో చూశాం. భారతీయ మార్కెట్కు ఏమి అవసరమో మాకు తెలుసు. అంతర్జాతీయంగా సుజుకీ కార్పొరేషన్కు ఎలక్ట్రిక్ వెహికిల్స్తోపాటు ఇతర అన్ని మోడళ్లకు ఉత్పత్తి కేంద్రంగా భారత్ ఉంటుంది. ఉత్పత్తిలో దాదాపు 50 శాతం జపాన్, యూరప్కు ఎగుమతి చేస్తాం’ అని సుజుకీ మోటార్ కార్పొరేషన్ ప్రెసిడెంట్, రిప్రజెంటేటివ్ డైరెక్టర్ తొషిహిరో సుజుకీ గురువారం వెల్లడించారు. భారత్ మొబిలిటీ ఎక్స్పో నేటి (జనవరి 17) నుంచి ప్రారంభం అవుతున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. చిన్న ఎలక్ట్రిక్ కార్లు.. ఎస్యూవీలపై ప్రధానంగా దృష్టి సారిస్తూ భారత ప్యాసింజర్ వాహన మార్కెట్లో 50 శాతం మార్కెట్ వాటాను.. అలాగే ఈవీ విపణిలో అగ్రశ్రేణి వాటాను పొందాలని చూస్తున్నట్లు తొషిహిరో సుజుకీ వెల్లడించారు. ఎస్యూవీలను కస్టమర్లు డిమాండ్ చేస్తున్నందున భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఈ–విటారాతో ఈవీ ప్రయాణం ప్రారంభం అవుతుందని ఆయన చెప్పారు. వినియోగానికి కాంపాక్ట్ ఈవీలు ఉత్తమంగా సరిపోతాయని సుజుకీ అన్నారు. ఈవీ విభాగంలో కంపెనీ నుంచి తదుపరి మోడల్ చిన్న కారు వచ్చే అవకాశం ఉందని ఆయన మాటలనుబట్టి సుస్పష్టం అవుతోంది. కస్టమర్ అవసరాలను అధ్యయనం చేస్తున్నామని, ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ కార్లు ట్యాంక్ ఇంధనంతో దాదాపు 500 కిలోమీటర్ల పరిధిని ఇస్తాయని సుజుకీ తెలిపారు. ఈ దూరాన్ని ఆచరణ సాధ్యం చేయడానికి ఈ–విటారాను సన్నద్ధం చేస్తున్నట్టు చెప్పారు. భారత్ మండపం వేదికగా ఈ–విటారాను కంపెనీ శుక్రవారం (నేడు) ఆవిష్కరిస్తోంది. టాటా నెక్సాన్ ఈవీతో పాటు హ్యుండై క్రెటా ఎలక్ట్రిక్, ఎంజీ జడ్ఎస్ ఈవీలకు ఈ–విటారా పోటీ ఇవ్వనుంది. ఇంకా డిమాండ్ ఉంది.. అమ్మకాలు క్షీణిస్తున్నప్పటికీ భారత్లో చిన్న కార్లు నిలిచిపోవని సుజుకీ అన్నారు. ‘సుజుకీ కార్పొరేషన్ అనుబంధ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా భారత్లో మార్కెట్ లీడర్గా ఉంది. ద్విచక్ర వాహనాల నుండి నాలుగు చక్రాల వాహనాలకు అప్గ్రేడ్ అయ్యే అవకాశం ఉన్న 100 కోట్ల మంది ప్రజలకు భవిష్యత్తులో ఇంకా సరసమైన చిన్న కార్లు అవసరం అని విశ్వసిస్తున్నాం. ఈ–విటారా పట్ల కస్టమర్ల నుండి అభిప్రాయాన్ని, ప్రతిస్పందనను అర్థం చేసుకుంటాం. ఆ తర్వాతే చిన్న ఎలక్ట్రిక్ కార్ల ప్రణాళికలతో ముందుకు సాగుతాం’ అని వివరించారు. కాగా, మారుతీ సుజుకీ ఇండియా 2024లో 3.24 లక్షల యూనిట్లను ఎగుమతి చేసింది. ఇప్పటి వరకు ఇదే అత్యధికం. ఎలక్ట్రిక్ యాక్సెస్ సైతం.. సుజుకీ మోటార్సైకిల్ ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ–యాక్సెస్ను భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో సందర్భంగా ఆవిష్కరిస్తోంది. సుజుకీ ఇప్పటికే భారత్లో పెట్రోల్ వర్షన్ యాక్సెస్–125 విక్రయిస్తోంది. భారతీయుడు కూడా సుజుకీ మోటార్ ప్రెసిడెంట్ కావచ్చు..మారుతీ సుజుకీ ఇండియా ఎండీ, సీఈవో ఎవరైనా కావొచ్చని, ఇక్కడ జాతీయత ఒక అంశం కాదని తొషిహిరో సుజుకీ అన్నారు. భారతీయుడు కూడా సుజుకీ మోటార్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ పదవి చేపట్టవచ్చని స్పష్టం చేశారు. తన తండ్రి దివంగత ఒసాము సుజుకీ 40 సంవత్సరాల క్రితం భారత్ వచ్చారని, ఈ మార్కెట్ యొక్క అసలైన సామర్థ్యాన్ని ఎవరూ ఊహించలేదని వివరించారు. అయినప్పటికీ భారతదేశం మరియు ఇక్కడి ప్రజలపై ఆయనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. నేడు భారతీయ ఆటోమోటివ్ పరిశ్రమ ప్రపంచంలో మూడవ అతిపెద్ద మార్కెట్గా అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. 2003లో లిస్టింగ్ అయినప్పటి నుండి మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్ అలాగే ఎండీ, సీఈవో పదవులను భారతీయ, జపాన్ ఎగ్జిక్యూటివ్లు అలంకరిస్తున్నారు. -
మారుతీ సుజుకీ కార్ల ఉత్పత్తి 16% డౌన్
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా గతేడాది అక్టోబర్తో పోలిస్తే ఈ ఏడాది అక్టోబర్లో ప్యాసింజర్ కార్ల ఉత్పత్తిని 16 శాతం తగ్గించింది. అయితే, యుటిలిటీ వాహనాల ఉత్పత్తిని 33 శాతం పెంచింది. అక్టోబర్లో ప్యాసింజర్ కార్ల ఉత్పత్తి 1,06,190 యూనిట్ల నుంచి 89,174 యూనిట్లకు తగ్గినట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు కంపెనీ తెలిపింది. మరోవైపు, బ్రెజా, ఎర్టిగా, ఫ్రాంక్స్, జిమ్నీ, ఎక్స్ఎల్6 వంటి యుటిలిటీ వాహనాలతో పాటు టయోటా కిర్లోస్కర్ మోటర్స్కి సఫరా చేసే వాహనాల ఉత్పత్తిని 54,316 యూనిట్ల నుంచి 72,339 యూనిట్లకు పెంచినట్లు పేర్కొంది. మినీ కార్లు అయిన ఆల్టో, ఎస్–ప్రెసో మొదలైన వాటి ఉత్పత్తి 14,073 యూనిట్ల నుంచి 12,787 యూనిట్లకు తగ్గింది. అటు బాలెనో, సెలీరియో, డిజైర్, ఇగి్నస్, స్విఫ్ట్, వ్యాగన్ఆర్తో పాటు టయోటా కిర్లోస్కర్ మోటర్స్కి కూడా సరఫరా చేసే కాంపాక్ట్ కార్ల ఉత్పత్తి 90,783 నుంచి 75,007 యూనిట్లకు తగ్గింది. -
జీఎస్టీ హీట్: దేశీయ అతిపెద్ద కార్ల కంపెనీకి షోకాజ్నోటీసులు
ఆన్లైన్ గేమింగ్ కంపెనీలు, బీమా , తదితర కంపెనీలు షోకాజ్ నోటీసుల తరువాత తాజాగా ఆటోమొబైల్ మేజర్ మారుతీ సుజుకి ఇండియాకి జీఎస్టీ షాక్ తగిలింది. వడ్డీ , పెనాల్టీలతో పాటు రివర్స్ ఛార్జ్ ప్రాతిపదికన నిర్దిష్ట సేవలపై పన్ను బాధ్యతకు సంబంధించి రూ. 139.3 కోట్లు చెల్లించాలంటూ జీఎస్టీ అధికారులు కంపెనీకి షోకాజ్ నోటిసులు పంపించారు. అయితే దీనిపై స్పందించిన మారుతి ఇప్పటికే చెల్లించిన పన్నుకు, 2017 జూలై -2022 ఆగస్టు వరకు నిర్దిష్ట సేవలపై రివర్స్ ఛార్జ్ విషయానికి సంబంధించిన నోటీసు అని కంపెనీ తెలిపింది. "అడ్జుడికేటింగ్ అథారిటీ ముందు షోకాజ్ నోటీసుకు తమ జవాబును ఫైల్ చేయనున్నామని, అలాగే ఈ నోటీసు తమ ఆర్థిక, కార్యకలాపాలు లేదా ఇతర కార్యకలాపాలపై ఎటువంటి ప్రభావం ఉండదని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్ సమాచారాన్ని అందించింది. అలాగే 2006 జూన్ నుండి మార్చి 2011 మధ్య కాలంలో సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దాఖలు చేసిన అప్పీళ్లు కొట్టివేస్తూ పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు నుండి తమకు అనుకూలమైన ఉత్తర్వు లభించిందని కంపెనీ తెలిపింది. దీనిపై జరిమానాను కూడా కోర్టు తొలగించినట్టు వెల్లడించింది. డిపార్ట్మెంట్ అప్పీల్లో పెనాల్టీ తోకలిపి మొత్తం పన్ను రూ. 57.2 కోట్లు. కాగా మారుతీ ఈ ఏడాది ఆగస్టు అత్యధిక నెలవారీ అమ్మకాల్లో1,89,082 యూనిట్లతో కీలక మైలురాయిని సాధించింది. వివిధ సబ్-సెగ్మెంట్ మోడల్లతో సహా దేశీయ విక్రయాలలో 1,58,678 యూనిట్లను నమోదు చేసింది. తన మొత్తం లైనప్లో పూర్తి స్వదేశీకరణ లక్ష్యంగా పెట్టుకుంది. ప్యాసింజర్ వెహికల్ (PV) మార్కెట్ లీడర్గా ఉన్న మారుతి ఇప్పటికీ కొన్ని కీలకమైన భాగాలు, ముఖ్యంగా సెమీకండక్టర్ చిప్ల దిగుమతులపై ఆధారపడి ఉన్నప్పటికీ, దేశీయ ఎలక్ట్రానిక్స్ తయారీపై పట్టు సాధిస్తే,విదేశీ మార్కెట్లపై ఆధారపడటాన్ని తగ్గించుకోవచ్చని కంపెనీ విశ్వసిస్తోంది. -
పండుగల సీజన్లో కార్ల జోరు
న్యూఢిల్లీ: ఈ ఏడాది పండుగల సీజన్లో రికార్డు స్థాయిలో అమ్మకాలు ఉంటాయని మారుతీ సుజుకీ ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా అంచనా వేస్తున్నాయి. పరిశ్రమ వార్షిక అమ్మకాల్లో పండుగల సీజన్ వాటా సగటున 23–26 శాతంగా ఉందని మారుతీ సుజుకీ ఇండియా మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ మంగళవారం జరిగిన సియామ్ సదస్సులో తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా అన్ని కంపెనీలవి కలిపి 40.5–41 లక్షల యూనిట్లు అమ్ముడవుతాయని చెప్పారు. ఇందులో పండుగల సీజన్ వాటా 10 లక్షల యూనిట్లు ఉంటుందన్నారు. ప్యాసింజర్ వెహికిల్స్ పరిశ్రమ తొలిసారిగా 10 లక్షల యూనిట్ల మార్కును చేరుకుంటుందని వెల్లడించారు. ఇప్పటి వరకు దేశంలో 2021లో అత్యధికంగా పండుగల సీజన్లో 9.34 లక్షల యూనిట్లు నమోదయ్యాయని వివరించారు. ఆ రెండూ జరగకపోతేనే.. ఓనమ్ విక్రయాల్లో 24 శాతం వృద్ధి సాధించామని శ్రీవాస్తవ పేర్కొన్నారు. గతేడాది 3.55 లక్షల యూనిట్లతో పోలిస్తే 2023 సెపె్టంబరులో 3.61 లక్షల యూనిట్ల హోల్సేల్ అమ్మకాలు ఆశిస్తున్నట్టు చెప్పారు. గ్రామీణ సెంటిమెంట్ను ప్రభావితం చేసే అధిక వడ్డీ రేట్లు, రుతుపవనాల లోటు వృద్ధికి అడ్డుకట్ట అని తెలిపారు. ఇవి రెండూ జరగకపోతే ఉపశమనం లభిస్తుందని అన్నారు. ‘వడ్డీ రేట్లు పెరగకూడదు. ఆహార ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంటే అవి పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం మైనస్ 8 శాతంగా నమోదవుతున్న వర్షపాతం కారణంగా గ్రామీణుల మనోభావాలు దెబ్బతినకూడదు’ అని ఆయన పేర్కొన్నారు. హుందాయ్ వృద్ధి 9 శాతం.. గతేడాదితో పోలిస్తే పండుగల సీజన్లో 9 శాతం వృద్ధి ఆశిస్తున్నట్టు హుందాయ్ మోటార్ ఇండియా సీవోవో తరుణ్ గర్గ్ తెలిపారు. ఈ ఏడాది అర్ధ భాగం విక్రయాల్లో ఎస్యూవీల వాటా 54 శాతం నమోదైందన్నారు. ఎక్స్టర్ రాకతో జూలై, ఆగస్ట్లో ఇది 64 శాతానికి ఎగసిందని చెప్పారు. వెయిటింగ్ పీరియడ్ తగ్గిందని, తద్వారా సమయానికి డెలివరీలు అందించేందుకు వీలవుతోందని చెప్పారు. బలమైన తాజా డిమాండ్ రాబోయే కాలానికి మంచి సూచిక అన్నారు. పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయని వివరించారు. -
ఫెస్టివల్ సీజన్ వచ్చేస్తోంది...సూపర్ అప్కమింగ్ కార్లు
TopUpcomingCars: పండుగల సీజన్ సమీపిస్తున్నతరుణంలో భారత మార్కెట్లోకి కొత్త కార్లు హల్చల్ చేస్తున్నాయి. వినాయక చవితి దసరా, దీపావళి రోజుల్లో కొత్త వాహనాలను కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. పండుగల సీజన్ కార్ల డిమాండ్ నేపథ్యంలో అనేక కంపెనీలు అత్యాధునిక ఫీచర్లు, బడ్జెట్, ఈవీ కార్లు ఇలా రకరకాల సెగ్మెంట్లలో కార్లను లాంచ్ చేస్తుంటారు. ఒకవేళ మీరు కూడా ఈ పండుగ సీజన్లో కొత్త కారును కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే, రానున్న రాబోయే మోడళ్ల కార్లను ఓసారి చూద్దాం! Maruti suzuki invicto మారుతి సుజుకి ఇండియా తన లీడర్ మోడల్ - మారుతి సుజుకి ఇన్విక్టో ఎమ్పివిని జీటా ఆల్ఫా అనే రెండు వేరియేషన్లలో అందుబాటులో ఉంది. మారుతి ఇన్విక్టో ఎలక్ట్రిక్ ఇంజిన్తో సరిపోలిన 2.0-లీటర్ పెట్రోల్ మోటారును పొందుతుంది. ఎలక్ట్రిక్ మోటార్ 11 బిహెచ్పి ,206 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది, ఐసిఇ వెర్షన్ 172 బిహెచ్పి మరియు 188 ఎన్ఎమ్ టార్క్ను కలిగి ఉంది. ధర రూ. రూ. 24.79 లక్షలు 28.42 లక్షలు (ఎక్స్ షోరూం) Honda Elevate హోండా ఎలివేట్ వచ్చే నెల ( సెప్టెంబరు) లో దేశంలో సేల్ కు రానుంది.హోండా ఎలివేట్ 1.5L NA పెట్రోల్ ఇంజన్తో 6-స్పీడ్ MT , CVT అనే రెండు ట్రాన్స్మిషన్ ఆప్షన్స్లో లభ్యం. దీని ధర రూ. 10.50-17 లక్షలు ఉంటుందని అంచనా. ఇది హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైడర్, వోక్స్వ్యాగన్ టైగన్, స్కోడా కుషాక్, MG ఆస్టర్ లాంటివాటికి గట్టి పోటీగా ఉండనుంది. Citroen C3 Aircross సిట్రోయెన్ సీ3 ఎయిర్క్రాస్: 7-సీటర్ SUVని కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే, సిట్రోయెన్ C3 ఎయిర్క్రాస్ బెస్ట్ ఆప్షన్. బోల్డ్ స్టైలింగ్తో, బెస్ట్ ఇంటీరియర్తో వస్తోంది. అయితే ఇది 1.2L టర్బో-పెట్రోల్ కేవలం ఒక ఇంజన్ ఎంపిక మాత్రమే లభ్యం. దీని ధర రూ. 9-13 లక్షలు ఉంటుందని అంచనా. Toyota Rumion మరో 7-సీటర్ కారు టయోటా రూమియన్. ఈమధ్యనే లాంచ్ అయినా ఈ కారు త్వరలోనే కొనుగోలుకు అందుబాటులోకి రానుంది. విజువల్ ఫ్రంట్లో కొన్ని మార్పులను కలిగి ఉంది. అలాగే రేడియేటర్ గ్రిల్ సవరించిన బంపర్తో కొత్తగానూ, అల్లాయ్ వీల్స్ కూడా తాజా డిజైన్ను కలిగి ఉన్నాయి. టయోటా లోగో మినహా లోపలి భాగంలో అంతా సేమ్. Tata Punch EV SUV టాటా పంచ్ ఈవీ టియాగో ఈవీ తరహాలో ఇదే ఆర్కిటెక్చర్తో పంచ్ ఈవీని విడుదల చేయడానికి టాటా మోటార్స్ సన్నాహాలు చేస్తోంది. ఇది జిప్ట్రాన్ సాంకేతికతతో బానెట్ కింద ఉంచబడిన ఎలక్ట్రిక్ మోటారుతో వస్తోంది. 350 కిమీల పరిధితో లాంచ్ కానుంది. దీని ధర రూ. 9-12 లక్షలు ఉంటుందని అంచనా. Tata Nexon facelift ప్రమోషనల్ షూట్లో అందరి దృష్టినీ ఆకర్షించిన టాటా నెక్సాన్ ఫేస్లిఫ్ట్ ఇండియన్ మార్కెట్లో అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఈ సంవత్సరం చివరి నాటికి ఇది మార్కెట్లోకి వస్తుందని తొలుత అనుకున్నప్పటికీ పండుగ సీజన్లోనే దాదాపు అక్టోబరులోనే దీన్ని లాంచ్ చేస్తుందని తాజా అంచనా.దీని ధర రూ. 8-15 లక్షలు ఉంటుందని అంచనా. Volvo C40 Recharge వోల్వో సీ40 రీఛార్జ్ (VolvoC40) XC40 రీఛార్జ్ SUV-కూపే వెర్షన్. మెరుగు పర్చిన 78kWh బ్యాటరీ ప్యాక్తో,530కిమీ పరిధిని అందిస్తుంది. 408PSతో డ్యూయల్-మోటార్ AWD కారణంగా 4.7 సెకన్లలో 100kmph వరకు దూసుకెళ్తుంది. అంచనా ధర రూ. 60 లక్షలు (ఎక్స్-షోరూమ్) సెప్టెంబరు 4న లాంచింగ్ -
నెక్సా కస్టమర్లు 20 లక్షలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నెక్సా రిటైల్ చైన్ల ద్వారా ఇప్పటి వరకు 20 లక్షల కార్లు రోడ్డెక్కాయని మారుతీ సుజుకీ ఇండియా ప్రకటించింది. ప్రీమియం కార్ల విక్రయాల కోసం 2015లో నెక్సా కేంద్రాలను కంపెనీ ప్రారంభించింది. బలేనో, ఇగ్నిస్, సియాజ్, ఎక్స్ఎల్6, గ్రాండ్ వితారా మోడళ్లు ఇక్కడ కొలువుదీరాయి. త్వరలో మార్కెట్లోకి రానున్న ఎస్యూవీలు ఫ్రాంక్స్, జిమ్నీ సైతం వీటి సరసన చేరనున్నాయి. ఇతర మోడళ్లను అరీనా ఔట్లెట్ల ద్వారా విక్రయిస్తున్నారు. హ్యుండై, టాటా మోటార్స్ విక్రయాల కంటే నెక్సా కేంద్రాల ద్వారా వచ్చే ఏడాది అధిక యూనిట్లను నమోదు చేయాలన్నది లక్ష్యమని కంపెనీ మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. రెండవ స్థానం దిశగా.. తొలి 10 లక్షల యూనిట్లకు నాలుగేళ్లు, ఆ తర్వాతి 10 లక్షల యూనిట్లకు మూడేళ్ల సమయం పట్టిందని శశాంక్ వెల్లడించారు. ‘ప్రస్తుతం మారుతీ సుజుకీ అరీనా, హ్యుండై, టాటా మోటార్స్ తర్వాత నెక్సా నాల్గవ స్థానంలో ఉంది. వచ్చే ఏడాది రెండవ స్థానానికి చేరుతుంది. సంస్థ మొత్తం విక్రయాల్లో 47 శాతం వృద్ధితో నెక్సా వాటా 23 శాతం ఉంది. దేశీయ ప్యాసింజర్ కార్ల రంగంలో నెక్సా 10 శాతం వాటా కైవసం చేసుకుంది. ఈ ఔట్లెట్ల ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో 2.55 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. 2022–23లో 3.7 లక్షల యూనిట్లు ఆశిస్తున్నాం. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కొత్త మోడళ్లు, గ్రాండ్ వితారా కారణంగా నెక్సా నుంచి 6 లక్షల యూనిట్ల మార్కును చేరుకుంటాం’ అని వివరించారు. పరిశ్రమ కంటే మెరుగ్గా.. 2023–24లో ప్యాసింజర్ వాహన పరిశ్రమ వృద్ధి 5–7.5 శాతం ఆశిస్తున్నామని శశాంక్ తెలిపారు. ‘పరిశ్రమలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 38.9 లక్షల యూనిట్లు, 2023–24లో 41 లక్షల యూనిట్ల అమ్మకాలు నమోదు కావొచ్చు. ఆర్థిక వృద్ధి, రుతుపవనాల సరళి, గ్రామీణ మార్కెట్పై దాని ప్రభావం, వడ్డీ రేట్ల పెరుగుదల, నగదు లభ్యత స్థాయిలు, పరిస్థితులకు తగ్గట్టుగా వాహన తయారీ కంపెనీలు చేపట్టిన ధరల పెంపు వంటి అంశాల ఆధారంగా ఈ వృద్ధి ఆధారపడి ఉంటుంది. పరిశ్రమ కంటే మెరుగైన వృద్ధిని మారుతీ సుజుకీ ఆశిస్తోంది’ అని పేర్కొన్నారు. -
టాటా, మారుతి, హ్యుందాయ్: కారు ఏదైనా ఆఫర్ మాత్రం భారీగానే!
సాక్షి, ముంబై: ఆటోమొబైల్ దిగ్గజాలు మారుతీ సుజుకి ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా , టాటా కంపెనీలు తమ పలు మోడళ్ల కార్లపై మార్చి మాసంలో భారీ తగ్గింపు లభిస్తోంది. కొత్త కారు కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఇది చక్కటి అవకాశం. మారుతి, హ్యుందాయ్, టాటా కార్లపై ప్రస్తుతం లభిస్తున్న తగ్గింపు వివరాలను చూద్దాం. (రూ. 32 వేల బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ఫోన్ కేవలం రూ. 1,999కే ) మారుతి కార్లపై డిస్కౌంట్లు మార్చిలో రూ. 52వేల వరకు తగ్గింపుతో మారుతి సుజుకి ఇగ్నిస్ను కొనుగోలు చేయవచ్చు. అలాగే మారుతి సియాజ్పై రూ. 28 వేల వరకు తగ్గింపు లభ్యం. ఇక పాపులర్ కారు ఆల్టోపై రూ. 38వేలు, ఆల్టో కె10, ఎస్-ప్రెస్సోపై రూ. 49వేలు , వ్యాగన్ఆర్ కారు కొనుగోలుపై రూ. 64వేల డిస్కౌంట్ అందిస్తోంది. ఇంకా స్విఫ్ట్ రూ. 54వేల దాకా, డిజైర్ మోడల్ కొనుగోలుపై రూ. 10 వేల వరకు తగ్గింపును పొందవచ్చు. (ఐటీ మేజర్ను నడిపించిన ఈ ధీర వనితల్ని గుర్తుపట్టారా? వీరే లేకపోతే..!) అయితే మారుతి సుజుకి బాలెనో, బ్రెజ్జా, గ్రాండ్ విటారా వంటి మోడళ్లపై ఎలాంటి తగ్గింపు లేదు. హ్యుందాయ్ కార్లపై డిస్కౌంట్లు మార్చిలో గ్రాండ్ ఐ10 నియోస్, ఐ20, ఆరా వంటి మోడళ్లపై హ్యుందాయ్ డిస్కౌంట్లనుఅందిస్తోంది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ రూ.38 వేలు దాకా, పాపులర్ ఐ20పై రూ. 20 వేలు, హ్యుందాయ్ ఆరాపై రూ.33 వేల వరకు తగ్గింపును పొందవచ్చు. అయితే, క్రెటా, వెన్యూ, అల్కాజార్ , టక్సన్ వంటి SUV మోడళ్లపై ఎలాంటి తగ్గింపు లేదు. టాటా కార్లపై డిస్కౌంట్లు అత్యధికంగా అమ్ముడైన టాటా ప్యాసింజర్ వాహనం టాటా నెక్సాన్ మార్చిలో రూ. 3,000 కార్పొరేట్ తగ్గింపు ఉంది. టాటా హారియర్ ,టాటా సఫారిపై రూ.45వేల రకు తగ్గింపు ఉంది. దీంతోపాటు టాటా టియాగోపై సుమారు రూ. 28వేలు, టాటా టిగోర్పై రూ. 30వేల వరకు తగ్గింపు ఉంది. టాటా ఆల్ట్రోజ్ రూ. 28 వేల దాకా తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. -
ఈకో 10 లక్షల యూనిట్ల మార్కు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఈకో వ్యాన్ సరికొత్త రికార్డు నమోదు చేసింది. తాజాగా 10 లక్షల యూనిట్ల అమ్మకాల మైలురాయిని చేరుకుంది. 2010లో భారత మార్కెట్లోకి ఈకో ప్రవేశించింది. 5, 7 సీట్లు, కార్గో, టూర్, అంబులెన్స్ వంటి 13 వేరియంట్లలో ఇది లభిస్తుంది. వ్యాన్స్ విభాగంలో 94 శాతం వాటా ఈకో కైవసం చేసుకుందని మారుతీ సుజుకీ ఇండియా మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. తొలి 5 లక్షల యూనిట్లకు ఎనమిదేళ్లు పట్టింది. మిగిలిన 5 లక్షల యూనిట్ల విక్రయాలు అయిదేళ్లలోపే పూర్తి చేశామన్నారు. 1.2 లీటర్ అడ్వాన్స్డ్ కె–సిరీస్ డ్యూయల్ జెట్, డ్యూయల్ వీవీటీ ఇంజన్తో ఈకో రూపుదిద్దుకుంది. మైలేజీ పెట్రోల్ వేరియంట్ లీటరుకు 20.2 కిలోమీటర్లు, ఎస్–సీఎన్జీ వేరియంట్ కేజీకి 27.05 కిలోమీటర్లు ఇస్తుందని కంపెనీ తెలిపింది. -
ఎస్యూవీలపై మారుతీ సుజుకీ గురి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్ (ఎస్యూవీ) విభాగంపై దృష్టిసారించింది. ఈ సెగ్మెంట్లో 2023–24లో 33 శాతం వాటా చేజిక్కించుకోవడం ద్వారా తొలి స్థానాన్ని కైవసం చేసుకోవాలని లక్ష్యంగా చేసుకుంది. ప్రస్తుతం బ్రెజ్జా, గ్రాండ్ వితారా ఎస్యూవీలను కంపెనీ విక్రయిస్తోంది. మార్చి నుంచి జిమ్నీ, ఫ్రాంక్స్ మోడళ్లు రోడ్డెక్కనున్నాయి. జిమ్నీ ఇప్పటికే 17,500 యూనిట్లు, ఫ్రాంక్స్ 8,500 యూనిట్ల బుకింగ్స్ను కైవసం చేసుకోవడం విశేషం. భారత ప్యాసింజర్ వాహన రంగంలో స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్ వాటా 42.5 శాతం ఉంది. 2022–23లో ఇది 45 శాతానికి చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఈ విభాగంలో మారుతీ సుజుకీ వాటా 11.5 శాతం. మొత్తం ప్యాసింజర్ వాహన పరిశ్రమలో సంస్థకు ఏకంగా 45 శాతం వాటా ఉంది. దీనిని 50 శాతానికి పెంచుకోవాలని కంపెనీ కృతనిశ్చయంతో ఉంది. 2023 జనవరిలో ఎస్యూవీల విపణిలో మారుతీ సుజుకీ 15 శాతం వాటా దక్కించుకుంది. స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్ విభాగంలో 2021–22లో టాటా మోటార్స్కు 18 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రాకు 15 శాతం వాటా ఉన్నట్టు సమాచారం. -
అదరగొట్టిన మారుతి:అమ్మకాల జోష్ మామూలుగా లేదుగా!
సాక్షి,ముంబై: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి క్యూ3 ఫలితాల్లో అదరగొట్టింది. నికర లాభం రెట్టింపు కంటే ఎక్కువలాభాలను నమోదు చేసింది. అలాగే ఆదాయం కూడా 25 శాతం ఎగిసింది. EBIT మార్జిన్ కూడా 350 బేసిస్ పాయింట్లు మెరుగుపడి 7.6 శాతానికి చేరుకుంది. లాభాల మార్జిన్ 380 బేసిస్ పాయింట్లు మెరుగుపడి 8.4 శాతంగా ఉంది. ప్యాసింజర్, హై ఎండ్ కార్ల బలమైన డిమాండ్, ఇటీవలి కాలంలో ధరల పెంపు నేపథ్యంలో మారుతీ గణనీయ లాభాలను సాధించింది. త్రైమాసిక ఏకీకృత నికర లాభంలో ఊహించిన దానికంటే మెరుగ్గా 129.55 శాతం జంప్ చేసింది. గత ఏడాదితో రూ.1,041.8 కోట్లతో పోలిస్తే, రూ.2,391.5 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. కార్యకలాపాల ద్వారా వచ్చిన మొత్తం ఆదాయం రూ. 29,057.5 కోట్లను సాధించింది. గత ఏడాది 23,253.3 కోట్ల వార్షిక ప్రాతిపదికన 24.96 శాతం పెరిగింది. జోరందుకున్న అమ్మకాలు, ముడి సరుకు ధర తగ్గడంతో లాభాల్లో పెరుగుదల నమోదైందని కంపెనీ తెలిపింది. ఈ త్రైమాసికంలో మొత్తం 465,911 వాహనాలను విక్రయించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో 430,668 యూనిట్లు విక్రయించింది. దేశీయ అమ్మకాలు 403,929 యూనిట్లు కాగా, ఎగుమతులు 61,982 యూనిట్లు. ఎలక్ట్రానిక్ విడిభాగాల కొరత ఈ త్రైమాసికంలో సుమారు 46,000 వాహనాల ఉత్పత్తిపై ప్రభావం చూపింది. ఇది మొత్తం 430,668 యూనిట్ల విక్రయాలకు వ్యతిరేకంగా ఉంది. అంతకుముందు సంవత్సరం ఇదే కాలంలో దేశీయంగా 365,673 యూనిట్లు , ఎగుమతి మార్కెట్లలో 64,995 యూనిట్లు ఉన్నాయని మారుతి రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొంది. ఈ త్రైమాసికంలో కంపెనీ రూ.27,849.2 కోట్ల నికర విక్రయాలను నమోదు చేసింది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో నికర విక్రయాలు రూ.22,187.6 కోట్లుగా ఉన్నాయి. అలాగే మారుతీ సుజుకి 2022 ఏప్రిల్ నుండి డిసెంబర్ మధ్య కాలంలో అత్యధికంగా రూ. 81,679 కోట్ల నికర అమ్మకాలను నమోదు చేసింది, ఇది గత ఏడాది ఇదే కాలంలో రూ. 58,284.1 కోట్లుగా ఉంది. ఎఫ్వై22 మొదటి తొమ్మిది నెలల్లో రూ.1,927.4 కోట్ల నుంచి ఏడాది మొదటి తొమ్మిది నెలల నికర లాభం రూ.5,425.6 కోట్లకు పెరిగింది. -
మారుతి కస్టమర్లకు మరోషాక్, 11 వేల కార్లు రీకాల్
సాక్షి,ముంబై: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మరోసారి తన కస్టమర్లకు షాకింగ్ న్యూస్ చెప్పింది. తన పాపులర్ మోడల్ గ్రాండ్ విటారా 11,177 కార్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కార్లలో రేర్ సీట్ బెల్ట్ మౌంటింగ్ బ్రాకెట్స్ సమస్య కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. గత ఏడాది ఆగస్టు ఎనిమిది నుంచి నవంబర్ 15 వరకు తయారైన గ్రాండ్ విటారా కార్లను రీకాల్ చేస్తున్నట్లు వెల్లడించింది. రేర్ సీట్ బెల్ట్ మౌంటింగ్ బ్రాకెట్లలో సమస్య తలెత్తింది. దూర ప్రాంతాలకు వెళ్లినప్పుడు రేర్ సీట్ బెల్ట్ లూజ్ అయ్యే అవకాశం ఉందని, దానివల్ల పనితీరు దెబ్బ తింటుందని మారుతి తెలిపింది. గత ఆగస్టు – నవంబర్ మధ్య తయారైన గ్రాండ్ విటారా కార్లు కొనుగోలు చేసిన వినియోగదారులకు తమ డీలర్ల ద్వారా సమాచారం అందుతుందని తెలిపింది. దెబ్బ తిన్న విడి భాగాలను ఉచితంగా రీ ప్లేస్ చేస్తామని మారుతి ప్రకటించింది. కాగా ఎయిర్బ్యాగ్ లోపం కారణంగా వివిధ మోడళ్లకు చెందిన 17,362 కార్లు ఇటీవల మారుతి రీకాల్ చేసింది. ముఖ్యంగా ఆల్టో కే10, ఎస్-ప్రెస్సో, ఈకో, బ్రెజా, బాలెనో, గ్రాండ్ విటారా మోడల్ కార్లు ఉన్న సంగతి తెలిసిందే. -
మారుతి కార్లలో లోపాలు: రీప్లేస్ చేసేదాకా దయచేసి వాడకండి!
సాక్షి, ముంబై: భారతదేశపు అగ్రశ్రేణి కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ తన కస్టమర్లకు షాకింగ్ న్యూస్ చెప్పింది. పలు మోడళ్ల కార్లలో ఎయిర్బ్యాగ్ కంట్రోలర్లలో లోపం కారణంగా వేల కార్లను రీకాల్ చేస్తున్నట్టు ప్రకటించింది. డిసెంబర్ 2022 డిసెంబరు 8, 2023 జనవరి 12 మధ్య తయారు చేసిన 17,362 వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు మారుతి బుధవారం తెలిపింది.ఆల్టో కె10, ఎస్-ప్రెస్సో, ఈకో, బ్రెజ్జా, బాలెనో , గ్రాండ్ విటారా వంటి మోడళ్లు ప్రభావితమైనట్లు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. ఎయిర్బ్యాగ్ కంట్రోలర్లో లోపం కారణంగా 17,362 వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ ఈరోజు విడుదల చేసింది. ఈ వాహనాల్లో అవసరమైతే ఎయిర్బ్యాగ్ కంట్రోలర్ను ఉచితంగా తనిఖీ చేసి భర్తీ చేసేందుకు గాను ఈ రీకాల్ చేపట్టినట్టు వెల్లడించింది. ఈ లోపం కారణంగా వాహనం క్రాష్ అయినప్పుడు ఎయిర్బ్యాగ్లు, సీట్ బెల్ట్ ప్రిటెన్షనర్లు చాలా అరుదుగా పనిచేయకపోవచ్చని తెలిపింది. ప్రభావితమైన భాగాన్ని మార్చే వరకు వాహనాన్ని నడపవద్దని లేదా ఉపయోగించవద్దని వినియోగదారులకు సూచించింది. సంబంధిత కార్ ఓనర్లకు తక్షణమే మారుతి సుజుకి అధీకృత వర్క్షాప్ల నుంచి సమాచారం వస్తుందని పేర్కొంది. కాగా గత డిసెంబరులో సియాజ్, బ్రెజ్జా, ఎర్టిగా,ఎక్స్ఎల్ 6, గ్రాండ్ విటారా మోడల్స్ 9,125 యూనిట్లను ఫ్రంట్లైన్ సీట్ బెల్ట్లలోని లోపాలను సరిచేయడానికి రీకాల్ చేసింది. -
మారుతి లవర్స్కు అలర్ట్, కొత్త కారు కొనాలంటే..!
సాక్షి, ముంబై: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ దారు మారుతి సుజుకి తన వినియోగదారులకు షాక్ ఇచ్చింది. వచ్చే ఏడాది ఆరంభంలో కార్ల ధరలు పెంచక తప్పదని 2021, డిసెంబరులో ప్రకటించిన మారుతీ సుజుకి ఇండియా జనవరి 16 నుంచి కార్ల ధరల పెంపు అమల్లోకి వస్తుందని రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది.వెల్లడించింది. దాదాపు అన్ని మోడళ్ల కార్లపై సగటు పెరుగుదల 1.1 శాతంగా ఉంటుందని తెలిపింది. కఠినమైన ఉద్గార నిబంధనలకు అనుగుణంగా అన్నో మోడళ్ల కార్లను అప్డేట్ చేయడం, ఉత్పత్తి ఖర్చులు పెరిగిన నేపథ్యంలో పెంపు తప్పడలం లేదని కంపెనీ తెలిపింది. ఢిల్లీలోని ఎక్స్-షోరూమ్ ధరలపై ఇది వర్తిస్తుందని ప్రకటించింది. దీంతో మారుతీ సుజుకీ లవర్స్ కారు కొనాలంటే మరింత ధర పడనుంది. మారుతి ఎంట్రీ-లెవల్ చిన్న కారు ఆల్టో నుండి SUV గ్రాండ్ విటారా వరకు రూ. 3.39 లక్షల నుండి రూ. 19.49 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) మధ్య వాహనాను విక్రయిస్తోంది. -
వాహన పరిశ్రమ వృద్ధికి విఘాతం
న్యూఢిల్లీ: చిన్నా, పెద్ద తేడా లేకుండా అన్ని కార్లకు ఒకే పన్ను రేటు వర్తింపచేయడం సరికాదని ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ చైర్మన్ ఆర్సీ భార్గవ వ్యాఖ్యానించారు. పరిశ్రమ వృద్ధికి ఇలాంటి ధోరణి మంచిది కాదని ఆయన చెప్పారు. దేశీ ఆటో పరిశ్రమలో కీలక విభాగమైన చిన్న కార్లపై అత్యధికంగా నియంత్రణ నిబంధనలపరమైన భారం ఉంటోందని భార్గవ తెలిపారు. తయారీ రంగం వేగంగా వృద్ధి చెందితే దేశ ఆర్థిక వృద్ది రేటు కూడా అధికంగా ఉంటుందని ఆయన చెప్పారు. కానీ దురదృష్టవశాత్తూ ప్రభుత్వం ఎంతగా కృషి చేస్తున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో విధానాలు పూర్తిగా అమలు కాకపోతుండటం వల్ల అలా జరగడం లేదని భార్గవ చెప్పారు. ‘పెద్ద కార్లతో పోలిస్తే చిన్న కార్లపై నియంత్రణపరమైన మార్పుల భారం చాలా ఎక్కువగా ఉంటోంది. ఇదే మొత్తం మార్కెట్ ధోరణులను మార్చేస్తోంది. ఇది కార్ల పరిశ్రమకు గానీ దేశానికి గానీ మంచిది కాదని భావిస్తున్నాను‘ అని ఆయన పేర్కొన్నారు. చిన్నా, పెద్ద కార్లకు ఒకే రకమైన పన్నును విధించడం సరికాదని ఆయన తెలిపారు. దాదాపు 50 శాతం స్థాయి పన్నుల భారంతో పరిశ్రమ వృద్ధిపై ప్రతికూల ప్రభావం పడుతోందని ఆయన తెలిపారు. ఏ దేశంలో కూడా ఇంత పన్నులతో ఆటోమొబైల్స్ వంటి పరిశ్రమ వృద్ధి చెందలేదని భార్గవ చెప్పారు. ప్రస్తుతం ఆటోమొబైల్స్పై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) 28 శాతంగా ఉండగా, వాహనం రకాన్ని బట్టి 1–22% వరకు సెస్సు అదనంగా ఉంటోంది. పూర్తిగా తయారైన రూపంలో (సీబీయూ) దిగుమతయ్యే కార్లపై కస్టమ్స్ సుంకం 60–100% వరకూ ఉంటోంది. ఆటో ఎక్స్పోలో మారుతీ ఎలక్ట్రిక్ కారు వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ.. జనవరిలో జరిగే ఆటో ఎక్స్పో వేదికగా ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ ఎస్యూవీని ప్రదర్శించనుంది. అలాగే రెండు సరికొత్త ఎస్యూవీలు సైతం కొలువుదీరనున్నాయి. మొత్తం 16 మోడళ్లు ప్రదర్శనకు రానున్నాయి. చదవండి: కొత్త సంవత్సరంలో టీవీ ప్రేక్షకులకు ఊహించని షాక్! -
మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు: ఆలస్యం చేస్తే...!
సాక్షి,ముంబై: దేశీయ కార్ల దిగ్గజం మారుతి సుజుకి డిసెంబరు నెలలో కూడా కొన్ని ఎంపిక చేసిన కార్లపై డిస్కౌంట్ ధరలను ప్రకటించింది. ముఖ్యంగా వచ్చేఏడాది జనవరి నుంచి అన్ని మోడళ్లకార్ల ధరలను పెంచక తప్పదని ఇటీవల ప్రకటించిన తరువాత అందిస్తున్న ఈ తగ్గింపు ధరలకు ప్రాధాన్యత లభిస్తోంది. స్విఫ్ట్, డిజైర్, వవ్యాగన్ ఆర్, సెలెరియో తోపాటు, న్యూజెన్ ఆల్టో, మారుతి అరేనా మోడళ్లపై కొనుగోలు దారులు డిస్కౌంట్ ఆఫర్ను పొందివచ్చు. కార్పొరేట్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్, క్యాష్ బ్యాక్ లాంటి ఆఫర్లుంటాయి. అలాగే నవంబరు నెలలో మాదిరిగానే ఎర్టిగా ఎమ్పివి. బ్రాండ్-న్యూ బ్రెజ్జా ఎస్యూవీలపై డిస్కౌంట్లు ఉండవు. మారుతి సుజుకి డిసెంబర్ 2022 నెలలో తన అరేనా లైన్ వాహన తగ్గింపును రూ. 52,000 వరకు అందిస్తోంది ఇటీవల విడుదల చేసిన మారుతి సుజుకి ఆల్టో కె10 మాన్యువల్ మోడల్స్పై రూ.52,000 వరకు డిస్కౌంట్. ఏఎంటీ మోడల్స్ రూ. 22వేలు, ఇటీవల విడుదలైన సీఎన్జీ మోడల్ కూడా రూ.45,100 తగ్గింపుతో అందుబాటులో ఉంది. సెలెరియో సీఎన్జీ రూ. 45,100, పెట్రోల్-మాన్యువల్ కార్లపై రూ. 36వేల వరకు తగ్గింపు అందు బాటులో ఉంది. ఏఎంటీ వెర్షన్పై రూ. 21,000 తగ్గింపు లభ్యం. హై ఎండ్ వేరియంట్లపై రూ. 42,000 వరకు తగ్గింపు , బేసిక్ మోడల్స్పై 17వేలు తగ్గింపు అందిస్తోంది. మారుతి మాన్యువల్ ఎస్-ప్రెస్సో వేరియంట్లపై గరిష్టంగా రూ. 46,000, ఏఎంటీ వేరియంట్లు రూ. 20వేలు, సీఎస్జీ వేరియంట్పై రూ. 45,100 తగ్గింపు లభిస్తుంది. అలాగే స్విప్ట్ ఏఎంటీ, మాన్యువల్ మోడల్స్ రెండింటిలోనూ దాదాపు రూ. 32వేలు తగ్గింపు. -
సుజుకి కొత్త స్కూటర్, అదిరే ఫీచర్స్, ప్రీమియం లుక్, ధర ఎంతంటే?
సాక్షి,ముంబై: మారుతి సుజుకి ద్విచక్ర వాహన అనుబంధ సంస్థ సుజుకి మోటార్సైకిల్ ఇండియా సరికొత్త స్కూటర్ను ఇండియాలో లాంచ్ చేసింది. బర్గ్మన్ స్ట్రీట్ ఈఎక్స్ పేరుతో దీన్ని తీసుకొచ్చింది. బర్గ్మన్ స్ట్రీట్కు అప్గ్రేడెడ్ వెర్షన్గా ఈ ఈఎక్స్ మోడల్ను విడుదలచేసింది. లేటెస్ట్ టెక్నాలజీ,నయా ఫీచర్లతో ప్రీమియం లుక్లో ఆకట్టుకునేలా ఆవిష్కరించింది. (వాట్సాప్ అవతార్ వచ్చేసింది..మీరూ కస్టమైజ్ చేసుకోండి ఇలా!) ధర: సుజుకీ బర్గ్మన్ స్ట్రీమ్ ఈఎక్స్ ధరను రూ.1,12,300 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా కంపెనీ నిర్ణయించింది. మారుతి సుజుకి బర్గ్మన్ స్ట్రీట్ స్టాండర్డ్ ఎడిషన్ స్కూటర్ ధర రూ. 89,900 (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ), సుజుకి బర్గ్మాన్ స్ట్రీట్ రైడ్ కనెక్ట్ ఎడిషన్ రూ. 93,300 (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ)కి అందుబాటులో ఉంది.మెటాలిక్ మ్యాట్ ప్లాటినమ్ సిల్వర్, మెటాలిక్ రాయల్ బ్రాంజ్, మెటాలిక్ మ్యాట్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో ఈ స్కూటర్ లభ్యం. సుజుకీ బర్గ్మన్ స్ట్రీమ్ ఈఎక్స్ ఇంజీన్ ఫీచర్లు ఎఫ్ఐ టెక్నాలజీతో పాటు ఎకో పర్ఫార్మెన్స్ ఆల్ఫా (SEP-a) ఇంజిన్తో 124cc సీసీ మోటార్ను అమర్చింది. ఇది 8.6PS గరిష్ట శక్తిని ,10Nm గరిష్ట టార్క్ను అందిస్తుంది. ఆటో స్టాప్-స్టార్ట్ సిస్టమ్ ,సైలెంట్ స్టార్టర్ సిస్టమ్ ప్రత్యేకత అని కంపెనీ తెలిపింది. వెనుక 12 అంగుళాల వెడల్పైన, పెద్ద టైర్ను అమర్చింది. సుజుకీ రైడ్ కనెక్ట్ బ్లూటూత్ డిజిటల్ ఎనేబుల్డ్ కన్సోల్తో కూడిన సుజుకీ రైడ్ కనెక్ట్ ఫీచర్ ను సుజుకీ బర్గ్మన్ స్ట్రీట్ ఈఎక్స్ మరో ఫీచర్. ఇది స్మార్ట్ఫోన్ను సింక్ చేసే సౌలభ్యాన్ని రైడర్కు అందిస్తుంది. నావిగేషన్, ఇన్కమింగ్ కాల్స్, ఎస్ఎంఎస్లు, వాట్సాప్ అలెర్ట్స్ ఈ బైక్ డిస్ప్లేలో చూడవచ్చు. స్పీడ్ ఎక్సీడింగ్ వార్నింగ్, ఫోన్ బ్యాటరీ లెవల్స్ కూడా డిజిటల్ కన్సోల్లో కనిపిస్తాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్ ఫోన్లను ఈ స్కూటర్ కన్సోల్కు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా స్పీడ్ ఎక్సీడింగ్ వార్నింగ్, ఫోన్ బ్యాటరీ లెవెల్ లాంటి వివరాలు కూడా ఈ బైక్ డిజిటల్ కన్సోల్లో కనిపిస్తాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్ ఫోన్లను ఈ స్కూటర్ కన్సోల్కు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. -
మారుతి కార్ లవర్స్కి షాకింగ్ న్యూస్: ఆ కారణం చెప్పి..!
సాక్షి, ముంబై: దేశీయ కార్ల తయారీదారు మారుతీ సుజుకి తన కస్టమర్లకు షాకిచ్చింది. వచ్చే ఏడాది జనవరి నుంచి కార్ల ధరలను భారీగా పెంచేందుకు యోచిస్తోంది. ప్రధానంగా ద్రవ్యోల్బణం, నియంత్రణ అవసరాల నిమిత్తం 2023, జనవరి నుంచి ధరల పెంపు ఉంటుందని శుక్రవారం ప్రకటించింది. అలాగే ఎలక్ట్రిక్ కాంపోనెంట్స్ కొరత డిసెంబరు కార్ల ఉత్పత్తిపై ప్రభావాన్ని చూపిస్తుందనే ఆందోళన వ్యక్తం చేసింది. (బెంజ్ కొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీ వచ్చేసింది: త్వరపడకపోతే..!) అమ్మకాలు పెరుగుతున్నప్పటికీ, ఎలక్ట్రిక్ కాంపోనెంట్స్ కొరత కారణంగా దేశీయ మోడళ్ల ఉత్పత్తిపై ప్రభావం చూపుతోంది. ద్రవ్యోల్బణం, ఖర్చుల నియంత్రణ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ధరల పెరుగుదల 2023 జనవరిలో ఉంటుందని ప్రకటించింది. మోడల్ని బట్టి, ధర పెంపు ఉంటుందని ప్రకటించిన మారుతి పెంపు ఎంత శాతం అనేది ధృవీకరించలేదు.(లగ్జరీ కారు కొన్న కుమార్తెలు: గర్ల్ పవర్ అంటున్న మ్యూజిక్ డైరెక్టర్) కాగా నవంబర్ 2022లో మొత్తం అమ్మకాలలో 14 శాతం పెరుగుదల సాధించింది మారుతీ సుజుకి. గత ఏడాది ఇదే కాలంలో 1,39,18 యూనిట్లతో పోలిస్తే ఈ ఏడాది నవంబర్లో 1,59,044 యూనిట్లను విక్రయించింది. దేశీయ విక్రయాలు 1,35,055 యూనిట్లుగా ఉన్నాయి. కాంపాక్ట్ సెగ్మెంట్ (స్విఫ్ట్, సెలెరియో, ఇగ్నిస్, బాలెనో , డిజైర్) అమ్మకాలు గతేడాది నవంబర్లో 57,019 యూనిట్ల నుంచి 72,844 యూనిట్లకు పెరిగాయి. మిడ్-సైజ్ సెడాన్ సియాజ్ అమ్మకాలు 1,554 యూనిట్లుగా ఉండగా, యుటిలిటీ వెహికల్ సెగ్మెంట్ (విటారా బ్రెజ్జా, ఎస్-క్రాస్, ఎర్టిగా) అమ్మకాలు ఈ ఏడాది నవంబర్లో 32,563 యూనిట్లకు పెరిగాయి. -
భారత్లో వన్ అండ్ ఓన్లీ గుర్తింపు.. మారుతీ సుజుకీ సొంతం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ రెండేళ్లలో ప్యాసింజర్ వెహికల్స్ విభాగంలో 50 శాతం వాటాను అందుకోవచ్చని ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం 42 శాతం వాటా ఉందని సంస్థ మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. మారుతీ కంపెనీ 2,250 నగరాల్లో తన కార్యకలాపాలను విస్తరించి ఉంది. దేశంలో 3,500వ ఔట్లెట్ను శుక్రవారం హైదరాబాద్లో ప్రారంభించిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘మార్చి నాటికి కొత్తగా రెండు ఎస్యూవీలను పరిచయం చేస్తాం. ఎస్యూవీల్లో ప్రస్తుతం కంపెనీకి 14.5 శాతం వాటా ఉంది. దీనిని పెంచుకోవడం ద్వారా లక్ష్యాన్ని చేరుకుంటాం. కంపెనీ తొలి ఎలక్ట్రిక్ కారు 2024–25లో రంగ ప్రవేశం చేయనుంది. ఈవీల కంటే ముందుగా హైబ్రిడ్ కార్లకు ఆదరణ పెరుగుతుంది. చార్జింగ్ మౌలిక వసతులు ఉంటేనే వినియోగదార్లలో ఈవీల పట్ల విశ్వాసం ఉంటుంది. 2030 నాటికి ఈవీల వాటా 15–17 శాతానికి చేరుకోవచ్చని అంచనా. ఇక అమ్మకాల పరంగా హైదరాబాద్ మూడవ స్థానంలో ఉంది’ అని వివరించారు. మారుతీ సుజుకీ మొత్తం విక్రయాల్లో తమ వాటా 2 శాతమని వరుణ్ మోటార్స్ ఎండీ వరుణ్ దేవ్ వెల్లడించారు. భారత్లో ఇంత విస్తృత నెట్వర్క్ను సాధించిన ఏకైక కార్ కంపెనీగా మారుతీ సుజుకీ గుర్తింపు సంపాదించుకుంది. చదవండి: వచ్చే ఏడాదిలోనూ ఉద్యోగాల్లో కోతలు -
అదిరే లుక్.. సీఎన్జీలో బాలీనో, ఎక్స్ఎల్6 కార్లను విడుదల చేసిన మారుతీ సుజుకీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ప్రీమియం హ్యాచ్బ్యాక్ బలీనో, మల్టీపర్పస్ వెహికిల్ ఎక్స్ఎల్6 మోడళ్లను ఎస్–సీఎన్జీ వేరియంట్లో ప్రవేశపెట్టింది. ఈ వారం నుంచే విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఎక్స్షోరూంలో ధర రూ.8.28 లక్షల నుంచి రూ.12.24 లక్షల మధ్య ఉంది. సీఎన్జీ వేరియంట్లో 2021–22లో కంపెనీ వివిధ మోడళ్లలో 2.3 లక్షల యూనిట్లను విక్రయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇవి 4 లక్షల యూనిట్లకు చేరుకుంటాయని మారుతీ సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. తాజా నిర్ణయంతో 16కుగాను 12 మోడళ్లలో సీఎన్జీ వేరియంట్లు ఉన్నాయని గుర్తు చేశారు. 1.23 లక్షల యూనిట్ల సీఎన్జీ వెహికిల్స్ కోసం ఆర్డర్లు ఉన్నాయని వెల్లడించారు. ఈ విభాగంలో కంపెనీ ఉత్పత్తి సామర్థ్యం నెలకు 30–32 వేల యూనిట్లు. 2010 నుంచి ఇప్పటి వరకు భారత్లో కంపెనీకి చెందిన 11.4 లక్షల సీఎన్జీ వాహనాలు రోడ్డెక్కాయి. బలీనో, ఎక్స్ఎల్6 మోడళ్లను నెక్సా షోరూంల ద్వారా మారుతీ సుజుకీ విక్రయిస్తోంది. చదవండి: ఎయిర్టెల్ బంపరాఫర్: ఒకే రీచార్జ్తో బోలెడు బెనిఫిట్స్, తెలిస్తే వావ్ అనాల్సిందే! -
కంపెనీ చరిత్రలో ఇదే తొలిసారి.. లాభాల్లో మారుతీ స్పీడ్!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం నాలుగు రెట్లు జంప్చేసి రూ. 2,112 కోట్లను అధిగమించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 487 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 20,551 కోట్ల నుంచి రూ. 29,942 కోట్లకు ఎగసింది. ఈ కాలంలో కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 5,17,395 వాహనాలను విక్రయించింది. వీటిలో దేశీయంగా 4,54,200 వాహనాలను విక్రయించగా.. 63,195 యూనిట్లు ఎగుమతి చేసింది. ఎలక్ట్రానిక్ పరికరాల కొరత కారణంగా ఉత్పత్తిలో 35,000 వాహనాలవరకూ ప్రభావం పడినట్లు మారుతీ వెల్లడించింది. ఇందువల్లనే గత క్యూ2 లోనూ మొత్తం వాహన విక్రయాలు 3,79,541 యూనిట్లకు పరిమితమైనట్లు ప్రస్తావించింది. పండుగల ప్రభావం ఎలక్ట్రానిక్ విడిభాగాల కొరత, కోవిడ్–19 సవాళ్లు గతంలో వృద్ధిని దెబ్బతీసినప్పటికీ ప్రస్తుతం పరిస్థితులు జోరందుకున్నట్లు వర్చువల్గా నిర్వహించిన విలేకరుల సమావేశంలో కంపెనీ చైర్మన్ ఆర్సీ భార్గవ పేర్కొన్నారు. ప్రధానంగా పండుగల సీజన్ అమ్మకాలకు జోష్నిస్తున్నట్లు తెలియజేశారు. దీంతో కస్టమర్ల పెండింగ్ ఆర్డర్లు 4.12 లక్షల యూనిట్లకు చేరినట్లు వెల్లడించారు. వీటిలో ఇటీవల ప్రవేశపెట్టిన గ్రాండ్ వితారా, కొత్త బ్రెజ్జా తదితర మోడళ్ల కోసమే 1.3 లక్షల ముందస్తు బుకింగ్స్ నమోదైనట్లు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్ విడిభాగాల లభ్యత, వ్యయ నియంత్రణ, ఉత్తమ ధరలు వంటి అంశాలపై దృష్టిపెట్టినట్లు వివరించారు. తద్వారా మెరుగైన మార్జిన్లు సాధించే వీలున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది తొలి అర్ధభాగం(ఏప్రిల్–సెప్టెంబర్)లో మొత్తం 9,85,326 వాహనాలు విక్రయించగా.. పూర్తి ఏడాదిలో 20 లక్షల యూనిట్ల అమ్మకాలు సాధించే లక్ష్యానికి కట్టుబడి ఉన్నట్లు భార్గవ తెలియజేశారు. గతేడాది ఏప్రిల్–సెప్టెంబర్ కాలంలో 7,33,155 వాహనాలను మాత్రమే విక్రయించింది. ఫలితాల నేపథ్యంలో మారుతీ షేరు ఎన్ఎస్ఈలో దాదాపు 6 శాతం జంప్చేసి రూ. 9,548 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 9,550 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకడం విశేషం! చదవండి: Elon Musk: ఎలాన్ మస్క్కు షాక్.. ట్విట్టర్లో యాడ్స్ బంద్! -
ఫలితాల్లో మారుతి అదుర్స్: ఏకంగా నాలుగు రెట్ల లాభం
సాక్షి,ముంబై: దేశీయ వాహన దిగ్గజం మారుతీ సుజుకీ క్యూ2 ఫలితాల్లో అదరగొట్టింది. సెప్టెంబరు త్రైమాసికంలో నికర లాభం 4 రెట్లు పెరిగి రూ.2,062 కోట్లకు చేరుకుందని కంపెనీ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో తెలిపింది. సెప్టెంబర్ త్రైమాసికంలో గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 475.30 కోట్ల లాభంతో పోలిస్తే నాలుగు రెట్లు ఎగిసింది. (షావోమి యూజర్లకు షాకింగ్ న్యూస్: ఆ సేవలిక బంద్!) గత ఏడాది ఇదే త్రైమాసికంలో అమ్మకాలు రూ.19,297.80 కోట్లనుంచి రూ.28,543.50 కోట్లకు వార్షిక ప్రాతిపదికన 47.91 శాతం వృద్ధి చెందాయి. ఆపరేటింగ్ ఎబిట్ గత ఏడాది త్రైమాసికంలో రూ.98.80 కోట్ల నుంచి 20.71 రెట్లు పెరిగి రూ.2,046.30 కోట్లకు చేరుకుంది. అలాగే ఈ త్రైమాసికంలో ఎబిట్ మార్జిన్ 670 బేసిస్ పాయింట్లు పెరిగి 0.5 శాతం నుంచి 7.2 శాతానికి చేరుకుంది. ఖర్చు తగ్గింపు ప్రయత్నాలు, అనుకూలమైన విదేశీ మారకపు వైవిధ్యం తమకు లాభించిందని పేర్కొంది. అయితే ఎలక్ట్రానిక్ భాగాల కొరత కారణంగా ఈ త్రైమాసికంలో దాదాపు 35,000 వాహనాల ఉత్పత్తిపై ప్రభావం చూపిందని కంపెనీ తెలిపింది. ఈ త్రైమాసికం ముగిసే సమయానికి 4.12 లక్షల వాహనాలు పెండింగ్లో ఉన్నాయని, వాటిలో 1.3 లక్షల వాహనాల ప్రీ-బుకింగ్లు ఇటీవల లాంచ్ చేసిన మోడళ్లకు సంబంధించినవేనని మారుతి వెల్లడించింది. ఈ ఫలితాల జోష్తో మారుతి సుజుకి షేరు ఆరుశాతం ఎగిసి 9,548 వద్ద ఇన్వెస్టర్లకు లాభాల పంట పండించింది. -
ఆరంభ లాభాలు పోయినా భేష్, మారుతి టాప్ గెయినర్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. అయితే ఆరంభ లాభాలనుంచి వెనక్కి తగ్గిన సెన్సెక్స్ 60 వేల దిగువన స్థిరపడింది. సెన్సెక్స్ 203 పాయింట్లు ఎగిసి 59959 వద్ద, నిఫ్టీ 50 పాయింట్ల లాభంతో 17786 వద్ద క్లోజ్ అయింది. వరుసగా రెండో సెషన్లోనూ విజయ పరంపరను కొనసాగించాయి. అయితే గ్లోబల్ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, ప్రపంచ ఆర్థిక మాంద్యం భయాలు టెక్ దిగ్గజాలనిరాశాజనక ఫలితాలు సెంటిమెంట్ను దెబ్బతీశాయి. ఫలితంగా దేశీయ సూచీలు గరిష్ట స్థాయిలను కోల్పోయాయి.. లాభాల జోష్తో మారుతి సుజుకి ఏకంగా 5 శాతం ఎగిసింది. రిలయన్స్, అపోలో హాస్పిటల్స్, ఎన్టీపీసీ, హీరోమోటా కార్ప్ భారీగా లాభపడగా, టెక్ ఎం, టాటా స్టీల్, గ్రాసిం, సన్ ఫార్మా, దివీస్ లాబ్స్ నష్టపోయాయి. అటు డాలరు మారకంలో రూపాయికూడా లాభాలను కోల్పోయి 82.47 స్థాయి వద్ద ముగిసింది. -
మారుతి ఎస్-క్రాస్ ఔట్: వినియోగదారులకు షాకింగ్ న్యూస్
సాక్షి, ముంబై: దేశీయ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకికి చెందిన ఫ్టాగ్షిప్ కారు మారుతి ఎస్-క్రాస్ కారును నిలిపివేసింది. గ్రాండ్ విటారాకు కంటే ముందు తీసుకొచ్చిన నెక్సా తొలి కారుఎస్-క్రాస్ను మారుతి నెక్సా వెబ్సైట్ నుంచి తొలగించింది. అంటే మార్కెట్నుంచి నిలివేసింది. 2015లో నెక్సా ఫస్ట్ అండ్ ఫ్లాగ్షిప్ కార్గా దీన్ని లాంచ్ చేసింది. (‘ప్లీజ్..కొనండి’ సేల్స్మేన్లా ఎలాన్ మస్క్ లేటెస్ట్ ట్వీట్ సంచలనం) కాంపాక్ట్ ఎస్యూవీ గ్రాండ్ విటారా లాంచ్, ధర ప్రకటన తర్వాత మారుతి తన అధికారిక నెక్సా వెబ్సైట్ నుండి ఎస్-క్రాస్ను తీసివేసింది. గ్రాండ్ విటారా ఇప్పటికే 60వేల బుకింగ్లను పొందింది. దీనికి 28 వారాల కంటే ఎక్కువ వెయిటింగ్ పీరియడ్ ఉంది. తాజాగా మారుతి ఎస్-క్రాస్ ప్లేస్ను 2022 గ్రాండ్ విటారా ఎస్యూవీ ఆక్రమించింది. 1.6-లీటర్, 1.3-లీటర్ డీజిల్ ఇంజీన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో S-క్రాస్ ముందుగా మార్కెట్లోకి వచ్చింది. తర్వాత డీజిల్ వెర్షన్ను ఆపేసి, 2020లో పెట్రోల్ వెర్షన్ను అందుబాటులోకి తెచ్చింది. అయితే ఈ సెగ్మెంట్లో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ దూసుకుపోవడంతో S-క్రాస్ అమ్మకాలు బాగా తగ్గిపోయాయి. ఈ సంవత్సరం జూలై, ఆగస్టులో ఒక్క కారు కూడా విక్రయించలేకపోయారు. ఈ నేపథ్యంలో భారత్ మార్కెట్లో S-క్రాస్ అమ్మకాలు నిలిపివేస్తున్నట్టు మారుతి ప్రకటించింది. గ్రాండ్ విటారాతో మిడ్-సైజ్ ఎస్యూవీ మార్కెట్లో పట్టు నిలుపుకోవాలని మారుతి భావిస్తోంది. క్రెటా, సెల్టోస్కు రానున్న రోజుల్లో ఇది గట్టి పోటీ ఇస్తుందని మారుతి అంచనా వేస్తోంది. (క్లిక్ చేయండి: గ్రాండ్ విటారా లాంచ్.. స్టైలిష్ లుక్, మిగతా కంపెనీలకు గట్టి పోటీ గురూ!) -
మారుతి బంపర్ ఆఫర్స్: అన్ని మోడల్స్పై ఫెస్టివ్ డిస్కౌంట్స్
సాక్షి, ముంబై: దేశీయ టాప్ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి తన కస్టమర్ల కోసం భారీ ఫెస్టివ్ ఆఫర్లను అందిస్తోంది. సీఎన్జీ మోడల్ సహా, పలు కార్ల మోడళ్లపై సుమారు రూ. 56,000 వరకు తగ్గింపును అందిస్తోంది. అరేనా షోరూమ్లు ఈ (అక్టోబర్) నెలలో తగ్గింపు ధరలకు అందుబాటులో ఉంటాయి. ఇందులో కార్పొరేట్, క్యాస్, ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా మారుతీ సుజుకి ఆల్టో 800, స్విఫ్ట్ ,వ్యాగన్-ఆర్, సెలెరియో, డిజైర్ సహా పలు కార్లు ఇపుడు తగ్గింపు ధరల్లో లభ్యం. మారుతి సుజుకి డిజైర్ మారుతి సుజుకి ఏఎంటీ వెర్షన్లపై రూ. 52,000 దాకా తగ్గింపు అందిస్తోంది. ఇందులో రూ. 35,000 నగదు తగ్గింపు, రూ. 7,000 కార్పొరేట్ డిస్కౌంట్లు రూ. 10,000 ఎక్స్చేంజ్ బోనస్లు ఉన్నాయి. అలాగే మాన్యువల్ ట్రాన్స్మిషన్ మోడల్ కార్లపై రూ. 17,000 తగ్గింపు లభ్యం. మారుతీ సుజుకి S-ప్రెస్సో రూ. 35,000 నగదు తగ్గింపు. రూ. 6,000 కార్పొరేట్, రూ. 15,000 ఎక్స్చేంజ్ ప్రోత్సాహకాలున్నాయి. మాన్యువల్ ట్రాన్స్మిషన్తో S Presso హై-రైడింగ్ హ్యాచ్బ్యాక్కు మొత్తం తగ్గింపును రూ. 56,000కి తగ్గింపు లభిస్తుంది. అలాగే S ప్రెస్సో AMT మోడల్లకు మొత్తం రూ. 46వేలు డిస్కౌంట్ లభ్యం. మారుతీ సుజుకి స్విఫ్ట్ అక్టోబర్ నెలలో, మారుతి సుజుకి స్విఫ్ట్ యొక్క ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ (AMT) వెర్షన్లు రూ. 47,000 మొత్తం ప్రయోజనాలకు అర్హమైనవి, స్విఫ్ట్ యొక్క మాన్యువల్ ట్రాన్స్మిషన్ వేరియంట్లు రూ. 30,000 విలువైన మొత్తం ప్రయోజనాలకు అర్హులు. ఆల్టో 800కి మొత్తం రూ. 36,000 తగ్గింపు ఉంటుంది. మారుతి సుజుకి వ్యాగన్-ఆర్ మారుతి సుజుకి డ్యూయల్జెట్ టెక్నాలజీతో వచ్చిన రెండు ఎకనామిక్ పెట్రోల్ కార్ల (1.0 ,1.2 లీటర్లు) వ్యాగన్ ఆర్ కొనుగోలుదారులు మాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ మోడల్లలో రూ. 31,000 ఆదా చేయవచ్చు. అదనంగా, మారుతీ రూ. 15,000 ధర తగ్గింపును కూడా అందిస్తోంది. సీఎన్జీ బేస్ మోడల్, టాప్-టైర్ వేరియంట్పై రూ. 5000 తగ్గింపు. మారుతి సుజుకి ఆల్టో K10 కొత్తగా విడుదల చేసిన ఆల్టో కె10 బడ్జెట్ హ్యాచ్బ్యాక్ ఆటోమేటిక్ మరియు మాన్యువల్ వెర్షన్లపై రూ.39,500 తగ్గింపును అందిస్తోంది. ఇందులో రూ. 17,500 విలువైన రూ. 7,000 నగదు తగ్గింపు , రూ. 15,000 విలువైన ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ రివార్డు ఉన్నాయి. -
సుజుకీ గ్రాండ్ విటారా లాంచ్.. స్టైలిష్ లుక్, మిగతా కంపెనీలకు గట్టి పోటీ గురూ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా నుంచి మధ్యస్థాయి స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్ గ్రాండ్ విటారా భారత మార్కెట్లో అడుగుపెట్టింది. ఢిల్లీ ఎక్స్షోరూంలో ధర రూ.10.45 లక్షల నుంచి రూ.19.65 లక్షల మధ్య ఉంది. మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ పొందుపరిచారు. ఆరు వేరియంట్లలో మాన్యువల్, ఆటోమేటిక్ మోడల్స్లో లభిస్తుంది. మైలేజీ వేరియంట్నుబట్టి లీటరుకు 21.1 కిలోమీటర్లు, స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్ట్రెయిన్ 27.97 కిలోమీటర్లు ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, టాటా హ్యారియర్కు ఇది పోటీ ఇవ్వనుంది. 57 వేల పైచిలుకు బుకింగ్స్ నమోదయ్యాయని మారుతీ సుజుకీ ఇండియా ఎండీ, సీఈవో హిసాటీ టాకేయూచీ ఈ సందర్భంగా తెలిపారు. మారుతీ సుజుకీ, టయోటా సంయుక్తంగా ఈ కారును అభివృద్ధి చేశాయి. మారుతీ సుజుకీ సబ్స్క్రైబ్ విధానంలో నెలకు రూ.27 వేల చందాతో గ్రాండ్ విటారా సొంతం చేసుకోవచ్చు. చదవండి: Ration Card New Rules: కేంద్రం కొత్త నిబంధనలు.. ఇకపై వాళ్ల రేషన్ కార్డు కట్! -
చిన్న కార్ల అమ్మకాలు పెరుగుతాయి..
న్యూఢిల్లీ: మొత్తం ప్యాసింజర్ వాహనాల అమ్మకాల్లో చిన్న కార్ల వాటా తగ్గుతున్నప్పటికీ .. పరిమాణంపరంగా చూస్తే మాత్రం విక్రయాలు పెరుగుతాయని ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్, సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. గతంలో మొత్తం ప్యాసింజర్ వాహనాల మార్కెట్లో చిన్న కార్ల వాటా 45–46 శాతం వరకూ ఉండేదని, గతేడాది 38 శాతానికి పడిపోయిందని వివరించారు. ఎస్యూవీలు 40 శాతం వాటాను దక్కించుకున్నాయని శ్రీవాస్తవ చెప్పారు. అయితే సంఖ్యాపరంగా చూస్తే చిన్న కార్ల విభాగం ఇప్పటికీ భారీ స్థాయిలోనే ఉందన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 30.7 లక్షల కార్లు అమ్ముడు కాగా వాటిలో దాదాపు 40 శాతం వాటా హ్యాచ్బ్యాక్లదేనని (దాదాపు 12 లక్షలు), మరో 12.3 లక్షల ఎస్యూవీలు (సుమారు 40 శాతం) అమ్ముడయ్యాయని శ్రీవాస్తవ వివరించారు. ఆ రకంగా చుస్తే పరిమాణంపరంగా రెండింటికీ మధ్య భారీ వ్యత్యాసమేమీ లేదని పేర్కొన్నారు. యువ జనాభా, కొత్తగా ఉద్యోగంలోకి చేరే యువత తొలిసారిగా కొనుగోలు చేసేందుకు చిన్న కార్లనే ఎంచుకునే అవకాశాలు ఉండటం ఈ విభాగానికి దన్నుగా ఉండగలదని ఆశిస్తున్నట్లు శ్రీవాస్తవ చెప్పారు. అయితే, ఈ విభాగం కొనుగోలుదారులు ఎక్కువగా అందుబాటు ధరకు ప్రాధాన్యమిస్తారని, అదే అంశం చిన్న కార్లకు కొంత సవాలుగా ఉంటోందని పేర్కొన్నారు. కొత్త ప్రమాణాలను పాటించాల్సి వస్తుండటం, కమోడిటీ ధరలు పెరుగుతుండటం, కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టాల్సి వస్తుండటం తదితర అంశాల కారణంగా.. చిన్న కార్లు అందుబాటు రేటులో లభించడం తగ్గుతోందని ఆయన వివరించారు. ‘గత రెండు మూడేళ్లలో ఆదాయం కన్నా ఎక్కువగా వాహనాల ధరలు పెరిగిపోయాయి. దీంతో అందుబాటులో లభ్యతనేది తగ్గిపోయింది. అందుకే ఎస్యూవీలతో పోలిస్తే ఈ విభాగం వాటా తగ్గిందని భావిస్తున్నాం‘ అని శ్రీవాస్తవ వివరించారు. చదవండి: బిగ్ అలర్ట్: అమలులోకి ఆధార్ కొత్త రూల్..వారికి మాత్రం మినహాయింపు! -
ఆల్ న్యూ ఆల్టో కే10- 2022 వచ్చేసింది.. మోర్ ఎనర్జీ ఫీచర్స్తో
సాక్షి, ముంబై: మోస్ట్ ఎవైటెడ్ మారుతి సుజుకి ఆల్టో K10 2022 మోడల్ వచ్చేసింది. నేడు (గురువారం, ఆగస్టు 18) మారుతి సుజికి ఇండియా లాంచ్ చేసింది. మారుతి చల్ పడీ అంటూ ఆల్టో K10 2022 ను తీసుకొచ్చింది. రెడ్ అండ్ బ్లూ రంగుల్లో ఆవిష్కరించింది. ఆల్టో K10 2022 కేవలం ప్రారంభ రూ. 3, 99,000 గా కంపెనీ నిర్ణయించింది. మొత్తం నాలుగు వేరియంట్లలో ఈ న్యూ వెర్షన్ ఆల్టో K10 2022 లభించనుంది. (ప్రత్యేక డిపాజిట్ స్కీమ్: లక్ష డిపాజిట్ చేస్తే దాదాపు లక్షా 28 వేలు!) మారుతి సుజుకి ఇప్పటికే కొత్త 2022 ఆల్టో కోసం బుకింగ్లను ప్రారంభించింది. ఆసక్తిగల కొనుగోలు దారులు ఆల్టోను రూ. 11,000తో బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. కొత్త మారుతి సుజుకి ఆల్టో కె10 మారుతి సుజుకి ఆల్టో 800 ఎంట్రీ లెవల్ హ్యాచ్బ్యాక్తో పాటు కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. (ఇది చదవండి: నా 30 ఏళ్ల అనుభవంలో తొలిసారి: ఎయిర్టెల్ చైర్మన్ ఆశ్చర్యం, ప్రశంసలు) కాగా మారుతి సుజుకి ఆల్టో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటి. కంపెనీ ఇప్పటి వరకు ఈ కారును 40 లక్షల యూనిట్లకు పైగా విక్రయించింది. ఆల్టో ఫస్ట్ జనరేషన్ 2000లో ఆల్టో 800గా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. కొత్త మారుతి సుజుకి ఆల్టో కె10కి రెనాల్ట్ నుండి మాత్రమే పోటీ ఇస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. (రియల్మీ 5జీ ఫోన్, ఇయర్ బడ్స్ లాంచ్: ఇంత తక్కువ ధరలోనా సూపర్!) -
మారుతి స్విఫ్ట్ ఎస్-సీఎన్జీ వచ్చేసింది, ఫీచర్లు చూసి వావ్ అనాల్సిందే!
సాక్షి,ముంబై: మారుతి సుజుకి తన పాపులర్ మోడల్ స్విఫ్ట్లో S-CNG వెర్షన్ను దేశంలో విడుదల చేసింది. హ్యాచ్బ్యాక్ కారు రెండు (VXi , ZXi) వేరియంట్లలో అందుబాటులో ఉంది. అంతేకాదు కిలోకి 30.90 కిలోమీటర్లతో మోస్ట్పవర్ఫుల్, అద్భుతమైన ఇంధన సామర్థ్యమున్న హ్యాచ్బ్యాక్ కార్ అని కంపెనీ చెబుతోంది. మారుతి కొత్త స్విఫ్ట్ వెర్షన్ ధరలు రూ. 7.77 లక్షల (ఎక్స్-షోరూమ్)నుండి ప్రారంభం. అలాగే నెలవారీ సబ్స్క్రిప్షన్ రుసుముతో రూ. 16,499తో (అన్ని కలుపుకొని) ఈ కారును సొంతం చేసుకోవచ్చని మారుతి వెల్లడించింది. కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ ఎస్-సీఎన్జీ 1.2L K-సిరీస్ డ్యూయల్ జెట్, డ్యూయల్ VVT ఇంజన్తో 6,000rpm వద్ద 76bhp, 4,300rpm వద్ద 98Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ యూనిట్తో మాత్రమే వచ్చింది. 2022 మారుతి సుజుకి స్విఫ్ట్ S-CNGలో డ్యూయల్ ఇంటర్ డిపెండెంట్ ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్స్, (ECU) ఇంటెలిజెంట్ ఇంజెక్షన్ సిస్టమ్ను జోడించింది. తుప్పు ఎలాంటి లీకేజీ లేకుండాస్టెయిన్లెస్ స్టీల్ పైపులు, జాయింట్లతో ఈ మోడల్ మరింత సేఫ్టీగా ఉంటుందని కంపెనీ మారుతీ సుజుకి ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. -
ఆల్టో K10 లవర్స్కు గుడ్ న్యూస్! రూ. 11 వేలతో...
సాక్షి,ముంబై: మారుతి సుజుకి సరికొత్త ఆల్టో కె10 కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త. కొత్త ఆల్టో K10 బుకింగ్లను మారుతి సుజుకి బుధవారం ప్రారంభించింది. మారుతి ఎంట్రీ-లెవల్ హ్యాచ్బ్యాక్ తాజా వెర్షన్ సరికొత్త సేఫ్టీ ఫీచర్లు, కనెక్టివిటీ ఫీచర్లతో వస్తున్న కొత్త ఆల్టో కె-10 కస్టమర్లను ఆకట్టుకోనుంది. రూ. 11 వేలు చెల్లించి ఆల్టో కె10ని ప్రీ-బుక్ చేయవచ్చు. మారుతి అరేనా షోరూంలో, లేదా ఆన్లైన్లో గానీ ఈ కారును బుక్ చేసుకోవచ్చు. (సీనియర్ సిటిజన్లు, జర్నలిస్టులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్?) మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్ & సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, 4.32 మిలియన్లకు పైగా కస్టమర్లతో, ఆల్టో దేశంలో అత్యంత ప్రభావవంతమైన కార్ బ్రాండ్గా ఉందని చెప్పారు.. ఆల్టో కుటుంబాలు విపరీతంగా ఇష్టపడే, లెజెండరీ ఆల్టో యువ భారతదేశం ఆకాంక్షలతో అభివృద్ధి చెందిన దిగ్గజ బ్రాండ్కు నిదర్శనం. 22 సంవత్సరాల బలమైన బ్రాండ్ వారసత్వంతో, ఆల్టో గౌరవానికి విశ్వసనీయతకు చిహ్నం మాత్రమేకాదు తమకు చాలా విజయ వంతమైన బ్రాండ్ అన్నారు. దేశంలో హ్యాచ్బ్యాక్ సెగ్మెంట్లో పునర్నిర్వచించేలా, కస్టమర్ల ఆకాంక్షలకనుగుణంగా కొత్త ఆల్-న్యూ ఆల్టో K10 తీర్చి దిద్దామని మారుతి చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ (ఇంజినీరింగ్) సీవీ రామన్ అన్నారు. ఆధునిక డిజైన్, విశాలమైన క్యాబిన్, సాంకేతికతతో నడిచే, యూజర్ ఫ్రెండ్లీ ఇంటీరియర్పై ప్రత్యేక దృష్టి సారించామని వెల్లడించారు. (వావ్...హోండా యాక్టివా 7జీ కమింగ్ సూన్..!) ఫీచర్లు, ధరపై అంచనాలు ఆల్టో K10 సరికొత్త డిజైన్, ప్లాట్ఫారమ్, ఇంటీరియర్ లేఅవుట్, ఫీచర్ లిస్ట్తో రానుంది. కార్ టెక్ కనెక్ట్, టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్, మెరుగైన పనితీరు కోసం హార్ట్టెక్ ఆర్కిటెక్చర్తో రానుంది. 1,000 cc పెట్రోల్ ఇంజీన్తో రానుందని భావిస్తున్నారు. ఇక ధరల విషయానికొస్తే, కొత్త మారుతి సుజుకి ఆల్టో కె10 ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర ఎస్-ప్రెస్సో ధర రూ. 4.25 లక్షల కంటే తక్కవనేగా ఉండనుందని అంచనా. కొత్త ఆల్టో కె10 ఆగస్టు 18 న అధికారికంగా లాంచ్ కానుంది. ఇదికూడా చదవండి : జియో మెగా ఫ్రీడం ఆఫర్, ఏడాది ఉచిత సబ్స్క్రిప్షన్ -
2022 ఆల్టో: ఎక్సైటింగ్ సర్ప్రైజ్ అంటున్న మారుతి
సాక్షి, ముంబై: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇండియా 'గెట్ రెడీ ఫర్ ఏ ఎక్సైటింగ్ సర్ప్రైజ్' అంటూ కస్టమర్లను ఊరిస్తోంది. ఆగస్ట్ 18 నుండి 22, 2022 వరకు క్యాలెండర్ను బ్లాక్ చేసుకోమంటూ శుక్రవారం సోషల్ మీడియాద్వారా కోరింది. దీంతో మారుతి థర్డ్ జనరేషన్ కాంపాక్ట్ హ్యాచ్బ్యాక్ కారు కొత్త 2022 ఆల్టోను ఆవిష్కరించే అవకాశం ఉందని ఊహాగానాలు వెల్లువెత్తాయి. ఇండియలో అత్యంత ప్రజాదరణ పొందిన కారుగా ఖ్యాతి దక్కించుకున్న ఆల్టోను కొత్త డిజైన్, అప్డేటెడ్ ఫీచర్లతో సరికొత్తగా లాంచ్ చేయనుంది. కొత్త తరం ఆల్టోకి సంబంధించిన కొన్ని ఫోటోలు అనేక సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, కంపెనీ కొత్త ఆల్టో కోసం తుది లాంచ్ తేదీని నిర్ధారించలేదని అధికారికంగా ప్రకటించకపోయినా,ఆగస్ట్ 18 -22 మధ్య లాంచ్ అవుతుందని ఖచ్చితంగా తెలుస్తోంది. కొత్త తరం ఆల్టో కి సంబంధించిన కొన్ని ఫోటోలు అనేక సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ఆటోమేటిక్ గేర్బాక్స్తో వస్తున్న కొత్త 998cసీసీ ఆల్టో K10 ఇంజన్ అమర్చిందట. ఇది 66 bhp శక్తిని, 89Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే 2022 ఆల్టో యొక్క ప్రారంభ ధర రూ. 3.5 లక్షల (ఎక్స్-షోరూమ్) గా ఉంటుందని అంచనా ఇక మార్కెట్లో పోటీ విషయానికి వస్తే. రెనాల్ట్ క్విడ్, టాటా టియాగో , డాట్సన్ రెడి-గో వంటి వాటికి గట్టిపోటీ ఇస్తుందని అంచనా. ఇది కూడా చదవండి : మహీంద్రాకు ఏమైంది? రెండోసారి ఆ కార్ల రీకాల్ ఐఫోన్ 11, ఐఫోన్ 12పై భారీ తగ్గింపు -
2022లో ఇప్పటివరకూ టాప్ సెల్లింగ్ కార్లు ఇవే!
