మారుతీ నుంచి కొత్త మోడళ్లు..  | New models from Maruti | Sakshi
Sakshi News home page

మారుతీ నుంచి కొత్త మోడళ్లు.. 

Jan 8 2019 1:30 AM | Updated on Jan 8 2019 1:30 AM

New models from Maruti - Sakshi

న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరంలో రెండు సరికొత్త మోడళ్లను భారత మార్కెట్‌లోకి విడుదల చేయనున్నట్లు మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్‌ఐ) ప్రకటించింది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో 2 సరికొత్త ఉత్పత్తులను అందించనున్నట్లు సంస్థ చైర్మన్‌ ఆర్‌సి భార్గవ వెల్లడించారు. ఈ ఏడాది మార్చిలోపు ఒక మోడల్‌ను భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారయన. ఈ అంశంపై మాట్లాడుతూ.. ‘నూతన భద్రతా నిబంధనలకు అనుగుణంగా నూతన మోడళ్లలో ఎయిర్‌ బ్యాగ్స్, సీట్‌ బెల్ట్‌ రిమైండర్, రివర్స్‌ పార్కింగ్‌ సెన్సార్స్‌ వంటి ఫీచర్లను ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఏడాది జూన్‌ నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుంది. ఎన్నికల సమయంలో కార్ల కొనుగోలు అధికంగా ఉంటుందనే విషయం ఇప్పటికే నిరూపితమైంది. ఈ నేపథ్యంలో నూతన మోడళ్లపై దృష్టిసారించాం.’ అని వ్యాఖ్యానించారు. ఈయన ప్రకటన అనంతరం.. ప్రీమియం కార్‌ నెక్సా, మరో సాధారణ మోడల్‌లో నూతన కార్లు విడుదల ఉండవచ్చని పరిశ్రమ వర్గాలు అంచనావేశాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement