Indian market
-
టాప్ 10 రియర్ వీల్ డ్రైవ్ కార్లు ఇవే..
భారతదేశంలో ఆల్ వీల్స్ డ్రైవ్ (AWD), రియర్ వీల్ డ్రైవ్ (RWD) వంటి మోడల్స్ ఉన్నాయి. అయితే ఇందులో రియర్ వీల్ డ్రైవ్ కార్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఎక్కువమంది ఈ మోడల్స్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ కథనంలో అత్యంత సరసమైన 10 రియర్ వీల్ డ్రైవ్ కార్లు ఏవి?, వాటి ధరలు ఎలా ఉన్నాయనే విషయాలు తెలుసుకుందాం.➤టయోటా ఫార్చ్యూనర్: రూ.35.37 లక్షలు➤మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ: రూ.21.90 లక్షలు➤ఇసుజు డీ-మ్యాక్స్: రూ.21.50 లక్షలు➤టయోటా ఇన్నోవా క్రిస్టా: రూ.19.99 లక్షలు➤మహీంద్రా బిఈ6: రూ.18.90 లక్షలు➤మహీంద్రా స్కార్పియో: రూ.13.62 లక్షలు➤మహీంద్రా థార్: రూ.11.50 లక్షలు➤మహీంద్రా బొలెరో: రూ.9.79 లక్షలు➤ఎంజీ కామెట్: రూ. రూ. 7 లక్షలు➤మారుతి ఈకో: రూ.5.44 లక్షలురియర్ వీల్ డ్రైవ్రియర్ వీల్ డ్రైవ్ కార్లలోని ఇంజిన్.. శక్తిని (పవర్) వెనుక చక్రాలను డెలివరీ చేస్తుంది. అప్పుడు వెనుక చక్రాలను కారును ముందుకు నెడతాయి. అయితే ఈల్ వీల్ డ్రైవ్ కార్లు.. శక్తిని అన్ని చక్రాలను పంపుతాయి. ధరల పరంగా ఆల్ వీల్ డ్రైవ్ కార్ల కంటే.. రియర్ వీల్ డ్రైవ్ కార్ల ధరలే తక్కువ. ఈ కారణంగానే చాలామంది ఈ RWD కార్లను ఇష్టపడి కొనుగోలు చేస్తుంటారు. -
భారత్లో టెస్లాకు అంత ఈజీ కాదు
న్యూఢిల్లీ: భారత్లో తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లాకు ఇక్కడి మార్కెట్పై పట్టు సాధించడం అంత సులువు కాదని జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ వ్యాఖ్యానించారు. టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రాలాంటి దేశీ దిగ్గజాల తరహాలో అది రాణించలేకపోవచ్చని తెలిపారు. ఎర్న్స్ట్ అండ్ యంగ్ ‘ఎంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. ‘‘మస్క్ చాలా స్మార్ట్. అందులో సందేహం లేదు. ఆయన చాలా గొప్ప పనులు చేస్తున్నారు. కానీ ఆయన ఉన్నది అమెరికాలో, భారత్లో కాదు. ఇక్కడ విజయం సాధించాలంటే అంత సులభం కాదు. మహీంద్రా, టాటాల్లాగా ఆయన రాణించలేరు’’ అని జిందాల్ పేర్కొన్నారు. ఈవీల దిగుమతులపై టారిఫ్ల తగ్గింపు అవకాశాలతో భారత మార్కెట్లో ప్రవేశించేందుకు టెస్లా సన్నాహాలు చేసుకుంటున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. జేఎస్డబ్ల్యూ గ్రూప్ కూడా ఈవీ సెగ్మెంట్లో అవకాశాలను అందిపుచ్చుకునే ప్రయత్నాల్లో ఉంది. చైనాకు చెందిన ఎస్ఏఐసీ కార్పొరేషన్తో ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ సంస్థ జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటర్ ఇండియా ఇటీవలే ఎలక్ట్రిక్, ప్లగ్–ఇన్ హైబ్రిడ్స్ మొదలైన పలు వాహనాలను ప్రదర్శించింది. -
'భారత్లో టెస్లా కార్ల ధరలు ఇలాగే ఉంటాయి!'
ప్రపంచ కుబేరుడు 'ఎలాన్ మస్క్' (Elon Musk) భారతదేశానికి టెస్లా కార్లను తీసుకురానున్నట్లు గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ముంబై, ఢిల్లీ ప్రాంతాల్లో షోరూమ్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు, అందులో పనిచేయడానికి కావలసిన నిపుణుల కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది. అయితే టెస్లా (Tesla) కార్లు దేశీయ విఫణిలో అడుగుపెడితే.. వాటి ధరలు ఎలా ఉంటాయనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.విదేశీ కంపెనీలపై.. దిగుమతి సుంకాలను విధించడం సర్వసాధారణం. అయితే టెస్లా కంపెనీపై దిగుమతి సుంకాన్ని 20 శాతం తగ్గిస్తే.. కార్ల ధరలు తగ్గుతాయి. ధరలు తగ్గిన తరువాత కూడా.. టెస్లా కారు ప్రారంభ ధర రూ. 35 లక్షల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుందని గ్లోబల్ క్యాపిటల్ మార్కెట్ కంపెనీ 'సీఎల్ఎస్ఏ' నివేదికలో వెల్లడించింది.ప్రస్తుతం అమెరికాలో టెస్లా చౌకైన కారు.. 'మోడల్ 3' ధర ఫ్యాక్టరీ స్థాయిలో దాదాపు 35,000 డాలర్లు (సుమారు రూ. 30.4 లక్షలు). భారతదేశంలో దిగుమతి సుంకాలను 15-20 శాతానికి తగ్గించడంతో పాటు, రోడ్ ట్యాక్స్ & ఇన్సూరెన్స్ వంటి అదనపు ఖర్చులతో, ఆన్-రోడ్ ధర 40,000 డాలర్లు లేదా దాదాపు రూ. 35-40 లక్షలుగా ఉంటుంది.మహీంద్రా XEV 9e, హ్యుందాయ్ ఈ-క్రెటా, మారుతి సుజుకి ఈ-విటారా వంటి దేశీయ ఎలక్ట్రిక్ వెహికల్స్ కంటే.. టెస్లా మోడల్ 3 ధర 20-50 శాతం ఎక్కువ. కాబట్టి టెస్లా అమ్మకాలు ఇండియాలో ఆశాజనకంగా ఉంటాయా? అనేది ఒక ప్రశ్న. అయితే టెస్లా ధరలు భారతీయ ఈవీ మార్కెట్ను దెబ్బతీసే అవకాశం ఉందని సీఎల్ఎస్ఏ నివేదిక వెల్లడించింది.ఇదీ చదవండి: ఫాస్ట్ట్యాగ్ కొత్త రూల్స్.. ఆ టోల్ ప్లాజాలకు వర్తించదుటెస్లా కంపెనీ రూ. 25 లక్షల కంటే తక్కువ ధర కలిగిన ఎంట్రీ లెవల్ మోడల్ను ఇండియాలో లాంచ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. టెస్లా ప్రవేశం ప్రధాన భారతీయ వాహన తయారీదారులపై గణనీయమైన ప్రభావాన్ని చూపదని నివేదిక సూచిస్తుంది. ఎందుకంటే భారతదేశంలో మొత్తం EVల వ్యాప్తి చైనా, యూరప్ మరియు US కంటే తక్కువగా ఉంది. -
భారత్లో ఐఫోన్ టాప్
న్యూఢిల్లీ: ‘భారత్లో అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్ఫోన్ మోడల్గా ఐఫోన్ అవతరించింది. రికార్డు స్థాయిలో వ్యాపారాన్ని నమోదు చేసిన భారత్పై కంపెనీ చాలా ఆసక్తిగా ఉంది’ అని యాపిల్ సీఈవో టిమ్ కుక్ శుక్రవారం తెలిపారు. కౌంటర్పాయింట్ రిసర్చ్ ప్రకారం భారత స్మార్ట్ఫోన్ విపణిలో 2024లో విలువ పరంగా 23 శాతం వాటాతో యాపిల్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. అలాగే స్మార్ట్ఫోన్స్ సంఖ్య పరంగా టాప్–5గా నిలిచింది. ‘అభివృద్ధి చెందుతున్న మార్కెట్లో గొప్ప ఫలితాలను సాధించాం. ముఖ్యంగా భారత్పై నేను ఆసక్తిగా ఉన్నాను. డిసెంబర్ త్రైమాసికంలో భారత్ రికార్డును నెలకొల్పింది. ఈ త్రైమాసికంలో ఐఫోన్ అత్యధికంగా అమ్ముడైంది. ప్రపంచంలో స్మార్ట్ఫోన్లకు రెండవ అతిపెద్ద, పర్సనల్ కంప్యూటర్స్, టాబ్లెట్ పీసీలకు భారత్ మూడవ అతిపెద్దది మార్కెట్. కాబట్టి ఇక్కడ భారీ మార్కెట్ ఉంది. మరిన్ని యాపిల్ ఔట్లెట్లను ప్రారంభించే యోచనలో ఉన్నాం. యాపిల్ ఇంటెలిజెన్స్ను విస్తరిస్తున్నాం. స్థానికీకరించిన ఇంగ్లీష్ వెర్షన్ను భారత్లో ఏప్రిల్లో విడుదల చేస్తాం’ అని టిమ్ కుక్ వివరించారు. కాగా, డిసెంబర్ త్రైమాసికంలో యాపిల్ మొత్తం ఆదాయం రికార్డు స్థాయిలో 4 % వృద్ధితో 124.3 బిలియన్ డాలర్లు నమోదైందని వెల్లడించారు. లాభం 7 శాతం క్షీణించి 33.91 బిలియన్ డాలర్లకు చేరింది. -
2024లో లంబోర్ఘిని కార్లను ఇంతమంది కొన్నారా?
ఇటాలియన్ సూపర్ కార్ల తయారీ సంస్థ 'లంబోర్ఘిని' (Lamborghini) భారతదేశంలో గణనీయమైన విక్రయాలను పొందుతోంది. 2024లో కంపెనీ 113 కార్లను సేల్ చేసింది. దీంతో సంస్థ విక్రయాల్లో సరికొత్త రికార్డును నమోదు చేసింది.2023తో పోలిస్తే 2024లో లంబోర్ఘిని విక్రయాలు 10 శాతం పెరిగాయి. కాగా ప్రపంచ వ్యాప్తంగా కంపెనీ 10,687 కార్లను విక్రయించింది. ఇందులో అధిక భాగం రెవెల్టో హైబ్రిడ్ స్పోర్ట్స్ కారు ఉంది. అంతకు ముందు ఏడాదిలో హురాకాన్ మంచి అమ్మకాలను పొందింది. ఈ ఏడాది కంపెనీ ఉరుస్ ఎస్ఈ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ కారును లాంచ్ చేసే అవకాశం ఉంది.గత ఏడాది అన్ని ప్రధాన మార్కెట్లలో కంపెనీ మంచి వృద్ధిని సాధించింది. లంబోర్ఘిని.. యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాలలో 4,227 కార్లను విక్రయించింది. అమెరికాలో 3,712 యూనిట్లు, ఆసియా - పసిఫిక్ ప్రాంతంలో 2,748 యూనిట్లను విక్రయించింది. ఈ ఏడాది కూడా కంపెనీ మంచి అమ్మకాలను పొందే అవకాశం ఉంటుంది. -
మారుతీ సుజుకీ నుంచి చిన్న ఈవీ!
న్యూఢిల్లీ: పరిమాణం, మార్కెట్ వాటాలో భారత్లో అతిపెద్ద కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ) విభాగంపై దృష్టి సారిస్తోంది. దేశీయ ఈవీ మార్కెట్లో కంపెనీ ఎంట్రీ కాస్త ఆలస్యం అయిన సంగతి తెలిసిందే. ‘ఈవీ మార్కెట్ను అధ్యయనం చేస్తున్నాం. మా పోటీదారుల ఉత్పత్తులు ఎలా పనిచేశాయో చూశాం. భారతీయ మార్కెట్కు ఏమి అవసరమో మాకు తెలుసు. అంతర్జాతీయంగా సుజుకీ కార్పొరేషన్కు ఎలక్ట్రిక్ వెహికిల్స్తోపాటు ఇతర అన్ని మోడళ్లకు ఉత్పత్తి కేంద్రంగా భారత్ ఉంటుంది. ఉత్పత్తిలో దాదాపు 50 శాతం జపాన్, యూరప్కు ఎగుమతి చేస్తాం’ అని సుజుకీ మోటార్ కార్పొరేషన్ ప్రెసిడెంట్, రిప్రజెంటేటివ్ డైరెక్టర్ తొషిహిరో సుజుకీ గురువారం వెల్లడించారు. భారత్ మొబిలిటీ ఎక్స్పో నేటి (జనవరి 17) నుంచి ప్రారంభం అవుతున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. చిన్న ఎలక్ట్రిక్ కార్లు.. ఎస్యూవీలపై ప్రధానంగా దృష్టి సారిస్తూ భారత ప్యాసింజర్ వాహన మార్కెట్లో 50 శాతం మార్కెట్ వాటాను.. అలాగే ఈవీ విపణిలో అగ్రశ్రేణి వాటాను పొందాలని చూస్తున్నట్లు తొషిహిరో సుజుకీ వెల్లడించారు. ఎస్యూవీలను కస్టమర్లు డిమాండ్ చేస్తున్నందున భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఈ–విటారాతో ఈవీ ప్రయాణం ప్రారంభం అవుతుందని ఆయన చెప్పారు. వినియోగానికి కాంపాక్ట్ ఈవీలు ఉత్తమంగా సరిపోతాయని సుజుకీ అన్నారు. ఈవీ విభాగంలో కంపెనీ నుంచి తదుపరి మోడల్ చిన్న కారు వచ్చే అవకాశం ఉందని ఆయన మాటలనుబట్టి సుస్పష్టం అవుతోంది. కస్టమర్ అవసరాలను అధ్యయనం చేస్తున్నామని, ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ కార్లు ట్యాంక్ ఇంధనంతో దాదాపు 500 కిలోమీటర్ల పరిధిని ఇస్తాయని సుజుకీ తెలిపారు. ఈ దూరాన్ని ఆచరణ సాధ్యం చేయడానికి ఈ–విటారాను సన్నద్ధం చేస్తున్నట్టు చెప్పారు. భారత్ మండపం వేదికగా ఈ–విటారాను కంపెనీ శుక్రవారం (నేడు) ఆవిష్కరిస్తోంది. టాటా నెక్సాన్ ఈవీతో పాటు హ్యుండై క్రెటా ఎలక్ట్రిక్, ఎంజీ జడ్ఎస్ ఈవీలకు ఈ–విటారా పోటీ ఇవ్వనుంది. ఇంకా డిమాండ్ ఉంది.. అమ్మకాలు క్షీణిస్తున్నప్పటికీ భారత్లో చిన్న కార్లు నిలిచిపోవని సుజుకీ అన్నారు. ‘సుజుకీ కార్పొరేషన్ అనుబంధ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా భారత్లో మార్కెట్ లీడర్గా ఉంది. ద్విచక్ర వాహనాల నుండి నాలుగు చక్రాల వాహనాలకు అప్గ్రేడ్ అయ్యే అవకాశం ఉన్న 100 కోట్ల మంది ప్రజలకు భవిష్యత్తులో ఇంకా సరసమైన చిన్న కార్లు అవసరం అని విశ్వసిస్తున్నాం. ఈ–విటారా పట్ల కస్టమర్ల నుండి అభిప్రాయాన్ని, ప్రతిస్పందనను అర్థం చేసుకుంటాం. ఆ తర్వాతే చిన్న ఎలక్ట్రిక్ కార్ల ప్రణాళికలతో ముందుకు సాగుతాం’ అని వివరించారు. కాగా, మారుతీ సుజుకీ ఇండియా 2024లో 3.24 లక్షల యూనిట్లను ఎగుమతి చేసింది. ఇప్పటి వరకు ఇదే అత్యధికం. ఎలక్ట్రిక్ యాక్సెస్ సైతం.. సుజుకీ మోటార్సైకిల్ ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ–యాక్సెస్ను భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో సందర్భంగా ఆవిష్కరిస్తోంది. సుజుకీ ఇప్పటికే భారత్లో పెట్రోల్ వర్షన్ యాక్సెస్–125 విక్రయిస్తోంది. భారతీయుడు కూడా సుజుకీ మోటార్ ప్రెసిడెంట్ కావచ్చు..మారుతీ సుజుకీ ఇండియా ఎండీ, సీఈవో ఎవరైనా కావొచ్చని, ఇక్కడ జాతీయత ఒక అంశం కాదని తొషిహిరో సుజుకీ అన్నారు. భారతీయుడు కూడా సుజుకీ మోటార్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ పదవి చేపట్టవచ్చని స్పష్టం చేశారు. తన తండ్రి దివంగత ఒసాము సుజుకీ 40 సంవత్సరాల క్రితం భారత్ వచ్చారని, ఈ మార్కెట్ యొక్క అసలైన సామర్థ్యాన్ని ఎవరూ ఊహించలేదని వివరించారు. అయినప్పటికీ భారతదేశం మరియు ఇక్కడి ప్రజలపై ఆయనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. నేడు భారతీయ ఆటోమోటివ్ పరిశ్రమ ప్రపంచంలో మూడవ అతిపెద్ద మార్కెట్గా అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. 2003లో లిస్టింగ్ అయినప్పటి నుండి మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్ అలాగే ఎండీ, సీఈవో పదవులను భారతీయ, జపాన్ ఎగ్జిక్యూటివ్లు అలంకరిస్తున్నారు. -
ఈ టూవీలర్స్ అమ్మకాలు.. వీటిదే ఆధిపత్యం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలో డిసెంబర్ నెలలో 'బజాజ్ చేతక్' (Bajaj Chetak) తొలి స్థానంలోకి దూసుకొచ్చింది. గత నెలలో 18,276 యూనిట్లతో బజాజ్ ఆటో 25 శాతం మార్కెట్ వాటాను దక్కించుకుంది. 2020 జనవరిలో ఎలక్ట్రిక్ చేతక్ ద్వారా స్కూటర్స్ రంగంలోకి బజాజ్ రీ-ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. ఈ-టూ వీలర్స్ విభాగంలో దేశంలో ఒక నెల అమ్మకాల్లో తొలి స్థానాన్ని కైవసం చేసుకోవడం సంస్థకు ఇదే తొలిసారి. డిసెంబర్ నెలలో 17,212 యూనిట్లతో టీవీఎస్ మోటార్ కంపెనీ రెండవ స్థానంలో నిలిచింది.నవంబర్ వరకు తొలి స్థానంలో కొనసాగిన ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) గత నెలలో అతి తక్కువగా 13,769 యూనిట్లతో 19 శాతం వాటాతో మూడవ స్థానానికి పరిమితమైంది. 2024లో కంపెనీకి అతి తక్కువ విక్రయాలు నమోదైంది డిసెంబర్ నెలలోనే కావడం గమనార్హం. అక్టోబర్లో 41,817 యూనిట్ల అమ్మకాలు సాధించిన ఓలా ఎలక్ట్రిక్ నవంబర్లో 29,252 యూనిట్లను నమోదు చేసింది.హోండా ఎలక్ట్రిక్ (Honda Electric) టూ వీలర్లు రోడ్డెక్కితే ఈ ఏడాది మార్కెట్ మరింత రసవత్తరంగా మారడం ఖాయంగా కనపడుతోంది. సంప్రదాయ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ (ఐసీఈ) ఆధారత టూవీలర్ రంగాన్ని ఏలుతున్న దిగ్గజాలే ఎలక్ట్రిక్ విభాగాన్ని శాసిస్తాయనడంలో అతిశయోక్తి లేదు. ప్రతి నెల నమోదవుతున్న అమ్మకాలే ఇందుకు నిదర్శనం.రెండింటిలో ఒకటి ఈవీ..భారత త్రిచక్ర వాహన రంగంలో ఎలక్ట్రిక్ త్రీవీలర్లు దూకుడుమీదున్నాయి. భారత ఈవీ రంగంలో టూవీలర్ల తర్వాత త్రీవీలర్లు రెండవ స్థానంలో నిలిచాయి. 2024లో దేశవ్యాప్తంగా మొత్తం 6,91,011 యూనిట్ల ఈ-త్రీవీలర్స్ రోడ్డెక్కాయి. భారత్లో గతేడాది ఎలక్ట్రిక్, ఐసీఈ, సీఎన్జీ, ఎల్పీజీ విభాగాల్లో కలిపి మొత్తం 12,20,925 యూనిట్ల త్రిచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి. ఇందులో ఎలక్ట్రిక్ వాటా ఏకంగా 56 శాతం ఉంది. అంటే అమ్ముడవుతున్న ప్రతి రెండింటిలో ఒకటి ఎలక్ట్రిక్ కావడం విశేషం.ఎలక్ట్రిక్ త్రీవీలర్స్లో నాయకత్వ స్థానాన్ని కొనసాగిస్తున్న మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ 10 శాతం వాటా సాధించింది. వేగంగా దూసుకొచ్చిన బజాజ్ ఆటో 6 శాతం వాటాతో మూడవ స్థానాన్ని కైవసం చేసుకుంది. 2023లో అమ్ముడైన 5,83,697 యూనిట్ల ఎలక్ట్రిక్ త్రీవీలర్లతో పోలిస్తే 2024 విక్రయాల్లో 18 శాతం వృద్ధి నమోదైంది.2023లో సగటున ఒక నెలలో 48,633 యూనిట్లు కస్టమర్ల చేతుల్లోకి వెళితే గతేడాది ఈ సంఖ్య నెలకు 57,584 యూనిట్లకు ఎగసింది. ఐసీఈ, సీఎన్జీ, ఎల్పీజీ ఆప్షన్స్తో పోలిస్తే నిర్వహణ వ్యయాలు తక్కువగా ఉండడం వల్లే ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లకు డిమాండ్ పెరుగుతోంది. మెరుగైన రుణ లభ్యత, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, అందుబాటులోకి విభిన్న మోడళ్లు, సరుకు రవాణాకై లాజిస్టిక్స్ కంపెనీల నుంచి డిమాండ్ ఇందుకు మరింత ఆజ్యం పోస్తోంది. త్రీవీలర్స్లో సీఎన్జీ విభాగానికి 28 శాతం వాటా కాగా, డీజిల్కు 11, ఎల్పీజీ 3, పెట్రోల్కు ఒక శాతం వాటా ఉంది.పోటీలో నువ్వా నేనా..రెండవ స్థానంలో ఉన్న టీవీఎస్ మోటార్ కంపెనీతో నువ్వా నేనా అన్నట్టు పోటీపడుతూ.. 2024 సెప్టెంబర్లో 19,213 యూనిట్లతో తొలిసారిగా బజాజ్ ఆటో రెండవ స్థానాన్ని పొంది టీవీఎస్ను మూడవ స్థానానిని నెట్టింది. అక్టోబర్, నవంబర్లో టీవీఎస్కు గట్టి పోటీ ఇచ్చిన బజాజ్ ఆటో మూడవ స్థానానికి పరిమితమైంది.ఇక 2020 జనవరి నుంచి 2023 నవంబర్ వరకు బజాజ్ ఆటో మొత్తం 1,04,200 యూనిట్ల అమ్మకాలను సాధించింది. తొలి లక్ష యూనిట్లకు కంపెనీకి 47 నెలల సమయం పట్టింది. 2024లో ఏకంగా 2 లక్షల యూనిట్ల విక్రయాలకు చేరువైంది. గతేడాది సంస్థ మొత్తం 1,93,439 యూనిట్ల అమ్మకాలతో భారత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలో మూడవ స్థానంలో ఉంది. ఓలా ఎలక్ట్రిక్ 4,07,547 యూనిట్లతో మొదటి, టీవీఎస్ మోటార్ కో 2,20,472 యూనిట్లతో రెండవ స్థానంలో నిలిచాయి. -
రూ.20 లక్షల కోట్లకు ఈవీ మార్కెట్
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ) మార్కెట్ విలువ భారత్లో 2030 నాటికి రూ.20 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉందని కేంద్ర రోడ్డు, రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం తెలిపారు. ఆ సమయానికి మొత్తం ఈవీ పర్యావరణ వ్యవస్థలో దాదాపు 5 కోట్ల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని అన్నారు. ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమ సుస్థిరతపై 8వ సదస్సు ఈవీఎక్స్పో 2024 సందర్భంగా ఆయన మాట్లాడారు. 2030 నాటికి ఎలక్ట్రిక్ వాహనాల ఫైనాన్స్ మార్కెట్ పరిమాణం దేశంలో దాదాపు రూ.4 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనాగా వెల్లడించారు. భారత్లో 40 శాతం వాయు కాలుష్యం రవాణా రంగం వల్లే అని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. సౌర విద్యుత్ 44 శాతం.. భారత్ రూ. 22 లక్షల కోట్ల విలువైన శిలాజ ఇంధనాలను దిగుమతి చేసుకుంటోందని, ఇది పెద్ద ఆర్థిక సవాలుగా మారిందని గడ్కరీ అన్నారు. ఈ శిలాజ ఇంధనాల దిగుమతి మన దేశంలో చాలా సమస్యలను సృష్టిస్తోందని తెలిపారు. భారత్లో ఉత్పత్తి అవుతున్న మొత్తం విద్యుత్లో 44 శాతం సౌరవిద్యుత్ కైవసం చేసుకున్నందున ప్రభుత్వం పర్యావరణ అనుకూల శక్తి వనరులపై దృష్టి పెడుతోందని వివరించారు.లక్ష ఈ–బస్లు అవసరం.. ఎలక్ట్రిక్ బస్ల కొరతను భారత్ ఎదుర్కొంటోందని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. ‘మన దేశానికి లక్ష ఎలక్ట్రిక్ బస్లు అవసరం. అయితే ప్రస్తుతం మన సామర్థ్యం 50,000 ఈ–బస్లు. మీరు మీ ఫ్యాక్టరీని విస్తరించుకోవడానికి ఇదే సరైన సమయం. ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులు నాణ్యత విషయంలో రాజీ పడొద్దు’ అని తయారీ కంపెనీలను ఉద్దేశించి అన్నారు. -
రూ.2 లక్షల కంటే తక్కువ ధర.. ఇవిగో బెస్ట్ బైకులు!
మంచి స్టైల్, అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కోరుకునేవారు.. కొంత ఎక్కువ డబ్బు వెచ్చించి బైక్ కొనాలని చూస్తారు. అలాంటి వారి కోసం ఈ కథనంలో రూ.2 లక్షల కంటే తక్కువ ధరలో లభించే బైకుల గురించి తెలుసుకుందాం.హీరో కరిజ్మా ఎక్స్ఎమ్ఆర్ప్రముఖ బైక్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ దేశీయ మార్కెట్లో 'కరిజ్మా ఎక్స్ఎమ్ఆర్' విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బైక్ ధర రూ. 1.79 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇందులోని 210 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ 9250 rpm వద్ద 25.1 Bhp పవర్, 7250 rpm వద్ద 20.4 Nm టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ గేర్బాక్స్తో అత్యుత్తమ పనితీరును అందిస్తుంది.హీరో కరిజ్మా ఎక్స్ఎమ్ఆర్ బైక్.. స్టీల్ ట్రెల్లిస్ ఫ్రేమ్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, గ్యాస్-ఛార్జ్డ్ మోనోషాక్ వంటి వాటితో పాటు టర్న్-బై-టర్న్ న్యావిగేషన్, ఎల్సీడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, యూఎస్బీ పోర్ట్ వంటి ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇవన్నీ రైడర్లకు ఉత్తమ రైడింగ్ అనుభూతిని అందిస్తాయి.యమహా ఆర్15 వీ4రూ.1.82 లక్షల నుంచి రూ.1.87 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ధర వద్ద లభించే 'యమహా ఆర్15 వీ4' మన జాబితాలో చెప్పుకోడదగ్గ బైక్. ఈ బైకులోని 155 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ 10,000 rpm వద్ద 18.1 Bhp పవర్, 7500 rpm వద్ద 14.2 Nm టార్క్ అందిస్తుంది. ఇది కూడా 6 స్పీడ్ గేర్బాక్స్ ఆప్షన్ పొందుతుంది.యమహా ఆర్15 వీ4 బైక్ 282 మిమీ ఫ్రంట్ డిస్క్, 220 మిమీ రియర్ డిస్క్ వంటివి పొందుతుంది. అంతే కాకుండా ఇది మంచి రైడింగ్ అనుభూతిని అందించడానికి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, రెండు రైడింగ్ మోడ్లు, ట్రాక్షన్ కంట్రోల్ వంటివి కూడా కలిగి ఉంది.బజాజ్ పల్సర్ ఆర్ఎస్ 200బజాజ్ అంటే అందరికీ గుర్తొచ్చేది పల్సర్. ఈ బైక్ మార్కెట్లో అధిక అమ్మకాలను పొందుతోంది. బజాజ్ ఆర్ఎస్ 200 ధర రూ. 1.74 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ 200 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఈ ఇంజిన్ 24.1 Bhp పవర్, 18.7 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎల్ఈడీ లైటింగ్ వంటివి పొందుతుంది.కేటీఎమ్ ఆర్సీ 125రూ.2 లక్షల కంటే తక్కువ ధర వద్ద కేటీఎమ్ బైక్ కావాలనుకునేవారికి.. ఆర్సీ 125 బెస్ట్ ఆప్షన్. ఈ బైకులోని 124.7 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ద్వారా 9250 rpm వద్ద 14.34 Bhp పవర్, 8000 rpm వద్ద 12 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్, అడ్జస్టబుల్ హ్యాండిల్బార్, ఎల్సీడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్స్ కలిగిన ఈ బైక్ ఎక్కువమందికి ఇష్టమైన మోడల్. -
ఏఐ రేసును గెలిచే మార్గం
భారతదేశం కృత్రిమ మేధా శక్తి కేంద్రంగా అవతరించాలంటే మౌలిక సదుపాయాలు ఒక్కటే చాలవు, పరిశోధనా ప్రతిభ కూడా అవసరం. ఇటీవల ఇండియాలో పర్యటించిన మెటా చీఫ్ ఏఐ సైంటిస్ట్ యాన్ లెకూన్ దీన్నే నొక్కిచెప్పారు. అమెరికా సిలికాన్ వ్యాలీలోని అత్యుత్తమ ప్రతిభావంతుల్లో ఎక్కువ మంది భారత సంతతికి చెందిన వారే. కనీసం వారిలో కొందరినైనా వెనక్కు తేవాలి. వారు ఇక్కడ అభివృద్ధి చెందడానికి అవసరమైన వ్యవస్థను కల్పించాలి. ఇప్పుడు ఏఐలో ఫ్రాన్స్ కీలకంగా మారిందంటే దానికి కారణం, ఎక్కడెక్కడో పని చేస్తున్న ఫ్రెంచ్ ప్రతిభావంతులను తిరిగి ఫ్రాన్స్ వైపు ఆకర్షించేలా చేసిన వారి ఏఐ వ్యూహం. ఇది మనకు ప్రేరణ కావాలి.ఎన్విడియా సంస్థకు చెందిన జెన్సన్ హువాంగ్, మెటా సంస్థకు చెందిన యాన్ లెకూన్ ఇటీవలి భారత్ సందర్శనలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)కు భారతీయ మార్కెట్ ప్రాముఖ్యాన్ని గురించి మాత్రమే నొక్కి చెప్పడంలేదు; భారతదేశం కృత్రిమ మేధా శక్తి కేంద్రంగా అవతరించాలన్నా, జాతీయ ఏఐ మిషన్ విజయవంతం కావాలన్నా ఏఐ మౌలిక సదుపాయాలు మాత్రమే సరిపోవు; అగ్రశ్రేణి కృత్రిమ మేధ పరిశోధనా ప్రతిభ అవసరం. మెటా సంస్థకు చెందిన చీఫ్ ఏఐ సైంటిస్ట్ యాన్ లెకూన్ తన పర్యటనలో భాగంగా ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ చెన్నై సహా పలు విద్యాసంస్థలలో ప్రసంగించారు. 2018లో ట్యూరింగ్ ప్రైజ్ విజేత అయిన లెకూన్, కృత్రిమ మేధ ఉత్పత్తి అభివృద్ధిపై మాత్రమే భారత్ దృష్టి పెట్టకుండా, ప్రపంచ కృత్రిమ మేధా పరిశోధనలో తన భాగస్వా మ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. ఏఐలో అత్యాధునిక పరిశోధన అవకాశాల కొరత, ‘బ్రెయిన్ డ్రెయిన్’ (పరిశోధకులు వేరే దేశాలకు వెళ్లిపోవడం) భారత్ తన సొంత ఏఐ నైపుణ్యాన్ని పెంపొందించు కోవడానికి ఉన్న ప్రాథమిక సవాళ్లని ఆయన ఎత్తి చూపారు.ప్రతిభ అవసరం!దీనికి విరుద్ధంగా, గత నెలలో జరిగిన ఎన్విడియా ఏఐ సదస్సులో రిలయెన్స్ అధినేత ముఖేష్ అంబానీతో వేదికను పంచు కున్న జెన్సన్ హువాంగ్ భారత్ సరసమైన కృత్రిమ మేధ మౌలిక సదుపాయాలను నిర్మించాలని నొక్కి చెప్పారు. అయితే, ఇండియా లోని అత్యున్నత స్థాయి పరిశోధనా ప్రతిభ గురించి ఆయన దాదాపుగా ప్రస్తావించలేదు. ఏఐ మౌలిక సదుపాయాలకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యత, భారత్ తన ‘నేషనల్ ఏఐ మిషన్’ (ఎన్ఏఐఎమ్)లో కంప్యూటర్ మౌలిక సదుపాయాలకు ఇచ్చిన ప్రాధాన్యతకు అనుగుణంగానే ఉంది. మిషన్ నిధులలో సగం వరకు దీనికే కేటాయించారు.అర్థవంతమైన ఏఐ పరిశోధనకు కంప్యూటర్ కనీస అవసరం అని అంగీకరించాలి. జాతీయ ఏఐ మిషన్ లో భాగంగా ఆరోగ్యం, విద్య, వ్యవసాయంపై దృష్టి సారించిన మూడు ఏఐ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఈఓ)ను ఏర్పాటు చేస్తున్నట్లు ఇండియా ఇటీవల ప్రకటించింది. అలాగే ‘ఏఐ ఫర్ ఆల్’(అందరికీ కృత్రిమ మేధ) భావనపై దృష్టిని కేంద్రీకరించింది. అయితే, 10,000 జీపీయూ కంప్యూటర్ మౌలిక సదుపాయాలు, 3 సెక్టోరల్ సీఓఈలు మాత్రమే దేశంలో అత్యాధునిక ఏఐ పరిశోధనను సొంతంగా ప్రారంభించలేవు. రాబోయే నెలల్లో భారత్ జీపీయూలను పొందడంపై దృష్టి పెట్టినప్పటికీ, ఏఐలో పోటీ తత్వాన్ని పెంచే కీలకమైన అంశం నిర్లక్ష్యానికి గురవుతోంది.జాతీయ ఏఐ మిషన్ తన మూలస్తంభాలుగా ప్రతిభ, నైపుణ్యా లను కలిగివుందనడంలో సందేహం లేదు. కానీ అగ్రశ్రేణి పరిశోధనా ప్రతిభను ఆకర్షించడం, ఉన్నదాన్ని నిలుపుకోవడం, శిక్షణ ఇవ్వడంపై భారతదేశ అవసరాన్ని ఇది నొక్కి చెప్పడం లేదు. బదులుగా, ఇది గ్రాడ్యుయేట్, పోస్ట్–గ్రాడ్యుయేట్ స్థాయిలలో కృత్రిమ మేధ పాఠ్యాంశాల సంఖ్యను, ప్రాప్యతను పెంచడంపై దృష్టి పెట్టే ఏఐ ఫ్యూచర్ స్కిల్స్ ప్రోగ్రామ్ను ఊహిస్తోంది.ఫ్యూచర్స్కిల్స్ ప్రోగ్రామ్ ఏఐ పట్ల అవగాహనను, విద్యను పెంపొందించడంలో సహాయపడుతుంది. కానీ రాబోయే రెండు మూడేళ్లలో భారత్లో అత్యాధునిక ప్రతిభావంతుల సమూహాన్ని నిర్మించడంలో ఇది తోడ్పడదు. లెకూన్ ఎత్తి చూపినట్లుగా, ప్రస్తుతం ఏఐలో అత్యాధునిక ప్రతిభ లేకపోతే ఈ ఆటలో భారత్ విజయం సాధించలేదు.ఫ్రాన్స్ విజయగాథఉదాహరణకు లెకూన్ స్వదేశమైన ఫ్రాన్స్ను చూడండి. అమెరికా, చైనాలకు పోటీగా ఉన్న తమదైన ఏఐ శక్తిని ఫ్రాన్స్ కోల్పోతున్నట్లు అక్కడి నాయకులు గ్రహించారు. అందుకే తాజా ఏఐ టెక్ వేవ్ కార్య క్రమాన్ని అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ వ్యక్తిగతంగా పర్యవేక్షించారు. ఫ్రెంచ్ ఏఐ వ్యూహం, ఎక్కడెక్కడో పని చేస్తున్న ఫ్రెంచ్ ప్రతిభా వంతులను తిరిగి ఫ్రాన్స్ వైపు ఆకర్షించడం చుట్టూ తిరుగుతుంది. గూగుల్ డీప్మైండ్, మెటాలో ఫండమెంటల్ ఏఐ రీసెర్చ్ (ఫెయిర్) బృందంతో కలిసి పనిచేసిన ఫ్రెంచ్ వ్యవస్థాపకులు కేవలం ఏడాది క్రితమే ఫ్రెంచ్ స్టార్టప్ అయిన మిస్ట్రాల్ను ప్రారంభించారు. ఇది ఓపెన్ఏఐకి చెందిన చాట్జీపీటీ వేదికకు అగ్ర పోటీదారులలో ఒకటిగా నిలవడమే కాక, ఏఐ ప్రపంచంలో ఫ్రాన్స్ స్థానాన్ని ప్రధాన స్థాయికి తీసుకొచ్చింది.ప్రపంచ వేదికపై ఫ్రాన్స్ ఈ విజయం వెనుక ఉన్న మరొక కారణాన్ని కూడా లెకూన్ ఎత్తి చూపారు. పదేళ్ల క్రితం ఫ్రాన్స్లో మెటా సంస్థకు చెందిన ఫెయిర్ జట్టును ఏర్పాటు చేశారు. ఇది చాలా మంది ఫ్రెంచ్ పరిశోధకులకు ఏఐ పరిశోధనను వృత్తిగా మలుచుకునేలా ప్రేరేపించింది. ఇదే మిస్ట్రాల్ వంటి ఫ్రెంచ్ ఏఐ స్టార్టప్ల విజయానికి దోహదపడిందని చెప్పారు.నిలుపుకోవాల్సిన ప్రతిభ భారత్ కూడా ఇలాగే చేయాలి. సిలికాన్ వ్యాలీలోని అగ్రశ్రేణి ఏఐ పరిశోధనా ప్రతిభలో ఎక్కువ మంది భారతీయ మూలాలకు చెంది నవారే అన్నది సత్యం. ఒకట్రెండు ఉదాహరణలను చూద్దాం. చాట్జీపీటీకి చెందిన ప్రధాన భాగమైన ట్రాన్స్ఫార్మర్లు వాస్తవానికి ‘అటెన్షన్ ఈజ్ ఆల్ యు నీడ్’ అనే గూగుల్ రీసెర్చ్ పేపర్లో భాగం. ఆ పేపర్ సహ రచయితలలో ఆశిష్ వాశ్వానీ, నికీ పర్మార్ ఇద్దరూ భారతీయ సంతతికి చెందినవారు. బిర్లా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నా లజీలో వాశ్వానీ బీటెక్ చేయగా, పుణె ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంప్యూటర్ టెక్నాలజీలో పర్మార్ చదివారు. మద్రాస్ ఐఐటీ పూర్వ విద్యార్థి అరవింద్ శ్రీనివాస్ గతంలో ఓపెన్ఏఐలో పరిశోధకుడు. పెర్ప్లెక్సిటీ. ఏఐని ప్రారంభించారు. ఇది ప్రస్తుతం సిలివాన్ వ్యాలీలోని హాటెస్ట్ ఏఐ స్టార్టప్లలో ఒకటిగా పరిగణించబడుతోంది.ఇలాంటి ప్రతిభను తిరిగి భారత్కు తేవాలి, లేదా ప్రతిభావంతులను నిలుపుకోవాలి. బెంగళూరు, గురుగ్రామ్, హైదరాబాద్, చెన్నై, ముంబై లేదా భారతదేశంలో ఎక్కడైనా అభివృద్ధి చెందడానికి అవస రమైన పరిశోధనా వ్యవస్థను కల్పించాలి. ఐఐటీ మద్రాస్ రీసెర్చ్ పార్క్లో చేసినట్లుగా, చిన్న ప్రదేశాల్లో కూడా అభివృద్ధి చెందడానికి వీలు కల్పించే వ్యవస్థ ఈ రంగంలో అద్భుతమైన పురోగతికి, అనేక విజయ గాథలకు దారి తీస్తుంది. ఏఐకి కూడా అదే వ్యూహాన్ని వర్తింప జేస్తే అది ఇండియాను ప్రధాన ఏఐ కేంద్రంగా మలచగలదు.అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ కు ఏఐ ఒక మూలస్తంభంగా ఉండాలి. ప్రధాన భారతీయ కార్పొరేట్లతో పాటు, ప్రాథమిక పరిశోధన చేయడానికి, ఈ ప్రతిభను ఆహ్వానించగల కనీసం మూడు, నాలుగు ఏఐ ల్యాబ్లకు నిధులు సమకూర్చాలి. ఈ ల్యాబ్లకు జాతీయ ఏఐ మిషన్ కింద కొనుగోలు చేయడానికి ప్రతిపాదించిన కంప్యూట్–ఇన్ ఫ్రాస్ట్రక్చర్, అధునాతన ఏఐ చిప్లతో సహా క్లిష్టమైన ఏఐ మౌలిక సదుపాయాలను అందించవచ్చు.అయితే, ఏఐలో పరిశోధనా ప్రతిభ ఇప్పటికే భారతదేశంలో లేదని చెప్పడం లేదు. మన విశ్వవిద్యాలయాలు ఏఐ, సంబంధిత రంగాలలో గొప్ప పరిశోధకులను ఉత్పత్తి చేస్తూనే ఉన్నాయి. ఎన్వీడి యాతో సహా అనేక ప్రపంచ కంపెనీలు ఇక్కడున్న తమ ఏఐ ల్యాబ్ లలో వేలాది మంది భారతీయులను కలిగి ఉన్నాయి. ఈ పునాది, అత్యుత్తమ అగ్రశ్రేణి ఏఐ ప్రతిభను ఆకర్షించడం, దాన్ని నిలుపుకోవ డంతో సహా జాతీయ ఏఐ మిషన్ విజయంలో సహాయపడుతుంది. చాలా మంది అంచనాల ప్రకారం, కృత్రిమ మేధలో విజయ ఫలాలు చాలా మధురంగా ఉండగలవు.అనిరుధ్ సూరి వ్యాసకర్త ‘ద గ్రేట్ టెక్ గేమ్’ రచయిత; ‘కార్నెగీ ఇండియా’ నాన్ రెసిడెంట్ స్కాలర్ (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
రూ.6000 వద్ద లభించే బెస్ట్ స్మార్ట్ఫోన్లు: ఇక్కడ చూడండి
ప్రస్తుతం మార్కెట్లో లక్ష రూపాయల కంటే ఎక్కువ ఖరీదైన స్మార్ట్ఫోన్ల దగ్గర నుంచి రూ. 6వేలు ధర వద్ద లభించే ఫోన్ల వరకు ఉన్నాయి. ఈ కథనంలో ఆరువేల రూపాయల ధర వద్ద లభించే స్మార్ట్ఫోన్ల గురించి వివరంగా తెలుసుకుందాం.ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 (Infinix Smart 8)మార్కెట్లో అందుబాటులో ఉన్న 'ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8' ధర కేవలం రూ.6,699 మాత్రమే. బ్యాంక్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేస్తే. ఇది రూ. 6వేలకు లభిస్తుంది. ఇందులో 3 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.6 ఇంచెస్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, రెండు కెమెరాలు మొదలైనవి ఉంటాయి. ఇది ఆక్టా కోర్ యూనిసోక్ T606 ప్రాసెసర్ పొందుతుంది.ఐటెల్ ఆరా 05ఐ (Itel Aura 05i)రూ.6000 కంటే తక్కువ ధర వద్ద లభించే స్మార్ట్ఫోన్ల జాబితాలో ఐటెల్ ఆరా 05ఐ ఒకటి. ఇది 2 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ పొందుతుంది. యూనిసోక్ SC9863A1 ప్రాసెసర్ కలిగిన ఈ స్మార్ట్ఫోన్ 4000 ఎంఏహెచ్ బ్యాటరీ పొందుతుంది. దీని ధర రూ. 5749 మాత్రమే. మల్టిపుల్ కెమెరా ఆప్షన్స్ ఇందులో చూడవచ్చు.రెడ్మీ ఏ2 (Redmi A2)రూ.5669 వద్ద లభించే రెడ్మీ ఏ2 కూడా ఆరు వేల రూపాయల కంటే తక్కువ ధర వద్ద లభిస్తున్న స్మార్ట్ఫోన్లలో ఒకటి. ఆక్టా కోర్ ప్రాసెసర్ కలిగిన ఈ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ పొందుతుంది. ఇది 2 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ పొందుతుంది. 8 మెగాపిక్సెల్ డ్యూయెల్ కెమెరా సెటప్ ఈ స్మార్ట్ఫోన్లో లభిస్తుంది. -
ట్రంప్ ఎన్నికతో భారత్వైపు చూపు
అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ సీఎల్ఎస్ఏ భారత్లో పెట్టుబడులు పెంచేందుకు ఆసక్తి చూపుతోంది. అక్టోబర్లో చైనా మార్కెట్లో దాదాపు ఐదు శాతం ఇన్వెస్ట్మెంట్ పెంచినట్లు కంపెనీ తెలిపింది. అదే సమయంలో భారత్లో 20 శాతంగా ఉన్న పెట్టుబడులను 10 శాతానికి తగ్గించింది. కానీ రానున్న రోజుల్లో భారత్లో తిరిగి పెట్టుబడులను పెంచబోతున్నట్లు సీఎల్ఎస్ఏ పేర్కొంది.అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంతో అమెరికా-చైనా వాణిజ్య సంబంధాలు పరిమితంగానే ఉంటాయని సీఎస్ఎల్ఏ అంచనా వేస్తుంది. దాంతో చైనాకు ఇబ్బందులు తప్పవనే వాదనలున్నాయి. కాబట్టి చైనాలో పెట్టుబడులు పెట్టడానికి అంతగా ఆసక్తి చూపించడంలేదు. చైనా ఆర్థిక వృద్ధిలో ఎగుమతులే ప్రధాన పాత్ర పోషిస్తాయి. అలాంటిది ట్రంప్ రాకతో వీటిపై తీవ్ర ప్రభావం పడుతుందని సీఎల్ఎస్ఏ విశ్లేషిస్తుంది. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రతరం కావొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దాంతో అక్కడి కంటే మెరుగైన ఆర్థిక వాతావరణ పరిస్థితులున్న భారత్వైపు సీఎల్ఎస్ఏ మొగ్గు చూపుతుంది.ఇదీ చదవండి: వ్యాక్సిన్ వ్యతిరేకితో భారత్కు నష్టం?ఇటీవలి కాలంలో విదేశీ మదుపర్లు భారత స్టాక్ మార్కెట్ల నుంచి రోజు సరాసరి రూ.3000 కోట్లు ఉపసంహరించుకుంటున్నారు. గత నెల నుంచి దాదాపు రూ.1.14 లక్షల కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో భారత మార్కెట్లు కొంత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఇది సీఎల్ఎస్ఏ వంటి పెట్టుబడిదారులు భారత మార్కెట్పై ఆసక్తి చూపేందుకు అవకాశం కల్పిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
ఏఐపై ఎరిక్సన్ ఫోకస్
న్యూఢిల్లీ: స్వీడన్కి చెందిన టెలికం పరికరాల తయారీ దిగ్గజం ఎరిక్సన్ భారత్లో తమ పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను మరింతగా విస్తరించనుంది. కృత్రిమ మేథ (ఏఐ), జనరేటివ్ ఏఐ, నెట్వర్క్ ఏపీఐలు, 6జీ టెక్నాలజీ అభివృద్ధి మొదలైన వాటిపై దృష్టి పెట్టనుంది. ఇందుకోసం గణనీయంగా ఇన్వెస్ట్ చేయనుంది. ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) 2024లో పాల్గొన్న సందర్భంగా కంపెనీ భారత విభాగం హెడ్ ఆండ్రెస్ విసెంటి ఈ విషయాలు తెలిపారు. 1994లో నుంచి భారత్లో తాము ఉత్పత్తి చేస్తున్నామని, అంతర్జాతీయంగా తమకు కీలక మార్కెట్లలో ఇది కూడా ఒకటని వివరించారు. 5జీ సాంకేతికతను వినియోగంలోకి తేవడంలో భారత్ వేగంగా పనిచేసిందని ఆండ్రెస్ తెలిపారు. కేవలం 22 నెలల్లోనే అయిదు లక్షల పైగా బేస్ స్టేషన్లు ఏర్పాటు చేసి, దేశవ్యాప్తంగా 90 శాతం మేర కవరేజీ సాధించిందని చెప్పారు. దీంతో నెట్వర్క్ పనితీరుకు సంబంధించి భారత్ 86వ స్థానం నుంచి 16వ స్థానానికి చేరిందని పేర్కొన్నారు. టెలికం దిగ్గజాలు భారతి ఎయిర్టెల్, జియోతో ఎరిక్సన్కి గతంలో ఒప్పందాలు ఉన్నాయి. ఇటీవలే 4జీ, 5జీ రేడియో యాక్సెస్ నెట్వర్క్నకు సంబంధించి వొడాఫోన్ ఐడియాతో కాంట్రాక్టు కుదుర్చుకుంది. ప్రస్తుతం దేశీయంగా ఎరిక్సన్కి చెన్నై, బెంగళూరు, గురుగ్రామ్లో ఆర్అండ్డీ కేంద్రాలు ఉన్నాయి. టెలికం రంగంలో రవాణా, క్లౌడ్ తదితర విభాగాలకు సంబంధించిన సాంకేతికతలపై ఇవి పని చేస్తున్నాయి. -
ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ @ 4 కోట్లు
న్యూఢిల్లీ: సూపర్ లగ్జరీ కార్ల తయారీలో ఉన్న బ్రిటిష్ కంపెనీ ఆస్టన్ మార్టిన్ భారత్లో కొత్త వాంటేజ్ను విడుదల చేసింది. ఎక్స్షోరూం ధర రూ.3.99 కోట్లు. 4.0 లీటర్ ట్విన్ టర్బో వీ8 ఇంజన్, 8 స్పీడ్ జడ్ఎఫ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, ఎల్రక్టానిక్ పవర్ అసిస్టెడ్ స్టీరింగ్, బావర్స్ అండ్ విలి్కన్స్ 15 స్పీకర్స్ సౌండ్ సిస్టమ్, 10.25 అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ పొందుపరిచారు. ఈ 2 డోర్ల కూపే 665 పీఎస్ పవర్, 800 ఎన్ఎం టార్క్ అందిస్తుంది. గరిష్ట వేగం గంటకు 325 కి.మీ. 3.5 సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. కీలకమైన, ఆశాజనక మార్కె ట్ కాబట్టే ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న అన్ని మోడళ్లను భారత్లోనూ విడుదల చేస్తున్నట్లు ఆస్టన్ మార్టిన్ న్యూఢిల్లీ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ ఆనంద్ తెలిపా రు. సెప్టెంబర్ 2న అంతర్జాతీయంగా వీ12 మోడల్ను కంపెనీ విడుదల చేస్తోంద న్నారు. ఈ మోడల్ భారత్లో తొలిసారిగా వెంటనే అందుబాటులోకి వస్తోందన్నారు.ఉత్తరాది కంటే వేగంగా దక్షిణాది.. సూపర్ లగ్జరీ కార్ల మార్కెట్ దేశంలో రెండేళ్లుగా ఏటా 35–40% వృద్ధి చెందుతోందని ఆనంద్ చెప్పారు. గతేడాదితో పోలిస్తే కంపెనీ అమ్మకాల్లో 90% వృద్ధి నమోదైందని వివరించారు. ఆస్టన్ మార్టిన్ కార్ల అధికారిక దిగుమతిదారుగా ఆస్టన్ మార్టిన్ న్యూఢిల్లీ వ్యవహరిస్తోంది. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుండి పెరుగుతున్న డిమాండ్ను అధిగమించడానికి కంపెనీ నెట్వర్క్ను విస్తరించనుంది. ప్రస్తుతం కంపెనీకి న్యూఢిల్లీలో షోరూం ఉంది. ఏడాది చివరికల్లా బెంగళూరులో ఔట్లెట్ రానుంది. సూపర్ లగ్జరీ స్పోర్ట్స్ కార్స్ మార్కెట్ ఉత్తరాది కంటే దక్షిణాది వేగంగా వృద్ధి చెందుతోందని ఆనంద్ తెలిపారు. -
అగ్రరాజ్యంలో తగ్గినా.. భారత్లో తగ్గని ఈవీ సేల్స్
ఎలక్ట్రిక్ వాహనాల (EV) విక్రయాల వృద్ధి రేటు ప్రపంచవ్యాప్తంగా మందగిస్తోందని.. ఇటీవలి గోల్డ్మన్ సాక్స్ పేర్కొంది. ఇంతకీ ఈవీల వృద్ధి ఎందుకు తగ్గుతోంది. భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ సేల్స్ ఎలా ఉన్నాయనే మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం.గ్లోబల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల వృద్ధి రేటు తగ్గడానికి ప్రధాన కారణం.. నిర్వహణ సంస్థల అధిక మూలధన వ్యయాలు, ఎన్నికల అనిశ్చితులు మాత్రమే కాకుండా ఛార్జింగ్ స్టేషన్ల కొరత అని తెలుస్తోంది.వెహికల్ వాల్యుయేషన్ అండ్ ఆటోమోటివ్ రీసెర్చ్ కంపెనీ ప్రకారం.. అమెరికన్లు 2024 మొదటి త్రైమాసికంలో 2,00,000 కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసారు. ఈవీల అమ్మకాలు 2023 కంటే 2024లో 7.3 శాతం వృద్ధి చెందినట్లు తెలుస్తోంది. విక్రయాలు కొంత పెరిగినప్పటికీ.. వృద్ధి రేటు మాత్రం గణనీయంగా తగ్గింది.యూరోపియన్ ఆటోమొబైల్ తయారీదారుల సంఘం(ACEA ) నివేదిక ప్రకారం.. EV రిజిస్ట్రేషన్లు తగ్గడం, ఈస్టర్ సెలవుల సమయం కారణంగా ఈ సంవత్సరం మార్చిలో మొదటిసారిగా యూరప్లో కొత్త కార్ల అమ్మకాలు క్షీణించాయని తెలిసింది. యూరోపియన్ యూనియన్ (EU)లో కొత్త ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు మార్చిలో 11.3 శాతం తగ్గి 134,397 యూనిట్లకు చేరుకున్నాయి. ఐరోపాలో అతిపెద్ద మార్కెట్ అయిన జర్మనీలో కూడా EV అమ్మకాల్లో 29 శాతం తగ్గుదలను నమోదు చేసింది.ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ తగ్గడంతో.. మిడ్, హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలకు.. ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. గత కొన్ని నెలలోగా అమెరికాలో వీటి వృద్ధి ఎలక్ట్రిక్ వాహనాల కంటే గణనీయంగా పెరిగింది.భారతదేశంలో ఏం జరుగుతోంది?జీఎంకే రీసెర్చ్ & అనలిటిక్స్ నివేదిక ప్రకారం.. 2024 ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య 1.7 మిలియన్ యూనిట్లను అధిగమించినట్లు తెలిసింది. దీన్ని బట్టి చూస్తే భారతీయ ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ గణనీయమైన పెరుగుదలను నమోదు చేసినట్లు స్పష్టమవుతోంది. మన దేశమ్లో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు 2023 కంటే 10 శాతం వృద్ధిని నమోదు చేసాయి. ఇందులో ఎక్కువ భాగం ప్యాసింజర్ వెహికల్స్ ఉన్నాయి. -
భారత్లో మోటరోలా ఎడ్జ్ 50 ప్రో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మోటరోలా భారత్లో ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. ప్రపంచంలో తొలి ట్రూ కలర్ కెమెరా, 3డీ కర్వ్డ్ డిస్ప్లే ఫోన్ ఇదేనని కంపెనీ చెబుతోంది. 6.7 అంగుళాల 1.5కే సూపర్ హెచ్డీ పీఓఎల్ఈడీ డిస్ప్లే, ఆన్డ్రాయిడ్ 14 ఓఎస్, 30 ఎక్స్ హైబ్రిడ్ జూమ్, 3 ఎక్స్ ఆప్టికల్ జూమ్తో 50 ఎంపీ ప్రైమరీ ఏఐ కెమెరా, టర్బోపవర్ 50 వాట్ వైర్లెస్ చార్జింగ్, 125 వాట్ టర్బోపవర్ వైర్డ్ చార్జింగ్ వంటి హంగులు ఉన్నాయి. ధర రూ.27,999 నుంచి ప్రారంభం. -
ష్నైడర్ ఎలక్ట్రిక్ భారీ పెట్టుబడులు
బెంగళూరు: ఎనర్జీ మేనేజ్మెంట్, ఆటోమేషన్ దిగ్గజం ష్నైడర్ ఎలక్ట్రిక్ దేశీయంగా తయారీపై భారీ పెట్టుబడులకు సిద్ధపడుతోంది. 2026కల్లా తయారీ ప్లాంట్లపై రూ. 3,200 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు వెల్లడించింది. తద్వారా దేశ, విదేశాలలో అమ్మకాలకు భారత్ను తయారీ కేంద్రంగా వినియోగించుకోనున్నట్లు పేర్కొంది. ఈ బాటలో స్థానికంగా డేటా సెంటర్లకు అవసరమయ్యే కూలింగ్ సొల్యూషన్స్ను ఉత్పత్తి చేసేందుకు రూ. 100 కోట్లతో ఏర్పాటు చేసిన ప్లాంటును తాజాగా ప్రారంభించింది. ప్రణాళికల్లో భాగంగా గ్రూప్ తయారీ కేంద్రంగా భారత్లో పెట్టుబడులు చేపట్టనున్నట్లు ష్నైడర్ ఎలక్ట్రిక్ ఇండియా ప్రెసిడెంట్, గ్రేటర్ ఇండియా జోన్ ఎండీ, సీఈవో దీపక్ శర్మ వెల్లడించారు. వివిధ ప్రొడక్టులు, సొల్యూషన్ల తయారీకి దేశవ్యాప్తంగా తయారీ ప్లాంట్లను నెలకొల్పనున్నట్లు కూలింగ్ సొల్యూషన్స్ యూనిట్ ప్రారంభం సందర్భంగా తెలియజేశారు. వెరసి మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, తెలంగాణ, తమిళనాడు, పశి్చమ బెంగాల్, ఉత్తరాఖండ్, ఒడిషాలలో యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. తాజా యూనిట్తో కలిపి ప్రస్తుతం కంపెనీ దేశవ్యాప్తంగా 30 ఫ్యాక్టరీలను నిర్వహిస్తోంది. -
మిడిల్ క్లాస్ డ్రీమ్ వెహికల్: ఐకానిక్ లూనా సరికొత్తగా! రిపబ్లిక్ డే ఆఫర్
దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ బాగా పుంజుకుంటోంది. ఈ ట్రెండ్కు అనుగుణంగా దేశంలోని ప్రముఖ ద్విచక్ర వాహన కంపెనీలన్నీ తమ మోడళ్లలో ఈవీ వెర్షన్స్ లాంచ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఒకప్పటి మధ్యతరగతి కలల టూవీలర్ లూనా సరికొత్త అవతారంలో ఈవీగా భారతీయ వినియోగదారులను ఆకట్టుకొనేందుకు భారత్లో లాంచ్ కానుంది. ఈవీలకు పెరిగిన డిమాండ్ నేపథ్యంలో కెనటిక్ కంపెనీకి చెందిన పాపులర్ లూనా స్కూటర్ను తాజాగా ఈవీ వెర్షన్లో రిలీజ్ చేస్తోంది. అంతేకాదు రిపబ్లిక్ డే సందర్భంగా ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. మోస్ట్ ఎవైటెడ్ మల్టీ యుటిలిటీ e2W, కైనెటిక్ గ్రీన్ E-Lunaను వచ్చే నెల (ఫిబ్రవరి 2024) ఆరంభంలో రిలీజ్ చేయనుంది. బుకింగ్లు జనవరి 26న షురూ అవుతాయని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. Kinetic Green వెబ్సైట్లో కేవలం రూ. 500తో ప్రీ-బుక్ చేసుకోవచ్చు. కైనెటిక్ ఇ-లూనా పూర్తిగా మేడ్-ఇన్-ఇండియాగా వస్తోంది. మెట్రో ,టైర్ 1, టైర్-2, టైర్-3 నగరాలు , అలాగే గ్రామీణ యూజర్లును కూడా దృష్టిపెట్టుకుని అత్యాధునిక ఫీచర్లతో లూనా ఈవీ నితయారు చేసినట్టు కైనెటిక్ గ్రీన్ ఫౌండర్, సీఈవో సులజ్జ ఫిరోడియా మోత్వాని తెలిపారు. అంతేకాదు 'చల్ మేరీ లూనా' అంటూ యాడ్ ప్రపంచంలో సంచలనం రేపిన పియూష్ పాండే తిరిగి ఈ బ్రాండ్ కోసం పని చేయనున్నారట. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత మళ్లీ లూనాకోసం సంతోషంగా ఉందని ప్రకటించారు పియూష్. నేటి యువతరాన్ని దృష్టిలో పెట్టుకుని మయూర్ అండ్ టీం దీనికోసం పనిచేస్తోందన్నారు.పీయూష్ పాండే ప్రస్తుతం ఒగిల్వీ ఇండియా గ్లోబల్ క్రియేటివ్ ఛైర్మన్, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా ఉన్నారు కాగా కైనెటిక్ 2000 ప్రారంభంలో దాని ఉత్పత్తిని నిలిపివేసింది Unleash the beats, charge up the streets, and ride the rhythm of the future on the Zulu! .#kineticgreen #kineticgreenev #kineticgreen2w #kineticgreenvehicles #kyaboltizulu #kineticgreenjourney #hiphop pic.twitter.com/h3rw3YzSRT — Kinetic Green (@KineticgreenEV) January 17, 2024 కైనటిక్ లూనాఫీచర్లు, అంచనాలు కైనెటిక్ ఇ లూనాకు సంబంధించిన ఫీచర్లను కంపెనీ అధికారికంగా ప్రకటించనప్పటికీ, అంచనాలు ఈ విధంగా ఉన్నాయి. 16-అంగుళాల వైర్ స్పోక్ వీల్స్, మోపెడ్ ఆపడానికి రెండు చివర్లలో డ్రమ్ బ్రేక్లు ఉంటాయి. ఈ లూనా టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, వెనుక వైపున ట్విన్ షాక్ అబ్జార్బర్లతో వస్తుంది. ఈ లూనా ఒక ‘హై-స్పీడ్’ ఎలక్ట్రిక్ స్కూటర్గా కూడా ఉంటుందని అంచనా. బ్యాటరీ 5 గంటల్లో పూర్తిగా చార్జ్ అవుతుంది. గంటకు గరిష్టంగా 60 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. పవర్ట్రెయిన్ డిజైన్ ఛార్జ్ టర్న్అరౌండ్ టైమ్లను తగ్గించడానికి మార్చుకునే లేదా రిమూవముల్ బ్యాటరీ ప్యా క్తో డిజైన్ చేసింది. -
టీవీ నుంచి వీడియోల వైపు.. !