సాక్షి, ముంబై: 2022 మొదటి అర్ధభాగంలో కార్ల అమ్మకాలు ప్రతికూల వృద్ధిని నమోదు చేశాయి. 2022 జనవరి- జూన్ వరకు అత్యధికంగా అమ్ముడైన కార్ల మోడల్స్లో మారుతి సుజుకి టాప్ లో నిలిచింది. ఈ ఏడాది విక్రయాల్లో టాప్-10 కార్లలో తొలి ఐదు స్థానాలను ఆక్రమించడం విశేషం. పాపులర్ మోడల్స్ వ్యాగన్-ఆర్, స్విఫ్ట్, బాలెనో, డిజైర్, ఆల్టో లాంటి మోడల్స్ ఉన్నాయి. అయితే 2021 మొదటి అర్ధభాగంలో అమ్మకాలతో ఈ ఏడాది ఇదే సమాయానికి అమ్మకాల్లో తగ్గుదల కనిపించింది. మారుతి సుజుకి స్విఫ్ట్, బాలెనో, ఆల్టో లాంటి కార్లతోపాటు, టాటా , హ్యుందాయ్ మోడల్ అమ్మకాలు బాగా పడిపోయాయి. టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో మారుతి సుజుకి ది వ్యాగన్ R, స్విఫ్ట్, డిజైర్, బాలెనో , ఆల్టోతో సేల్స్ చార్ట్లో అగ్రస్థానంలో ఉంది. వ్యాగన్ ఆర్ 20 శాతం వృద్ధితో 1,13,407 కార్లు అమ్ముడయ్యాయి. డిజైర్ 21 శాతం వార్షిక అమ్మకాలను నమోదు చేసింది. ఐదు మోడళ్లలో, వరుసగా 91,177 యూనిట్లు, 85,929 యూనిట్లు, 74,892 యూనిట్లు, 68,660 కార్లను సేల్ చేఏసింది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 52,333 యూనిట్లను విక్రయాలతో ఆరవ స్థానంలో నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే అమ్మకాలు 7 శాతం క్షీణించాయి. గత ఏడాది ఇదే కాలంలో హ్యుందాయ్ 56,286 యూనిట్లను విక్రయించింది. సెలెరియో, S-ప్రెస్సో వరుసగా 46,764 యూనిట్లు , 34,123 యూనిట్లతో మారుతి సుజుకి ఏడు, ఎనిమిదవ స్థానాలను కైవసం చేసుకుంది. మారుతి సుజుకి సెలెరియో 144 శాతం వృద్ధిని నమోదు చేయగా, ఎస్-ప్రెస్సో 4 శాతం వృద్ధిని నమోదు చేసింది. హ్యుందాయ్ i20 తొమ్మిదో ప్లేస్లో ఉంది. గత సంవత్సరం 41,326 యూనిట్లతో పోలిస్తే 34,119 యూనిట్లను విక్రయించి, 17 శాతం ప్రతికూల వృద్ధిని నమోదు చేసింది. టాటా ఆల్ట్రోజ్ 28,808 యూనిట్లతో టాప్-10 లో నిలిచింది. దీని అమ్మకాలు కూడా 23 శాతం పడిపోయాయి.. -
మారుతి ఆల్ న్యూ గ్రాండ్ విటారా: సరికొత్త టెక్నాలజీతో
సాక్షి, ముంబై: మారుతితి సుజుకి గ్రాండ్ విటారాను ఎట్టకేలకు ఈ రోజు (జూలై 20) ఇండియాలో పరిచయం చేసింది. అర్బన్ క్రూయిజర్, గ్లాంజా తరువాత టయోటా సుజుకి భాగస్వామ్యంతో తయారైన కొత్త మోడల్ ఎస్యూవీ గ్రాండ్ విటారా. 28 కిలోమీటర్ల మైలేజీ ఎస్యూవీగా కంపెనీ వెల్లడించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఆసక్తిగల కొనుగోలుదారులు మారుతి డీలర్షిప్ వద్ద లేదా ఆన్లైన్లో రూ. 11,000తో ఈ కారును బుక్ చేసుకోవచ్చు. 2020 మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఎస్యూవీ ధర రూ.9.50 లక్షల నుంచి రూ.16 లక్షల వరకు ఉండనుంది. డిజైన్, ఫీచర్లు, ఇంజన్ గ్రాండ్ విటారా ఎస్యూవీ కూడా టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ఎస్యూవీ మాదిరిగానే ఉన్నా. SUV క్రోమ్ స్ట్రిప్, ట్రైఎల్ఈడీ టెయిల్ లైట్ల పొడవైన బంపర్, స్పోర్టి ఎయిర్ డ్యామ్, పూర్తి-LED ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్ స్పెషల్. ప్రత్యేకమైన 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ పొందుపర్చింది. 27.97km మైలేజీని అందజేస్తుందని కంపెనీ పేర్కొంది. ఫీచర్ల విషయానికి వస్తే,వెంటిలేటెడ్ సీట్లు, ఎలక్ట్రిక్ సన్రూఫ్, వైర్లెస్ ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, హెడ్స్-అప్-డిస్ప్లే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా , అనేక ఇతర స్మార్ట్ కార్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అలాగూ ఆల్గ్రిప్ AWD సాంకేతికతను కూడా జోడించింది. AllGrip సిస్టమ్లో ఆటో, స్పోర్ట్, స్నో, లాక్ అనే నాలుగు మోడ్లు అందుబాటులో ఉంటుంది. ఏడబ్యూడీ టెక్నాలజీని అందించిన మారుతి సుజుకీ ఏకైక కారు గ్రాండ్ విటారా. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, 6-ఎయిర్బ్యాగ్లు, ESP, హిల్-హోల్డ్ అసిస్ట్, వెనుక ప్రయాణీకులకు 3 పాయింట్ సీట్బెల్ట్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఆల్-వీల్ డిస్క్ బ్రేక్లు, హిల్ డిసెంట్ కంట్రోల్ లాంటి సెక్యూరిటీ ఫీచర్లున్నాయి. మారుతి సుజుకి గ్రాండ్ విటారా రెండు ఇంజన్ ఆప్షన్లతో లభ్యం. ఇందులో ఒకటి 1.5-లీటర్ TNGA అట్కిన్సన్ సైకిల్ ఇంజన్. ఇది 92hp , 122Nm టార్క్ను, 79hp, 141Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. రెండోది 1.5-లీటర్ K15C మైల్డ్-హైబ్రిడ్ ఇంజన్తో అందుబాటులో ఉంటుంది. కొత్త బ్రెజ్జా, XL6 , ఎర్టిగాలో ఇదే ఇంజన్ను అమర్చింది.ఇది 103hp , 137Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. -
ఆ నిర్ణయంతో చిన్న కార్లకు కష్టకాలమే!
న్యూఢిల్లీ: ప్యాసింజర్ కార్లలో ఆరు ఎయిర్బ్యాగ్స్ తప్పనిసరి ఉండాలన్న ప్రభుత్వ ప్రతిపాదనపై దేశీయ వాహన రంగ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా స్పందించింది. ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని సూచించింది. ఇప్పటికే తగ్గుతున్న చిన్న కార్ల మార్కెట్పై ప్రతిపాదిత నిబంధన తీవ్ర ప్రభావం చూపిస్తుందని సంస్థ చైర్మన్ ఆర్.సి.భార్గవ వెల్లడించారు. వాహన రంగంలో ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ‘మూడేళ్లుగా చిన్న కార్ల విభాగం అమ్మకాలు తగ్గుతూ వస్తున్నాయి. ద్విచక్ర వాహనదారులు అప్గ్రేడ్ అయ్యే అవకాశాలను దెబ్బతీస్తుంది. ధరలు దూసుకెళ్తుండడంతో మెట్రోయేతర ప్రాంతాల్లో విక్రయాలు తగ్గాయి. ఆరు ఎయిర్బ్యాగ్స్ తప్పనిసరి అయితే ధర రూ.20–25 వేల దాకా అధికం అవుతుంది. చిన్న కారు కొనుగోలుదార్లకు ఇది భారమే’ అని భార్గవ వివరించారు. -
లేటెస్ట్ ఫీచర్లతో మారుతీ కొత్త ఎక్స్ఎల్6
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఎక్స్ఎల్6 కొత్త వెర్షన్ ధరను ప్రకటించింది. ఎక్స్షోరూంలో ధర వేరియంట్నుబట్టి రూ.11.3–14.5 లక్షల మధ్య ఉంది. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్తో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ పొందుపరిచారు. ప్యాడిల్ షిఫ్టర్స్తో 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, 75.8 కిలోవాట్ పవర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, నాలుగు ఎయిర్బ్యాగ్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, హిల్ హోల్డ్ అసిస్ట్తో ఎల్రక్టానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, రిమోట్ ఆపరేషన్స్తో 40కిపైగా ఫీచర్లతో ఇన్బిల్ట్ సుజుకీ కనెక్ట్ వంటి హంగులు ఉన్నాయి. చదవండి: వచ్చేస్తోంది..కియా ఎలక్ట్రిక్ కారు..మొదలుకానున్న బుకింగ్స్..ఎప్పుడంటే..? -
అనుకున్నట్లే జరిగింది..కొనుగోలుదారులకు భారీ షాకిచ్చిన మారుతీ సుజుకీ..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా అన్ని రకాల మోడళ్ల ధరలను సవరించింది. మోడల్నుబట్టి 0.9–1.9 శాతం మేర ధర పెంచినట్టు కంపెనీ ప్రకటించింది. సోమవారం నుంచే కొత్త ధరలు అమలులోకి వచ్చాయని వివరించింది. తయారీ వ్యయం అధికం అయినందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. 2021 జనవరి నుంచి 2022 మార్చి మధ్య వాహన ధరలను మారుతీ సుజుకీ 8.8 శాతం పెంచింది. స్టీల్, రాగి, అల్యూమినియం, ఇతర విలువైన లోహాలు రోజురోజుకూ ఖరీదు అవుతూనే ఉన్నాయి. చదవండి: గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్న ఎల్ఎంఎల్..! అది కూడా ఎలక్ట్రిక్ హైపర్ బైక్..! -
టయోటా, మారుతి సుజుకి సంయుక్తంగా రూపొందించిన ఎలక్ట్రిక్ కారు..! రేంజ్లో అదుర్స్..!
పెరుగుతున్న ఇంధన ధరలు, పర్యావరణ ఆందోళనల కారణంగా...ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి సారించాయి. ఇప్పటికే పలు కంపెనీలు ఆయా ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లలోకి రిలీజ్ చేశాయి. ఇక భారత్లో కూడా ఎలక్ట్రిక్ వాహనాల వాడకం కూడా ఊపందుకుంది. భారత ఆటోమొబైల్ మార్కెట్లను టార్గెట్ చేస్తూ పలు దిగ్గజ కంపెనీలు వినూత్న ఎలక్ట్రిక్ మోడళ్ల తయారీపై దృష్టి పెట్టాయి. కాగా టయోటా, మారుతి సుజుకి సంస్థలు ఒక అడుగు ముందుకేసి మిడ్సైజ్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ కారును భారత్లో రిలీజ్ చేసేందుకు ప్రణాళికలను రచిస్తోన్నాయి. ఈ రెండు సంస్థలు సంయుక్తంగా రెండు ఎలక్ట్రిక్ కార్లను తయారుచేస్తున్నాయి. డిజైన్ విషయానికి వస్తే..! టయోటా, మారుతి సుజుకి సంయుక్తంగా రూపొందించిన మిడ్సైజ్ ఎస్యూవీ ఎలక్ట్రిక్ కారు డిజైన్కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ఈ వాహనం 2.7 మీటర్ల వీల్బేస్తో 4.3 మీటర్ల పొడవు ఉండవచ్చునని తెలుస్తోంది. అంటే భారత్లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఈవీ టాటా నెక్సాన్ ఈవీ కంటే ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ పెద్దదిగా ఉండే అవకాశం ఉంది. కొద్దిరోజుల క్రితం ఎంజీ మోటార్స్ లాంచ్ చేసిన జెడ్ఎస్ ఈవీతో సమానమైన పరిమాణంలో ఉండవచ్చు. స్థానిక , అంతర్జాతీయ మార్కెట్ల కోసం, సుజుకి ఈ రెండు మోడళ్లను దాని గుజరాత్ ఫెసిలిటీలో నిర్మిస్తుందని సమాచారం. ఎలక్ట్రిక్ స్కేట్బోర్డ్ పొడవైన వీల్బేస్ కారణంగా, క్యాబిన్ మరింత విశాలంగా ఉండనుంది. సెక్యూర్డ్ బ్యాటరీ ప్యాకేజింగ్తో రానుంది. మాడ్యులర్ eTNGA ప్లాట్ఫారమ్తో కూడిన డెడికేటెడ్ ఎలక్ట్రిక్ క్రాస్ఓవర్తో వచ్చే అవకాశం ఉంది. ధర ఎంతంటే..? భారత్లో మిడ్సైజ్ ఎస్యూవీ వాహనాలు భారీ ఆదరణను పొందాయి. టయోటా, మారుతి సుజుకీ సంయుక్తంగా రూపొందిస్తోన్న మిడ్ సైజ్ ఎస్యూవీ భారత ఈవీ మార్కెట్లలో తొలి కారుగా నిలుస్తోంది. ఈ రెండు కంపెనీలు తయారు చేస్తోన్న కారు ధర రూ. 13 నుంచి 15 లక్షల(ఎక్స్షోరూమ్)గా ఉండనున్నట్లు తెలుస్తోంది. రేంజ్ ఎంతంటే..? ఈ కారులో రెండు రకాల బ్యాటరీ వేరియంట్స్తో వచ్చే అవకాశం ఉంది. 48 కెడబ్ల్యుహెచ్ బ్యాటరీతో కూడిన సింగిల్ 140పీఎస్ శక్తిని, ఈ మోడల్ ఎలక్ట్రిక్ కారుని ఒకసారి ఛార్జ్ చేస్తే సుమారు 400 కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది. 59 కెడబ్ల్యుహెచ్ బ్యాటరీ, 172 పీఎస్ శక్తిని ఉత్పత్తి చేస్తోంది. ఈ కారు సుమారు రియల్టైంలో 500 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుందని సమాచారం. చదవండి: కళ్లు చెదిరే లుక్స్తో హల్చల్ చేస్తోన్న మారుతి సుజుకి నయా కారు..! లాంచ్ ఎప్పుడంటే..? -
కళ్లు చెదిరే లుక్స్తో హల్చల్ చేస్తోన్న మారుతి సుజుకి నయా కారు..! లాంచ్ ఎప్పుడంటే..?
2022 Maruti Suzuki Ertiga Facelift: ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకీ త్వరలోనే అప్డేటెడ్ 2022 మారుతి సుజుకి ఎర్టిగా ఎంపీవీ ఫేస్లిఫ్ట్ మోడల్ను లాంచ్ చేయనుంది.ఈ కారుకు సంబంధించిన చిత్రాలు సోషల్మీడియాలో వైరల్గా మారాయి. 2022 మారుతి సుజుకి ఎర్టిగా ఎంపీవీ ఫేస్లిఫ్ట్ కారుకు సంబంధించిన ప్రీబుకింగ్స్ను కూడా కంపెనీ మొదలుపెట్టింది. రూ. 11 వేల టోకెన్ అమౌంట్ను చెల్లించి కొనుగోలుదారులు 2022 మారుతి సుజుకి ఎర్టిగా ఫేస్లిఫ్ట్ ఎడిషన్ బుక్ చేసుకోవచ్చును. లాంచ్ ఎప్పుడంటే..! ఎంపీవీ వాహనాల్లో మారుతి సుజుకీ ఎర్టిగా భారీ ఆదరణనే పొందింది. ఇప్పుడు పలు మార్పులతో సరికొత్తగా మారుతి సుజుకీ ఎర్టిగా కారును లాంచ్ చేసేందుకు మారుతి సుజుకీ సన్నాహాలను చేస్తోంది. ఈ నెల చివరలో 2022 మారుతి సుజుకీ ఎర్టిగా ఫేస్లిఫ్ట్ మోడల్ను కంపెనీ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. 2022 మారుతి సుజుకి ఎర్టిగా ఫేస్లిఫ్ట్ ఎడిషన్ నాలుగు వేరియంట్లలో రానున్నట్లు సమాచారం. సీఎన్జీ, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కూడా కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనున్నాయి. ట్యాక్సీ సెగ్మెంట్ కోసం 2022 ఎర్టిగా టూర్ వేరియంట్ను కూడా మారుతి సుజుకి ఇండియా అందిస్తోంది. ఇది పెట్రోల్, సీఎన్జీ ఎంపికలలో వస్తుంది, ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్తో రానుంది. 2022 మారుతి సుజుకి ఎర్టిగా పెరల్ ఆర్కిటిక్ వైట్, స్ప్లెండిడ్ సిల్వర్, మాగ్మా గ్రే, ఆబర్న్ రెడ్, ప్రైమ్ ఆక్స్ఫర్డ్ బ్లూ, పెరల్ డిగ్నిటీ బ్రౌన్, మిడ్నైట్ బ్లాక్ షేడ్స్ అనే ఏడు కలర్ ఆప్షన్స్తో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. అప్డేటేడ్ డిజైన్తో..! 2022 మారుతి సుజుకీ ఎర్టిగా ఫేస్లిఫ్ట్ మోడల్ సరికొత్త డిజైన్తో రానుంది. కొత్త గ్రిల్, ఎల్ఈడీ ప్రొజెక్టర్ యూనిట్లతో, అప్డేటేడ్ హెడ్ల్యాంప్స్తో రిఫ్రెష్ లుక్ను పొందనుంది. ఇక ఫీచర్ల విషయానికొస్తే,....ఎర్టిగా స్మార్ట్ప్లే ప్రో టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్తో కొత్త 7-అంగుళాల డిస్ప్లేను పొందనుంది. రాబోయే మారుతి సుజుకి ఎర్టిగా ఫేస్లిఫ్ట్లో స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీతో జత చేశారు. నెక్స్ట్-జెన్ కే-సిరీస్ 1.5-లీటర్ డ్యూయల్ జెట్, డ్యూయల్ వీవీటీ ఇంజన్తో రానుంది. కొత్త పవర్ట్రెయిన్తో పాటు, మారుతి సుజుకి ప్యాడిల్ షిఫ్టర్లతో కూడిన అధునాతన 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ను కూడా పరిచయం చేస్తోంది. చదవండి: అమ్మకాల్లో దూసుకెళ్తున్న మెర్సిడెస్ బెంజ్! -
హల్చల్ చేస్తోన్న మారుతి సుజుకీ వ్యాగన్ఆర్ నయా మోడల్..! ధర ఎంతంటే..?
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి వ్యాగన్ఆర్ పోర్ట్ఫోలియోలో సరికొత్త వేరియంట్ను లాంచ్ చేసింది. ఈ కారు వ్యాగన్ఆర్ టూర్ హెచ్3గా పిలవనున్నట్లు తెలుస్తోంది. మారుతి సుజుకి వ్యాగన్ఆర్ టూర్హెచ్3 సరికొత్త డిజైన్తో రానుంది. ఈ కారులో హ్యాచ్బ్యాక్ బాడీ కలర్ బంపర్స్, వీల్ సెంటర్ క్యాప్ అండ్ బ్లాక్-అవుట్ ఓఆర్వీఎంను అమర్చారు. కారు ఇంటీరియర్ విషయానికి వస్తే...ఇందులో ఫ్రంట్ క్యాబిన్ ల్యాంప్స్, టికెట్ హోల్డర్తో డ్రైవర్ సైడ్ సన్వైజర్, ఫ్రంట్ అండ్ రియర్ హెడ్రెస్ట్ ఉన్నాయి. అంతేకాకుండా సైడ్ ఆటో డౌన్ ఫంక్షన్, మాన్యువల్ ఏసీ, వెనుక పార్శిల్ ట్రే, రిక్లైనింగ్ అండ్ ఫ్రంట్ స్లైడింగ్ సీట్లు కలిగిన ఫ్రంట్ పవర్ విండోలతో రానుంది. గతంలో మారుతి సుజుకి పలు వేరియంట్లకు టూర్ వెర్షన్ మోడల్స్ను తీసుకొచ్చింది. ఇప్పుడు డిజైర్, ఎర్టిగా టూర్ వెర్షన్ మోడల్స్కు మారుతి సుజుకీ వ్యాగన్ఆర్ కూడా వచ్చి చేరింది. వ్యాగన్ఆర్ టూర్ హెచ్3 పెట్రోల్, సీఎన్జీ వేరియంట్లలో రానుంది. పెట్రోల్ వేరియంట్ ధర రూ. 5.39 లక్షలు కాగా, సీఎన్జీ వేరియంట్ రూ. 6.34 లక్షలుగా ఉంది. సేఫ్టీ విషయానికి వస్తే..! మారుతి సుజుకి వ్యాగన్ఆర్ టూర్ హెచ్3 కారులో డ్యూయల్ ఎయిర్బ్యాగ్లు, ఈబీడీ టెక్నాలజీతో ఎబీఎస్ బ్రేకింగ్ సిస్టమ్స్, స్పీడ్ లిమిటింగ్ ఫంక్షన్, రియర్ పార్కింగ్ సెన్సార్స్, సెంట్రల్ డోర్ లాకింగ్తో రానుంది. ఇంజిన్ విషయానికి వస్తే..! మారుతి సుజుకి వ్యాగన్ఆర్ టూర్ హెచ్3 పెట్రోల్, సీఎన్జీ వేరియంట్లలో రానుంది. పెట్రోల్ పవర్ ట్రైన్తో..1.0-లీటర్, 3-సిలిండర్, K10C పెట్రోల్ ఇంజన్తో 5,500rpm వద్ద 64bhp శక్తిని, 3,500rpm వద్ద 89Nm గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేయనుంది. ఇది మారుతి సుజుకి డ్యూయల్జెట్ సాంకేతికతను ఐడిల్ స్టార్ట్-స్టాప్ సిస్టమ్తో పొందుతుంది. దీంతో ఈ కారు 25.4km/l మైలేజ్ను అందిస్తుంది. సీఎన్జీ వేరియంట్లో డ్యూయల్ జెట్ సాంకేతికత లేదు. ఈ వెర్షన్ 5,300rpm వద్ద 56bhp శక్తిని, 3,400rpm వద్ద 82Nm గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్బాక్స్తో రానుంది. ఈ వేరియంట్ గరిష్టంగా 34.73km/kg మైలేజ్ను అందించనుంది. చదవండి: హల్చల్ చేస్తోన్న టాటా మోటార్స్ కొత్త ఎలక్ట్రిక్ కారు..! లాంచ్ ఎప్పుడంటే..? -
మారుతి సుజుకీ కస్టమర్లకు శుభవార్త..! కేవలం రూ. 500తో..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైడ్రోస్టాటిక్ లాక్, ఇంధన కల్తీ కారణంగా వాహనాల ఇంజన్లో ఊహించని వైఫల్యాలు తలెత్తుతుంటాయి. ఇటువంటి సమస్యలు ఉత్పన్నమైతే మేమున్నామని భరోసా ఇస్తోంది మారుతి సుజుకీ ఇండియా. స్వల్ప మొత్తంతో కస్టమర్ కన్వీనియెన్స్ ప్యాకేజీని (సీసీపీ) ప్రకటించింది. సీసీపీ కింద ఆల్టో, వేగన్–ఆర్ మోడళ్లకైతే రూ.500 చెల్లించాలి. ఇంజన్ పాడైతే మారుతి సుజుకీ అధీకృత సర్వీస్ సెంటర్ తీసుకెళితే చాలు. ఎటువంటి ప్రశ్నలు వేయకుండా రిపేర్ చేసి ఇస్తారు. ‘రోడ్లపై వరద నీరు కారణంగా ఇంజన్ నిలిచిపోతోంది. అలాగే కల్తీ ఇంధన ప్రభావం కొన్నేళ్లుగా పెరుగుతోంది. ఇటువంటి సందర్భాల్లో కస్టమర్లకు సీసీపీ ఉపశమనం కలిగిస్తుంది’ అని కంపెనీ వెల్లడించింది. దేశవ్యాప్తంగా సంస్థకు 2,100 నగరాలు, పట్టణాల్లో 4,200లకుపైగా సర్వీస్ టచ్ పాయింట్స్ ఉన్నాయి. చదవండి: మైలేజ్లో రారాజు..మారుతి సుజుకీ రికార్డుల హోరు..! 10 లక్షలకుపైగా.. -
మైలేజ్లో రారాజు..మారుతి సుజుకీ సరికొత్త రికార్డు..!
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఎస్-సీఎన్జీ వేరియంట్ వాహనాల అమ్మకాలు సరికొత్త మైలురాయిను తాకింది. భారత్లో ఏకంగా 10 లక్షల యూనిట్లకు పైగా ఎస్-సీఎన్జీ వేరియంట్ వాహనాలు అమ్ముడైనట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. గ్రీన్ మొబిలిటీ లక్ష్యంగా..! గ్రీన్ మొబిలిటీ వైపు అడుగులు వేస్తూ మారుతి సుజుకి కంపెనీ పోర్ట్ఫోలియోలోని పలు మోడళ్లను సీఎన్జీ వేరియంట్స్గా మార్చింది. ఆల్టో, ఎస్-ప్రెస్సో, వ్యాగన్ఆర్, సెలెరియో, డిజైర్, ఎర్టిగా, ఈకో, సూపర్ క్యారీ , టూర్-ఎస్ మోడళ్లను సీఎన్జీ వేరియంట్స్గా కొనుగోలుదారులకు అందుబాటులోకి తెచ్చింది. మారుతి సుజుకి ఎస్-సీఎన్జీ కార్లు మైలేజ్లో రారాజుగా నిలుస్తూ కొనుగోలుదారుల నుంచి భారీ ఆదరణను పొందాయి. ఆటోమొబైల్ ఇండస్ట్రీలో అత్యధిక సీఎన్జీ మోడల్స్ను ఉత్పత్తి చేసిన కంపెనీగా మారుతి సుజుకీ నిలుస్తోందని మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరక్టర్ అండ్ సీఈవో కెనిచీ అయుకవా అన్నారు. అంతేకాకుండా గ్రీన్ మొబిలిటే లక్ష్యంగా, సురక్షితమైన, విశ్వసనీయమైన, మన్నికైన వాహనాలను అందించేందుకు సిద్దంగా ఉన్నామని అభిప్రాయపడ్డారు. 2016-17లో మారుతీ సుజుకి 3.5 లక్షల S-CNG విక్రయాల మైలురాయిని చేరుకుంది సీఎన్జీ విస్తరణతో తక్కువ వ్యవధిలోనే 10 లక్షల మైలురాయిని అందుకుంది. కొద్ది రోజుల క్రితం ఎస్-సీఎన్జీ పోర్ట్ఫోలియో భాగంగా న్యూ డిజైర్ మోడల్ను కంపెనీ లాంచ్ చేసింది. సీఎన్జీ మోడళ్లలో సెలెరియో 35. 60 కిమీ/కేజీ, వ్యాగనఆర్ 34.05 కిమీ/కేజీ, ఆల్టో 31.59 కిమీ/కేజీ, ఎస్ ప్రెస్సో 31.20 కిమీ/కేజీ, డిజైర్ 31.12 కిమీ/కేజీ, ఎర్టిగా 26.08 కిమీ/కేజీ, ఈకో 20.88 కిమీ/కేజీ మేర మైలేజ్ను అందిస్తున్నాయి. చదవండి: అత్యధిక మైలేజ్ ఇచ్చే కారును లాంచ్ చేసిన మారుతి సుజుకీ..! -
కొత్త కారు కొనేవారికి మారుతి సుజుకి బంపర్ ఆఫర్..!