న్యూఢిల్లీ: టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ అన్ని రంగాల్లో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మొబైల్ ప్రతిఒక్కరి జీవితంలో భాగమైంది. ఏదైనా కొత్త సినిమా, వెబ్సిరీస్ చూడాలన్నా ఇప్పుడు టీవీలకు బదులుగా మొబైల్, ల్యాప్టాప్లనే వాడుతున్నారు. అందరి ఇళ్లల్లో టీవీలు ఉన్నా క్రమంగా వాటి వాడకం తగ్గుతోంది. ఓటీటీలకు ప్రాధాన్యం పెరుగుతోంది. అందుకు సంబంధించి మీడియా పార్ట్నర్స్ ఏషియా ఆసక్తికర నివేదిక విడుదల చేసింది. ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో (ఏపీఏసీ) 2028 నాటికి అత్యధికంగా ఆదాయం నమోదయ్యే టాప్ 6 వీడియో మార్కెట్లలో భారత్ కూడా ఒకటిగా ఎదగనుంది. ఈ జాబితాలో చైనా, జపాన్, కొరియా, ఆస్ట్రేలియా, ఇండొనేషియాలు కూడా ఉన్నాయి. ఆసియా–పసిఫిక్ ప్రాంత వీడియో పరిశ్రమలో ఈ ఆరు దేశాల వాటా ఏకంగా 90 శాతంగా ఉండనుంది. మీడియా పార్ట్నర్స్ ఏషియా (ఎంపీఏ) విడుదల చేసిన ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఇక 2023–28 మధ్య కాలంలో అత్యంత వేగంగా ఎదిగే వీడియో మార్కెట్లలో ఒకటిగా భారత్ ఉంటుందని నివేదిక పేర్కొంది. వార్షిక ప్రాతిపదికన 5.6 శాతం మేర వృద్ధి చెందవచ్చని అంచనా వేసింది. 14 మార్కెట్లలో ఉచిత టీవీ చానళ్లు, పే–టీవీలు, వివిధ రకాల వీవోడీలు (వీడియో–ఆన్–డిమాండ్) .. వాటి వినియోగదారులు, ప్రకటనలు మొదలైన అంశాలను అధ్యయనం చేసిన మీదట ఎంపీఏ ఈ నివేదికను రూపొందించింది. దీని ప్రకారం 2023–28 మధ్య కాలంలో ఏపీఏసీ వీడియో పరిశ్రమ మొత్తం ఆదాయం 2.6 శాతం వార్షిక వృద్ధితో 165 బిలియన్ డాలర్లకు చేరనుంది. చైనా మార్కెట్ 1.7 శాతం వృద్ధితో 2028 నాటికి 70 బిలియన్ డాలర్లకు చేరుకోగలదు. ఆ తర్వాత స్థానాల్లో జపాన్ (35 బిలియన్ డాలర్లు), భారత్ (17 బిలియన్ డాలర్లు), కొరియా (14 బిలియన్ డాలర్లు), ఆస్ట్రేలియా (11 బిలియన్ డాలర్లు) ఉంటాయి. కనెక్టివిటీ దన్ను.. మెరుగైన ఇంటర్నెట్, కనెక్టెడ్ టీవీల వినియోగం పెరగడం, ప్రీమియం లోకల్ కంటెంట్పై ఇన్వెస్ట్ చేస్తుండటం, ప్రీమియం స్పోర్ట్స్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉండటం మొదలైన అంశాల వల్ల ఆసియా–పసిఫిక్ వీడియో పరిశ్రమ క్రమంగా టీవీ నుంచి ఆన్లైన్ వైపు వెడుతోందని నివేదిక తెలిపింది. రాబోయే రోజుల్లో ఆదాయాలు, వీక్షకుల సంఖ్య పెరగడానికి కూడా ఇదే కారణం కాగలదని పేర్కొంది. 2023లో 5.5 శాతం వృద్ధి .. ఏపీఏసీ వీడియో పరిశ్రమ ఆదాయం 2023లో 5.5 శాతం వృద్ధి చెందింది. 145 బిలియన్ డాలర్లకు చేరింది. ఆన్లైన్ వీడియో విభాగం ఇందుకు దోహదపడింది. ఏపీఏసీలో గతేడాది చైనా అగ్రస్థానంలోనే కొనసాగింది. 64 బిలియన్ డాలర్ల మార్కెట్గా నిల్చింది. చైనాను పక్కన పెడితే గతేడాది అతి పెద్ద మార్కెట్లలో జపాన్ (32 బిలియన్ డాలర్లు), భారత్ (13 బిలియన్ డాలర్లు), కొరియా (12 బిలియన్ డాలర్లు), ఆస్ట్రేలియా (9.5 బిలియన్ డాలర్లు), తైవాన్, ఇండొనేషియా ఉన్నాయి. వినియోగదారులు ఆన్లైన్ వైపు మళ్లుతుండటం, కనెక్టెడ్ టీవీలు పెరుగుతుండటంతో టీవీ మాధ్యమంపై ఒత్తిడి పెరుగుతోందని నివేదిక పేర్కొంది. -
కోకా కోలా నుంచి మద్యం.. రేటెంతో తెలుసా?
కూల్ డ్రింక్ అనగానే ఎక్కువ మందికి గుర్తొచ్చే బ్రాండ్ 'కోకా కోలా' (Coca Cola). ఈ కంపెనీ ఇప్పుడు మన దేశంలో తొలిసారిగా మద్యం విభాగంలోకి అడుగు పెట్టింది. కోకా కోలా మద్యం పేరు ఏమిటి? దాని ధరలు ఎలా ఉన్నాయనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. థమ్స్ అప్, మ్కా, ఫాంటా, స్ర్పైట్, మాజా, కోకా కోలా జీరో షుగర్, డైట్ కోక్, ష్వెప్స్, ఛార్జ్డ్, కిన్లే, మినిట్ మెయిడ్, స్మార్ట్ వాటర్, రిమ్ జిమ్, హానెస్ట్ టీ, కోస్టా కాఫీ, జార్జియా వంటి వాటితో దూసుకెళ్తున్న కోకా కోలా తాజాగా 'లెమన్ డౌ' (Lemon-Dou) అనే పేరుతో మద్యం తయారు చేయడం మొదలు పెట్టింది. కోకా కోలా 'లెమన్ డౌ' ఇప్పుడు కేవలం గోవా, మహారాష్ట్రలలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. గోవాలో దీని ధర రూ. 150 కాగా.. మహారాష్ట్రలో రూ. 230 కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ మద్యం భారతీయులను ఆకర్షిస్తుందా? లేదా? అనే టెస్టింగ్ దశలోనే ఉంది. ఆ తరువాత ఇందులో ఏమైనా మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నట్లు గుర్తిస్తే.. కంపెనీ దానికి తగిన విధంగా మద్యం తయారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదీ చదవండి: ఈ ఏడాది ఎక్కువ గూగుల్ సెర్చ్ చేసిన విషయాలు ఇవే.. 2018లో కోకా కోలా కంపెనీ 'లెమన్ డౌ'ను జపాన్ దేశంలో పరిచయం చేసింది. ఇది చైనా, ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడు ఇది భారతదేశానికి వచ్చింది. దేశీయ మార్కెట్లో ఈ మద్యం సక్సెస్ అవుతుందా.. లేదా అనేది త్వరలోనే తెలుస్తుంది. -
మూడు నెలల కనిష్ఠానికి చేరనున్న సీపీఐ ద్రవ్యోల్బణం!
భారత గణాంకాల మంత్రిత్వ శాఖ సెప్టెంబర్కు సంబంధించిన వినియోగదారుల ధరల సూచీ డేటాను, ఆగస్టులోని పారిశ్రామిక ఉత్పత్తి డేటాను అక్టోబరు 12న విడుదల చేయనుంది. అందుకు నిపుణులు కారణాలను విశ్లేసిస్తున్నారు. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్లో మూడు నెలల కనిష్ఠానికి పడిపోయే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. వినియోగదారుల ధరల సూచీ(సీపీఐ) ద్రవ్యోల్బణం ఆగస్టులో 6.83 శాతంగా ఉంది. కానీ సెప్టెంబరు నెలకు అది 5.4 శాతానికి తగ్గుతుందని అంచనా. పారిశ్రామికోత్పత్తి సూచీ జులైలో 5.7తో పోలిస్తే ఆగస్టులో 9.1కు పెరిగినట్లు తెలుస్తుంది. అయితే ఇది గడిచిన 14 నెలల్లో అత్యధికం. సెప్టెంబర్లో టమాటా ధరలు సాధారణ స్థితికి రావడంతో నెలవారీగా ఖర్చుల శాతం తగ్గినట్లు నిపుణులు చెబుతున్నారు. దాంతో పాటు ఇండియన్ మార్కెట్లు జీవితకాలపు గరిష్ఠాల్లో ట్రేడయ్యాయి. అయితే అదే సమయంలో ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబర్లో ఉల్లి ధరలు 12 శాతం పెరిగాయి. తృణధాన్యాలు, పప్పుల ధరలు పెరిగాయి. సెప్టెంబరులో అంతర్జాతీయ చమురు ధరలు దాదాపు 8.8శాతం పెరిగినప్పటికీ చమురు మార్కెటింగ్ కంపెనీలు మాత్రం ధరలపై ఎలాంటి ప్రభావం చూపకపోవడం కొంత ఊరట కలిగించినట్లు కొన్ని వర్గాలు తెలిపాయి. అన్ని కారణాల వల్ల ద్రవ్యోల్బణం దాదాపు ఒకటిన్నర శాతం తగ్గుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. -
200 కి.మీ రేంజ్లో కొత్త ఈ-స్కూటర్ : బుకింగ్స్ షురూ! ధర మాత్రం!
Pure EV ePluto 7G Max electric scooter: ప్యూర్ ఈవీ భారతదేశంలో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ను లాంచ్ చేసింది. 201 కిమీ పరిధితో ePluto 7G మాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ను విడుదల చేసింది. దేశంలో 200 కిమీ కంటే ఎక్కువ పరిధిని అందిస్తున్న 2-వీలర్ EVలలో ePluto 7G మాక్స్ ఒకటిగా నిలిచింది. ఈ వింటేజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుకింగ్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయని కంపెనీ వెల్లడించింది. ePluto 7G MAX ఫీచర్లు : AIS-156 సర్టిఫికేట్, స్మార్ట్ BMS , బ్లూటూత్ కనెక్టివిటీతో 3.5 KWH బ్యాటరీని అమర్చింది. స్కూటర్ హిల్ స్టార్ట్ అసిస్ట్, డౌన్హిల్ అసిస్ట్, కోస్టింగ్ రీజెన్, రివర్స్ మోడ్ ,స్మార్ట్ AI వంటి ఫీచర్లతో వస్తుంది. ఇవి బ్యాటరీ ఆరోగ్యాన్ని కాపాడతాయని కంపెనీ పేర్కొంది. దీని ధర రూ. 1,14,999 (ఎక్స్-షోరూమ్). రాష్ట్ర స్థాయి సబ్సిడీలు , RTO రుసుములను బట్టి ఆన్-రోడ్ ధర మారుతుంది. వచ్చే పండుగ సీజన్ నుండి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. ఈ స్కూటర్ మ్యాట్ బ్లాక్, రెడ్, గ్రే , వైట్ నాలుగు రంగులలో లభించనుంది. (ODI WC 2023 Revenue Prediction: ఆదాయంపై బీవోబీ సంచలన అంచనాలు) అత్యధికంగా అమ్ముడవుతున్న 7G మోడల్ అప్గ్రేడ్ వెర్షన్ రోజుకు 100 కి.మీ డ్రైవ్ చేసే వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్నట్లు ప్యూర్ EV సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రోహిత్ వదేరా తెలిసారు. మరోవైపు కంపెనీ దాదాపు అన్ని ప్రముఖ నగరాలు, పట్టణాలలో తన డీలర్ నెట్వర్క్ను దూకుడుగా విస్తరిస్తోంది, FY24 చివరి నాటికి 300 కంటే ఎక్కువ టచ్పాయింట్లను లక్ష్యంగా చేసుకుంది. -
పండగ సీజన్: అందుబాటులో ధరలో సీఎన్జీ కార్లు
పండుగ సీజన్ దగ్గర పడుతోంది. అందుబాటులో ధరలో సీఎన్జీకారు కోసం చూస్తున్నారా? అయితే ప్రస్తుతం భారతదేశంలో అత్యంత సరసమైన, పర్యావరణహిత CNG-ఆధారిత కార్లను ఒకసారి పరిశీలిద్దాం Maruti Alto & Alto K10 S-CNG దేశీయ కార్ల దిగ్గజం మారుతి సుజుకి చెందిన కార్లలో సిఎన్జి కార్ సెగ్మెంట్ల ఆల్టో సిరీస్, ఆల్టో ఆల్టో కె10 లాంటి ప్రధానంగా ఉన్నాయి. ఆల్టో 796cc ఇంజన్ 40 bhp, 60 గరిష్టటార్క్ను అందిస్తుంది. వీటి ధరలు ఆల్టో ధర రూ. 5.13 లక్షలు. ఆల్టో కె10 1.0-లీటర్ ఇంజన్ (56 బిహెచ్పి & 82 ఎన్ఎమ్) కలిగి ఉంది. ఈ మోడల్ రెండూ సమర్థవంతమైన పనితీరును అందిస్తాయి. లు ప్రశంసనీయమైన ఇంధన సామర్థ్యంతో సిటీ డ్రైవింగ్కు అనువైనవి. ఆల్టో K10 ధర రూ. 5.96 లక్షలు Maruti S-Presso S-CNG మారుతి ఎస్ ప్రెస్సో 1.0-లీటర్ ఇంజన్. 56 bhp. 82 Nm అందిస్తుంది. ధర: రూ. 5.91-6.11 లక్షలు Maruti Wagon R S-CNG, వ్యాగన్ ఆర్ చక్కటి ఇంటీరియర్ స్పేస్తో ముచ్చటైన కారు ఇది. రోజువారీ ప్రయాణానికి ఆకర్షణీయమైన ఎంపిక. 1.0-లీటర్ ఇంజన్ (56 bhp & 82 Nm) సామర్థ్యంతో వస్తుంది. ధర: రూ. 6.44-6.89 లక్షలు Tata Tiago iCNG టాటా టియాగో టాటా టియాగో iCNG చక్కటి బూట్ స్పేస్తో అందుబాటులోఉన్న CNG హ్యాచ్బ్యాక్ ఇది. 1.2-లీటర్ CNG ఇంజన్ (72 bhp & 95 Nm) , స్పెషల్ ట్విన్ CNG సిలిండర్ సిస్టమ్తో ఉన్నదీనిధర: రూ. 6.54-8.20 లక్షలు. Maruti Celerio S-CNG: మారుతి సెలేరియో 1.0-లీటర్ CNG ఇంజిన్తో బడ్జెట్ధరలో అందుబాటులో ఉన్న కారిది. ధర: రూ. 6.73 లక్షలు టాటా పంచ్ Tata Punch iCNG ఈ కాంపాక్ట్ SUV 1.2-లీటర్ ఇంజన్ 72 bhp మరియు 95 Nm ను అందిస్తుంది. ధర: రూ. 7.09 నుంచి 9.67 లక్షలు హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ సీఎన్జీ Hyundai Grand i10 Nios CNG : 1.2-లీటర్ ఇంజన్ 68 బిహెచ్పి, 95 ఎన్ఎంను అందిస్తుంది. ధర: రూ. 7.58-8.13 లక్షలు -
లగ్జరీ బీఎండబ్ల్యూ ఈవీ: గంటల్లోనే హాట్ సేల్, ధర ఎంతంటే?
జర్మనీ లగ్జరీ కార్ మేకర్ బీఎండబ్ల్యూ ఇండియా కొత్తరు కారును లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. BMW iX1 ఎలక్ట్రిక్ ఎస్యూవీని ఇండియాలో ఆవిష్కరించింది. ఫుల్లీ ఎలక్ట్రిక్ BMW iX1 బుకింగ్లు ప్రత్యేకంగా ఆన్లైన్లో తీసుకొచ్చింది. బుకింగ్స్ అలా మొదలు పెట్టిందో లేదో విపరీతమైన డిమాండ్ను నమోదు చేసింది. ఈ హాల్ సేల్లో ఇప్పటికే 2023కి సంబంధించిన మొత్తం యూనిట్లు అందుకుంది. రూ. 66.90 లక్షలు (ఎక్స్-షోరూమ్)ధరతో తీసుకొచ్చిన ఈ ఎస్యూవీ డెలివరీలో అక్టోబర్లో ప్రారంభం. లాంచింగ్ రోజే iX1 SUVకి ‘అసాధారణ స్పందన రావడం థ్రిల్లింగ్గా ఉందంటూ BMW ప్రెసిడెంట్ విక్రమ్ పవా సంతోషం ప్రకటించారు. తమకు ఇండియాలో iX1కి గొప్ప అరంగేట్రం అని పేర్కొన్నారు. కానీ ఎన్ని యూనిట్లు సేల్ అయిందీ కచ్చితమైన వివరాలు అందించలేదు. డిజైన్ పరంగా, iX1 ఒక విభిన్నమైన 'I' ఎలక్ట్రిక్ గుర్తింపు,అడాప్టివ్ LED హెడ్లైట్లు LED హెడ్ల్యాంప్లు రన్నింగ్ బోర్డ్లతో పాటు ముందు మరియు వెనుక బంపర్లో బ్లూ యాక్సెంట్లతో దాదాపు చతురస్రాకారంలో గ్రిల్ను అమర్చింది. iX1 66.4kWh బ్యాటరీ ప్యాక్, 80 kms/hr గరిష్ట వేగంతో 5.6సెకన్లలో 100 కి.మీటర్ల వరకు తక్షణ వేగవంతం అందుకుంటుంది. ఇది 313 హెచ్పి పవర్ను గరిష్టంగా 494 ఎన్ఎమ్ల టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. కేవలం 29 నిమిషాల్లో 10 నుండి 80 శాతం వరకు బ్యాటరీని ఛార్జ్ చేయవచ్చు. దాదాపు 6.3 గంటల్లో పూర్తిగా చార్జ్ అవుతుంది. ఆల్ఫ్లైన్ వైట్, స్పేస్ సిల్వర్, బ్లాక్ సఫైర్ , స్టార్మ్ బే అనే నాలుగు రంగుల్లో లభ్యం. 10.7-అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, 10.25-అంగుళాల పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ను పొందుతుంది. ఇది బ్లూ రింగ్ ఫినిషర్ లోగోతో ఎమ్ స్పోర్ట్ లెదర్ స్టీరింగ్ వీల్, 12 స్పీకర్లతో హర్మాన్ కార్డాన్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, మసాజ్ ఫంక్షన్లతో కూడిన యాక్టివ్ ఫ్రంట్ సీట్లు, యాంబియంట్ లైట్ని కలిగి ఉంది. అలాగే డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్రూఫ్, పవర్ టెయిల్గేట్ మరియు స్టోరేజీతో కూడిన ఫ్లోటింగ్ ఆర్మ్రెస్ట్ ఇతర ఫీచర్లుగా ఉన్నాయి. -
విడుదలకు సిద్దమవుతున్న ఎలక్ట్రిక్ కార్లు - వివరాలు
భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ రోజురోజుకి పెరుగుతున్న వేళ ఇప్పటికే విడుదలైన వాహనాలను కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లుగా మార్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో టాటా పంచ్ ఈవీ, హ్యుందాయ్ ఎక్స్టర్ ఈవీ, మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఈవీ ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ కార్లను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 1. టాటా పంచ్ ఈవీ: ప్రారంభం నుంచి మంచి అమ్మకాలతో అత్యధిక భద్రత కలిగిన వాహనాల జాబితాలో ఒకటిగా ఉన్న టాటా పంచ్ త్వరలో ఎలక్ట్రిక్ రూపంలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే అనేక సార్లు టెస్టింగ్ సమయంలో కనిపించిన ఈ కారు ఈ ఏడాది చివరి నాటికి లేదా 2024 ప్రారంభంలో విడుదలకానున్నట్లు సమాచారం. దేశీయ విఫణిలో ఎంతోమంది వాహన ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఎలక్ట్రిక్ కార్లలో పంచ్ ఈవీ కూడా ఒకటి. ఇది రెండు బ్యాటరీ ఫ్యాక్ ఆప్షన్తో లభించనుంది. అవి 19.2 కిలోవాట్ (65 Bhp / 110 Nm) & 24 కిలోవాట్ (74 Bhp / 114 Nm) బ్యాటరీ ప్యాక్. ఈ ఎలక్ట్రిక్ కారు గురించి మరిన్ని అధికారిక వివరాలు తెలియాల్సి ఉంది. 2. హ్యుందాయ్ ఎక్స్టర్ ఈవీ: ఈ ఏడాది మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త హ్యుందాయ్ ఎక్స్టర్ కూడా ఎలక్ట్రిక్ వెర్షన్ రూపంలో విడుదలకానుంది. టెస్టింగ్ దశలో ఉన్న ఈ కారు 2024 చివరి నాటికి మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. బ్యాటరీ ఇందులో 25 కిలోవాట్ నుంచి 30 కిలోవాట్ మధ్యలో ఉండవచ్చని అంచనా. దీనికి సంబంధించిన అధికారిక వివరాలు తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి: టెక్సాస్ సరిహద్దులో మస్క్ - వీడియో వైరల్ 3. మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఈవీ: మారుతి సుజుకి ఫ్రాంక్స్ త్వరలో ఎలక్ట్రిక్ కారుగా విడుదలకానుంది. ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో కంపెనీ 2030 నాటికి 6 వాహనాలను విడుదల చేయడానికి కంపెనీ సన్నద్ధమవుతోంది. ఇందులో ఒకటి ఫ్రాంక్స్ ఈవీ. ఈ వెర్సన్ గురించి కంపెనీ అధికారిక వివరాలు వెల్లడించనప్పటికీ.. ఇది ఒక సింగిల్ ఛార్జ్తో 400 నుంచి 450 కిమీ రేంజ్ అందించవచ్చని తెలుస్తోంది. Note: ఈ కథనంలో ఉపయోగించిన ఫోటోలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అధికారిక చిత్రాలు లాంచ్ సమయంలో వెల్లడవుతాయి. -
Today Gold and Silver: బంగారం నేలచూపులు, షాకిస్తున్న వెండి
Today Gold and Silver Prices: బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మరింత దిగివచ్చాయి. గత కొన్ని సెషన్లుగా నేలచూపులు చూస్తున్న పసిడి ధర శుక్రవారం దేశవ్యాప్తంగా సుమారు 300 రూపాయలు క్షీణించింది. మూడు రోజుల్లో దాదాపు వెయ్యిరూపాయలు దిగి వచ్చింది. సెప్టెంబరు 26న రూ. 54,750గా ఉన్న 22 క్యారెట్ల 10 గ్రా. పసిడి ధర శుక్రవారం నాటికి రూ. 54 వేల స్థాయిని కోల్పోయి 53,650 స్థాయికి దిగి వచ్చింది. మూడు సెషన్లలో 1100 దిగివచ్చింది.హైదరాబాద్ మార్కెట్లో 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 250 రూపాయలు క్షీణించి రూ. 53,650గా ఉంటే…24 క్యారెట్ల బంగారం ధర రూ.270 తగ్గి రూ. 58,530గా ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అయితే వెండి మాత్రం వెయ్యి రూపాయలు పుంజుకుంది. దీంతో కిలో వెండి ధర ప్రస్తుతం హైదరాబాద్లో రూ. 77500 ఉండగా, ఢిల్లీలో రూ.74,700 పలుకుతోంది. (బ్యాంకు లాకర్లో రూ.18 లక్షలు చెదల పాలు: లాకర్ కొత్త నిబంధనలు తెలుసా?)కాగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్న సంగతి తెలిసిందే. అలాగే దేశీయంగా కూడా పెళ్లిళ్ల సీజన్లో పుంజుకున్నప్పటికీ, గత కొన్ని వారాలుగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. అటు దేశీయ స్టాక్మార్కెట్లు పాజటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. -
యాప్ట్రానిక్స్ స్టోర్స్లో ఐఫోన్లపై బంపర్ ఆఫర్లు
Offers on iPhone 15 series యాపిల్ ఉత్పత్తుల విక్రయ సంస్థ యాప్ట్రానిక్స్ తాజాగా ఐఫోన్ 15 స్మార్ట్ఫోన్లు, వాచ్లను దేశవ్యాప్తంగా 56 స్టోర్స్లో అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించింది. గుంటూరు, సిద్ధిపేట, విజయనగరం, భీమవరం తదితర నగరాల్లోని స్టోర్స్ కూడా వీటిలో ఉన్నాయి. గుంటూరు, సిద్ధిపేట స్టోర్స్లో ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్లు అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఐఫోన్ 14 లేదా ఐఫోన్ 13లను కొనుగోలు చేసేవారు రూ. 11,000 విలువ చేసే యాక్సెసరీలు ఉచితంగా పొందవచ్చని పేర్కొంది. ప్రత్యామ్నాయంగా రూ. 2,500 ఫ్లాట్ డిస్కౌంటును ఎంచుకోవచ్చని తెలిపింది. అదనంగా యాపిల్కేర్ప్లస్, ప్రొటెక్ట్ప్లస్పై రూ. 2,000 మినహాయింపును, ఫోన్ను ఎక్సే్చంజ్ చేస్తే రూ. 6,000 వరకు బోనస్ వంటివి పొందవచ్చు. మొత్తం మీద గుంటూరు, సిద్ధిపేట కస్టమర్లు 31 శాతం వరకు ఆదా చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. -
ఫెస్టివ్ సీజన్: బంగారం, వెండి ధరలు, ఎన్నాళ్లీ ఒత్తిడి!
Gold and silver prices today : దేశంలో బంగారం, వెండి ధరలు పెరుగుతూ, తగ్గుతూ ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్లో శనివారం 10గ్రాముల పసిడి (22 క్యారెట్లు) ధర రూ. 100 పెరిగి రూ. 54,950కి చేరింది. అలాగే 10 గ్రాముల (24 క్యారెట్లు) బంగారం ధర రూ. 110 పెరిగి రూ. 59,950 వద్ద ఉంది. అ టు వెండి ధరలు కూడా పుంజుకున్నాయి. దేశంలో కిలో వెండి ధర 300 రూపాయి ఎగిసి రూ. 75,800కి చేరింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర 79,300గా ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇటీవలి కాలంలో 60వేల మార్క్ను దాటేసిన 10 గ్రాముల గోల్డ్ ధరలో గత కొన్ని రోజులుగా పసిడి ధరల్లో తీవ్ర ఒత్తిడి కొనసాగుతోంది. దీంతో రానున్న ఫెస్టివ్ సీజన్ , దీపావళి పెళ్లిళ్ల ముహూర్తాల నేపథ్యంలో బంగారం కొనాలో, వెయిట్ చేయాలో తెలియని అనిశ్చితి వినియోగదారుల్లో నెలకొంది. ఫెడ్ వడ్డీరేట్లు ప్రస్తుతం యథాతథంగా ఉంచినప్పటికీ ద్రవ్యోల్బణం, ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో మరోసారి వడ్డీ వడ్డన ఉంటుందనే అంచనాల మధ్య పసిడి ధరలపై ఒత్తిడి కొనసాగుతోందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు , జాతీయ అంతర్జాతీయ పరిణామాలు, ఆర్థిక పరిస్థితులు, ఫెడ్ వడ్డీరేటు, రూపాయి, డాలరు కదలికలపై భారతీయ మార్కెట్లో పసిడి ధరలు ఆధారపడి ఉంటాయి. అలాగే ప్రపంచ బంగారం డిమాండ్, వివిధ దేశాలలో కరెన్సీ విలువలు, ప్రస్తుత వడ్డీ రేట్లు , బంగారు వాణిజ్యానికి సంబంధించిన ప్రభుత్వ నిబంధనలు వంటి అంశాలు కూడా దోహదం చేస్తాయి. -
ఫెడ్ ఎఫెక్ట్: స్టాక్ మర్కెట్ పతనం, దిగివచ్చిన పసిడి
Today Gold and Silver Prices: బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. గత కొన్ని సెషన్లుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర గురువారం కాస్త నెమ్మదించింది. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రా. 22 క్యారెట్ల పసిడి ధర రూ. 150 తగ్గి రూ. 55,050గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10గ్రా. బంగారం ధర 180 రూపాయలు ఎ గిసి 60,050 వద్ద ఉంది. మరోవైపు కిలో వెండి ధర హైదరాబాద్లో రూ.78 వేలు పలుకుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. (డేటా భద్రత నిబంధనలు: తేడా వస్తే రూ. 250 కోట్ల వరకు జరిమానా) ముఖ్యంగా ఫెడ్ వడ్డీరేట్లు యధాతథంగాఉంచడంతో డాలర్ బలంపుంజుకుంది. డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి స్వల్పంగా నష్టపోతోంది. ఇక స్టాక్మార్కెట్ల విషయానికి వస్తే గ్లోబల్ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో ఆరంభంలోనే భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ ఏకంగా 500పాయింట్లకుపైగా కుప్పకూలగా, 147 పాయింట్ల నష్టంతో నిఫ్టీ 19800 స్థాయిని కూడా కోల్పోయి మరింత బలహీన సంకేతాలందించాయి. అటు ఆయిల్ రేట్లు భగ్గుమన్నాయి. -
పండగ వేళ పసిడి పరుగు, వెండి ఎంత తగ్గిందంటే!
Today Gold and Silver Prices: దేశంలో బంగారం , వెండి ధరలు పైపైకే చూస్తున్నాయి. గతరెండు రోజులుగా పెరుగుతూ వస్తున్న పసిడి ధర సోమవారం మరింత ఎగిసింది. అటు వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. గత కొన్ని సెషన్లుగా పరుగాపక పయనిస్తున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ పెరుగుతున్న చమురు, డాలరు బలం బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) (సెప్టెంబర్ 18, సోమవారం నా డు )లో బంగారం, వెండి ధరలు రెండూ పెరిగాయి.అక్టోబర్ 5, 2023న మెచ్యూర్ అయ్యే గోల్డ్ ఫ్యూచర్స్ MCXలో రూ. 105 పెరిగి 10 గ్రాములకు రూ.59,098గా ఉంది. అదేవిధంగా, డిసెంబర్ 5, 2023న మెచ్యూర్ అయ్యే వెండి ఫ్యూచర్స్ కూడా రూ. 307 లేదా 0.43 శాతం పెరిగి MCXలో కిలోకు రూ. 72,461 వద్ద ట్రేడవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలకోసం ఇక్కడ క్లిక్ చేయండి! హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల పసిడి ధర 140 రూపాయిలు పెరిగి, 10గ్రాములకు 55,050 గా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 150 రూపాయలు పుంజుకుని 60.050పలుకుతోంది. అటు వెండి కిలో స్వల్పంగా 200 రూపాయిలు తగ్గి కిలో వెండి 74,500గా ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అటు వరస లాభాలకుచెక్ చెప్పిన దేశీయ స్టాక్మార్కెట్లు సోమవారం నష్టాల్లోకి జారుకున్నాయి.మరోవైపు పెరుగుతున్న చమురు ధరల కారణంగా భారత కరెన్సీ రూపాయి డాలరు మారకంలో 83.22 వద్ద రికార్డు కనిష్ట స్థాయికి చేరుకుంది. -
లగ్జరీ కార్ ఫీచర్లతో టాటా నెక్సాన్ ఈవీ కొత్త వెర్షన్
న్యూఢిల్లీ: టాటా మోటార్స్ తాజాగా తమ నెక్సాన్ వాహనానికి సంబంధించి కొత్త వెర్షన్స్ ఆవిష్కరించింది. నెక్సాన్ ఈవీలో కొత్త వెర్షన్ ధర రూ. 14.74–19.94 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా ఉంటుంది. ఇది ఒకసారి చార్జి చేస్తే గరిష్టంగా 465 కిలోమీటర్ల రేంజి ఇస్తుంది. అలాగే, నెక్సాన్లో పెట్రోల్, డీజిల్కు సంబంధించి కొత్త వెర్షన్లను టాటా మోటర్స్ ప్రవేశపెట్టింది. (ఎస్బీఐ మాజీ చైర్మన్ రజనీష్ సంపాదన ఎంతో తెలిస్తే!) వీటి రేటు రూ. 8.09 లక్షల (ఎక్స్–షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాల కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రత్యేక నెట్వర్క్ను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు సంస్థ ఎండీ (ప్యాసింజర్ వెహికల్స్ విభాగం) శైలేష్ చంద్ర తెలిపారు. ప్రస్తుతం టాటా మోటర్స్ ఎలక్ట్రిక్ వాహనాల పోర్ట్ఫోలియోలో నెక్సాన్, టియాగో, టిగోర్, ఎక్స్ప్రెస్–టీ ఈవీ ఉన్నాయి. -
గోల్డ్ లవర్స్కి తీపి కబురు: బంగారం, వెండి ధరలు పతనం
Today Gold and Silver Price పండుగల వేళ బంగారం ప్రియులకు తీపి కబురు. భారతీయ మార్కెట్లో రెండు రోజులు వరుసగా పెరిగిన వెండి బంగారం ధరలు (సెప్టెంబర్ 13, 2023 )బుధవారం దిగి వచ్చాయి. దేశవ్యాప్తంగా వెండి బంగారం ధరలు తగ్గముఖం పట్టాయి.22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.340 మేర తగ్గింది. అలాగే 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర 10 గ్రాములకు రూ.380లు తగ్గి 59,450 పలుకుతోంది. వెండి కిలో ఏకంగా వెయ్యి రూపాయిలు క్షీణించింది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి 73,500గా ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లోని బంగారం ధరల కోసం ఇక్కడ క్లిక్ చేయండి! మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో పతనాన్ని నమోదు చేశాయి. అక్టోబరు 5, 2023న మెచ్యూర్ అయ్యే గోల్డ్ ఫ్యూచర్స్, రూ. 74 లేదా 0.13 శాతం స్వల్ప తగ్గుదల నమోదు చేసిన తర్వాత, 10 గ్రాములకు రూ. 58,592 వద్ద ఉంది. క్రితం ముగింపు రూ.58,626గా నమోదైంది. అదేవిధంగా డిసెంబర్ 5, 2023న వెండి ఫ్యూచర్స్ రూ. 385 లేదా 0.54 శాతం పతనాన్ని చవిచూశాయి .మునుపటి ముగింపు రూ. 71,934తో పోలిస్తే కిలోకు రూ. 71,750 వద్ద ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ అంతర్జాతీయ మార్కెట్లో కూడా బుధవారం నాడు బంగారం ధరలు పడిపోయాయి. అయితే మునుపటి సెషన్లో రెండు వారాల కనిష్ట స్థాయికి స్వల్పంగా అధిగమించాయి. . అమెరికా మార్కెట్, ద్రవ్యోల్బణ డేటా, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింత పెంచుతుందా అనే కీలక అంశాలకోసం ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్నారు. తాజా మెటల్ నివేదిక ప్రకారం స్పాట్ గోల్డ్ ఔన్స్కు 0.1 శాతం తగ్గి 1,910.87 డాలర్లు వద్ద ఉంది. ఆగస్టు 25 తరువాత నిన్న(మంగళవారం) 1,906.50 వద్ద కనిష్ట స్థాయిని తాకింది. స్పాట్ సిల్వర్ ఔన్స్కు 0.8 శాతం తగ్గి 22.92 డాలర్ల స్థాయికి చేరుకుంది. మరోవైపు దేశీయ స్టాక్మార్కెట్లు ప్రారంభ నష్టాలనుంచి భారీగా కోలుకున్నాయి.సెన్సెక్స్ ఏకంగా 330 పాయింట్లకు పైగా ఎగియగా, నిఫ్టీ 20090 వద్ద రికార్డు స్తాయిలో కొనసాగుతోంది. -
ఆడి క్యూ8 స్పెషల్ ఎడిషన్, ధర చూస్తే..!
Audi Q8 special edition: పండుగల సీజన్ సందర్భంగా లగ్జరీ కార్ల దిగ్గజం ఆడి ఇండియా స్పెషల్ ఎడిషన్ను తీసుకొచ్చింది. తాజాగా క్యూ8లో స్పెషల్ ఎడిషన్ను ఆవిష్కరించింది. దీని ధర రూ. 1,18,46,000 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. మైథోస్ బ్లాక్, గ్లేషియర్ వైట్, డేటోనా గ్రే రంగుల్లో ఇవి లభిస్తాయి. పరిమిత సంఖ్యలోనే ఈ ఎస్యూవీల విక్రయాలు ఉంటాయని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ తెలిపారు. (10 శాతం జీఎస్టీ?ఇక డీజిల్ కార్లకు చెక్? నితిన్ గడ్కరీ క్లారిటీ) 3.0-లీటర్ పెట్రోల్-హైబ్రిడ్ మోటార్ను పొందుతుంది ఇది కేవలం 5.9 సెకన్లలో సున్నా నుండి 100kmph వరకు వేగవంతం చేస్తుంది మరియు గరిష్టంగా 250kmph వేగాన్ని అందుకోగలదు. ఎక్ట్సీరియర్లో, S-లైన్ ఎక్స్టీరియర్ ప్యాకేజీ , బ్లాక్ స్టైలింగ్ ప్యాకేజీతో Q8 స్పెషల్ ఎడిషన్ను రూపొందించింది. క్యాబిన్ 'ఏరో-అకౌస్టిక్స్'ని కలిగి ఉన్న అధిక-నాణ్యత క్యాబిన్తో, 4 జోన్ ఏసీ, ప్రీమియం సౌండ్ సిస్టమ్, 21 అంగుళాల అలాయ్ వీల్స్, ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఇంటీరియర్స్ మొదలైన ప్రత్యేకతలు ఈ ఎస్యూవీలో ఉన్నట్లు ధిల్లాన్ తెలిపారు. తమ ఉత్పత్తుల పోర్ట్ఫోలియోలో ఇది విశిష్టమైన ఎస్యూవీ అని ఆయన పేర్కొన్నారు. -
క్షీణిస్తున్న బంగారం, వెండి ధరలు: ఈ వివరాలు చూడండి!