కొత్తగా కారు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకీ ఇండియా తాజాగా తన కార్లపై అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. కారు కొనుగోలుపై భారీగా తగ్గింపు అందిస్తోంది. హోలీ పండగ సందర్భంగా భారీగా ఆఫర్ ఇస్తున్నట్లు ప్రకటించింది. దేశంలో అతిపెద్ద వాహన తయారీ సంస్థ అయిన మారుతీ పాపులర్ మోడల్స్ అన్నింటిపై భారీ డిస్కౌంట్లు, పండుగ ఆఫర్లు ప్రకటించింది. ఆల్టో, ఎస్-ప్రెసో, సెలెరియో, వేగన్ఆర్, స్విఫ్ట్, డిజైర్, బ్రెజా మోడల్స్పై ఈ డిస్కౌంట్లు లభించనున్నాయి. మహీంద్రా, టాటా వంటి ఇతర తయారీ కంపెనీలు కూడా తమ కార్లపై డిస్కౌంట్ అందిస్తున్నాయి. మారుతి సుజుకి ఆల్టో మారుతి ఆల్టో(ఎస్టిడి)పై రూ.5,000 నగదు డిస్కౌంట్, రూ.3,000 కార్పొరేట్ డిస్కౌంట్ అందుబాటులో ఉన్నాయి. మారుతి ఆల్టో అత్యంత పాకెట్ ఫ్రెండ్లీ కార్లలో ఒకటి. ధీని ధర రూ.3.25 లక్షలతో ప్రారంభమవుతుంది. మారుతి సుజుకి సెలెరియో మారుతి సుజుకి సెలెరియో మాన్యువల్ వేరియెంట్లపై రూ.10,000 నగదు డిస్కౌంట్, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.3,000, ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.10,000 లభిస్తుంది. ఇంకా హ్యాచ్ బ్యాక్ గురించి మాట్లాడీతే.. మారుతి సుజుకి ఎస్-ప్రెస్సోపై రూ.15,000 భారీ నగదు డిస్కౌంట్, రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.3,000 కార్పొరేట్ డిస్కౌంట్ పొందవచ్చు. మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ మారుతి సుజుకి వ్యాగన్ఆర్ పై అతిపెద్ద డిస్కౌంట్ ఆఫర్ అందిస్తుంది. దీని మాన్యువల్ వేరియెంట్లు మార్చి 2022 వరకు 1.0-లీటర్ పెట్రోల్ వేరియెంట్లపై రూ.25,000, 1.2-లీటర్ పెట్రోల్ వేరియెంట్లపై రూ.20,000 నగదు డిస్కౌంట్ 'తో లభ్యం అవుతాయి. రూ.10,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్, రూ.4,000 కార్పొరేట్ డిస్కౌంట్ అదనం. మారుతి సుజుకి స్విఫ్ట్ మారుతి సుజుకి స్విఫ్ట్ పై డిస్కౌంట్ల విషయానికి వస్తే, ఇది ఎల్ఎక్స్ ఐ వేరియెంట్లపై రూ.10,000, విఎక్స్ఐ & జెడ్ఎక్స్ఐ వేరియెంట్లపై రూ.20,000 నగదు డిస్కౌంట్, 10,000 ఎక్స్ఛేంజ్ బెనిఫిట్, రూ.3,000 కార్పొరేట్ డిస్కౌంట్ లభిస్తుంది. మారుతి సుజుకి డిజియర్ మారుతి సుజుకి డిజిర్ రూ.3,000 కార్పొరేట్ డిస్కౌంట్'తో పాటు క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్ కలిపి రూ.10,000 డిస్కౌంట్ అందిస్తుంది. ఈ డిస్కౌంట్ మాన్యువల్ వేరియెంట్ కార్ల కొరకు మాత్రమే అని గుర్తుంచుకోవాలి. మారుతి సుజుకి వితారా బ్రెజ్జా మారుతి సుజుకి వితారా బ్రెజ్జా కారుపై రూ.5,000 నగదు డిస్కౌంట్, రూ.10,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్, రూ.3,000 కార్పొరేట్ డిస్కౌంట్ లభిస్తుంది. (చదవండి: మదుపరులకు శుభవార్త.. ఎల్ఐసీ ఐపీఓకు సెబీ ఆమోదం..!) -
అత్యధిక మైలేజ్ ఇచ్చే కారును లాంచ్ చేసిన మారుతి సుజుకీ..!
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకి భారత మార్కెట్లలోకి సరికొత్త కాంపాక్ట్ సెడాన్ డిజైర్లో సీఎన్జీ వేరియంట్ను విడుదల చేసింది. ఇది భారత్లో మోస్ట్ ఫ్యూయల్ ఎఫిసియంట్ కారుగా నిలుస్తోందని కంపెనీ పేర్కొంది. న్యూ డిజైర్ ఎస్-సీఎన్జీ గ్రీన్ మొబిలిటే లక్ష్యంగా మారుతి సుజుకీ పలు మోడళ్లను సీఎన్జీ వేరియంట్గా మారుస్తోంది. ఈ మోడల్తో మొత్తంగా 9 మోడల్ కార్లను సీఎన్జీ టెక్నాలజీతో జతచేసింది. మారుతి సుజుకీ న్యూ డిజైర్ ఎస్- సీఎన్జీ వేరియంట్ ధర రూ. 8 లక్షల నుంచి ప్రారంభం కానుంది. హై-ఎండ్ వేరియంట్ జెడ్ఎక్స్ఐ రూ. 8.82 లక్షల వద్ద లభిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ మోడల్ కోసం బుకింగ్స్ ప్రారంభించామని, కొనుగోలుదారులు డీలర్ల వద్ద రూ. 11,000 అడ్వాన్స్ రూపంలో చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది. దేశీయంగా సీఎన్జీ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని కంపెనీ వరుసగా సీఎన్జీ మోడల్స్ను మార్కెట్లోకి తీసుకొస్తోంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో డిజైర్ మోడల్కు వినియోగదారుల నుంచి అద్భుతమైన ఆదరణ ఉంది. కంపెనీ ఇప్పటికే మారుతి ఆల్టో, మారుతి ఎస్-ప్రెస్సో, వ్యాగన్ఆర్, మారుతీ ఎకో, మారుతీ సెలెరియో, ఎర్టిగా మోడళ్లను సీఎన్జీ వేరియంట్లో విక్రయిస్తోంది. ఈ జాబితాలో ఇప్పుడు డిజైర్ను కూడా తీసుకొచ్చింది ఇంజన్ విషయానికి వస్తే..! ఇంధన ధరల నుంచి ఉపశమనం కల్పిస్తూ మోస్ట్ ఫ్యూయల్ ఎఫిసియంట్ కారుగా న్యూ డిజైర్ ఎస్-సీఎన్జీ వేరియంట్ను కొనుగోలుదారులకు మారుతి సుజుకీ అందుబాటులోకి తెచ్చింది. కొత్త డిజైర్ ఎస్-సీఎన్జీ సాంకేతికతతో, కే-సిరీస్ డ్యూయల్ జెట్, డ్యూయల్ VVT 1.2L ఇంజన్ జతచేశారు. ఇది 57kW గరిష్ట శక్తిని, 98.5Nm గరిష్ట టార్క్ను అందించనుంది. ఈ కొత్త డిజైర్ ఒక కేజీకి 31.12 కిమీ మేర మైలేజీని అందిస్తోందని కంపెనీ పేర్కొంది. ఫీచర్స్లో సరికొత్తగా.. ఫీచర్ల పరంగా ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లేతో పాటు ఆటోమెటిక్ క్లైమెట్ కంట్రోల్, డ్యుయెల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్, బ్రేక్ అసిస్ట్ లాంటి అనేక అత్యాధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయని కంపెనీ వెల్లడించింది. చదవండి: క్రేజీ ఆఫర్..! పలు మహీంద్రా కార్లపై రూ. 3 లక్షల వరకు భారీ తగ్గింపు..! -
ప్రముఖ కంపెనీతో మారుతీ సుజుకీ కీలక ఒప్పందం..!
Maruti, Quiklyz tie up for vehicle subscription: లీజింగ్ సబ్స్కిప్షన్ వేదిక క్విక్లీజ్తో వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ భాగస్వామ్యం కుదుర్చుకుంది. నెలవారీ చందా ప్రాతిపదికన క్విక్లీజ్ వేదికగా మారుతీ సుజుకీ వాహనాలను వినియోగదార్లు తీసుకోవడానికి ఈ భాగస్వామ్యం తోడ్పడుతుంది. సబ్స్క్రైబ్ పేరుతో మారుతీ సుజుకీ 2020 జూలై నుంచి సబ్స్క్రిప్షన్పైన వాహనాలను సమకూరుస్తోంది. వైట్ ప్లేట్ లేదా బ్లాక్ ప్లేట్ సబ్స్క్రిప్షన్ను ఎంచుకోవచ్చు. వాహనం కస్టమర్ పేరునే నమోదు అవుతుంది. హైదరాబాద్తో సహా 20 నగరాల్లో ఈ సౌకర్యం ఉంది. 12-60 నెలల కాలపరిమితితో వాహనాన్ని తీసుకోవచ్చు. కాల పరిమితి ముగిసిన తర్వాత వాహనాన్ని వెనక్కి ఇవ్వడం లేదా అప్గ్రేడ్కూ అవకాశం ఉంది. ఎటువంటి ముందస్తు చెల్లింపు అవసరం లేదు. బీమా, నిర్వహణ ఖర్చులు కలుపుకుని నెలవారీ రుసుము రూ.11,000 నుంచి ప్రారంభం. క్విక్లీజ్ను మహీంద్రా ఫైనాన్స్ ప్రమోట్ చేస్తోంది. చందాపై వాహనాలను కస్టమర్లకు చేర్చడానికి ఏఎల్డీ ఆటోమోటివ్, మైల్స్, ఓరిక్స్తో ఇప్పటికే మారుతీ సుజుకీ చేతులు కలిపింది. (చదవండి: 5 మిలియన్ టన్నుల హరిత హైడ్రోజన్ ఉత్పత్తి!) -
అదిరిపోయిన మారుతి సుజుకి ఎలక్ట్రిక్ కారు.. రేంజ్ ఎక్కువ, ధర తక్కువ..!
ఇప్పటికే మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల జోరు కొనసాగుతున్న మనకు తెలిసిందే. ప్రముఖ దిగ్గజ కంపెనీలతో సహ ఇతర స్టార్టప్ కంపెనీలు తమ వాహనాలను విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నాయి. కొన్ని సంస్థల ఎలక్ట్రిక్ కార్లు, బైక్లు, స్కూటర్లు ఇప్పటికే మార్కెట్లోకి విడుదల అయ్యాయి. ప్రస్తుతం కార్ల అమ్మకాల్లో టాటా మోటార్స్ దూసుకొని వెళ్తుంది. ఈవీ రంగంలో కాస్త వెనుక బడిన దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి(ఎంఎస్ఐ) కూడా ఎలక్ట్రిక్ వెహికల్(ఈవీ) సెగ్మెంట్లోకి అడుగు పెట్టేందుకు సిద్ధం అవుతుంది. టయోటా కిర్లోస్కర్ మోటార్స్తో కలిసి గ్లోబల్ మిడ్ సైజ్ ఎలక్ట్రిక్ ఎస్యూవీని మారుతి సుజుకి అభివృద్ధిచేస్తున్నట్లు సమాచారం. ఈ ఎలక్ట్రిక్ కారుకి వైవై8 అనే కోడ్నేమ్ పెట్టాయి. ఇప్పటివరకు మార్కెట్లోకి వచ్చిన ఈవీ కార్ల కంటే చాలా శక్తిమంతమైన ఎలక్ట్రిక్ కారుగా నిల్వనున్నట్లు సమాచారం. ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీని విదేశాలకు కూడా ఎగుమతి చేసేలా రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. దీనిని సుజుకికి చెందిన గుజరాత్ ప్లాంట్లో తయారు చేయనుంది. నివేదిక ప్రకారం.. వైవై8 4.2 మీటర్ల పొడవైన బాడి, పొడవైన 2,700 మీ.మీ వీల్ బేస్ ఉండనుంది. ఇందులో 48 కెడబ్ల్యుహెచ్ బ్యాటరీతో కూడిన సింగిల్ 138 హెచ్పీ మోటార్ ఉంటుంది. ఈ మోడల్ ఎలక్ట్రిక్ కారుని ఒకసారి ఛార్జ్ చేస్తే సుమారు 400 కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది. 59 కెడబ్ల్యుహెచ్ బ్యాటరీ, 170 హెచ్పీ మోటార్ గల మోడల్ కారు 500 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుందని సమాచారం. మారుతి-టయోటా అభివృద్ధి చేస్తున్న ఎలక్ట్రిక్ ఎస్యూవీ కారులో వినియోగించే భారత్లో తయారు చేసిన బ్యాటరీలే వాడనున్నారు. గుజరాత్లోని లిథియం అయాన్ బ్యాటరీ మాన్యుఫాక్చరర్ టీడీఎస్జీ ఈ బ్యాటరీలు తయారు చేస్తున్నది. ఈ బ్యాటరీని సుజుకి మోటార్ కార్పొరేషన్, డెన్సో కార్పొరేషన్, తొషిబా కార్పొరేషన్ ఉమ్మడిగా అభివృద్ది చేస్తున్నాయి. 2025లో మారుతి-టయోటా వైవై8 ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లోకి రానున్నది. ప్రస్తుతం రెండు కంపెనీలు కారు ధర తగ్గించడంపైనే ఫోకస్ చేస్తున్నాయి. టాటా నెక్సాన్ ఈవీ, ఎంజీ మోటార్స్ జడ్ఎస్ ఈవీ కంటే మారుతి-టయోటా ఈవీ కారు ధర చాలా తక్కువగా ఉంటుందని సమాచారం. ఈ కారు ధర రూ.13-15 లక్షలు ఉంటుందని అంచనా. (చదవండి: రయ్మంటూ దూసుకెళ్లిన రిలయన్స్..! డీలా పడ్డ టీసీఎస్..!) -
మారుతికి షాకిచ్చిన మహీంద్రా, టాటాలు
Auto Sales In January 2022: దేశీయ ఆటో తయారీ కంపెనీల జనవరి వాహన విక్రయ గణాంకాలు అంతంత మాత్రంగానే నమోదయ్యాయి. ఈ 2022 ఏడాది తొలి నెలలో మారుతీ సుజుకీ, హ్యుందాయ్ మోటార్స్ వాహన అమ్మకాలు క్షీణించాయి. అయితే టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, నిస్సాన్, స్కోడా అమ్మకాలు మెరుగుపడ్డాయి. ఇదే జనవరిలో ద్విచక్ర వాహన కంపెనీలైన బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్ అమ్మకాల్లో రెండెంకల క్షీణత నమోదైంది. మూడోదశ లాక్డౌన్ ప్రభావంతో వాణిజ్య వాహనాలకు డిమాండ్ తగ్గింది. ఫలితంగా అశోక్ లేలాండ్, ఎస్కార్ట్స్ అమ్మకాలు తగ్గాయి. సెమికండెక్టర్ల కొరత కొనసాగడంతో వాహన ఉత్పత్తి ఆశించిన స్థాయిలో జరగలేదని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. - మారుతీ సుజుకి ఇండియా జనవరిలో మొత్తం అమ్మకాలు 3.96 శాతం పడిపోయి 1,54,379 యూనిట్లకు చేరింది. గతేడాది 2021 జనవరిలో కంపెనీ 1,60,752 యూనిట్లను విక్రయించినట్లు కంపెనీ పేర్కొంది. - ప్యాసింజర్ వాహనాల (పీవీ) విక్రయాల్లో టాటా మోటార్స్27 శాతం వృద్ధిని నమోదు చేసింది. గతేడాది జనవరిలో ఈ సంస్థ 59,866 కార్లను అమ్మగా.. ఈ 2022 జనవరిలో 76,210 యూనిట్లను అమ్మింది. - ద్విచక్ర వాహన తయారీ కంపెనీ బజాజ్ ఆటో దేశీయ అమ్మకాలు 15 శాతం క్షీణించాయి. గతేడాది జనవరిలో 4.25 లక్షల వాహనాలను విక్రయించగా.., ఈ ఏడాది తొలి నెలలో 3.63 లక్షల యూనిట్లకు పరిమితమైంది. చదవండి: ప్రభుత్వం చేయలేనిది.. టాటా గ్రూపు చేసి చూపింది -
మారుతి సుజుకిపై అనూహ్యమైన దెబ్బ..! ఆ రెండూ తీవ్రంగా దెబ్బతీశాయి..!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికనలో నికర లాభం 48 శాతం క్షీణించి రూ. 1,042 కోట్లకు పరిమితమైంది. ఇందుకు అమ్మకాలు నీరసించడం, సెమీకండక్టర్ల కొరత, కమోడిటీల ధరలు పెరగడం ప్రభావం చూపాయి. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 1,997 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం నామమాత్రంగా రూ. 218 కోట్లు తగ్గి రూ. 23,253 కోట్లకు చేరింది. మొత్తం వాహన అమ్మకాలు 13 శాతం నీరసించి 4,30,668 యూనిట్లను తాకాయి. గత క్యూ3లో 4,95,897 వాహనాలు విక్రయించింది. దేశీయంగా ఈ క్యూ3లో 3,65,673 వాహనాలను మారుతీ సుజుకీ విక్రయించింది. గతేడాది ఇదే కాలంలో 4,67,369 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. అయితే కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా ఒక త్రైమాసికంలో 64,995 వాహనాలను ఎగుమతి చేసింది. గత క్యూ3లో ఈ సంఖ్య 28,528 యూనిటు. కాగా.. 2021 డిసెంబర్తో ముగిసిన 9 నెలల కాలంలో కంపెనీ నికర లాభం రూ. 3,148 కోట్ల నుంచి రూ. 2,004 కోట్లకు జారింది. ఆదాయం మాత్రం రూ. 46,338 కోట్ల నుంచి రూ. 61,581 కోట్లకు జంప్చేసింది. కన్సాలిడేటెడ్ ఫలితాలివి. ఫలితాల నేపథ్యంలో షేరు బీఎస్ఈలో 7% జంప్చేసి రూ. 8,601 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 8,662 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది. చదవండి: ఎగుమతుల్లో హ్యుందాయ్ సంచలనం! ఎస్యూవీ కేటగిరీల్లో క్రెటా ఏకంగా.. -
పెట్రోలు బాధల నుంచి ఉపశమనం.. మారుతి నుంచి సీఎన్జీ వేరియంట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ సెలెరియో సీఎన్జీ వేరియంట్ను పరిచయం చేసింది. ధర ఢిల్లీ ఎక్స్షోరూంలో రూ.6.58 లక్షలు. ఎస్–సీఎన్జీ టెక్నాలజీతో కె–సిరీస్ 1.0 లీటర్ ఇంజన్ పొందుపరిచారు. మైలేజీ కేజీకి 35.6 కిలోమీటర్లు. ట్యాంక్ సామర్థ్యం 60 లీటర్లు. అంత క్రితం విడుదలైన సెలెరియో కార్లలో ఎస్–సీఎన్జీ వేరియంట్ యూనిట్ల వాటా 30 శాతముంది. మారుతి సుజుకీ ఖాతాలో 8 మోడళ్లకుగాను 9,50,000 యూనిట్ల ఎస్–సీఎన్జీ వాహనాలు ఇప్పటి వరకు అమ్ముడయ్యాయి. అయిదేళ్లలో సీఎన్జీ విక్రయాల్లో ఏటా 22 శాతం వృద్ధి సాధిస్తున్నట్టు మారుతి సుజుకీ సోమవారం తెలిపింది. -
ఆకర్షణీయమైన లుక్స్తో సరికొత్తగా రానున్న మారుతి సుజుకీ బాలెనో..!
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకీ ఆకర్షనీయమైన లుక్స్తో సరికొత్త మారుతి సుజుకీ బాలెనో ఫేస్లిఫ్ట్ 2022 ఎడిషన్ కారును త్వరలోనే లాంచ్ చేయనుంది. ఈ కారును వచ్చే నెల ఫిబ్రవరిలో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. బాలెనోతోపాటుగా మారుతి సుజుకీ సెలెరియో సీఎన్జీ వేరియంట్ను కూడా లాంచ్ చేయనుంది. న్యూ లుక్స్తో..! మారుతి సుజుకీ బాలెనో ఫేస్లిఫ్ట్ ఎడిషన్లో మెకానికల్ ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చునని సమాచారం. అయితే డిజైన్, ఇంటిరీయర్స్ విషయంలో సరికొత్త మార్పులను జతచేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మారుతి సుజుకీ బాలెనో ఫేస్లిఫ్ట్ 2022 ఎడిషన్లో భాగంగా ... భారీ గ్రిల్, న్యూ రాప్అరౌండ్ హెడ్ల్యాంప్స్, న్యూ ఎల్ ఈడీ డీఆర్ఎల్ సిగ్నేచర్స్, రివైజ్డ్ ఫ్రంట్ బంపర్, న్యూ ఫాగ్ ల్యాంప్స్, రియర్ సైడ్ రీడిజైన్ట్ టెయిల్ ల్యాంప్స్, న్యూ బంపర్, రివైజ్డ్ డిజైన్ టెయిల్ గేట్ వంటి ఫీచర్లతో రానుంది. న్యూ బాలెనో 2022 ఫేస్లిఫ్ట్ మోడల్ ఇంజిన్లో ఎలాంటి మార్పులు ఉండవు. 1.2-లీటర్ నేచురల్-ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, మైల్డ్-హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్తో రానుంది. 5-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్తో రానుంది. చదవండి: అమెరికాలో అమెరికన్ కంపెనీకి దిమ్మదిరిగే షాక్..! -
అమ్మకాల్లో దూసుకెళ్తున్న మారుతీ సుజుకీ బాలెనో కారు!
ప్రముఖ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీకి చెందిన బాలెనో కారు అమ్మకాల్లో దూసుకెళ్తుంది. మారుతి సుజుకి ప్రీమియం హ్యాచ్ బ్యాక్ బాలెనో ఈ ఏడాది 10లక్షల మైలు రాయిని దాటినట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. మారుతి సుజుకి హ్యాచ్ బ్యాక్ కారు మార్కెట్ వాటాలో 25 శాతం వాటాను కలిగి ఉంది. నెక్సా కస్టమర్ల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన బాలెనో 248 నగరాల్లోని 399 అవుట్ లెట్ల ద్వారా విక్రయిస్తున్నారు. మారుతి సుజుకి బాలెనోను 2015 అక్టోబర్ నెలలో లాంచ్ చేశారు. ప్రారంభించిన ఒక సంవత్సరంలోనే 1 లక్ష యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ మోడల్ 2018 నాటికి ఈ కారు విక్రయాలు 5 లక్షలు దాటేశాయి. ఆ తర్వాత ఐదులక్షల విక్రయాలను మూడేళ్లలోనే పూర్తి చేసుకోవడం విశేషం. "లాంఛ్ చేసినప్పటి నుంచి బాలెనో ప్రీమియం హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్ కార్లలో తన సత్తా చాటుతుంది. ఇది డిజైన్, భద్రత, ఆవిష్కరణలో కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. 25 శాతానికి పైగా మార్కెట్ వాటాతో "బాలెనో" ప్రీమియం హ్యాచ్ బ్యాక్ విభాగంలో నాయకత్వం వహిస్తున్నట్లు" అని మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(మార్కెటింగ్ అండ్ సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. (చదవండి: 2021లో వచ్చిన బెస్ట్ సూపర్ స్మార్ట్ఫోన్స్ ఇవే..!) బాలెనో 1.2 లీటర్ డ్యూయల్ జెట్, సెగ్మెంట్-ఫస్ట్ స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీతో పనిచేసే డ్యూయల్ వీవీటి ఇంజిన్ కలిగి ఉంది. ఇది, ఐడిల్ స్టార్ట్-స్టాప్, సివిటి ట్రాన్స్ మిషన్ కలిగి ఉంది. పెట్రోల్ యూనిట్ 1.2-లీటర్ ఇంజిన్ రూపంలో 82 బిహెచ్పి, 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. రెండవ పెట్రోల్ ఇంజన్ కొత్త 1.2-లీటర్ డ్యూయల్ జెట్ స్మార్ట్ హైబ్రిడ్ యూనిట్ రూపంలో ఉంది. ఇది 89 బిహెచ్పి & 113 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. (చదవండి: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. కొత్త రూల్స్ పాటించాల్సిందే!) -
చిప్ల కొరతతో వాహన డిమాండ్కు భారీ దెబ్బ!
న్యూఢిల్లీ: సెమీకండక్టర్లు (చిప్) సరఫరాలో తీవ్ర జాప్యం వల్ల ఉత్పాదన దెబ్బతింటోందని కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. దీనివల్ల కార్ల డిమాండ్పై తీవ్ర ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ప్రస్తుతానికైతే మార్కెట్లో డిమాండ్ బాగానే ఉందని, బుకింగ్లు కూడా మెరుగ్గానే ఉన్నాయని శ్రీవాస్తవ పేర్కొన్నారు. అయితే, కార్ల లభ్యత సమస్యగా మారిందని, వెయిటింగ్ పీరియడ్ గణనీయంగా పెరిగిపోయిందని వివరించారు. ‘ఇలా సుదీర్ఘ సమయం పాటు వేచి ఉండాల్సి రావడం వల్ల డిమాండ్ ధోరణులపై ప్రతికూల ప్రభావాలు పడవచ్చేమో అన్న ఆందోళన నెలకొంది‘ అని శ్రీవాస్తవ పేర్కొన్నారు. అయితే, తాము ఎప్పటికప్పుడు కస్టమర్లతో మాట్లాడుతూనే ఉన్నందువల్ల బుకింగ్లేమీ రద్దు కావడం లేదని ఆయన చెప్పారు. ‘పరిస్థితి ఏమిటి, ఎప్పట్లోగా వాహనం అందుకోవచ్చు వంటి విషయాల గురించి ప్రతీ వారం దాదాపు ప్రతీ కస్టమర్ను సంప్రదించి, వివరిస్తున్నాం. చాలా మటుకు కస్టమర్లు అర్థం కూడా చేసుకుంటున్నారు‘ అని శ్రీవాస్తవ తెలిపారు. మోడల్, వేరియంట్ను బట్టి వెయిటింగ్ పీరియడ్ అనేది కొద్ది వారాలు మొదలుకుని నెలల దాకా ఉంటోంది. ప్రస్తుతం సెమీకండక్టర్ల సరఫరా కాస్త మెరుగుపడుతోందని శ్రీవాస్తవ వివరించారు. మారుతీకి ప్రస్తుతం 2.5 లక్షల యూనిట్ల ఆర్డర్లు పెండింగ్లో ఉన్నాయి. నవంబర్లో కంపెనీ ప్లాంట్లు .. ఉత్పత్తి సామర్థ్యాల్లో దాదాపు 80 శాతం మేర పనిచేశాయి. (చదవండి: 900 మంది ఉద్యోగుల తొలగింపుపై హర్ష్ గోయెంకా కీలక వ్యాఖ్యలు!) -
నవంబర్లో ఎక్కువగా అమ్ముడైన టాప్-10 కార్లు ఇవే!
Here Are the Top 10 Best-Selling Cars From November: భారతదేశంలో కార్ల అమ్మకాల్లో మారుతి సుజుకి ఇండియా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. నవంబర్ నెలలో అత్యధికంగా అమ్ముడవుతున్న పది కార్ల జాబితాలో ఏడు స్థానాలను మారుతి సుజుకి ఇండియా ఆక్రమించింది. ఇండో-జపనీస్ కార్ల తయారీ కంపెనీ నవంబర్ నెలలో మొత్తంగా 9 శాతం అమ్మకాలు పడిపోయినప్పటికీ, జాబితాలో మాత్రం అగ్రస్థానంలో నిలిచింది. ఈ జాబితాలో మిగిలిన మూడు హ్యుందాయ్, కియా, టాటా మోటార్స్ కు చెందిన ఒక్కొక్క మోడల్ ఉన్నాయి. నవంబర్లో భారతదేశంలో ఎక్కువగా అమ్ముడైన టాప్ 10 కార్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 1. మారుతి వ్యాగన్ఆర్ దేశంలో అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాలో మారుతి సుజుకికి చెందిన వ్యాగన్ఆర్ అగ్రస్థానంలో నిలిచింది. మారుతి నవంబర్ 2021లో 16,853 యూనిట్ల వ్యాగన్ఆర్ కార్లను విక్రయించింది. ఇది నవంబర్ 2020లో విక్రయించిన 16,256 యూనిట్ల కంటే కొంచెం ఎక్కువ. 2. మారుతి స్విఫ్ట్ ఈ జాబితాలో మారుతి సుజుకికి వచ్చిన మారుతి స్విఫ్ట్ రెండవ స్థానంలో నిలిచింది. గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్లో తక్కువ రేటింగ్ పొందినప్పటికి అమ్మకాల పరంగా దూసుకెళ్లింది. మారుతి సుజుకి 2021 నవంబర్ నెలలో స్విఫ్ట్ 14,568 యూనిట్లను విక్రయించింది. అయితే, గత సంవత్సరంతో పోలిస్తే అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. మారుతి 2020 నవంబర్ నెలలో 18,498 యూనిట్ల స్విఫ్ట్ కార్లను విక్రయించింది. 3. మారుతి ఆల్టో ఈ జాబితాలో మూడవ స్థానంలో కూడా మారుతి సుజుకికి చెందిన మారుతి ఆల్టో నిలిచింది. ఇది అక్టోబర్ నెలలో అగ్ర స్థానాన్ని కలిగి ఉంది, కానీ ఈసారి దీనిని వ్యాగన్ఆర్ ఓడించింది. మారుతి సుజుకి 2021 నవంబర్ నెలలో 13,812 యూనిట్ల ఆల్టో కార్లను విక్రయించింది. ఇది గత ఏడాది ఇదే నెలలో విక్రయించిన 15,321 యూనిట్ల కంటే తక్కువ. 4. మారుతి విటారా బ్రెజ్జా విటారా బ్రెజ్జా, భారతీయ మార్కెట్లలోకి ప్రవేశించిన మొట్టమొదటి సబ్-కాంపాక్ట్ ఎస్యువీ కారు. మారుతీ గత నవంబర్ నెలలో 10,760 యూనిట్ల బ్రెజ్జాను విక్రయించింది, గత ఏడాది ఇదే కాలంలో విక్రయించగలిగిన 7.838 యూనిట్ల కంటే చాలా ఎక్కువ. మారుతి రాబోయే రోజుల్లో బ్రెజ్జా యొక్క ఫేస్లిఫ్ట్ వెర్షన్ను కూడా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది. అయితే, కార్మేకర్ ఇంకా నిర్దిష్ట లాంచ్ టైమ్లైన్ను వెల్లడించలేదు. 5. హ్యుందాయ్ క్రెటా ఈ జాబితాలో కనిపించిన మొదటి నాన్-మారుతి కారు హ్యుందాయ్ క్రెటా మాత్రమే. గత కొంత కాలంగా చిప్ సంక్షోభం ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తున్నప్పటికీ హ్యుందాయ్ నవంబర్లో 10,300 యూనిట్ల క్రెటా కాంపాక్ట్ ఎస్యువీని విక్రయించింది. గతేడాది నవంబర్లో హ్యుందాయ్ క్రెటా 12,017 యూనిట్లను విక్రయించింది. 6. మారుతి బాలెనో దేశంలో అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాలో 6వ స్థానంలో మారుతి బాలెనో నిలిచింది. మారుతి నవంబర్ 2020లో 17,872 యూనిట్లతో పోలిస్తే నవంబర్ 2021లో 9,931 యూనిట్ల బాలెనో కార్లను విక్రయించింది. ఈ కారు కూడా లాటిన్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్లో తక్కువ రేటింగ్ పొందింది. 7. టాటా నెక్సన్ దేశంలో అత్యధికంగా అమ్ముడైన కార్ల టాప్-10 జాబితాలో నిలిచిన ఏకైక కారు టాటా మోటార్స్ నెక్సాన్ మాత్రమే. హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మహీంద్రా ఎక్స్ యువి300 కార్ల నుంచి భారీ పోటీని ఎదుర్కొన్నప్పటికీ ఈ జాబితాలో 7వ స్థానంలో నిలిచింది. 2021 నవంబరులో టాటా 9,831 యూనిట్ల నెక్సన్ కార్లను విక్రయించింది. ఈ ఏడాది అక్టోబర్ నెలలో 10,096 యూనిట్లతో పోలిస్తే ఇది తక్కువ. 8. మారుతి ఈఈసీఓ ఈ జాబితాలో కనిపించిన ఏకైక వ్యాన్ మారుతి ఈఈసీఓ. మారుతి నవంబరులో 9,571 యూనిట్ల ఈకో కార్లను విక్రయించింది, ఇది సంస్థ నుంచి అత్యధికంగా అమ్ముడైన కార్లలో ఒకటిగా నిలిచింది. ఈ ఈఈసీఓ నాన్ కార్గో వేరియెంట్ల ధరలను మారుతి రూ.8,000 పెంచింది. ధరల పెంపు నవంబర్ 30 నుంచి అమల్లోకి వచ్చింది. 9. మారుతి ఎర్టిగా మారుతి ఎర్టిగా నవంబరులో ఏడు సీట్ల ఎంపివి విభాగంలో ఆధిపత్యం కొనసాగిస్తోంది. దేశంలో అత్యధికంగా అమ్ముడైన కార్ల టాప్-10 జాబితాలో ఇది 9వ స్థానంలో నిలిచింది. మారుతి సుజుకి నవంబరులో 8,752 యూనిట్ల ఎర్టిగా కార్లను విక్రయించింది, అక్టోబర్ నెలలో విక్రయించిన యూనిట్ల కంటే గణనీయమైన తగ్గుదలను నమోదు చేసింది. 10. కియా సెల్టోస్ దేశంలో అత్యధికంగా అమ్ముడైన కార్ల టాప్-10 జాబితాలో ఇది 10వ స్థానంలో కియా సెల్టోస్ నిలిచింది. 2020 నవంబరులో విక్రయించిన 9,205 యూనిట్లతో పోలిస్తే కియా నవంబర్ 2021లో 8,659 యూనిట్ల సెల్టోస్ ఎస్యూవీని విక్రయించింది. -
కొత్త కారు కొనేవారికి మారుతి సుజుకీ షాక్!
మీరు రాబోయే కొత్త ఏడాదిలో కొత్త కారు కొనాలని చూస్తున్నారా? అయితే.. మీకు ఒక షాకింగ్ న్యూస్. దేశీయ ఆటో రంగ దిగ్గజం మారుతి సుజుకీ కార్ల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాదిలో వాహనాల ఉత్పత్తి వ్యయం గణనీయంగా పెరగడంతో కార్ల ధరలను పెంచాలనే నిర్ణయానికి వచ్చినట్లు ఆటోమేకర్ పేర్కొంది. వివిధ ఇన్ పుట్ ఖర్చులు పెరగడం వల్ల గత ఏడాది కాలంలో వాహనాల ఖర్చుపై ప్రతికూల ప్రభావం పడుతుందని మారుతి సుజుకి ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. వచ్చే ఏడాది జనవరి నుంచి తమ అన్ని మోడళ్ల ధరలను పెంచాలని యోచిస్తున్నట్లు కంపెనీ గురువారం తెలిపింది. అయితే, ధరల పెరుగుదల వివిధ మోడల్స్ బట్టి మారుతుందని తెలిపింది. కార్ల ధరల పెంపు మొదటిసారి కాదు, ఈ సంవత్సరం ప్రారంభంలో అతిపెద్ద కార్ల తయారీదారు దేశవ్యాప్తంగా కార్ల ధరలను రూ.34,000 వరకు పెంచింది. ముడి పదార్థాల ఖర్చులు పెరగడం, ఆటో పరిశ్రమ గత కొన్ని నెలలుగా కష్ట కాలాన్ని ఎదుర్కొంటున్నట్లు కంపెనీ పేర్కొంది. అలాగే, ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో మారుతి సుజుకి ధరల పెంపును ప్రకటించింది. కార్ల తయారీదారు తన ఎంపిక చేసిన మోడల్స్ బట్టి ధరల పెంపు ₹1,000 నుంచి ₹22,500 వరకు ఉంది. ఇప్పటికే దెబ్బతిన్న పరిశ్రమను చిప్ కొరత, పెరుగుతున్న ముడి పదార్థాల ధరలు, కంటైనర్లు అందుబాటులో లేకపోవడం, అధిక షిప్పింగ్ రేట్లు ఇంకా దెబ్బతీస్తున్నాయని సంస్థ తెలిపింది. స్టీల్ & మెగ్నీషియం వంటి కీలక ముడి పదార్థాలకు లభ్యత లేకపోవడం కూడా పరిశ్రమపై ఎక్కువ ప్రభావం చూపిస్తున్నట్లు తెలిపింది. మారుతి సుజుకి ఇప్పటికే ధరల పెంపును ప్రకటించడంతో, ఇతర కార్ల తయారీదారులు కూడా ఇదే మార్గంలో నడవాలని చూస్తున్నాయి. (చదవండి: కియా నుంచి మరో కొత్త కారు...! ఇది వస్తే గేమ్ ఛేంజరే..!) -
అనుకోని అతిథిలా వచ్చి..! మారుతి సుజుకిపై అనూహ్యమైన దెబ్బేసింది..!
కోవిడ్-19 రాకతో అనుకోని అతిథిలా వచ్చిన చిప్స్(సెమికండక్టర్స్) కొరత ప్రపంచవ్యాప్తంగా పలు దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలకు భారీ నష్టాలనే మిగిల్చాయి. ఆయా కంపెనీల ఉత్పత్తి పడిపోవడంతో అమ్మకాల సంఖ్య భారీగా పడిపోయింది. చిప్స్ కొరతతో సతమతమవుతోన్న కంపెనీలో మారుతీ సుజుకీ కూడా చేరింది. చిప్స్ కొరతతో ఉత్పత్తి అంతంతే..! మారుతీ సుజుకీ ఈ ఏడాది నవంబర్లో మొత్తం 1,39,184 యూనిట్లను విక్రయించగా..గత ఏడాది నవంబర్ నెలలో 1,53,223 యూనిట్లను విక్రయించిన్నట్లు మారుతి సుజుకీ ఒక ప్రకటనలో పేర్కొంది. గ్లోబల్ చిప్ కొరత కారణంగా ఉత్పత్తి మందగించడంతో అమ్మకాల్లో 9.16 శాతం తగ్గుదల వచ్చిన్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ ఏడాది నవంబర్ నెలలో ఎలక్ట్రానిక్ విడిభాగాల కొరత వాహనాల ఉత్పత్తిపై స్వల్ప ప్రభావం చూపిందని కంపెనీ పేర్కొంది.గత నెలలో జరిగిన మొత్తం అమ్మకాలలో... దేశీయ విక్రయాల సంఖ్య 113,017 యూనిట్లుగా ఉండగా, ఇతర ఓఈఎమ్లకు 4774 యూనిట్లును విక్రయించినట్లు మారుతి సుజుకీ తెలిపింది. చదవండి: దుమ్మురేపిన టాటా మోటార్స్..! కంపెనీకి కాసుల వర్షమే..! మినీ, కాంపాక్ట్ కార్ సెగ్మెంట్లో...అల్టో, ఎస్ ప్రెసో, బాలెనో, సెలెరియో, డిజైర్, ఈగ్నిస్, స్విఫ్ట్, టూర్ ఎస్, వాగనార్ వంటి కార్లపై పలు ఆఫర్లను కలిగి ఉన్న నవంబర్ 2021లో 74,492 యూనిట్లను విక్రయించింది, గత ఏడాది నవంబర్ నెలలో 98,969 యూనిట్లను అమ్మకాలను జరిపింది. మొత్తంగా చూసుకుంటే ప్యాసింజర్ కార్ల విక్రయాలు 100,839 యూనిట్ల నుంచి 75,581 యూనిట్లుగా వరకు క్షీణించాయి. యుటిలిటీ వాహనాల విభాగంలో అమ్మకాలు పరవాలేదనిపించింది. ఎర్టిగా, జిప్సీ, ఎస్-క్రాస్ , విటారా బ్రెజ్జా, ఎక్స్ఎల్ఆర్తో సహా గత నెలలో 24,574 యూనిట్లను విక్రయించింది. మరోవైపు నాన్ కార్గో ప్యాసింజర్ ఈకో వ్యాన్ విక్రయాలు నవంబర్లో 9,571 యూనిట్లకు పడిపోయింది. గత ఏడాది క్రితం నవంబర్ నెలలో 11,183 యూనిట్లను మారుతి విక్రయించింది. చదవండి: వినియోగంలో లేని బ్యాంక్ అకౌంట్లు, మగ్గుతున్న రూ.26,697 కోట్లు -
మారుతి సుజుకీలో ఆ కారు ధర మరింత ప్రియం..!
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకీ ఇండియా ఈకో వ్యాన్లోని అన్ని వేరియంట్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సుమారు రూ. 8000 మేర పెంచినట్లు మంగళవారం కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. పెంపు ఎందుకంటే..! ఈకో మోడల్కు చెందిన అన్ని నాన్ కార్గో వేరియంట్లలో అదనంగా ప్యాసింజర్ ఎయిర్బ్యాగ్ను మారుతి సుజుకీ ప్రవేశపెట్టింది. దీంతో ఈకో వ్యాన్లోని అన్ని నాన్-కార్గో వేరియంట్ల ధరలను పెంచాల్సి వచ్చినట్లు కంపెనీ పేర్కొంది. పెరిగిన ధరలు ఈరోజు (నవంబర్ 30) నుంచే అమల్లోకి వస్తుందని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. ఈకో ప్యాసింజర్ వెర్షన్ ధరలు రూ. 4.3 లక్షల నుంచి రూ. 5.6 లక్షలుగా ఉంది. అంబులెన్స్ ఈకో వెర్షన్ ధర రూ. 7.29 లక్షలుగా ఉంది. (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ).ఈ ఏడాది సెప్టెంబర్లో సెలెరియో మోడల్ మినహా మిగతా మోడళ్ల ధరలను కంపెనీ సుమారు 1.9 శాతం వరకు పెంచింది. చదవండి: ఓలాకు గట్టిపోటీ..! భారీ ప్రణాళికతో ఏథర్..! -
ఎక్కువ మైలేజ్ ఇచ్చే మారుతి కారు.. ధర ఎంతో తెలుసా?
మారుతి సుజుకి ఇండియా ఎట్టకేలకు కొత్త తరం సెలెరియోను నేడు (నవంబర్ 10, 2021న) భారతదేశంలో విడుదల చేసింది. మారుతి సుజుకి కార్లలో ఎక్కువ మంది ఇష్టపడే బడ్జెట్ కార్లలో సెలెరియో ఒకటి. దీని కోసం వినియోగదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీని ఎక్స్-షోరూమ్ ధర ₹4.99 లక్షల నుంచి ₹6.94 లక్షల మధ్య ఉంది. ఇది భారతదేశంలో ప్రారంభించిన రెండవ తరం సెలెరియో. దీని కోసం బుకింగ్ ఇప్పటికే ప్రారంభించింది, ఎవరైనా కంపెనీ అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఇది కాకుండా, మీ సమీప డీలర్షిప్లో రూ.11,000 టోకెన్ మొత్తాన్ని చెల్లించి కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ కారు నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. పవర్ ఫుల్ ఇంజన్ పెరుగుతున్న పెట్రోలు ధరలతో ప్రజలు అల్లాడిపోతున్న వేళ ఎక్కువ మైలేజ్ ఇచ్చే కారును మారుతి సుజుకి ఇండియా తీసుకొని వచ్చింది. కొత్త సెలెరియో కారు రికార్ఢు స్థాయిలో లీటరు పెట్రోలుకు 26 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందంటూ సంచలన ప్రకటన చేసింది. ఇండియాలోనే అత్యధిక మైలేజీ ఇచ్చే పెట్రోలు కారు తమదేనంటూ ప్రకటించింది. ఈ కొత్త కారులో 1.0-లీటర్ డ్యూయల్ జెట్, డ్యూయల్ వీవీటీ కే10సీ పెట్రోలు ఇంజన్ను అమర్చారు. కొత్త-తరం మారుతి సుజుకి సెలెరియో సరికొత్త డిజైన్తో వస్తుంది. ఈ కారు కొత్త స్వెప్ట్-బ్యాక్ హెడ్ల్యాంప్లు, బ్లాక్ క్లాడింగ్, కొత్త ఫాగ్ల్యాంప్లతో కూడిన అగ్రెసివ్ ఫ్రంట్ బంపర్తో వస్తుంది. సెలెరియో రెండు కొత్త షేడ్స్తో సహా 6 రంగులలో లభిస్తుంది. క్యాబిన్ విషయానికొస్తే.. కొత్త-జెన్ సెలెరియోలో కొత్త ఆల్-బ్లాక్ ఇంటీరియర్, రీడిజైన్ చేసిన డ్యాష్బోర్డ్ ఉంది. ఈ కారులో ఆడియో, టెలిఫోనీ కోసం మౌంటెడ్ కంట్రోల్లతో కూడిన కొత్త త్రీ-స్పోక్ టిల్ట్-అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్, పెద్ద ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనలాగ్ స్పీడోమీటర్, డిజిటల్ రెవ్ కౌంటర్ ఉన్నాయి. ఈ కారు సిల్వర్ యాక్సెంట్లతో కూడిన కొత్త ఎయిర్ కాన్ వెంట్లు, మాన్యువల్ ఎయిర్ కాన్ సిస్టమ్, 12వీ ఛార్జర్ కోసం రెండు పోర్ట్లు ఉన్నాయి. మధ్యలో స్మార్ట్ఫోన్ నావిగేషన్తో కూడిన 7-అంగుళాల స్మార్ట్ ప్లే స్టూడియో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ని కలిగి ఉంది. City life, now more stylish than ever! Introducing the #AllNewCelerio#DriveYourStyle #MarutiSuzuki #MarutiSuzukiArena pic.twitter.com/J12gq9kg32 — Maruti Suzuki Arena (@MSArenaOfficial) November 10, 2021 ఆటో గేర్ షిఫ్ట్ ఫీచర్ భద్రత పరంగా, AGS/AMT వేరియంట్లతో కూడిన ఫస్ట్-ఇన్-సెగ్మెంట్ హిల్ హోల్డ్ అసిస్ట్ ఫంక్షన్తో సహా 12కి పైగా సేఫ్టీ ఫీచర్లతో ఈ కారు వస్తుందని మారుతి తెలిపింది. ఇతర ఫీచర్లు డ్యూయల్ ఎయిర్బ్యాగ్లు, EBDతో కూడిన ABS, ఫ్రంట్ సీట్-బెల్ట్ రిమైండర్, హై-స్పీడ్ అలర్ట్ వంటివి ఇందులో ఉన్నాయి. ఈ కారులో 66 బిహెచ్పీ పవర్, 89 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగల ఇంజన్ ఉంది. ఇందులో 5-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్తో పాటు ఆటో గేర్ షిఫ్ట్ ఫీచర్ కూడా ఉంది. ఇది VXI AGS వేరియంట్ అత్యధికంగా 26.68 kmpl మైలేజ్ అందిస్తుంది. Zxi+MT వేరియంట్ 24.97 kmpl మైలేజ్ ఇస్తుందని కంపెనీ తెలిపింది. (చదవండి: రక్షణలో రారాజు మహీంద్రా ఎక్స్యూవి700) -
మారుతి మరో సంచలనం.. మార్కెట్లోకి అధిక మైలేజీ ఇచ్చే పెట్రోలు కారు
పెరుగుతున్న పెట్రోలు ధరలతో ప్రజలు అల్లాడిపోతున్న వేళ చల్లని కబురు చెప్పింది మారుతి సూజుకి ఇండియా. డీజిల్ కారుని మించి మైలేజీ అందించే కొత్త కారుని మార్కెట్లోకి తేబోతున్నట్టు ప్రకటించింది. ఎంట్రీ లెవల్ హచ్బ్యాక్ మోడల్గా ఉన్న సెలెరియో ఫేస్లిఫ్ట్ వెర్షన్ని మార్కెట్లోకి తెచ్చేందుకు మారుతి రెడీ అయ్యింది. నవంబరు 10 నుంచి ఈ కొత్త సెలెరియో మోడల్ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అవుతున్నాయి. రూ.11,000 చెల్లించి ఈ కారుని బుక్ చేసుకోవచ్చు. అయితే బుకింగ్స్కి ముందు అదిరిపోయే న్యూస్ చెప్పింది మారుతి. కొత్త సెలెరియో కారు రికార్ఢు స్థాయిలో లీటరు పెట్రోలుకు 26 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందంటూ సంచలన ప్రకటన చేసింది. ఇండియాలోనే అత్యధిక మైలేజీ ఇచ్చే పెట్రోలు కారు తమదేనంటూ తేల్చి చెప్పింది. ఇప్పటి వరకు మారుతి స్విఫ్ట్, బాలెనో కార్లు 24 కి.మీల మైలేజీ ఇస్తున్నాయి. ప్రస్తుతం వీటినే అత్యధిక మైలేజీ ఇచ్చేవిగా పరిగణిస్తున్నాను. సెలెరియో వాటిని బీట్ చేయబోతుంది. సెలెరియో కారులో 1 లీటరు కే 10సీ డ్యూయల్ జెట్ వీవీటీ పెట్రోలు ఇంజన్ను అమర్చారు. ఆటోమేటిక్, మాన్యువల్ గేర్లలో ఈ కారు లభించనుంది. ఈ ఫేస్ లిఫ్ట్ వెర్షన్లో ఏడు వేరియంట్లు మార్కెట్లోకి రాబోతున్నాయి. టచ్ స్క్రీన్ ఇన్ఫోంటైన్మెంట్, యాపిల్ కార్ప్లే వంటి లేటెస్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి. సెలెరియా పెట్రోలు కారు ఎక్స్షోరూం కనిష్ట ధర రూ.4.50 లక్షల దగ్గర ప్రారంభం అవుతుండగా హైఎండ్ వేరియంట్ ధర రూ.6.00 లక్షలుగా ఉంది. కీలక సమయంలో మైలేజీ కారును మార్కెట్లోకి తెస్తూ హ్యుందాయ్ సాంట్రో, టాటా టియాగోలకు గట్టి సవాల్ విసిరింది మారుతి. -
సెలెరియోలో సరికొత్త టెక్నాలజీ.. బుకింగ్స్ ప్రారంభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మారుతి సుజుకి.. ప్రీమియం హ్యాచ్బ్యాక్ సెలెరియో కొత్త వర్షన్ ముందస్తు బుకింగ్స్ ప్రారంభించింది. వినియోగదార్లు రూ.11,000 చెల్లించి ఈ వాహనాన్ని బుక్ చేయవచ్చు. స్టార్ట్–స్టాప్ టెక్నాలజీతో తదుపరి తరం కె–సిరీస్ ఇంజన్ పొందుపరిచారు. ఆటో గేర్ షిఫ్ట్ టెక్నాలజీతో ఇప్పటికే ఈ కారు ఆదరణ చూరగొందని కంపెనీ తెలిపింది. భారత్లో అత్యంత ఇంధన సామర్థ్యం గల పెట్రోల్ కారుగా సెలెరియో నిలవనుందని మారుతి సుజుకి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ సి.వి.రమణ్ తెలిపారు. -
పెట్రోలు ధరలకు పరిష్కారం.. సీఎన్జీ వైపు మారుతి చూపు
న్యూఢిల్లీ: పెరుగుతున్న పెట్రోలు ధరలు పెరుగుతుండటంతో ప్రజలు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. మరోవైపు ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. అయితే ఇండియాలో నంబర్ వన్ ఆటోమొబైల్ కంపెనీ మారుతి భిన్నమైన మార్గం ఎంచుకుంది. సీఎన్జీకే మొగ్గు సీఎన్జీ మోడళ్ల సంఖ్యను పెంచాలని వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకి నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో సీఎన్జీ మోడళ్లకు గిరాకీ రావడంతో కంపెనీ సీఎన్జీ వైపు మళ్లింది. మరిన్ని మోడల్స్ త్వరలో కొత్తగా మరో నాలుగు మోడళ్లకు సీఎన్జీ శ్రేణిని విస్తరించనున్నట్టు సంస్థ మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఈడీ శశాంక్ శ్రీవాస్తవ వెల్లడించారు. ‘ప్రస్తుతం ఎనిమిది మోడళ్లకు సీఎన్జీ వేరియంట్స్ ఉన్నాయి. భవిష్యత్లో మరిన్ని సీఎన్జీ మోడల్స్ అందుబాటులోకి తెస్తాం. ప్రస్తుతం పెండింగ్లో 2.8 లక్షల యూనిట్లు ఉన్నాయి. ఇందులో 1.1 లక్షల యూనిట్లు సీఎన్జీ వేరియంట్లే. ఒక్కో కిలోమీటర్కు పెట్రోల్, డీజిల్ వాహనమైతే రూ.5 ఖర్చు అవుతోంది. అదే సీఎన్జీ అయితే రూ.1.7 మాత్రమే. దేశవ్యాప్తంగా 260 నగరాలు, పట్టణాల్లో 3,400 సీఎన్జీ స్టేషన్స్ ఉన్నాయి’ అని వివరించారు. -
ఇంధన ధరలతో సతమతమవుతున్నారా..! అయితే ..!
దేశవ్యాప్తంగా ఇంధన ధరలు సెంచరీ దాటేసి... తగ్గేదేలే అంటూ.. పెరుగుతూనే ఉన్నాయి. పెరుగుతున్న ఇంధన ధరలతో సామాన్యులకు చుక్కలు కన్పిస్తున్నాయి. ఇంధన ధరలు పెరగడంతో కొంత మంది వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాలపై మొగ్గుచూపుతున్నారు. కొందరైతే ఎలక్ట్రిక్ వాహనాలు ఫుల్ ఛార్జ్ అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుందని చెప్పి సంప్రాదాయి శిలాజ ఇంధన వాహనాలనే కొనుగోలు చేస్తున్నారు. మనలో చాలా మంది మైలేజీ ఎక్కువ ఇచ్చే వాహనాలపైనే మొగ్గుచూపుతాం. అంతేందుకు ఎవరైనా కొత్త వాహనాలను కొనుగోలు చేస్తే మొదట మనం వారిని అడిగే ప్రశ్న...మైలేజ్ ఎంత ఇస్తుందని..? ఇంధన ధరల మోత తగ్గనప్పటికీ...మైలేజ్ ఎక్కువ ఇచ్చే వాహనాలను కొనుగోలు చేయడంతో కాస్తనైనా ఉపశమనం కలిగే వీలు ఉంది. ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ) స్టాండర్స్ ప్రకారం.. భారత మార్కెట్లో తక్కువ బడ్జెట్లో బెస్ట్ మైలేజ్ ఇచ్చే కార్లపై ఓ లుక్కేయండి. మార్కెట్లలోని టాప్-10 మైలేజ్ ఇచ్చే కార్లు ఇవే...! 1. హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ డీజిల్ వేరియంట్ ఎంట్రీ లెవల్ హ్యాచ్బ్యాక్ విభాగంలో ఉత్తమ మైలేజీని అందిస్తోంది. గ్రాండ్ ఐ 10 నియోస్ ఎంట్రీ లెవల్ హ్యాచ్బ్యాక్ విభాగంలో డీజిల్ ఇంజిన్తో ఎక్కువ మైలేజ్ ఇచ్చే అతికొద్ది కార్లలో ఇది ఒకటి. ARAI రికార్డుల ప్రకారం... డీజిల్ వేరియంట్ 25 kmpl వరకు మైలేజీ, పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్21 kmpl మైలేజీను అందిస్తోంది. 2. మారుతి సుజుకి స్విఫ్ట్ మారుతి స్విఫ్ట్ పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ 23 kmpl కంటే కొంచెం ఎక్కువ, ఆటోమేటిక్ వెర్షన్ 23.76 kmpl రేంజ్ను ఇస్తోంది. 3. హ్యుందాయ్ i20 ప్రీమియం హ్యాచ్బ్యాక్ విభాగంలో, హ్యుందాయ్ i20 అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటి. ఈ కారులో అద్భుతమైన ఫీచర్సే కాకుండా గొప్ప మైలేజ్ ఈ కారు సొంతం. ARAI ప్రకారం...హ్యుందాయ్ i20 డీజిల్ వేరియంట్ 25.2 kmpl, పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వేరియంట్ 20.35 kmpl రేంజ్ను ఇస్తోంది. 4. మారుతి బాలెనో ఇటీవలి కాలంలో హ్యుందాయ్ ఐ 20 మైలేజీకు సమానంగా మారుతి బాలెనో అందిస్తోంది. ARAI ప్రకారం... బాలెనో పెట్రోల్ ఇంజన్తో 23. 87 kmpl రేంజ్ వస్తోంది. 5. హ్యుందాయ్ ఆరా సబ్-కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కారుగా ఆరా నిలుస్తోంది. ARAI డేటా ప్రకారం...ఆరా డీజిల్ మాన్యువల్ వేరియంట్ 25 kmpl మైలేజీని అందిస్తుంది.సీఎన్జీ వేరియంట్ కిలోకు 28 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. 6.మారుతి డిజైర్ మారుతి డిజైర్ కూడా సబ్-కాంపాక్ట్ సెడాన్ విభాగంలో ఇది కూడా అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్. పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ 23.26 kmpl మైలేజీ, ఆటోమేటిక్ వెర్షన్ 24.12 kmpl మైలేజీను అందిస్తోంది. 7. కియా సొనెట్ సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలో అత్యధికంగా కొనుగోలు చేయబడిన మోడల్ కియా సోనెట్. ARAI సర్టిఫికేట్ ప్రకారం... సోనేట్ డీజిల్ వేరియంట్ 24 kmpl మైలేజీను, పెట్రోల్ వేరియంట్ 18 kmpl ను అందిస్తోంది. 8. హ్యుందాయ్ వెన్యూ హ్యూందాయ్ వెన్యూ సుమారు 23.4 kmpl మైలేజీను అందిస్తోంది. 9. హ్యుందాయ్ క్రెటా మిడ్ రేంజ్ ఎస్యూవీ విభాగంలో హ్యుందాయ్ క్రెటాకు సాటి లేదు. క్రెటా డీజిల్ మాన్యువల్ వేరియంట్ 21 kmpl అందిస్తోంది. 10. హ్యూందాయ్ వెర్నా ప్రీమియం సెడాన్ విభాగంలో హ్యుందాయ్ వెర్నా డిజీల్ వేరియంట్ 25 కెఎమ్పీఎల్, పెట్రోల్ వేరియంట్ 18.4 కెఎమ్పీఎల్ను అందిస్తోంది. -
మహీంద్రా థార్కు పోటీగా మారుతి నుంచి అదిరిపోయే కార్...!