Today Gold and Silver Prices పండగ సీజన్లో బంగారం, వెండి ధరలు వరుసగా దిగి వస్తున్నాయి. గత రెండు మూడు సెషన్లుగా వరుసగా తగ్గుతున్న బంగారం నేడు మరింత క్షీణించింది. మరో ముఖ్యమైన మెటల్ వెండి ధర కూడా దిగి వస్తోంది. అంతర్జాతీయ పరిణామాలు, చమురు ధరలు, డాలరు బలం నేపథ్యంలో దేశీయంగా తులం పసిడి ధర రూ. 60 వేల దిగువకుచేరింది. (మోడ్రన్ కార్లలో సెక్స్ నుంచి పాలిటిక్స్ దాకా మొత్తం లీక్: షాకింగ్ రిపోర్ట్) మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో కూడా బుధవారంతో పోలిస్తే నేడు తక్కువగానే ఉన్నాయి. అక్టోబర్ 5 డెలివరీకి సంబంధించిన 10 గ్రా.పసిడి రూ. 59043 వద్ద కొనసాగుతోంది. అలాగే నవంబర్ 30 డెలివరీకి సంబంధించిన MCX సిల్వర్ కిలోకు 72271 వద్ద ప్రారంభమైంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరల వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి! హైదరాబాద్ మార్కెట్లో గురువారం 10 గ్రా. 22 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయలు తగ్గి 54,900వద్ద ఉంది.అలాగే 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ. 59,890 గా కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల, 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 55050 వద్ద, 60,040 వద్ద ఉన్నాయి. ఇక వెండి విషయానికి వస్తే హైదరాబాద్లో ఏకంగా వెయ్యి రూపాయలు పతనమైన 77, 500 వద్ద ఉంది. దాదాపు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇదే ధరలు కొనసాగుతున్నాయి. -
సెప్టెంబరులో రానున్న 5G బెస్ట్ ఫోన్లు ఏవంటే?
iQoo Z7 Pro 5g భారత మార్కెట్లో ఐక్యూ జెడ్ 7 ప్రో (ఆగస్టు 31న లాంచ్ అయింది. Z7 లైనప్లో ఈ స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లో తీసుకొచ్చింది కంపెనీ. బ్లూ లగూన్, గ్రాఫైట్ మ్యాట్ కలర్ ఆప్షన్లలోరెండు వేరియంట్లలో ఇది లభిస్తుంది. 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ ధరలు వరుసగా రూ.23,999, రూ.24,999గా నిర్ణయించింది. (30 వేల అడుగుల ఎత్తులో స్పెషల్ రాఖీ వేడుక: వీడియో వైరల్) బ్యాంక్ ఆఫర్ అయితే బ్యాంక్ ఆఫర్ కింద రెండువేల రూపాయల తగ్గింపు అందిస్తోంది. దీని ప్రకారం వీటి ధరలు వరుసగా రూ. 21,999, రూ. 22,999గా ఉంటాయి. అమెజాన్, ఐక్యూ అధికారిక వెబ్సైట్ ద్వారా సెప్టెంబర్ 5, మధ్యాహ్నం 12 నుంచి సేల్ షురూ అవుతుంది. వన్ప్లస్ నార్డ్ CE 3తో పోలిస్తే తక్కువ ధరలో గట్టి పోటీ ఇవ్వనుందని అంచనా. The #iQOOZ7Pro 5G is finally here! 🤩 Get this ultimate, power-packed device at an incredible price of just ₹21,999* at the upcoming sale on @amazonIN & https://t.co/ZK4Krrdztq on Sept 5. 💙📱 Know more: https://t.co/tfsaIl9h3Y#AmazonSpecials #FullyLoaded #iQOOZ7Pro5G pic.twitter.com/BgOHLnjnuC — iQOO India (@IqooInd) August 31, 2023 ఐక్యూ జెడ్7 ప్రో ఫీచర్లు : 6.78 అంగుళాల డిస్ప్లే, MediaTek Dimensity 7200 సాక్ ప్రాసెసర్, 2400x1080 పిక్సెల్స్ రిజల్యూషన్ , 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 64+2 ఎంపీ రియర్ డ్యుయల్ కెమెరాఉంటాయి. చైనా టెక్నో పోవా ఫోన్లు చైనాకు చెందిన స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ టెక్నో మొబైల్ రెగ్యులర్ స్మార్ట్ఫోన్లకు కాస్త భిన్నంగా ఉండే విధంగా సరికొత్త స్మార్ట్ఫోన్లు పోవా 5, పోవా 5 ప్రో 5జీలను మార్కెట్లోకి విడుదల చేసింది. Tecno Pova 5: పోవా 5 ఫోన్ 6.78 ఇంచెస్ ఫుల్హెచ్డి ప్లస్ 120Hz డిస్ప్లేతో వచ్చింది. మీడియాటెక్ హీలియో G99 6nm చిప్సెట్, 50MP ఏఐ డ్యూయల్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా, 6000mAh బ్యాటరీ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఫోన్ 45W స్మార్ట్ ఛార్జ్ టెక్నాలజీ కలిగి ఉంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 11,999 Tecno Pova 5 Pro 5G 120 Hz రిఫ్రెష్ రేట్తో , 6.78-అంగుళాల టచ్స్క్రీన్ డిస్ప్లే (FHD+) 50-megapixel + VGA రియర్ కెమెరా, 16ఎంపీ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. అలాగే 128GB, 256GB ఇంటర్నల్ స్టోరేజీ ప్రత్యేకత. Tecno Pova 5 Pro నానో-సిమ్ , నానో-సిమ్ కార్డ్ స్లాట్లను కలిగి ఉంటుంది. డ్యూయల్ సిమ్ (GSM ప్లస్ GSM) మొబైల్. ఇది డార్క్ ఇల్యూషన్ , సిల్వర్ ఫాంటసీ రంగులలో అందుబాటులో ఉంది. Tecno Pova 5 Pro 5జి ప్రారంభ ధర రూ. 14,999. సెప్టెంబర్లో లాంచ్ అవుతున్న టాప్ స్మార్ట్ఫోన్లు వీటితోపాటు ఈ సెప్టెంబరులో ఐఫోన్ 15 సిరీస్లో ఐఫోన్ 15, 15 ప్లస్, ఐఫోన్ 15ప్రొ, ఐఫోన్ 15ప్రొ మ్యాక్స్ తదితర ఫోన్లు లాంచ్ కానున్నాయి.ఇంకా హానర్ 90 మొబైల్ తయారీ దారు హానర్ రెండేళ్ల తరువాత భారత మార్కెట్లో రీ ఎంట్రీ ఇవ్వనుంది. 6.4-అంగుళాల పూర్తి-HD+ డైనమిక్ AMOLED డిస్ప్లే,50 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా లాంటి ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఈ (Samsung Galaxy S23 FE) లాంచ్ కానుంది. అలాగే Moto G54 5G స్మార్ట్ఫోన్ ఈనెలలోనే రానుంది. 6.5-అంగుళాల పూర్తి-HD+ డిస్ప్లే, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్, 50 ఎంపీ కెమెరా లాంటి ఫీచర్లుంటాయని అంచనా. It’s official! Apple will launch the iPhone 15 at the next #AppleEvent on September 12th at 10 a.m. PDT 🚨 Are you excited? pic.twitter.com/6mBEW7Z0Tm — Apple Hub (@theapplehub) August 29, 2023 Samsung Galaxy S23 FE Might Launch in September 2023 Specs: -6.4'' FHD+ 120Hz Dynamic AMOLED display -Snapdragon 8 Gen 2 or Exynos 2200 SoC -50MP Main +8MP UW +12MP Telephoto camera & 10MP selfie -4500mAh battery with 25W charging -One UI 5.1, Android 13#Samsung #GalaxyS23FE pic.twitter.com/Y3N1tH2ky8 — Smartprix (@Smartprix) August 24, 2023 moto G54 5G is launching on September 6, 2023 in India. - 6.55" FHD+ 120Hz IPS LCD - MediaTek Dimensity 7020 - 50MP OIS + 8MP camera - 16MP front - Stereo speakers, Dolby Atmos - 6000mAh battery, 33W charge - Android 13 - 3.5mm, Side FS - 192g, 8.89mm#Motorola #moto #motoG54 pic.twitter.com/TlfViCJcL4 — Oneily Gadget (@OneilyGadget) August 31, 2023 -
అప్రీలియా ఎస్ఆర్ స్టార్మ్ 125కొత్త బైక్: ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే!
Aprilia SR Storm 125 వాహన తయారీలో ఉన్న పియాజియో వెహికిల్స్ తాజాగా అప్రీలియా ఎస్ఆర్ స్టార్మ్ 125 స్కూటర్ ప్రవేశపెట్టింది. నాలుగు రంగుల్లో ఇది లభిస్తుంది.స్పోర్టీ స్టైలింగ్తో ఆకర్షణీయంగా ఉంది. ఇంజీన్ 125 సీసీ 3-వాల్వ్ 4-స్ట్రోక్ ఐ-గెట్ ఇంజన్ పొందుపరిచారు. గంటకు 60 కిలోమీటర్ల వేగాన్ని 9.6 సెకన్లలో అందుకుంటుంది. డిస్క్ బ్రేక్స్తో 12 అంగుళాల ట్యూబ్లెస్ టైర్స్, సెమీ డిజిటల్ క్లస్టర్, గ్రాఫిక్స్తో ట్యూబ్యులార్ స్టీల్ ఫ్రేమ్ వంటి హంగులు ఉన్నాయి. పరిచయ ఆఫర్ ధర ఎక్స్షోరూంలో రూ.1,07,999 ఉంది. -
వామ్మో! హీటెక్కుతున్న బంగారం ధరలు
Today Gold and Silver prices: బంగారం, వెండి ధరలు మళ్లీ మండుతున్నాయి. ఆల్ టై హై నుంచి కొద్దిగా వెనక్కి తగ్గినప్పటికీ, డాలర్ బలంతో మళ్లీ భగ్గుమంటున్నాయి. అంతర్జాతీయంగా, దేశీయంగా గోల్డ్, సిల్వర్ ధరలు వేగం పుంజకున్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.250 పెరిగి రూ.54,750గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 270పెరిగి రూ. 59,670 పలుకుతోంది. అటు వెండి ధర కూడా పెరిగింది. కిలోకు రూ. 200 పెరిగిన వెండి ధర కిలోకు 77. 100గా ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. MCX మార్కెట్లో వరుసగా రెండో రోజు జంప్ ఆగస్టు 29, మంగళవారం మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం , వెండి ధరలు వరుసగా రెండో రోజు కూడా పెరిగాయి. అక్టోబరు 5, 2023న మెచ్యూర్ అయ్యే గోల్డ్ ఫ్యూచర్స్, రూ. 90 లేదా 0.15 శాతం పెరిగి 10 గ్రాములకు రూ.58,949గా ఉంది.అదేవిధంగా, సెప్టెంబరు 5, 2023న మెచ్యూరయ్యే వెండి ఫ్యూచర్లు కూడా రూ. 162 లేదా 0.22 శాతం పెరిగి కిలోకు రూ. 73,700 వద్ద ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయంగా బంగారం, వెండి ధర స్పాట్ గోల్డ్ ఔన్స్కు 0.3 శాతం పెరిగి 1,924.84కి చేరుకుంది, ఆగస్టు 10 నుండి అత్యధికం. అమెరికా బంగారం ఫ్యూచర్స్ 0.3 శాతం పెరిగి 1,952.90 డాలర్ల వద్ద ఉన్నాయి. వెండి ఔన్స్కు 0.3 శాతం పెరిగి 24.32 డాలర్లకు చేరుకుంది. అంతర్జాతీయంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా ఫెడ్ సెప్టెంబర్ పాలసీ నిర్ణయం, ఆగస్ట్ లేబర్ మార్కెట్ డేటా ఆధారంగా బంగారం ధరలు కదలాడుతాయని మార్కెట్వర్గాలు అంచనా వేస్తున్నాయి. అటు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి స్వల్పంగా నష్టపోయింది. సోమవారం నాటి ముగింపు 82.62 తో పోలిస్తే మంగళవారం 82.70 వద్ద ముగిసింది. -
ఆ ఐకానిక్ బైక్ మళ్లీ వచ్చేసింది.. అదిరిపోయే లాంచింగ్ ఆఫర్ కూడా
Karizma XMR: దేశీయ ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారు హీరో మోటోకార్ప్ సరికొత్త బైక్ను (మంగళవారం, ఆగస్టు 29) లాంచ్ చేసింది. కరిజ్మా XMR 210 పేరుతో ఈ కొత్త బైక్ లాంచ్తో కరిజ్మా బ్రాండ్ను రీలాంచ్ చేసింది. అంతేకాదు ఈ బైక్పై ఆకర్షణీయమైన్ రూ. 10వేల ప్రత్యేక తగ్గింపు అందిస్తోంది. యంగ్ జనరేషన్ బైకర్లను దృష్టిలో ఉంచుకని దీన్ని తీసు కొచ్చినట్టు హీరో మోటోకార్ప్ కంపెనీ వెల్లడించింది. బుకింగ్లను కూడా షురూ చేసింది. రూ. 1,82,900 లాంచింగ్ ప్రైస్గా ఉన్న Karizma XMR 210 ఈ తగ్గింపుతో రూ. 1,72,900 (ఎక్స్-షోరూమ్ ధర ఆల్ ఇండియా) అందుబాటులో ఉంటుంది. నటుడు,బ్రాండ్ అంబాసిడర్ బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కరిజ్మా XMR 210ని ఆవిష్కరించారు. ఇది ఐకానిక్ ఎల్లో, టర్బో రెడ్ , మ్యాట్ ఫాంటమ్ బ్లాక్ అనే మూడు కలర్ ఆప్షన్లలో లభ్యం. Karizma XMR 210 ఇంజీన్, ఫీచర్లు 210cc సింగిల్-సిలిండర్, 4V, DOHC , లిక్విడ్-కూల్డ్ యూనిట్ 9250 RPM (కంపెనీ అత్యంత శక్తివంతమైన ఇంజిన్)ను అమర్చింది. RPM వద్ద 20.4 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. గరిష్ట వేగం గంటకు 140 కి.మీ. అని కంపెనీ తెలిపింది. లిక్విడ్ కూల్ సెటప్ డ్యూయల్-ఛానల్ ABS, స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్, 6-స్పీడ్ గేర్బాక్స్ ఫ్యాటర్ రియల్ వెక టైర్తో వస్తుంది.ఇంకా ఈ బైక్లో కొత్త ఎల్ఈడీ లైట్లు , ఇండికేటర్లు, స్లీకర్ ఇంధన ట్యాంక్, షార్ప్ లైన్లో, రైడర్కు ప్రొటెక్షన్గా స్నాజీ విండ్స్క్రీన్తో యంగస్టర్స్ను ఆకట్టుకునేలా ఉంది. కాల్ల్స్, ఇతర నోటిఫికేషన్ అలర్ట్ కోసం బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్, ఇంకా టర్న్-బై-టర్న్ నావిగేషన్ కూడా ఉంది. సరికొత్త ఫుల్లీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంది. ఇది గేర్ పొజిషన్ ఇండికేటర్, తేదీ, సమయం, టూర్, ఓడోమీటర్ రీడింగ్, ఇంధన స్థాయి, టాకోమీటర్ స్పీడోమీటర్ రీడింగ్ల వంటి సమాచారాన్ని అందిస్తుంది. Say hello to the Most Powerful in its Class machine loaded with cutting-edge tech, and a design that's an absolute head-turner. 😎 Introducing the new #KarizmaXMR, at an introductory price of Rs. 1,72,900* (*Ex-showroom price All India). BOOKINGS OPEN https://t.co/Y7zhD7lJTE pic.twitter.com/7NEhA4Fijr — Hero MotoCorp (@HeroMotoCorp) August 29, 2023 -
అభిమానులకు గుడ్న్యూస్: రూ. 999లకే జియోభారత్ ఫోన్ 4జీ సేల్
JioBharat 4G ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో ఇటీవల లాంచ్ చేసిన JioBharat 4G ఫోన్ అమెజాన్లో కొనుగోలుకు అందు బాటులో ఉంది. రూ.999 వద్ద కొనుగోలు చేయవచ్చు. ముఖ్యంగా ఇప్పటికీ 2G ఫోన్లను ఉపయోగిస్తున్న వారికి సరసమైన ధరలో, ఇంటర్నెట్ సేవలు అందించే లక్ష్యంతో జియోభారత్ 4G ఫోన్ను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 23 భాషలకు మద్దతు ఇస్తుందని విడుదల సందర్బంగా జియో ప్రకటించింది. కార్బన్తో కలిసి తీసుకొచ్చిన ఈ ఫోన్లో 1000mAh బ్యాటరీ , మైక్రో SD కార్డ్ వంటి ఫీచర్లతోపాటు స్విఫ్ట్ 4G ఇంటర్నెట్ కనెక్ట్ సామర్థ్యంతో వచ్చింది. JioBharat 4G ఫీచర్లు 1.77-అంగుళాల TFT డిస్ప్లే 3.5mm హెడ్ఫోన్ జాక్ 0.3MP కెమెరా విత్ LED ఫ్లాష్ 1000mAh బ్యాటరీ ఎక్స్టర్నల్ మైక్రో SD కార్డ్ సపోర్ట్ ద్వారా వినియోగదారులు 128GB వరకు స్టోరేజీని విస్తరించుకోవచ్చు. "భారత్" , వెనుక కార్బన్ లోగోను డ్యూయల్ బ్రాండింగ్తో వస్తుంది. (టాలీవుడ్ మన్మధుడి కళ్లు చెదిరే నెట్వర్త్, కార్లు, ఇల్లు ఈ విషయాలు తెలుసా?) రూ. 123 ప్లాన్ అంతేకాదు ఈఫోన్ లాంచింగ్ సందర్బంగా స్పెషల్గా రూ. 123 ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ 28 రోజుల వాలిడిటీ. అపరిమిత వాయిస్ కాల్లు, 14 GB డేటా అందిస్తుంది. డియో స్ట్రీమింగ్ను ప్రారంభించే Jio యాప్లకు యాక్సెస్ని అందిస్తుంది. అయితే, భవిష్యత్తులో ఇతర రిటైల్ అవుట్లెట్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుందా లేదా అనే విషయాన్ని కంపెనీ ఇంకా వెల్లడించలేదు. (ప్రజ్ఞానంద తల్లిదండ్రులకు ఆనంద్ మహీంద్ర అదిరిపోయే గిఫ్ట్) -
భారత్లో రూ. 8,000 కోట్ల పెట్టుబడులు - వచ్చే ఐదేళ్లలో..