Maruti Suzuki Teases New Off Road Car: ఆఫ్ రోడ్స్ వాహనాల్లో మహీంద్రా థార్కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మహీంద్రా థార్కు పోటీగా ప్రముఖ దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు ఆఫ్ రోడ్స్ ఎస్యూవీ కార్లపై ఫోకస్ పెట్టాయి. భారత మార్కెట్లలోకి థార్కు పోటీగా ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ ఫోర్స్ గుర్ఖా పేరుతో ఆఫ్ రోడ్ ఎస్యూవీని లాంచ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మహీంద్రా థార్కు పోటీగా మారుతి సుజుకి భారత మార్కెట్లలోకి ‘జిమ్నీ’ పేరుతో ఆఫ్ రోడ్ ఎస్యూవీను త్వరలోనే లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. మహీంద్రా థార్కు తీసిపోకుండా అదే స్టైల్తో జిమ్నీ రానుంది. మారుతి తీసుకువస్తోన్న ఆఫ్ రోడ్ ఎస్యూవీ కస్టమర్లను ఇట్టే కట్టిపడేస్తుంది. మారుతి సుజుకీ జిమ్నీకి సంబంధించిన టీజర్ను సోషల్ మీడియా హ్యాండిల్స్లో లాంచ్ చేసింది. అన్ని రకాల భూభాగాల్లో అడ్వెంచరస్ డ్రైవింగ్ అనుభూతిని వాహనదారులకు కచ్చితంగా అందిస్తోందని మారుతి సుజుకీ పేర్కొంది. చదవండి: డావో ఎలక్ట్రిక్ స్కూటర్.. భలే ఉంది కదూ! ఇండియా నుంచి ఇతర దేశాలకు... మారుతి సుజుకీ జిమ్నీ ఎస్యూవీ 3 డోర్ వెర్షన్తో రానుంది. ఈ కారును హర్యానాలోని మాన్నేసర్లో ప్లాంట్లో తయారుచేశారు. ఇక్కడి నుంచే ఇతర దేశాలకు కూడా ఎగుమతికానుంది. భారతీయుల కోసం సపరేట్గా 5 డోర్ వెర్షన్తో రానున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది నుంచి కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. ఇంజన్ విషయానికి వస్తే..! మారుతి సుజుకీ జిమ్నీ ఇంటర్నేషనల్ వెర్షన్ 1.4-లీటర్ మైల్డ్-హైబ్రిడ్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్తో రానుంది. అయితే ఇండియన్ వెర్షన్ జిమ్నీ 1.5-లీటర్ కె 15 బి పెట్రోల్ ఇంజిన్ తో రానుంది. ఇక్కడ విశేషమేమిటంటే..విటారా బ్రెజ్జా, సియాజ్, ఎర్టిగా, ఎక్స్ఎల్ 6 మోడల్స్లో ఇదే ఇంజిన్ను మారుతి అమర్చింది. 6000 ఆర్పిఎమ్ వద్ద 103 బిహెచ్పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది, 4400 ఆర్పిఎమ్ వద్ద 138 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ను అందిస్తోంది. ఈ ఎస్యూవీ 5-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్తో పాటు ఆప్షనల్ 4-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ ట్రాన్స్మిషన్ గేర్బాక్స్లో కూడా అందుబాటులో ఉంది. కాగా ఈ కారు ధర ఇంకా తెలియాల్సి ఉంది. చదవండి: రికార్డ్ సేల్స్, ప్రతిరోజు 400 అపార్ట్మెంట్ల రిజిస్ట్రేషన్లు -
మారుతి నుంచి కొత్తగా డిగ్రీ కోర్సు.. టాటా సహకారం
కార్ల అమ్మకాల్లో దేశంలోనే నంబర్ వన్గా ఉన్న మారుతి సుజూకి మరో అడుగు ముందుకు వేసింది. భవిష్యత్తులో తమ సంస్థకు అవసరమైన మానవ వనరులను అభివృద్ధి చేసే పనిపై ఫోకస్ పెట్టింది. ఆటోమోటివ్ రిటైల్ మార్కెట్ రీసెర్చ్ అంచనాల ప్రకారం దేశంలో ప్రతీ వెయ్యి మందికి కేవలం 36 కార్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి కోవిడ్ సంక్షోభం పూర్తిగా ముగిసి ఆర్థిక పరిస్థితి గాడిన పడితే కార్ల అమ్మకాలు ఊపందుకుంటాయని మార్కెట్ అనాలిసిస్టులు చెబుతున్నారు. దీంతో ఆటోమొబైల్ ఇండస్ట్రీకి అవసరమైన రీతిలో హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్పై మారుతి దృష్టి సారించింది. అందులో భాగంగా రిటైల్ మేనేజ్మెంట్ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఆటోమోటివ్ రిటైల్ కోర్సును ప్రవేశ పెడుతోంది. మూడేళ్ల కోర్సు ఆటోమొబైల్ ఇండస్ట్రీకి సంబంధించి మూడేళ్ల డిగ్రీ కోర్సును అందివ్వాలని మారుతి నిర్ణయించింది. ఈ కోర్సులో పూర్తిగా ఆటోమైబైల్ పరిశ్రమకు సంబంధించిన అంశాలనే సిలబస్లో పొందు పరచనుంది. మొదటి ఏడాది కేవలం తరగతి కోర్సుగా మిగిలిన రెండేళ్లు మారుతి ఆథరైజ్డ్ డీలర్షిప్ యూనిట్లలో ప్రాక్టికల్ తరగతులు నిర్వహిస్తారు. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (యూజీసీ) నిబంధనలకు అనుగుణంగా ఈ కోర్సుని డిజైన్ చేసింది. టాటా సహకారంతో మారుతి సంస్థ అందిస్తోన్న మూడేళ్ల కొత్త కోర్సును మొదటగా టాటా ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ - స్కూల్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ (టీఐఎస్ఎస్-ఎస్వీఈ) ముంబై క్యాంపస్లో ప్రవేశపెడుతున్నారు. ఈ కోర్సుకు సంబంధించిన తొలి బ్యాచ్కి 2021 అక్టోబరు నుంచి క్లాసులు ప్రారంభం అవనుంది. కోర్సు పూర్తైన తర్వాత విద్యార్థుల యోగ్యతను బట్టి మారుతి లేదా ఇతర సంస్థలలో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. జపాన్ తరహా స్కిల్స్ ఆటోమోటివ్ ఇండస్ట్రీలో రిటైల్ సెక్టార్లో స్కిల్డ్ వర్కర్లు లభించడం లేదని, అందుకే ఇండస్ట్రీ అవసరాలకు తగ్గట్టుగా యువతకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని రుతి సుజూకి ఇండియా, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, మనోజ్ అగర్వాల్ తెలిపారు. ఈ కోర్సులో జపాన్ తరహా వర్క్ కల్చర్, సాఫ్ట్ స్కిల్స్ని మన యూత్లో డెవలప్ చేయడం మా లక్ష్యమని ఆయన వివరించారు. చదవండి : ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారికి కేంద్రం తీపికబురు! -
ఆ ఒక్క మోడల్ తప్పా.. మళ్లీ పెరిగిన మారుతీ కార్ల ధరలు
-
సెడాన్ అమ్మకాల్లో ఆ కారుదే అగ్రస్థానం
Maruti Ciaz Sedan Car: ఇండియన్ మార్కెట్లో తనకు తిరుగు లేదని మరోసారి మారుతి నిరూపించుకుంది. మార్కెట్లో ఇతర కంపెనీల నుంచి తీవ్ర పోటీ నెలకొన్నా మరోసారి అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంటున్నాయి మారుతి బ్రాండ్ నుంచి వస్తోన్న కార్లు. తాజాగా సెడాన్ సెగ్మెంట్ అమ్మకాల్లో మారుతి సియాజ్ సంచలనం సృష్టించింది. ఎస్యూవీ పోటీని తట్టుకుని గత దశాబ్ధం కాలంగా ఇండియన్ మార్కెట్లో ఎస్యూవీ వెహికల్స్కే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఎంట్రీ లెవల్ కార్లను మినహాయిస్తే ఎస్యూవీలోనే ఎక్కువ అమ్మకాలు జరుగుతున్నాయి. ఇక సెడాన్ సెగ్మెంట్కి సంబంధించిన అమ్మకాల్లో ఎలాంటి మెరుపులు ఉండటం లేదు. అలాంటి తరుణంలో మారుతి మిడ్రేంజ్ సెడాన్ సియాజ్ సానుకూల ఫలితాలు సాధించింది. అమ్మకాల్లో రికార్డ్ మారుతి సంస్థ 2014లో మిడ్ రేంజ్ సెడాన్గా సియాజ్ని మార్కెట్లో ప్రవేశ పెట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 3 లక్షలకు పైగా సియాజ్ కార్ల అమ్మకాలు జరిగాయి. పోటీ సంస్థలైన స్కోడా ర్యాపిడ్, హ్యుందాయ్ వెర్నా, ఫోక్స్వాగన్ వెంటోల నుంచి పోటీ ఉన్నా తన అధిపత్యాన్ని కొనసాగించింది. డీజిల్ ఆపేసినా మారుతి సంస్థ 2014లో డీజిల్ వెర్షన్లో సియాన్ని మార్కెట్లోకి తెచ్చినప్పుడు భారీగానే అమ్మకాలు జరిగాయి. ఆ తర్వాత డీజిల్ వెర్షన్ ఆపేసి ఇప్పుడు పెట్రోల్ వెర్షన్లోనే సియాజ్ను అమ్ముతోంది. ఐనప్పటికీ సేల్స్ బాగానే ఉన్నాయి. ‘సియాజ్ మార్కెట్కి వచ్చినప్పటి నుంచి డిజైన్, స్టైల్, కంఫర్ట్ ఇలా అన్ని విభాగాల్లో కస్టమర్ల ఆదరణ చూరగొంది’ అని మారుతి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ అన్నారు. 1.5 పెట్రోల్ ఇంజన్ ప్రస్తుతం మారుతి సియాజ్కి కారు 1.5 పెట్రోలు ఇంజన్ వెర్షన్లో లభిస్తోంది. 103 బ్రేక్ హార్స్ పవర్తో గరిష్టంగా 138 ఎన్ఎం టార్క్ని అందిస్తోంది. స్టాండర్డ్, ఆటోమేటిక్ గేర్ వెర్షన్లలో ఈ కారు మార్కెట్లో అందుబాటులో ఉంది. 510 లీటర్ల బూట్ స్పేస్, 2,650 గ్రౌండ్ క్లియరెన్సులు సియాజ్ ప్రత్యేకతలు. చదవండి : Ford: ప్లీజ్ మమ్మల్ని వదిలేసి వెళ్లొద్దు! -
అమ్మకాలలో దూసుకెళ్తున్న మారుతి సుజుకి..!
ప్రముఖ ఆటోమేకర్ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ భారత మార్కెట్లో అమ్మకాల విషయంలో దూసుకెళ్తుంది. ఆగస్టులో మొత్తం 1,30,699 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసినట్లు మారుతి సుజుకి ప్రకటించింది. ఇందులో 1,05,775 యూనిట్ల దేశంలో అమ్మితే, 4,305 యూనిట్ల ఇతర ఓఈఎంలకు అమ్మినట్లు పేర్కొన్నారు. అలాగే, ఆగస్టులో 20,619 యూనిట్లను ఎగుమతి చేసింది. ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ల కొరత కారణంగా ఆగస్టులో అమ్మకాల మీద ప్రభావం పడినట్లు మారుతి సుజుకి ఒక అధికారిక ప్రకటనలో వివరించింది. కాంపోనెంట్ల కొరత ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవడానికి సాధ్యమైన అన్ని చర్యలు తీసుకున్నట్లు ఆటోమేకర్ పేర్కొంది.(చదవండి: నిరుద్యోగులకు అమెజాన్ తీపికబురు!) కోవిడ్-19 మహమ్మారి కారణంగా 2020 ఆగస్టులో అమ్మకాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు కంపెనీ తెలిపింది. మారుతి సుజుకి ఇండియా ఆగస్టు 2020 లో 1,24,624 యూనిట్లను అమ్మినట్లు పేర్కొంది. మినీ సబ్ సెగ్మెంట్ గత ఏడాది ఇదే నెలలో 19,709 యూనిట్లు అమ్మితే, 2021 ఆగస్టులో 20,461 యూనిట్ల అమ్మకాలను జరిపినట్లు పేర్కొంది. యుటిలిటీ వెహికల్స్ సెగ్మెంట్ కూడా గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే అమ్మకాల్లో పెరుగుదలను నమోదు చేసింది. గత ఏడాది ఇదే నెలలో 21,030 యూనిట్లతో పోలిస్తే ఈ ఏడాది 2021 ఆగస్టులో సంస్థ 24,337 యూనిట్లను విక్రయించింది. ఈ సెగ్మెంట్ లో ఎర్టిగా, ఎస్-క్రాస్, వితారా బ్రెజ్జా, ఎక్స్ ఎల్ 6, జిప్సీ వంటి మోడల్స్ ఉంటాయి. -
కొత్త కారు కొనేవారికి మారుతి సుజుకి షాక్!
న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా కొనుగోలు దారులకు షాక్ ఇచ్చింది. మరోసారి కార్ల ధరలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. తయారీ, నిర్వహణ, ముడిసరకుల వ్యయాలు పెరగడం వల్ల వచ్చే నెల నుంచి అన్నీ మోడల్స్ ధరలను పెంచనున్నట్లు మారుతి సుజుకి తెలిపింది. "గత ఏడాది కాలంలో ఇన్ పుట్ ఖర్చులు పెరగడం వల్ల వివిధ వాహనాల ధరలు ప్రభావితం అవుతున్నాయి" అని కంపెనీ బీఎస్ఈ ఫైలింగ్లో పేర్కొంది. మోడల్ బట్టి ధరల పెరుగుదలలో వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది. "సెప్టెంబర్ 2021లో విడుదల చేసే అన్నీ మోడల్స్ ధరల పెరగనున్నట్లు" మారుతి సుజుకి ఇండియా తెలిపింది. ప్రస్తుతం కంపెనీ ఎంట్రీ లెవల్ హ్యాచ్ బ్యాక్ ఆల్టో(ధర రూ.2.99 లక్షల) నుంచి ఎస్-క్రాస్(ధర రూ.12.39) మోడల్స్ వరకు విక్రయిస్తుంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు నాలుగు సార్లు వాహన ధరలను పెంచింది.(చదవండి: ‘కూ’ కోటి యూజర్ల రికార్డ్) -
మారుతి సుజుకిపై భారీ జరిమానా విధించిన సీసీఐ
దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకిపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) 27 మిలియన్ డాలర్ల(₹200 కోట్ల) జరిమానా విధించింది. 2019లో మారుతి తన డీలర్లను వారు అందించే డిస్కౌంట్లను పరిమితం చేయాలని బలవంతం చేస్తుందనే వచ్చిన ఆరోపణలను కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) పరిశీలిస్తుంది. మారుతి సుజుకి చర్య వల్ల డీలర్ల మధ్య పోటీని సమర్థవంతంగా అణచివేస్తుంది, డీలర్లు స్వేచ్ఛగా పనిచేస్తే వినియోగదారులు తక్కువ ధరలకు కార్లను పొందే అవకాశం ఉంటుందని రాయిటర్స్ నివేదించింది.(చదవండి: రూ.9 వేలకే రియల్మీ ట్రిపుల్ రియర్ కెమెరా స్మార్ట్ఫోన్) దర్యాప్తు తర్వాత సీసీఐ జారీ చేసిన ఒక ఉత్తర్వులో ఇక నుంచి అటువంటి విధానాలకు పాల్పడకుండా "నిలిపివేయాలి/విరమించుకోవాలని" మారుతిని కోరింది. అలాగే, జరిమానాను 30 రోజుల్లోగా డిపాజిట్ చేయాలని కంపెనీని కోరింది. ఈ విషయంపై మారుతి సుజుకి యాజమాన్యం ఇంకా స్పందించలేదు. దీంతో మారుతి సుజుకి షేర్లు నేడు పడిపోయి బిఎస్ఈలో ₹6,835.00(0.23%) వద్ద ఉన్నాయి. దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మొత్తం ఉత్పత్తి సంవత్సరానికి 58 శాతం పెరిగి 1,70,719 యూనిట్లకు చేరుకుంది. ఏడాది క్రితం కాలంలో కంపెనీ మొత్తం 1,07,687 యూనిట్లను ఉత్పత్తి చేసిందని మారుతి సుజుకి ఇండియా(ఎంఎస్ఐ) రెగ్యులేటరీ ఫైలింగ్ లో తెలిపింది. -
మారుతి బంపర్ ఆఫర్, ఏ కారు ఎంత డిస్కౌంట్ లో వస్తుందో తెలుసా?
మీరు కొత్తగా కారు కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకో శుభవార్త. కొనుగోలు దారులకు మారుతీ సుజుకీ ఇండియా కళ్లు చెదిరే ఆఫర్లను ప్రకటించింది. అరీనా, నెక్సా డీలర్ షిప్లలో మారుతి వాహనాలపై క్యాష్ డిస్కౌంట్, ఎక్సేంజ్ బోనస్ తో పాటు కార్పొరేట్ బెన్ ఫిట్స్ ను ఈ నెల చివరి వరకు సొంతం చేసుకోవచ్చని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. దేశంలో అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచడమే కాదు భారీ ఆఫర్లు ప్రకటించి ఆటో మొబైల్ ఇండస్ట్రీలో తమకు సాటెవ్వరూ లేరని నిరూపిస్తుంది. తాజాగా మారుతీ తన కంపెనీ వాహనాలపై భారీ ఆఫర్లను ప్రకటించింది. ఆ ఆఫర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం? మారుతి సుజుకి ఆల్టో 800 మారుతి సుజికీ ఆల్టో 800పై ప్రస్తుత ప్రారంభ ధర రూ.2.99లక్షలు ఉండగా.. ఆ ధరపై (డిస్కౌంట్ వర్త్) క్యాష్ డిస్కౌంట్ తో కలిపి రూ.43,000వరకు తగ్గించనుంది. మారుతి సుజుకి ఎస్ - ప్రెస్సో మారుతి సుజుకి ఎస్- ప్రెస్సో ప్రారంభ ధర రూ.3.78 లక్షలు ఉండగా రూ. 48,000 వరకు బెన్ఫిషియల్ ఆఫర్ను అందిస్తుంది మారుతి సుజికి స్విఫ్ట్ మారుతి స్విఫ్ట్ ప్రారంభ ధర రూ.5.81లక్షలు ఉండగా.. ఆ కారుపై ఎక్ఛేంజ్ ఆఫర్ను కలుపుకొని రూ.49,000 వరకు డిస్కౌంట్ను అందిస్తుంది మారుతి సుజికి ఎస్ క్రాస్ మారుతి సుజికీ ఎస్ క్రాస్ కారు ప్రారంభ ధర రూ.8.39లక్షలు ఉండగా ఆ కారుపై పర్చేస్ బెన్ఫిటిక్స్ కింద రూ.57,500వరకు డిస్కౌంట్ పొందవచ్చు. -
ఈ కంపెనీ ఒక్కనెలలో ఎన్ని కార్లు తయారు చేసిందో తెలుసా?
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచింది. గత నెలలో 1,70,719 కార్లను తయారీ చేసింది. గతేడాది జులైలో 1,07,687 యూనిట్లను ఉత్పత్తి చేసింది. వార్షిక ప్రాతిపదికన ఉత్పత్తి సామర్థ్యంలో 58 శాతం వృద్ధి నమోదయిందని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. ఏడాది క్రితంతో పోలిస్తే వాహన తయారీ గణాంకాలలో పెరుగుదల ఉన్నప్పటికీ ఈ పోలిక అర్ధవంతమైనది కాదని.. ఎందుకంటే గతేడాది జులైలో కరోనా అంతరాయం కారణంగా విక్రయాలు చాలా తక్కువ స్థాయిలో జరిగాయని తెలిపింది. 2018 జులైతో పోలిస్తే ఈ ఏడాది జులైలోని ఉత్పత్తి సామర్థ్యం తక్కువేనని పేర్కొంది. ఈ ఏడాది జులైలో 1,67,825 ప్యాసింజర్ వాహనాలను ఉత్పత్తి చేయగా.. గతేడాది జులైలో ఇవి 1,05,345 యూనిట్లుగా ఉన్నాయి. మోడళ్ల వారీగా చూస్తే.. ఈ ఏడాది జులైలో ఆల్టో, ఎస్ప్రెస్సో 24,899 కార్లు తయారయ్యాయి. గతేడాది ఇదే నెలలో వీటి సంఖ్య 20,638గా ఉన్నాయి. వ్యాగన్ఆర్, సెలెరియో, ఇగ్నిస్, స్విఫ్ట్, బాలెనో, డిజైర్ వంటి కాంపాక్ట్ కార్లు 55,390 యూనిట్ల నుంచి 90,604 యూనిట్లకు పెరిగాయి. అదేవిధంగా జిప్సీ, ఎర్టిగా, ఎస్–క్రాస్, విటారా బ్రెజా, ఎక్స్ఎల్6 వంటి యుటిలిటీ వాహనాలు 19,130 నుంచి 40,094 యూనిట్లకు వృద్ధి చెందాయి. లైట్ కమర్షియల్ వెహికిల్స్ ఉత్పత్తి గత నెలలో 2,894 యూనిట్లు కాగా.. క్రితం ఏడాది జులైలో ఇవి 2,342 యూనిట్లుగా ఉన్నాయి. చదవండి: మనదేశంలో ఏ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ ను ఎక్కువగా కొంటున్నారో మీకు తెలుసా? -
సరికొత్త మార్పులతో మారుతి సుజకీ వ్యాగన్ఆర్...!
ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ సరికొత్తగా వ్యాగన్ఆర్ ఎక్స్ట్రా ఎడిషన్ను మార్కెట్లలోకి లాంచ్ చేసింది. ఈ కారు 1L లేదా 1.2L ఇంజిన్, ట్రాన్స్మిషన్ ఆప్షన్లతో లభ్యమవుతుందని తెలుస్తోంది. వ్యాగన్ఆర్ ఎక్స్ట్రా కారు లిమిటిడెట్ ఎడిషన్గా వస్తున్నట్లు తెలుస్తోంది. ఇది స్టాండర్డ్ వ్యాగన్ఆర్ వేరియంట్కు 13 కొత్త అప్గ్రేడ్లతో రానుంది. కారు ఇంటీరియర్స్, ఎక్స్టిరియర్స్ గణనీయంగా మార్పులు ఉన్నట్లు తెలుస్తోంది. వ్యాగన్ఆర్ కారును సుమారు రూ. 22,990 అదనంగా చెల్లించడంతో అప్గ్రేడ్ అవుతుంది. కారులో స్టైలింగ్లో భాగంగా కారు వెనుక బంపర్ ప్రొటెక్టర్, సైడ్ స్కర్ట్, వీల్ ఆర్చ్ క్లాడింగ్, బాడీసైడ్ మౌల్డింగ్, ఫాగ్ ల్యాంప్ గార్నిష్, అప్పర్ గ్రిల్ క్రోమ్ గార్నిష్, వెనుక డోర్కు క్రోమ్ గార్నిష్, నంబర్ ప్లేట్ సరికొత్తగా అమర్చారు. అంతేకాకుండా డిజిటల్ ఎయిర్ ఇన్ఫ్లేటర్, ట్రంక్ ఆర్గనైజర్, కార్ ఛార్జర్ ఎక్స్టెండర్ సౌకర్యాలను కలిగి ఉంది. మారుతి సుజుకి వ్యాగన్ఆర్ రెండు ఇంజన్ ఆప్షన్లతో వస్తుంది. 1.0 లీటర్ త్రీ సిలిండర్ ఇంజిన్ 67 బిహెచ్పి సామర్థ్యంతో 90 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తోంది. ఫోర్ సిలిండర్ పెట్రోల్ 1.2 లీటర్ ఇంజన్ 82 బీహెచ్పీ సామర్థ్యంతో 113 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేయనుంది. భద్రత పరంగా కారులో ఈబీడీ (ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్) తో డ్రైవర్ ఎయిర్బ్యాగ్, ఏబీఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), స్పీడ్ అలర్ట్ సిస్టమ్, ఫ్రంట్ సీట్ బెల్ట్స్ రిమైండర్, రియర్ పార్కింగ్ సెన్సార్లను అమర్చారు. -
మళ్లీ కార్ల ధరలు పెంచిన టాటా మోటార్స్!