న్యూఢిల్లీ: హౌసింగ్ సొల్యూషన్స్, గాజు కిటికీలు తదితర ఉత్పత్తుల తయారీ దిగ్గజం సెయింట్ గొబెయిన్ ఇండియా .. భారత్లో రూ. 8,000 కోట్ల మేర ఇన్వెస్ట్ చేయనుంది. వచ్చే అయిదేళ్లలో వివిధ విభాగాల్లో పెట్టుబడులు, కంపెనీల కొనుగోళ్ల కోసం ఈ నిధులను వెచ్చించనుంది. కంపెనీ చైర్మన్ బి. సంతానం ఈ విషయాలు వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు 8–10 శాతం మేర వృద్ధి చెందగలవని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. సెయింట్ గొబెయిన్ గ్లోబల్ వ్యాపారంలో అత్యంత లాభదాయక మార్కెట్లలో భారత్ మూడో స్థానంలో ఉందని ఆయన వివరించారు. ‘వృద్ధి, లాభదాయకత, విస్తరణ, డిజిటల్, నిపుణులు వంటి అంశాల్లో సెయింట్ గొబెయిన్ ఇండియా మెరుగ్గా రాణిస్తోంది. నిర్మాణ రంగంలో కావచ్చు.. పారిశ్రామిక రంగంలో కావచ్చు మా వ్యాపారాలన్నీ బాగున్నాయి‘ అని సంతానం తెలిపారు. ప్రస్తుతం తాము మధ్యప్రాచ్యం, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ తదితర దేశాలకు భారత్ నుంచి ఎగుమతులు చేస్తున్నామని చెప్పారు. భారత్ నుంచి ఇతరత్రా ఉత్పత్తుల ఎగుమతులు మందగించినా తమవి మాత్రం స్థిరంగా 15 శాతం స్థాయిలో వృద్ధి చెందుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఫ్రాన్స్కు చెందిన సెయింట్ గొబెయిన్ ఇటీవలే రాక్వూల్ ఇండియా, ట్విగా సంస్థలను కొనుగోలు చేసింది. -
ఫెస్టివల్ సీజన్ వచ్చేస్తోంది...సూపర్ అప్కమింగ్ కార్లు
TopUpcomingCars: పండుగల సీజన్ సమీపిస్తున్నతరుణంలో భారత మార్కెట్లోకి కొత్త కార్లు హల్చల్ చేస్తున్నాయి. వినాయక చవితి దసరా, దీపావళి రోజుల్లో కొత్త వాహనాలను కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. పండుగల సీజన్ కార్ల డిమాండ్ నేపథ్యంలో అనేక కంపెనీలు అత్యాధునిక ఫీచర్లు, బడ్జెట్, ఈవీ కార్లు ఇలా రకరకాల సెగ్మెంట్లలో కార్లను లాంచ్ చేస్తుంటారు. ఒకవేళ మీరు కూడా ఈ పండుగ సీజన్లో కొత్త కారును కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే, రానున్న రాబోయే మోడళ్ల కార్లను ఓసారి చూద్దాం! Maruti suzuki invicto మారుతి సుజుకి ఇండియా తన లీడర్ మోడల్ - మారుతి సుజుకి ఇన్విక్టో ఎమ్పివిని జీటా ఆల్ఫా అనే రెండు వేరియేషన్లలో అందుబాటులో ఉంది. మారుతి ఇన్విక్టో ఎలక్ట్రిక్ ఇంజిన్తో సరిపోలిన 2.0-లీటర్ పెట్రోల్ మోటారును పొందుతుంది. ఎలక్ట్రిక్ మోటార్ 11 బిహెచ్పి ,206 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది, ఐసిఇ వెర్షన్ 172 బిహెచ్పి మరియు 188 ఎన్ఎమ్ టార్క్ను కలిగి ఉంది. ధర రూ. రూ. 24.79 లక్షలు 28.42 లక్షలు (ఎక్స్ షోరూం) Honda Elevate హోండా ఎలివేట్ వచ్చే నెల ( సెప్టెంబరు) లో దేశంలో సేల్ కు రానుంది.హోండా ఎలివేట్ 1.5L NA పెట్రోల్ ఇంజన్తో 6-స్పీడ్ MT , CVT అనే రెండు ట్రాన్స్మిషన్ ఆప్షన్స్లో లభ్యం. దీని ధర రూ. 10.50-17 లక్షలు ఉంటుందని అంచనా. ఇది హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైడర్, వోక్స్వ్యాగన్ టైగన్, స్కోడా కుషాక్, MG ఆస్టర్ లాంటివాటికి గట్టి పోటీగా ఉండనుంది. Citroen C3 Aircross సిట్రోయెన్ సీ3 ఎయిర్క్రాస్: 7-సీటర్ SUVని కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే, సిట్రోయెన్ C3 ఎయిర్క్రాస్ బెస్ట్ ఆప్షన్. బోల్డ్ స్టైలింగ్తో, బెస్ట్ ఇంటీరియర్తో వస్తోంది. అయితే ఇది 1.2L టర్బో-పెట్రోల్ కేవలం ఒక ఇంజన్ ఎంపిక మాత్రమే లభ్యం. దీని ధర రూ. 9-13 లక్షలు ఉంటుందని అంచనా. Toyota Rumion మరో 7-సీటర్ కారు టయోటా రూమియన్. ఈమధ్యనే లాంచ్ అయినా ఈ కారు త్వరలోనే కొనుగోలుకు అందుబాటులోకి రానుంది. విజువల్ ఫ్రంట్లో కొన్ని మార్పులను కలిగి ఉంది. అలాగే రేడియేటర్ గ్రిల్ సవరించిన బంపర్తో కొత్తగానూ, అల్లాయ్ వీల్స్ కూడా తాజా డిజైన్ను కలిగి ఉన్నాయి. టయోటా లోగో మినహా లోపలి భాగంలో అంతా సేమ్. Tata Punch EV SUV టాటా పంచ్ ఈవీ టియాగో ఈవీ తరహాలో ఇదే ఆర్కిటెక్చర్తో పంచ్ ఈవీని విడుదల చేయడానికి టాటా మోటార్స్ సన్నాహాలు చేస్తోంది. ఇది జిప్ట్రాన్ సాంకేతికతతో బానెట్ కింద ఉంచబడిన ఎలక్ట్రిక్ మోటారుతో వస్తోంది. 350 కిమీల పరిధితో లాంచ్ కానుంది. దీని ధర రూ. 9-12 లక్షలు ఉంటుందని అంచనా. Tata Nexon facelift ప్రమోషనల్ షూట్లో అందరి దృష్టినీ ఆకర్షించిన టాటా నెక్సాన్ ఫేస్లిఫ్ట్ ఇండియన్ మార్కెట్లో అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఈ సంవత్సరం చివరి నాటికి ఇది మార్కెట్లోకి వస్తుందని తొలుత అనుకున్నప్పటికీ పండుగ సీజన్లోనే దాదాపు అక్టోబరులోనే దీన్ని లాంచ్ చేస్తుందని తాజా అంచనా.దీని ధర రూ. 8-15 లక్షలు ఉంటుందని అంచనా. Volvo C40 Recharge వోల్వో సీ40 రీఛార్జ్ (VolvoC40) XC40 రీఛార్జ్ SUV-కూపే వెర్షన్. మెరుగు పర్చిన 78kWh బ్యాటరీ ప్యాక్తో,530కిమీ పరిధిని అందిస్తుంది. 408PSతో డ్యూయల్-మోటార్ AWD కారణంగా 4.7 సెకన్లలో 100kmph వరకు దూసుకెళ్తుంది. అంచనా ధర రూ. 60 లక్షలు (ఎక్స్-షోరూమ్) సెప్టెంబరు 4న లాంచింగ్ -
శ్రావణంలో షాక్: వెండి, బంగారం ధరలు హై జంప్
Today Gold and Silver Prices: ఆల్టైంహైనుంచి దిగివచ్చిన వెండి బంగారం ధరలు మళ్లీ షాకిస్తున్నాయి. ముఖ్యంగా శ్రావణమాసంలో బంగారు ఆభరణాలకు డిమాండ్ పెరగనున్న నేపథ్యంలో వరుస సెషన్లుగా పెరుగుతూ వస్తున్న ధరలు వినియోగ దారులను నిరాశ పరుస్తున్నాయి. దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా కూడా పసిడి, వెండి ధరలు పరుగందుకున్నాయి. హైదరాబాద్లో బంగారం ధరలు(ఆగస్టు 24,గురువారం) 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.220 పెరిగి రూ.59,450 ధరకు చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల పది గ్రాముల ధర రూ.200 పెరిగి రూ.54,500 పలుకుతోంది. ఇక వెండి అయితే ఏకంగా 1500 రూపాయలు ఎగిసి తిరిగి 80వేల రూపాయిల స్థాయికి చేరుకుంది. దాదాపు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరోవైపు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి కూడా జోరందుకుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగార ధరల కోసం ఇక్కడ క్లిక్ చేయండి! గ్లోబల్గా ఎలా ఉన్నాయంటే.. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1922 డాలర్ల దగ్గర ఘుంది. అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధర 24 డాలర్లకు ఎగువన 24.26 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. -
అద్భుతమైన రియల్మీ స్మార్ట్ఫోన్లు వచ్చేశాయ్.. ఫీచర్లు చూస్తే ఫిదా!
Realme11 5G Realme11 X 5G: చైనా స్మార్గ్ఫోన్ దిగ్గజం రియల్మీ సరికొత్త స్మార్ట్ఫోన్స్ను లాంచ్ చేసింది. రియల్మీ 11 సిరీస్లో రెండు స్మార్ట్ఫోన్స్ను తీసుకొచ్చింది. రియల్మీ 11 5జీ (Realme 11 5G), రియల్మీ 11ఎక్స్ 5జీ (Realme 11X 5G) పేరుతో తాజాగా ఆవిష్కరించింది. వీటితో పాటు రియల్మీ బడ్స్ ఎయిర్ 5, రియల్మీ బడ్స్ ఎయిర్ 5 ప్రో ట్రూ వైర్లెస్ స్టీరియో ఇయర్పోన్స్ని కూడా తీసుకొచ్చింది. రియల్మీ 11 5జీ ధరను రూ.20 వేల లోపు ధరను నిర్ణయించగా, రియల్మీ 11ఎక్స్ 5జీ మొబైల్ రూ.15 వేల బడ్జెట్ ధరగా నిర్ణయించడం గమనార్హం. రియల్మీ 11ఎక్స్ 5జీ,ధరలు, లభ్యత రియల్మి 11ఎక్స్ 5జీ స్మార్ట్ఫోన్ రెండు వేరియంట్లలో లాంఛ్ అయింది. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999. మిడ్నైట్ బ్లాక్, పర్పుల్ డాన్ కలర్స్లో లభ్యం.. ఆగస్ట్ 30న సేల్ ప్రారంభం. ఎస్బీఐ , హెచ్డీఎఫ్సీ కార్డుతో కొంటే రూ.1,500 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. రియల్మీ 11ఎక్స్ 5జీ ఫీచర్లు 6.72-అంగుళాల డిస్ప్లే MediaTek డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 13 1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్ 64+2ఎంపీ డ్యూయల్ రియర్కెమెరా 8ఎంపీ సెల్ఫీ కెమెరా 6/8జీబీర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 5000mAhబ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్ రియల్మి 11 5జీ ధర, లభ్యత Realme 11 5G ప్రారంభ ధర రూ. 8 జీబీ ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ 18,999. 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 19,999. గ్లోరీ గోల్డ్ , గ్లోరీ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభ్యం. ఆగస్ట్ 29 నుండిసేల్. రియల్మీ 11 5జీ ఫీచర్లు 6.72-అంగుళాల డిస్ప్లే MediaTek డైమెన్సిటీ 6100+ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 132400x1080 పిక్సెల్స్ రిజల్యూషన్ 108 ఎంపీ+2 ఎంపీ రియర్ డ్యూయల్కెమెరా 16 ఎంపీ సెల్ఫీకెమరా 8జీబీ స్టోరేజ్, 128, 256జీబీ స్టోరేజ్ 5000mAh బ్యాటరీ 67W ఫాస్ట్ ఛార్జింగ్ రియల్మీ బడ్స్ ఎయిర్5: రూ.200 తగ్గింపుతో కేవలం రూ.3,499కే సొంతం చేసుకోవచ్చు. తొలి సేల్ ఆగస్టు 26, మధ్యాహ్నం 12 గంటలకు Experience the #realme11x5G and upgrade your style game. 🚀 With lightning-fast speed and unbeatable features, get ready to take the leap. Starting at ₹13,999/-* Early bird sale will be live today at 6PM. Know more: https://t.co/pfnyKqBsVD#LeapUpWith5G pic.twitter.com/nhroIFytf1 — realme (@realmeIndia) August 23, 2023 /> -
రియల్మి ఏ2+ కొత్త వేరియంట్: ధర చూస్తే ఇంప్రెస్ అవుతారు!
Redmi A2+ 128GB Storage చైనా స్మార్ట్ఫోన్ మేకర్ రెడ్మీ సరికొత్త స్మార్ట్ఫోన్ వేరియంట్ను లాంచ్ చేసింది. రెడ్మి ఏ2+లో కొత్త ర్యామ్, స్టోరేజ్ వేరియంట్ను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. ఇది ఈ ఏడాది మార్చిలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. కొత్తగా ఇపుడు 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్కాన్ఫిగరేషన్లో తీసుకొచ్చింది. MediaTek Helio G36 SoC , 5,000mAH బ్యాటరీ,మెమరీ ఫ్యూజన్ టెక్నాలజీతో లాంచ్అయింది. ఇది గరిష్టంగా 32 రోజుల స్టాండ్బై సమయాన్ని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. ధర, ఆఫర్ 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్రెడ్మి ఏ2+ వేరియంట్ ధర ఎంఐడాట్కామ్లో రూ.8,499గా ఉంది. అయితే ప్రస్తుతం పరిచయ ఆఫర్గా ప్రస్తుతం రూ. 7,999గా కొనుగోలు చేయవచ్చు. ఇది క్లాసిక్ బ్లాక్, సీ గ్రీన్ , ఆక్వా బ్లూ రంగులలో లభ్యం. రెడ్మి ఏ2+ స్పెసిఫికేషన్స్ 120Hz టచ్ శాంప్లింగ్ రేట్తో 6.52-అంగుళాల HD+ LCD డిస్ప్లే 1600 x 720 పిక్సెల్స్రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 13 8మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ , QVGA కెమెరాతో AI-బ్యాక్డ్ డ్యూయల్ రియర్ కెమెరా 5ఎంపీ ఫ్రంట్ కెమెరా సెన్సార్ 5,000mAh బ్యాటరీ -
షాకిస్తున్న వెండి, బంగారం ధరలు
Today Gold and Silver Prices:తగ్గినట్టే తగ్గి వినియోగదారులను ఊరించిన వెండి,బంగారం ధరలు పరుగందుకున్నాయి. దాదాపు గత రెండు నెలలుగా స్తబ్దుగా ఉన్న గోల్డ్ ధరల క్రమంగా వేగం పుంజుకుంటోంది. ముఖ్యంగా పవిత్రశ్రావణమాసం సందడి నేపథ్యంలో దేశీయంగా వెండి బంగారం ధరలు ఊపందుకున్నాయి. తులం బంగారంపై ఏకంగా రూ.60 మేర పెరిగి షాక్ ఇచ్చింది. అటు మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం , వెండి ధరలు రెండూ పెరిగాయి. (ఎక్స్ టేకోవర్: ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు,అసలేం జరుగుతోంది?) 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.50 పెరిగి రూ.54,200 పలుకోంది.ఇక 24 క్యారెట్ల బంగారం ధర10 గ్రాములకు రూ.60 పెరిగి రూ. 59,130కి చేరుకుంది. ఇక వెండి ధర అయితే ఏకంగా 1500 జంప్చేసింది. ప్రస్తుతం కిలో వెండిరూ.78000 చేరుకుంది. దాదాపు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా కూడా పసిడి ధరలు లాభాల్లోనే ఉన్నాయి. ఔన్స్ ధర 1,902.96డాలర్ల వద్ద ఉంది. (యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రొ: భారీ తగ్గింపు ) -
హానర్ లవర్స్కు గుడ్ న్యూస్: స్మార్ట్ఫోన్లు వచ్చేస్తున్నాయ్!
Honor Comeback: హానర్ బ్రాండ్ స్మార్ట్ఫోన్లు మళ్లీ భారత్ మార్కెట్లోకి రానున్నాయి. చైనా స్మార్ట్ డివైజెస్ సంస్థ హానర్ నుంచి లైసెన్సు పొందిన హానర్టెక్ కంపెనీ వీటిని సెపె్టంబర్లో ప్రవేశపెట్టే ప్రయత్నాల్లో ఉంది. ఈ వ్యాపారానికి సంబంధించి రూ. 1,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. హానర్టెక్ సీఈవో మాధవ్ సేథ్ ఈ విషయాలు వెల్లడించారు. వచ్చే ఏడాది ఆఖరు నాటికి 4-5 శాతం మార్కెట్ వాటాను దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంటున్నట్లు, తద్వారా రూ. 10,000 కోట్లు ఆదాయం సాధించే అవకాశాలు ఉన్నట్లు ఆయన వివరించారు. హానర్టెక్ పూర్తిగా భారత సంస్థ అని, హానర్ నుంచి తీసుకున్న లైసెన్సుతో ఇక్కడే తయారీ నుంచి అమ్మకాల కార్యకలాపాలు నిర్వహించనున్నామని సేథ్ చెప్పారు. చైనా టెలికం దిగ్గజం హువావే అప్పట్లో హానర్ బ్రాండ్ను ప్రవేశపెట్టింది. ఆ తర్వాత 2020లో మరో చైనా సంస్థకు దాన్ని విక్రయించింది. మరోవైపు, రియల్మి అంతర్జాతీయ వ్యాపారానికి సారథ్యం వహిస్తున్న సేథ్ ఇటీవలే దాన్నుంచి తప్పుకున్నారు. వ్యాపారవేత్త సీపీ ఖండేల్వాల్కి చెందిన పీఎస్ఏవీ గ్లోబల్తో కలిసి హానర్టెక్ను జాయింట్ వెంచర్గా ఏర్పాటు చేశారు. -
ఈ-స్కూటర్ కొనాలనుకుంటున్నారా? అయితే మీకో ఆఫర్
Bajaj Chetak Electric Scooter Price Cut: దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో టూవీలర్ దిగ్గజం బజాజ్ ఆటో కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ల సెగ్మెంట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈక్రమంలో ఈ ఏడాది మార్చిలో బజాజ్ ఆటో రెండు వేరియంట్లలో అప్డేట్ చేసిన 2023 చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రకటించింది. తాజాగా తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. చేతక్ఈవీ ధరలను తగ్గించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. బేస్ చేతక్ ధర రూ.1.22 లక్షలు కాగా, ప్రీమియం వేరియంట్ ధర రూ.1.52 లక్షలు. అయితే ఇప్పుడు, బేస్ వేరియంట్ నిలిపి వేసింది. అలాగే ప్రీమియం వేరియంట్ ధర రూ. 22 వేల తగ్గింపును అందిస్తోంది. దీని ప్రకారం రూ. 1.3 లక్షల (ఎక్స్-షోరూమ్)గా ఉండనుంది. అయితే ఈ ఆఫర్ ఎప్పటివరకు అందుబాటులో ఉంటుందనే వివరాలు అందుబాటులో లేవు. (టెక్ దిగ్గజం ఇంటెల్ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్) బజాజ్ చేతక్ ఇ-స్కూటర్ ఫీచర్లు చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రష్లెస్ DC మోటార్తో ఆధారితంగా 60.3Ah కెపాసిటీ కలిగిన లిథియం-అయాన్ బ్యాటరీతో. ఇది 4.08 kW గరిష్ట శక్తిని16 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. బ్యాటరీని 5 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. దీన్ని కేవలం ఒక గంటలో 25 శాతం ఛార్జ్ చేయవచ్చు. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎల్ఈడీ లైటింగ్, ఆల్-కలర్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, యాప్ ఆధారిత నోటిఫికేషన్లు, స్మార్ట్ఫోన్ కనెక్టివిటీని పొందుతుంది. హార్డ్వేర్ పరంగా, ఇది సింగిల్-సైడ్ ఫ్రంట్ సస్పెన్షన్, రియర్ మోనోషాక్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ,రియర్ డ్రమ్ బ్రేక్స్ లాంటివి ఉన్నాయి.2023 బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రీమియమ్ ఎడిషన్ వెర్షన్ మూడు రంగులలో లభిస్తుంది. (వరుసగా నాలుగో వారం క్షీణించిన బంగారం ధర..కానీ!) -
23 కొత్త ఫీచర్లతో హ్యుందాయ్ వెన్యూ నైట్ ఎడిషన్, ధర ఎంతంటే?
Hyundai Venue Knight Edition హ్యుందాయ్ తన కస్టమర్ల కోసం స్పెషల్ ఎడిషన్ను లాంచ్ చేసింది. 23 కొత్త ఫీచర్లతో హ్యుందాయ్ వెన్యూ నైట్ ఎడిషన్ భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ప్రారంభ దరను రూ. 9.99 లక్షల (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. టాప్ వేరియంట్ ఎడిషన్ ధర రూ. 13.48 లక్షలుగా ఉంటుంది. స్పెషల్ ఎడిషన్ SUV S(O) , SX వేరియంట్లకు మాన్యువల్ ట్రాన్స్మిషన్తో 1.2 l కప్పా పెట్రోల్ ఇంజన్ అమర్చింది. SX(O) వేరియంట్ కోసం 6MT, 7DCTతో 1.0 l T-GDi పెట్రోల్ ఇంజన్తో అందుబాటులో ఉంది. వెన్యూ నైట్ ఎడిషన్ 4 మోనోటోన్ , 1 డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. అబిస్ బ్లాక్, అట్లాస్ వైట్, టైటాన్ గ్రే, ఫియరీ రెడ్ అండ్ ఫియరీ రెడ్ విత్ అబిస్ బ్లాక్ కలర్స్లో కొత్త వెన్యూ నైట్ ఎడిషన్ లభ్యం. హ్యుందాయ్ వెన్యూ నైట్ ఎడిషన్ 23 ప్రత్యేక ఫీచర్లను అందిస్తోంది. ముఖ్యంగా బ్లాక్ పెయింటెడ్ ఫ్రంట్ గ్రిల్, హ్యుందాయ్ లోగో, బ్రాస్ కలర్ ఫ్రంట్ అండ్ రియర్ బంపర్ ఇన్సర్ట్లు, ఫ్రంట్ వీల్స్పై బ్రాంచ్ కలర్ ఇన్సర్ట్లు, బ్రాంచ్ రూఫ్ రైల్ ఇన్సర్ట్లు, డార్క్ క్రోమ్ రియర్ హ్యుందాయ్ లోగో,వెన్యూ ఎంబ్లం, నైట్ ఎంబ్లం, బ్లాక్ ఉన్నాయి. పెయింట్ చేయబడిన రూఫ్ రెయిల్లు, షార్క్-ఫిన్ యాంటెన్నా, ORVMలు, రెడ్ కలర్ ఫ్రంట్ బ్రేక్ కాలిపర్లు, బ్లాక్ పెయింటెడ్ అల్లాయ్ వీల్/వీల్ కవర్, బ్లాక్ ఫ్రంట్ అండ్ రియర్ స్కిడ్ ప్లేట్లతో పాటు బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ ప్రధానంగా ఉన్నాయి. వెన్యూ నైట్ ఎడిషన్ 82 bhp 1.2-లీటర్ పెట్రోల్ ఇంజీన్, 118 bhp 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ రెండింటితో అందుబాటులో ఉంది. స్టాండర్డ్ వెన్యూ , వెన్యూ ఎన్-లైన్ లా కాకుండా, టర్బో-పెట్రోల్ యూనిట్ మాన్యువల్ గేర్బాక్స్తో కొత్త ఎడిషన్ తీసుకొచ్చింది. స్టాండర్డ్ వేరియంట్లు iMTని పొందుతాయి. ఇది 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్బాక్స్తో కూడా ఎంపిక చేసుకోవచ్చు. ఇక ఇంటీరియర్ల విషయానికి వస్తే, హ్యుందాయ్ వెన్యూ నైట్ ఎడిషన్ బ్రాస్ కలర్ ఇన్సర్ట్లతో బ్లాక్ ఇంటీరియర్, బ్రాస్ కలర్ హైలైట్లతో ప్రత్యేకమైన బ్లాక్ సీట్ అప్హోల్స్టరీ, డ్యుయల్ కెమెరాతో డాష్క్యామ్, స్పోర్టీ మెటల్ పెడల్స్, ECM IRVM , 3D డిజైనర్ మ్యాట్లను పొందుపర్చింది. టాటా నెక్సాన్, మారుతి బ్రెజ్జా, కియా సోనెట్, రెనాల్ట్ కిగర్ మరియు నిస్సాన్ మాగ్నైట్ వంటి వాటికి గట్టి పోటీ ఇవ్వనుంది. -
బడ్జెట్ ధరలో అద్భుతమైన మోటో ఈ13 స్మార్ట్ఫోన్: స్పెషాల్టీ ఏంటంటే?