దేశంలోని ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ తన ప్యాసింజర్ వాహనాల ధరలను వేరియంట్, మోడల్ బట్టి సగటున 0.8 శాతం ఆగస్టు 3 నుంచి పెంచనున్నట్లు ప్రకటించింది. అంతేగాక, ఆటోమేకర్ 31 ఆగస్టు, 2021 వరకు అన్ని రిటైల్ ధరలపై రక్షణను కూడా అందిస్తోంది. "టాటా మోటార్స్ ఇటీవల తన వినియోగదారులు, డీలర్లు, సరఫరాదారుల ప్రయోజనాలను రక్షించడానికి సమగ్రమైన 'బిజినెస్ అజిలిటీ ప్లాన్'ను ఏర్పాటు చేసినట్లు" అని ఒక ప్రకటనలో తెలిపింది. పీటీఐ నివేదిక ప్రకారం, స్టీల్, ఇతర విలువైన లోహాల ధరలు భారీగా పెరగడంతో కార్ల తయారీ వ్యయాన్ని భర్తీ చేయాడానికి ఆటోమేకర్ లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో ప్రయాణీకుల వాహన ధరలను పెంచినట్లు పేర్కొంది. ముంబైకి చెందిన ఆటో మేజర్ టియాగో, నెక్సన్, హారియర్, సఫారీ వంటి ప్రయాణీకుల వాహనాలను దేశీయ మార్కెట్లో విక్రయిస్తుంది. ఈ నెల ప్రారంభంలో, దేశంలోని అతిపెద్ద కార్ల తయారీసంస్థ మారుతి సుజుకి ఇండియా ఇన్ పుట్ ఖర్చుల భారాన్ని తగ్గించడానికి హ్యాచ్ బ్యాక్ స్విఫ్ట్, సీఎన్ జి వేరియెంట్ల ధరలను ₹15,000 వరకు పెంచింది. అదేవిధంగా, హోండా మోటార్స్ ఆగస్టు నుంచి భారతదేశంలో తన మొత్తం మోడల్ శ్రేణి ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. ఎందుకంటే పెరిగిన కమోడిటీ ధరలను భర్తీ చేయాలని కార్ల తయారీ సంస్థలు చూస్తున్నాయి. -
మారుతి సుజుకీ నుంచి తొలి ఎలక్ట్రిక్ వాహనం..! లాంచ్ ఎప్పుడంటే
టోక్యో:: జపాన్కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ సుజుకి మోటార్ కార్పోరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్లో ఎలక్ట్రిక్ వాహనాలపై పెరుగుతున్న ఆదరణకు అనుగుణంగా 2025 నాటికి భారత్లో ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటుంది. తొలి ఎలక్ట్రిక్ వాహనాన్ని భారత్లో లాంచ్ చేయాలని దేశంలో విడుదల చేయనున్నట్లు కంపెనీ ఒక నివేదికలో పేర్కొంది. మారుతి భాగస్వామ్యంతో భారత్లో సుజుకి చలామణీ అవుతున్న విషయం తెలిసిందే. నివేదిక ప్రకారం.. కంపెనీ తీసుకున్న నిర్ణయంతో కాంపాక్ట్ కార్ల విభాగంలో జపనీస్ కార్ల తయారీ సంస్థ సుజుకీ ఎలక్ట్రిక్ మొబిలిటీ వాహనాలు వృద్ధికి మరింత సహాయపడనుంది. భారత ఆటోమొబైల్స్ రంగంలో మారుతి సుజుకీ అతిపెద్ద వాహన తయారీ సంస్థగా నిలిచింది. భారత్లో మారుతి సుజుకీ అమ్మకాలు ఎక్కువగా ఆల్టో, వాగన్ఆర్, బాలెనో, స్విఫ్ట్ వంటి చిన్న కాంపాక్ట్ కార్లు ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి. భారత్లో ఫస్ట్ బోణీ...! ఎలక్ట్రిక్ వాహనాన్ని తొలుత భారత మార్కెట్లో రిలీజ్చేయాలని సుజుకీ భావిస్తోంది. తరువాత జపాన్, యూరప్ వంటి ఇతర దేశాల్లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మారుతి సుజుకీ వాగన్ఆర్ వాహనాలను ఈవీగా పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ పరీక్షలపై మారుతి సుజుకీ అధికారికంగా ధృవీకరించలేదు. మారుతి సుజుకీ ఎక్కువగా సీఎన్జీ వాహన శ్రేణులపై ఎక్కువగా దృష్టిపెట్టింది. భారత ప్రభుత్వం 2030 నాటికి కార్లలో కనీసం 30% ఎలక్ట్రిక్ వాహనాలు ఉండేలా ప్రణాళికలను రూపొందించింది. అంతేకాకుండా ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకు భారీగా ప్రోత్సాహాకాలను ప్రకటించింది. -
మారుతి సుజుకీ కార్ల మోడళ్లపై భారీ డిస్కౌంట్
ముంబై: దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ కీలక నిర్ణయం తీసుకుంది. విక్రయాలను పెంచడం కోసం మారుతి సుజుకీ శ్రేణిలోని కొన్ని కారు మోడళ్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది. మారుతి తన కస్టమర్లకు క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ల కింద ఆఫర్లను అందించనుంది. ఆల్టో, స్విఫ్ట్, ఈకో అనేక రకాల కార్లపై డిస్కౌంట్ అందుబాటులో ఉంది. కాగా ఏర్టిగా మోడల్కు సంబంధించి ఏలాంటి రాయితీ ప్రకటించలేదు. కాగా ఈ ఆఫర్ జూలై 31 వరకు కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది. మారుతి సుజుకీ డిస్కౌంట్ను అందిస్తోన్న కారు మోడళ్లు ఇవే.. మారుతి ఆల్టో కస్టమర్లు సుమారు రూ. 15000 వరకు ఎక్సేఛేంజ్ బోనస్, రూ. 3000 కార్పొరేట్ బోసన్ను అందించనుంది. కాగా మారుతి ఆల్టో పెట్రోల్ ఇంజన్ మోడల్కు సుమారు రూ. 25 వేల వరకు క్యాష్ డిస్కౌంట్ను అందించనుంది. మారుతి సెలేరియో, సెలేరియో ఎక్స్ మారుతి సెలేరియో, సెలేరియో ఎక్స్ మోడళ్ల కొనుగోలుపై సుమారు రూ. 15,000 వరకు ఎక్సేఛేంజ్ బోనస్, రూ. 3,000 కార్పొరేట్ బోసన్ను ప్రకటించింది. కాగా ఈ మోడళ్లకు ఏలాంటి క్యాష్ డిస్కౌంట్ను అందించడం లేదు. మారుతి డిజైర్ మారతి డిజైర్ మోడల్ కొనుగోలుపై సుమారు రూ. 20,000 వరకు ఎక్సేఛేంజ్ బోనస్, రూ. 10,000 క్యాష్ డిస్కౌంట్ను ప్రకటించింది. మారుతి ఈకో మారుతి ఈకో మోడళ్ల కొనుగోలుపై సుమారు రూ. 15,000 వరకు ఎక్సేఛేంజ్ బోనస్, రూ. 3,000 కార్పొరేట్ బోసన్, రూ. 10,000 క్యాష్ డిస్కౌంట్ను అందించనుంది. మారుతి ఎస్-ప్రెస్సో పెట్రోల్ ఇంజన్ మోడల్కు రూ .25 వేల నగదు తగ్గింపు, సిఎన్జి మోడల్కు రూ .10,000 నగదు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. వాటితో పాటుగా రూ .15 వేల ఎక్స్ఛేంజ్ బోనస్, రూ .3,000 కార్పొరేట్ డిస్కౌంట్ అందించనుంది. మారుతి స్విఫ్ట్ స్విఫ్ట్పై సుమారు రూ .20,000 ఎక్స్ఛేంజ్ బోనస్ , రూ .4,000 కార్పొరేట్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. స్విఫ్ట్ ఎల్ఎక్స్ఐ మోడల్కు 10,000 రూపాయల నగదు తగ్గింపు, జెడ్ఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ + వేరియంట్లకు రూ. 15,000 తగ్గింపు, స్విఫ్ట్ విఎక్స్ఐ మోడల్కు సుమారు . 30,000 నగదు తగ్గింపును ప్రకటించింది. మారుతి విటారా బ్రెజ్జా మోడళ్ల కొనుగోలుపై సుమారు రూ. 20,000 వరకు ఎక్సేఛేంజ్ బోనస్, రూ. 4,000 కార్పొరేట్ బోసన్, రూ. 15,000 క్యాష్ డిస్కౌంట్ను అందించనుంది. మారుతి వాగన్-ఆర్ పెట్రోల్ ఇంజన్ మోడల్కు రూ .15 వేల నగదు తగ్గింపుతో, సిఎన్జి ఇంజన్ మోడళ్లకు రూ .5 వేల నగదు తగ్గింపుతో లభిస్తుంది. అంతేకాకుండా, కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 15,000, ఎక్స్ఛేంజ్ బోనస్ రూ .3,000 ను అందిస్తోంది. -
మారుతికి కోవిడ్ దెబ్బ: లాభాలు ఢమాల్
సాక్షి, ముంబై: కోవిడ్-19 మహమ్మారి బెడద దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకిని పట్టి పీడిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో కరోనా మహమ్మారి కారణంగా అమ్మకాలతో భారీగా దెబ్బతిన్నాయి. దీంతో క్యు4 లో ఫలితాలు మార్కెట్ అంచనాలను అందుకోలేకపోయాయి. 2021 ఆర్ధిక సంవత్సరంలో 25.1 శాతం క్షీణితతో నికర లాభం రూ .4,229.7 కోట్లుగా ఉందని కంపెనీ మంగళవారం వెల్లడించింది. అలాగే ఆదాయం 7.2శాతం క్షీణించి రూ.66562 కోట్లకి పరిమితమైంది. మరోవైపు కంపెనీ బోర్డు ఒక్కో షేరుకు రూ .45 మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. (ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్సేల్: భారీ ఆఫర్లు) జనవరి-మార్చి త్రైమాసికంలో కంపెనీ నికర లాభం ఏకంగా 10శాతం క్షీణత నమోదు చేసింది. 9.7 శాతం తగ్గి1,166.10 కోట్లకు చేరుకోగా, నికర అమ్మకాలు 33.6 శాతం పెరిగి రూ .22,958 కోట్లకు చేరుకున్నాయి. వాహన విడిభాగాల ధరలు పెరగడం, రూపాయి మారకపు విలువ, నిర్వహణేతర ఆదాయం తగ్గిపోవడం వంటి కారణాలతో ఈ క్షీణత నమోదైనట్లు కంపెనీ చెప్పింది. కరోనా, సంబంధిత ఆంక్షల నేపథ్యంలో అమ్మకాలు 6.7 శాతం క్షీణించి 14,57,861 వాహనాలకు చేరుకున్నాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే అమ్మకాలు 21.7 శాతం తగ్గాయి. దేశీయ అమ్మకాలు 6.8 శాతం క్షీణించి 13,61,722 యూనిట్లకు చేరుకోగా, ఎగుమతులు 5.9 శాతం తగ్గి 96,139 యూనిట్లకు చేరుకున్నాయి. నికర అమ్మకాలు ఈ ఏడాదిలో 66,562.10 కోట్ల రూపాయలుగా ఉండగా, అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 7.2 శాతం తక్కువ. (కరోనా రెండో దశ : స్వల్పంగా తగ్గిన పాజిటివ్ కేసులు) చదవండి : సుజుకి హయాబుసా క్రేజ్: ఆ వేరియంట్ ఔట్ ఆఫ్ స్టాక్! -
మారుతీ దూకుడు: టాప్ సెల్లింగ్ కారు ఇదే!
సాక్షి, ముంబై: కార్ల విక్రయాల్లో వరుసగా నాలుగో ఏడాది మారుతీ సుజుకీ సత్తా చాటింది. గడిచిన ఆర్థిక సంవత్సరం(2020–21)లో జరిగిన కార్ల అమ్మకాల్లో తొలి ఐదు స్థానాలను మారుతీ కంపెనీ మోడళ్లే దక్కించుకున్నాయి. ఈ ఐదు మోడళ్లలో స్విఫ్ట్ కారు అత్యధికంగా అమ్ముడై తొలి స్థానాన్ని దక్కించుకుంది.(రెండో దశకు ఎయిరిండియా విక్రయం) 2020–21 ఏడాదిలో మొత్తం 1.72 లక్షల స్విఫ్ట్ కార్లు అమ్ముడుపోయాయి. ఈ తర్వాత స్థానాల్లో వరుసగా ఇదే కంపెనీకి చెందిన బాలెనో(1.63 లక్షలు), వేగనార్(1.60 లక్షలు), ఆల్టో(1.59 లక్షలు), డిజైర్(1.28 లక్షలు) మోడళ్లు నిలి చాయి. 5 మోడళ్లు మొత్తం అమ్మకాలు ప్యాసింజర్ కార్ల విక్రయాల్లో 30 శాతాన్ని ఆక్రమించాయి. ఇతర కంపెనీల నుంచి పోటీ ఉన్నప్పటికీ.., మారుతీ సుజుకీ చెందిన ఐదు ప్యాసింజర్ వాహన మోడల్స్ తొలి ఐదు స్థానాలను దక్కించుకోవడం గర్వంగా ఉందని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీవాస్తవ తెలిపారు. (అంచనాలను మించిన పరోక్ష పన్నులు) -
ప్రతి నెల పదివేలు చెల్లిస్తే మారుతి స్విఫ్ట్ కారు మీదే
దేశంలో అత్యంత అధికంగా అమ్ముడవుతున్న బ్రాండ్లలో మారుతి స్విఫ్ట్ ప్రధానంగా చెప్పవచ్చు. ఈ కారు మోడల్ మార్కెట్లోకి విడుదలై 15 సంవత్సరాలు గడిచినప్పటికీ ఇంకా సేల్స్ లో టాప్ గేర్ లో కొనసాగుతోంది. మారుతి సుజుకి ఇండియా 2021 స్విఫ్ట్ ఫేస్లిఫ్ట్ను ఫిబ్రవరి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.5.73 లక్షలకు(ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) విడుదల చేసింది. టాప్-ఆఫ్-లైన్ వేరియంట్ రూ.8.41 లక్షలకు(ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) లభిస్తుంది. 2021 మారుతి సుజుకి స్విఫ్ట్ సరికొత్త నెక్స్ట్-జెన్ కె-సిరీస్ డ్యూయల్-జెట్, డ్యూయల్-వివిటి పెట్రోల్ ఇంజిన్తో వస్తుంది. 2021 మారుతి సుజుకి స్విఫ్ట్ ఫేస్లిఫ్ట్ మధ్యలో బోల్డ్ హారిజాంటల్ క్రోమ్ తో సరికొత్త మెష్ గ్రిల్ను పొందుతుంది. ఎల్ఈడీ డీఆర్ఎల్లు, ఎల్ఈడీ టెయిల్ లాంప్స్, 15-అంగుళాల ప్రెసిషన్-కట్ అల్లాయ్ వీల్స్ ఉన్న ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్లు అవుట్గోయింగ్ మోడల్ నుంచి ముందుకు తీసుకెళ్లబడ్డాయి. 1.2 లీటర్ కె-సిరీస్ పెట్రోల్, 1.3 లీటర్ డీడీఐఎస్ డీజిల్ ఇంజిన్లను కొత్త స్విఫ్ట్లోనూ వాడారు. మారుతి సుజుకి ఇండియా 2021 స్విఫ్ట్ ఎంటి 23.20 కిలోమీటర్లు, 2021 స్విఫ్ట్ ఎఎమ్టి 23.76 కిలోమీటర్లు మైలేజీ ఇస్తుందని పేర్కొంది. భారత్లో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్-5 కార్లలో ఒకటిగా స్విఫ్ట్ నిలిచింది. మార్కెట్ షేర్లో 35 శాతం వాటా దీనిదే కావడం విశేషం. ఇక ఈ కారు ఫైనాన్స్ విషయానికి వస్తే కనిస్టంగా రూ.1,28,759 డౌన్ పేమెంట్ చెల్లించి కారును సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు మార్కెట్లో బ్యాంకులు అత్యల్పంగా 7 నుంచి 9 శాతం మధ్యలో కార్ల వడ్డీ రేట్లతో లోన్లను అందిస్తున్నారు. ఈ లెక్కన 5 సంవత్సరాల కాల వ్యవధికి సుమారు రూ.10 వేల వరకూ ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. చదవండి: డేంజర్ జోన్లో వాట్సప్ యూజర్లు! -
ఏప్రిల్ నుంచి పెరగనున్న కారు, బైక్ ధరలు
న్యూఢిల్లీ: ఏప్రిల్ 1 నుంచి కారు, ద్విచక్ర వాహనాల ధరలు పెరగనున్నాయి. అల్యూమినియం, ప్లాస్టిక్ వంటి ముడి సరకు ధరలు, వస్తువుల ఖర్చులు పెరగడం వల్ల కార్లు, ద్విచక్ర వాహనాల ధరలు పెంచుతున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఖర్చుల పెరుగుదల వల్ల ఇప్పటికే జనవరిలోనే వాహనాల ధరలు పెరిగాయి. కేవలం స్వల్ప సమయంలోనే రెండో సారి ధరలు పెరగనున్న నేపథ్యంలో కొనుగోలుదారులు ఏ విధంగా స్పందిస్తారు అనే దానిపై కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా ఇప్పటికే వివిధ మోడల్స్, వేరియంట్ల ధరల పెంచుతున్నట్లు ప్రకటించింది. వివిధ ఇన్పుట్ ఖర్చులు పెరగడం వలన వాహనా తయారీకి అయ్యే ఖర్చు పెరుగుతుందని మారుతి సుజుకి పేర్కొంది. అందువల్ల, ఏప్రిల్లో కస్టమర్ల మీద అదనపు భారం పడే అవకాశం ఉండనున్నట్లు కంపెనీ పేర్కొంది. నిస్సాన్ కూడా కొత్త ఎస్యూవీల ధరలను పెంచాలని నిర్ణయించింది. నిస్సాన్, డాట్సన్ సిరీస్లోని వివిధ వేరియంట్ల ధరలను విడివిడిగా పెంచనున్నట్లు నిస్సాన్ ప్రకటించింది. ఇతర కంపెనీలు కూడా వాహనాల ధరలను సమీక్షిస్తున్నాయి. త్వరలోనే ధరల పెరుగుదల గురించి సంస్థలు ప్రకటించే అవకాశం ఉంది. ప్రత్యక్ష ఇన్పుట్ ఖర్చులు మాత్రమే కాకుండా ఇంధన, సరుకు రవాణా ఖర్చులు పెరగడంతో కంపెనీలపై భారం పడుతోంది. డీజిల్ రిటైల్ ధరలు రికార్డు స్థాయిలో పెరగడంతో కంపెనీలు రవాణా, ఇతర మౌలిక సదుపాయాల ఖర్చులు పెరిగాయి. ఈ కారణాల వల్ల బైక్ కంపెనీ ధరలను ఏప్రిల్ నుంచి పెంచనున్నాయి. ఇప్పటికే ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో ద్విచక్ర వాహన ధరలను పెంచుతున్నట్లు హీరో మోటోకార్ప్ పేర్కొంది. కస్టమర్లపై ఎక్కువ భారం పడకుండా ఉండటానికి తయారీ ఖర్చులను తగ్గించే ప్రయత్నం చేయనున్నట్లు హీరో మోటోకార్ప్ వెల్లడించింది. అలాగే ప్రీమియం బైక్స్పై కూడా ఈ ప్రభావం పడుతుంది. రాయల్ ఎన్ఫీల్డ్ కొత్తగా ఇటీవల తీసుకొచ్చిన ఇంటర్సెప్టర్ 650, కాంటినెంటల్ జీటీ 650 కొత్త వేరియంట్ ధరలు 2 శాతం పెరిగాయి. చదవండి: వన్ప్లస్ 9 సిరీస్ స్మార్ట్ఫోన్ ఉచితంగా పొందండిలా! -
కొత్త కారు కొనాలనుకునేవారికి షాకింగ్ న్యూస్
న్యూఢిల్లీ: మీరు ఈ కొత్త ఏడాదిలో కొత్త కారు కొనాలనుకుంటున్నారా? అయితే.. మీకు ఒక షాకింగ్ న్యూస్. దేశీయ ఆటో రంగ దిగ్గజం మారుతి సుజుకీ కార్ల ధరలను పెంచింది. గత నెలలో ప్రకటించిన విదంగానే ఇప్పుడు తమ వివిధ మోడళ్ల ధరలను పెంచేసింది. మారుతి సుజుకి కార్ల ధరలను దేశవ్యాప్తంగా రూ.34,000 వరకు పెంచింది. కొత్తగా పెరిగిన ధరలు వెంటనే దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తాయని సంస్థ పేర్కొంది. ధరల ప్రధాన కారణం పెరిగిన ఉత్పాదక వ్యయాలు అని స్పష్టం చేసింది. కరోనా మహమ్మారి ప్రభావం తర్వాత డిసెంబర్ నెలలో మారుతి కార్ల అమ్మకాలు 20 శాతం మేర పెరిగినట్టు సంస్థ ప్రకటించింది. మొత్తంగా చెప్పాలంటే ఈ ఏడాది కొత్త కారు కొనేవారు అదనంగా మరింత సొమ్మును చెల్లించాలి. కార్ల తయారీదారి మారుతి సుజుకి పెరిగిన ధరల వివరాలను అధికారిక జాబితాను పంచుకోకపోయిన, కొన్ని పెరిగిన కారు ధరల వివరాలు బయటకి వెలువడ్డాయి. ఈ నివేదికల ప్రకారం, మారుతి సుజుకి పెరిగిన కార్ల జాబితా ఈ క్రింది విదంగా ఉంది. మారుతి సుజుకి టూర్ ఎస్: రూ.5,061 వరకు మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో: రూ.7,000 వరకు మారుతి సుజుకి విటారా బ్రెజ్జా: రూ.10,000 వరకు మారుతి సుజుకి డిజైర్: రూ.12,500 వరకు మారుతి సుజుకి ఆల్టో 800: రూ.14,000 వరకు మారుతి సుజుకి సెలెరియో: రూ.19,400 వరకు మారుతి సుజుకి వాగన్-ఆర్: రూ.23,200 వరకు మారుతి సుజుకి ఈకో: రూ.24,200 వరకు మారుతి సుజుకి స్విఫ్ట్: రూ.30,000 వరకు మారుతి సుజుకి ఎర్టిగా: రూ.34,000 వరకు -
కొత్తగా కార్లు కొంటున్నవారే అధికం!
చెన్పై, సాక్షి: రుతుపవనాలు, రబీ పంటలు, చౌక రుణాల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల నుంచి కార్ల విక్రయాలు పెరిగినట్లు ఆటో పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. పండుగల సందర్భంగా ఇటీవల కార్ల విక్రయాలు 10-15 శాతం స్థాయిలో్ పుంజుకున్నట్లు తెలియజేశాయి. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామాల నుంచి డిమాండ్ అధికంగా కనిపిస్తున్నట్లు వెల్లడించాయి. అక్టోబర్ 16న మొదలైన పండుగల సీజన్ నవంబర్ చివరి వారం వరకూ కొనసాగినట్లు తెలియజేశారు. గతేడాదితో పోలిస్తే.. ఈ పండుగల సీజన్లో 10-11 శాతం అధికంగా 2.33 లక్షల కార్లను విక్రయించినట్లు మారుతీ సుజుకీ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. ఇది గత 4-5 ఏళ్లలో అధికమని చెప్పారు. వీటిలో 40 శాతం గ్రామీణ ప్రాంతాల నుంచే నమోదైనట్లు వెల్లడించారు. గ్రామ ప్రాంతాల నుంచి తొలిసారి కార్లు కొంటున్నవారి వాటా 5 శాతం పెరిగి 54 శాతాన్ని తాకినట్లు తెలియజేశారు. పట్టణాలలో అయితే ఈ సంఖ్య 48 శాతానికి చేరినట్లు చెప్పారు. ప్రధానంగా ఈకో వ్యాన్లు, ఆల్టో, వ్యాగన్ ఆర్ వంటి చిన్న కార్లకు డిమాండ్ పెరిగినట్లు పేర్కొన్నారు. రేనాల్ట్ సైతం నవరాత్రి రోజులలో 5,000 కార్లు, ధన్తేరాస్, దీపావళిలలో 3,000 కార్లు చొప్పున విక్రయించినట్లు రేనాల్ట్ ఇండియా ప్రతినిధులు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి కోవిడ్-19కు ముందు స్థాయితో పోలిస్తే 50 శాతం డిమాండ్ కనిపించినట్లు తెలియజేశారు. గ్రామీణవాసులు, రైతులకు ప్రత్యేక పథకాలు ప్రకటించడంతో ఇది సాధ్యపడినట్లు వెల్లడించారు. తొలిసారి కారు కొనుగోలుదారులు, ఇతరులతో కలిపి క్విడ్, ట్రైబర్లకు డిమాండ్ పెరిగినట్లు పేర్కొన్నారు. గతేడాదితో పోలిస్తే 7 శాతం పెరిగిన వర్షపాతంతో రబీ పంటల దిగుబడి 6 శాతం అధికంగా 152 మిలియన్ టన్నులకు చేరినట్లు విశ్లేషకులు తెలియజేశారు. దీనికితోడు ప్రభుత్వం రబీ పంటలకు మద్దతు ధరను పెంచడంతో ఖరీఫలోనూ పంటలసాగు 95 మిలియన్లు పెరిగి 1100 మిలియన్ హెక్టార్లకు చేరినట్లు వివరించారు. -
ఆటో కంపెనీలకు దసరా పండగ..
న్యూఢిల్లీ: దసరా పండగ సందర్భంగా అక్టోబర్లో వాహనాల విక్రయాలు జోరుగా సాగాయి. కొత్త వస్తువుల కొనుగోళ్లకు శుభకరంగా పరిగణించే నవరాత్రుల్లో అమ్మకాలు భారీగా నమోదయ్యాయని ఆటోమొబైల్ వర్గాలు వెల్లడించాయి. దిగ్గజ సంస్థలు మారుతీ సుజుకీ ఇండియా, హ్యుందాయ్ రెండంకెల స్థాయిలో వృద్ధి సాధించాయి. మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) విక్రయాలు సుమారు 20 శాతం వృద్ధితో 1,72,862 యూనిట్లుగా నమోదయ్యాయి. మినీ కార్ల అమ్మకాలు తగ్గినప్పటికీ స్విఫ్ట్, సెలీరియో వంటి కాంపాక్ట్ కార్లు, ఎస్–క్రాస్ వంటి యుటిలిటీ వాహనాల అమ్మకాలు పెరిగాయి. అటు హ్యుందాయ్ మోటార్ ఇండియా నెలవారీగా అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసింది. అక్టోబర్లో విక్రయాలు 13 శాతం పెరిగి 56,605 యూనిట్లకు చేరాయి. చివరిసారిగా 2018 అక్టోబర్లో హ్యుందాయ్ అత్యధికంగా 52,001 యూనిట్లు విక్రయించింది. ‘అక్టోబర్ గణాంకాలు వ్యాపార పరిస్థితులపరంగా సానుకూల ధోరణులకు శ్రీకారం చుట్టాయి. మరింత మెరుగైన పనితీరు కనపర్చగలమని ధీమాగా ఉన్నాం‘ అని హ్యుందాయ్ మోటార్ ఇండియా డైరెక్టర్ తరుణ్ గర్గ్ తెలిపారు. ఇక హోండా కార్స్ ఇండియా అమ్మకాలు 8 శాతం పెరిగి 10,836 యూనిట్లకు చేరాయి. మార్కెట్ సెంటిమెంట్కి తగ్గట్టుగా, తమ అంచనాలకు అనుగుణంగా అక్టోబర్లో సానుకూల ఫలితాలు సాధించగలిగామని హోండా కార్స్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజేశ్ గోయల్ చెప్పారు. నవరాత్రుల్లో అమ్మకాలు.. అక్టోబర్ మధ్యలో నవరాత్రులు మొదలైనప్పట్నుంచి వాహనాల విక్రయాలు పుంజుకున్నాయి. నవరాత్రుల్లో మారుతీ సుజుకీ అమ్మకాలు 27 శాతం పెరిగి 96,700 యూనిట్లకు చేరాయి. గతేడాది ఇదే వ్యవధిలో మారుతీ సుమారు 76,000 వాహనాలు విక్రయించింది. ఇక హ్యుందాయ్ మోటార్ ఇండియా అమ్మకాలు కూడా 28 శాతం పెరిగి 26,068 యూనిట్లుగా నమోదయ్యాయి. టాటా మోటార్స్ విక్రయాలు ఏకంగా 90 శాతం వృద్ధితో 5,725 యూనిట్ల నుంచి 10,887 యూనిట్లకు పెరిగాయి. సమీప భవిష్యత్తుపై పరిశ్రమ వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. -
మారుతి ఆల్టో రికార్డు
సాక్షి, ముంబై : భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (ఎంఎస్ఐఎల్) ఎంట్రీ లెవల్ కారు ఆల్టో మరోసారి అమ్మకాల్లో నంబర్ వన్ స్థానాన్ని కొట్టేసింది. "ఆల్టో’’ వరుసగా 16 వ సంవత్సరం కూడా భారతదేశంలో నంబర వన్ అమ్మకపు కారుగా నిలిచిందని మారుతి ప్రకటించింది. 40 లక్షల యూనిట్ల సంచిత అమ్మకాల మరో గొప్ప మైలురాయిని అధిగమించామని గురువారం వెల్లడించింది. 76 శాతం భారతీయుల తొలి ఎంపిక తమ కారేనని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. భారతదేశపు తొలి ఎంట్రీ లెవల్ కారు ఆల్టో బీఎస్-6 నిబంధనలకు అనుగుణంగా సరికొత్త భద్రతా ఫీచర్లతో కూడి ఉందని పేర్కొంది. ఇందుకు చాలా సంతోషంగా ఉందని మరే ఇతర భారతీయ కారు సాధించని అమ్మకపు రికార్డు తమ కారు సృష్టించిందని ఎంఎస్ఐఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్సే అండ్ సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. కాగా సెప్టెంబర్ 2000లో లాంచ్ అయిన మారుతి సుజుకి ఆల్టో ప్రస్తుతం 2.95 లక్షల రూపాయల (ఢిల్లీలో ఎక్స్-షోరూమ్) నుంచి 4.36 లక్షల రూపాయల మధ్య అందుబాటులో ఉంది.