Motorola Launched 'moto e13' మోటరోలా సరికొత్త మొబైల్ను లాంచ్ చేసింది. మోటో ఈ13 పేరుతో కొత్త స్మార్ట్ఫోన్ను ప్రకటించింది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్లో తీసుకొచ్చింది. సంస్థ అధికారిక వెబ్సైట్తోపాటు, ఆగస్టు 16 నుండి ఫ్లిప్కార్ట్, ప్రముఖ రిటైల్ స్టోర్లు బడ్జెట్ ధరలో లభించ నుంది. కాస్మిక్ బ్లాక్, అరోరా గ్రీన్, క్రీమీ వైట్ అనే మూడు రంగుల్లో రూ. 8,999కి అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. అద్భుతమైన టెక్నాలజీ, పెర్ఫామెన్స్తో దీన్ని తీసుకొచ్చినట్టు తెలిపింది. ఈ స్మార్ట్ఫోన్ లోని ఏఐ పవర్డ్ కెమెరా "ఆటో స్మైల్ క్యాప్చర్ వంటి ఇంటెలిజెంట్ ఫీచర్తో పర్ఫెక్ట్ షాట్ను తీయడంతోపాటు, ఫేస్ బ్యూటీ , పోర్ట్రెయిట్ మోడ్ మీ ఫోటోలను స్వయంచాలకంగా మెరుగుపరుస్తాయని స్మార్ట్ఫోన్ మేకర్ వెల్లడించింది. మోటో ఈ13 స్పెసిఫికేషన్స్ 6.5-అంగుళాల IPS LCD డిస్ప్లే UNISOC T606 ఆక్టా-కోర్ ప్రాసెసర్ ప్రీమియం యాక్రిలిక్ గ్లాస్ (PMMA) బాడీ Dolby Atmos ఆడియో 13 ఎంపీ ఏఐ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 5000mAh బ్యాటరీ, 10W ఛార్జింగ్ సపోర్ట్ -
ఐకూ నుంచి జెడ్7 ప్రో 5జీ, కమింగ్ సూన్
న్యూఢిల్లీ: స్మార్ట్ఫోన్ బ్రాండ్ ఐకూ కొత్తగా జెడ్7 ప్రో 5జీ ఫోన్ను ఆగస్టు 31న ఆవిష్కరించనుంది. ఈ-కామర్స్ పోర్టల్ అమెజాన్లో ఇది అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 మొబైల్ ప్లాట్ఫాం, 3డీ కర్వ్డ్ సూపర్ విజన్ అమోలెడ్ డిస్ప్లే, 64 ఎంపీ కెమెరా తదితర ఫీచర్లు ఇందులో ఉన్నట్లు వివరించింది. 8జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వెర్షన్లలో లభ్యం. ఫీచర్లు 6.78-అంగుళాల కర్వ్డ్ AMOLED డిస్ప్లే 4nm MediaTek డైమెన్సిటీ 7200 SoC 64 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా 2 మెగాపిక్సెల్ సెకండరీ షూటర్తో 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 4,600mAh బ్యాటరీ 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇది కూడా చదవండి: గుడ్ఇయర్ భాగస్వామ్యంతో అష్యూరెన్స్ బ్యాటరీలు న్యూఢిల్లీ: టైర్ల తయారీ సంస్థ గుడ్ఇయర్ టైర్ అండ్ రబ్బర్ కంపెనీ నుంచి తీసుకున్న అధికారిక లైసెన్సు కింద అష్యూరెన్స్ ఇంటర్నేషనల్ కొత్త ఫిల్టర్లు, బ్యాటరీల శ్రేణిని ఆవిష్కరించింది. వీటిని భారత్లోనే తయారు చేయనున్నట్లు సంస్థ తెలిపింది. దేశీయంగానే కాకుండా దక్షిణాసియా, ఆగ్నేయాసియా, ఆ్రస్టేలియా న్యూజిలాండ్ మార్కెట్లలో విక్రయించనున్నట్లు వివరించింది. ఆగస్టు ఆఖరు నాటికి ఈ బ్యాటరీలు, ఫిల్టర్లు మార్కెట్లోకి రాగలవని అష్యూరెన్స్ ఇంటర్నేషనల్ పేర్కొంది. -
గుడ్ న్యూస్: అమెరికా షాక్, దిగొస్తున్న పసిడి
Today Gold and silver Price: దేశంలో పసిడి ధరలు శుక్రవారం కూడా తగ్గుముఖం పట్టాయి. గురువారం రూ. 250 తగ్గిన పసిడి ఈ రోజు మరింత దిగి వచ్చింది. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ. 54,550 వద్ద ఉంది. గురువారం ఈ ధర రూ. 54,700గా ఉన్న సంగతి తెలిసిందే. ఇక 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి రూ.59, 510 గా ఉంది. దాదాపు ఉభయ రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో విలువైన మెటల్ వెండి ధరలు కూడా దిగివస్తున్నాయి. స్వల్పంగా పడి కిలో వెండి ధర రూ.76200 వద్ద కొనసాగుతుంది. (లగ్జరీ ఎస్టేట్ కొనుగోలు చేసిన జెఫ్ బెజోస్: ప్రియురాలి కోసమేనా?) అంతర్జాతీయంగానూ వెండి,బంగారం ధరలు వెనకడుగువస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు ఆశాజనకంగా ఉండటంతో గురువారం పెరిగిన ధరలు నేడు దిగివ చ్చాయి. ఎంసీక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ (అక్టోబర్ 5) చివరి లెక్కన 10 గ్రాములకు రూ. 58,810 వద్ద స్థిరంగా ఉంది. వెండి ఫ్యూచర్స్ (సెప్టెంబర్ 5) 0.12 శాతం లేదా రూ.86 తగ్గి కిలో రూ.69,895 వద్ద ఉంది.గోల్డ్ ఆగస్ట్ ఫ్యూచర్స్ను రూ. 59,200 స్టాప్ లాస్తో రూ. 59,950 వద్ద విక్రయించాలని ఎనలిస్టులు సూచిస్తున్నారు. అయితే జూలై డేటా ప్రకారం అమెరికా వినియోగదారుల ధరలు మధ్యస్తంగా ఉన్నాయి. గురువారం బంగారం ధరలు పెరిగాయి. అలాగే ఫెడ్ వడ్డీ వడ్డనలో కాస్త ఉపశమనం లభిస్తుందనే అంచనాలున్నాయి. సీపీఐ నెమ్మదిగా తగ్గుతూ ఉండటంతో, ముఖ్యంగా సెప్టెంబర్ రివ్యూలో వడ్డీ రేట్లను పెంపు ఉండకపోవచ్చని హై రిడ్జ్ ఫ్యూచర్స్ మెటల్స్ ట్రేడింగ్ డైరెక్టర్ డేవిడ్ మెగర్ అన్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లోని బంగారం ధరలకోసం ఇక్కడ క్లిక్ చేయండి మరోవైపు దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 312 కుప్పకూలి 65, 365 వద్ద ఉండగా,నిఫ్టీ 99 పాయింట్ల నష్టంతో 19,444 వద్ద కొనసాగుతోంది. -
శ్రావణ శుక్రవారం వచ్చేస్తోంది: దిగొస్తున్న బంగారం, వెండి ధరలు
Today Gold and Silver Price: దేశంలో వెండి, బంగారం ధరల్లో ఒడిదుడుకులు కొనసాగుతున్నాయి. బుధవారం బంగారం, వెండి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్మార్కెట్ పసిడి ధర 22 క్యారెట్ల 10 గ్రాములకు 100 రూపాయలకుతగ్గి, 54,950వద్ద ఉంది. తద్వారా 55వేల దిగువకు చేరింది. ఇక 24 క్యారెట్ల 10గాముల బంగారం ధర 110రూపాయలు క్షీణించి 59,950 వద్ద ఉంది. వెండి ధర కూడా అదే బాటలోఉంది. కిలో వెండి ధర రూ.600 క్షీణించి రూ. 76,700 వద్ద ఉంది. (HBDMaheshBabu: మహేష్బాబు నెట్వర్త్, లగ్జరీ కార్లు,ఖరీదైన జెట్, ఈ విషయాలు తెలుసా?) మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో వరుసగా రెండు రోజులు భారతీయ మార్కెట్లో దిగువన ఉన్న ధరలు (ఆగస్టు 9 బుధవారం) బంగారం వెండి ధరలు రెండూ పెరిగాయి. అక్టోబరు 5, 2023న మెచ్యూర్ అయ్యే గోల్డ్ ఫ్యూచర్స్ MCXలో రూ. 82 పెరిగి 10 గ్రాములకు రూ.59,347గా ఉంది. అదేవిధంగా, సెప్టెంబర్ 5, 2023న మెచ్యూర్ అయ్యే వెండి ఫ్యూచర్స్ కూడా రూ. 309 లేదా 0.44 శాతం పెరిగి MCXలో కిలోకు రూ. 70,538 వద్ద ట్రేడవుతున్నాయి. (దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు రేటింగ్స్ ఏజెన్సీ మూడీస్ యూఎస్ వృద్ధ రేటును డౌన్గ్రేడ్ గ్లోబల్గా బంగారం ధరలు మునుపటి సెషన్లోని నెల కనిష్టంనుంచి తిరిగి పుంజుకున్నాయి. తాజా మెటల్ నివేదిక ప్రకారం, స్పాట్ బంగారం 0345 GMT నాటికి ఔన్స్కు 0.3 శాతం పెరిగి 1,929.99 డాలర్ల వద్ద ఉంది. అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ 0.2 శాతం పెరిగి 1,963.80 డాలర్ల వద్ద ఉన్నాయి. -
హోండా కొత్త బైక్ ఎస్పీ160: ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే!
Honda SP160 ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హోండా మోటార్సైకిల్, స్కూటర్ ఇండియా భారత మార్కెట్లో సరికొత్త బైక్ ఎస్పీ160 విడుదల చేసింది. ఇది హోండా యునికార్న్ , హోండా X-బ్లేడ్ తర్వాత 160cc విభాగంలో ఇది మూడో మోడల్. వీటి ఎక్స్షోరూంలో ధర రూ.1.17 లక్షల నుండి ప్రారంభం. రెండు ట్రిమ్స్, ఆరు రంగుల్లో లభిస్తుంది. 13 బీహెచ్పీ పవర్, 14.58 ఎన్ఎం టార్క్తో 162 సీసీ ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ ఇంజన్, ఫ్లాషింగ్ ఇండికేటర్ లైట్స్, పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్, సింగిల్ చానెల్ యాంటీ లాక్ బ్రేక్ సిస్టమ్, ఎల్ఈడీ హెడ్ల్యాంప్, స్పోర్టీ మఫ్లర్ వంటి హంగులు ఉన్నాయి. 3 ఏళ్లు స్టాండర్డ్, ఏడేళ్లు ఆప్షనల్ వారంటీ ఉంది. వేరియంట్ వారీగా హోండా ఎస్పీ160 ధరలు (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ) సింగిల్ డిస్క్ - రూ. 1,17,500 డ్యూయల్ డిస్క్ - రూ. 1,21,900 -
బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే షాకవుతారు!
Today Gold and Silver Rate: దేశీయంగా గత రెండు మూడు రోజులుగా తగ్గుముఖం పట్టిన పసిడి ధర శనివారం బులియన్ మార్కెట్లో మళ్లీ ఎగిసాయి. అటు వెండి ధర కూడా మళ్లీ పరుగందుకుంది. అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు ఊపందుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.55,310 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,310 వద్ద కొనసాగుతున్నది. (అంత లేదు...నేనూ సంపాదిస్తున్నా: మండిపడిన సమంత) హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 200 ఎగిసి రూ.55150 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర 210 రూపాయలు పుంజుకని 60,160గా పలుకుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక వెండి ధర విషయానికి వస్తే కొనుగోలు దారులకు షాక్ తగిలింది. ఏకంగా 300 రూపాయలు ఎగిసి కిలోవెండి 78500గా ఉంది. గ్లోబల్గా ఔన్స్ బంగారం ధర పుంజుకుంది .యూఎస్ జాబ్ డేటా అమెరికన్ డాలర్, బాండ్ ఈల్డ్స్ క్షీణత అని బులియన్ వర్గాలు భావిస్తున్నాయి. (మహిళల రికార్డ్: వారి టార్గెట్ పక్షి కన్నే, గర్వంగా ఉంది: ఆనంద్ మహీంద్ర ప్రశంసలు) ఇదీ చదవండి: తండ్రికే షాకిస్తున్న ఇషా: మురిసిపోతున్న అంబానీ -
ఇక ఉల్లి కూడా..ఈ నెలాఖరుకు: క్రిసిల్ షాకింగ్ రిపోర్ట్
Onion prices ఇప్పటికే కొండెక్కి కూచున్న టమాట ధరలు సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి. దీంతో పాటు చింతపండు, వెల్లుల్లి, అల్లంతో పాటు ఇతర కూరగాయలు ధలు కూడా మండిస్తున్నాయి. తాజాగా ఉల్లిపాయ ధరలపై క్రిసిల్ షాకింగ్ రిపోర్ట్ వెలుగులోకి వచ్చింది. ఉల్లి ధరలు కూడా టమాటా బాట పట్టనుందని క్రిసిల్ పరిశోధన వెల్లడించింది. ఆగస్టు నెలాఖరు నాటికి ఉల్లి ధరలు 150 శాతం ఎగిసి కిలో రూ.60/70కి చేరవచ్చని క్రిసిల్ పేర్కొంది. సప్లయ్ కూడా కష్టంగా మారితే ధరలు మరింత అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. (మహిళల రికార్డ్: వారి టార్గెట్ పక్షి కన్నే, గర్వంగా ఉంది: ఆనంద్ మహీంద్ర ప్రశంసలు) శుక్రవారం విడుదల చేసిన అధ్యయనం, ఫిబ్రవరి ,మార్చి 2023లో నమోదైన అమ్మకాల కారణంగా రబీ ఉల్లిపాయల షెల్ఫ్ లైఫ్ ఒకటి నుండి రెండు నెలల వరకు తగ్గిందని ఫలితంగా, గత రబీ సీజన్లోని ఉల్లి నిల్వలు సెప్టెంబర్ కంటేముందే ఆగస్టు నాటికే గణనీయంగా క్షీణించవచ్చని తెలిపింది. ప్రస్తుతం, డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ డేటా ప్రకారం, ఢిల్లీ మార్కెట్లలో ఉల్లిపాయల రిటైల్ ధర కిలోకు సుమారు రూ.30. క్రిసిల్ నివేదిక నిజమైతే, నెలాఖరు నాటికి ధరలు రెట్టింపు కావచ్చు. (పండగ సందడి షురూ: టాటా సీఎన్జీ కార్లు వచ్చేశాయ్!) అయితే దీంతోపాటు ఈ నివేదిక కొన్ని సానుకూల అంశాలను కూడా వెల్లడించింది.ఈ పెరుగుదల 2020లో కనిపించిన గరిష్ట స్థాయిల కంటే తక్కువగానే ఉంటుందని పేర్కొంది. మరీ ముఖ్యంగా, ఖరీఫ్ పంట అక్టోబర్ నుండి మార్కెట్లోకి వచ్చిన తర్వాత ధరలు తగ్గుముఖం పడతాయని భావిస్తున్నారు. అయినప్పటికీ, ఖరీఫ్ ఉల్లి పంట మార్పిడి , పంటను నిర్ణయించడంలో ఆగస్టు , సెప్టెంబర్లలో వర్షపాతం కీలక పాత్ర పోషిస్తుందని నివేదిక హెచ్చరించింది.సెప్టెంబర్లో ఉన్న అధిక ధరలతో పోలిస్తే, పండుగ నెలల్లో (అక్టోబర్-డిసెంబర్) ధరల హెచ్చుతగ్గులు స్థిరంగా ఉంటాయని అంచనా వేస్తోంది" అని నివేదిక స్పష్టం చేసింది. దేశంలో ఉల్లి ప్రస్తుత రిటైల్ ధరలు కిలోకు రూ. 25 వద్ద ఉన్నాయి. -
పండగ సందడి షురూ: టాటా సీఎన్జీ కార్లు వచ్చేశాయ్!
Tata CNG Cars: వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ పండుగ సీజన్ సందడిని స్టార్ట్ చేసింది. కొత్త కార్లతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు సిద్ధమై పోయింది. టాటా ఒకటి కాదు ఏకంగా మూడు సీఎన్జీ కార్లను లాంచ్ చేసింది. పంచ్ i-CNG లాంచ్తోపాటు, ట్విన్-సిలిండర్ టెక్నాలజీతో టిగోర్, టియాగో సీఎన్జీని కూడా అప్డేట్ చేసింది. టాటా పంచ్ ఐ-సీఎన్జీ మైక్రో ఎస్యూవీ పంచ్ సీఎన్జీ వేరియంట్ను ప్రవేశపెట్టింది. హైదరాబాద్ ఎక్స్షోరూంలో ధర రూ.7,09,900 మొదలకుని రూ.9,67,900 వరకు ఉంది. ట్విన్ సిలిండర్ టెక్నాలజీతో 1.2 లీటర్ రివొట్రాన్ సీఎన్జీ ఇంజన్తో రూపుదిద్దుకుంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ పొందుపరిచారు. పెట్రోల్, సీఎన్జీతో నడుస్తుంది. 37 లీటర్ల పెట్రోల్, 60 లీటర్ల సీఎన్జీ ఫ్యూయల్ ట్యాంక్ ఏర్పాటు ఉంది. సీఎన్జీ కేజీకి 26.99 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ తెలిపింది. వాయిస్ అసిస్టెడ్ ఎలక్ట్రిక్ సన్రూఫ్, ఆటోమేటిక్ ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్, 7 అంగుళాల హర్మాన్ ఇన్ఫోటైన్మెంట్, 16 అంగుళాల డైమండ్ కట్ అలాయ్ వీల్స్ వంటి హంగులు ఉన్నాయి. కొత్త టాటా సీఎన్జీ కార్లు టాటా ట్విన్-సిలిండర్ టెక్నాలజీతో టియాగో ఐ-సీఎన్జీని విడుదల చేసింది. ధరల వారీగా, కొత్త టియాగో సిఎన్జి రూ. 7.46 లక్షలలు- రూ. 9.32 లక్షల మధ్య ఉంటుంది. ఆశ్చర్యకరంగా, టాటా మునుపటి సీఎన్జీ మోడల్తో పోలిస్తే కేవలం 5వేలు మాత్రమే ధరను పెంచింది. -
ఎంజీ బుల్లి కామెట్ ఈవీస్పెషల్ గేమర్ ఎడిషన్: ధర పెరిగిందా?
MG unveils Comet EV Gamer Edition ఎంజీ మెటార్ ఇండియా తన బుల్లి ఈవీ కామెట్ లో కొత్త ఎడిషన్ను లాంచ్ చేసింది. ‘గేమర్ ఎడిషన్’గా పేరుతో కామెట్ ఈవీ ఆల్-ఎక్స్క్లూజివ్ స్పెషల్ ఎడిషన్ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఫలితంగా ఈసీ సెగ్మెంట్లో ఇది కస్టమైజ్ చేసిన ఫస్ట్కారుగా నిలిచింది. గేమర్ ఎడిషన్ ట్రిమ్ గేమర్లు, యువ కొనుగోలుదారులే లక్ష్యంగా స్టీరింగ్ వీల్ కవర్, థీమ్డ్ మేట్స్ లాంటి స్పెషల్ యాక్ససరీస్తో ఆకర్ణణీయంగా తీసుకొచ్చింది. (ఇండియాలో అత్యధికంగా అమ్ముడుబోయిన కారు ఇదే: ఎన్ని కార్లు తెలుసా?) కామెట్ ఈవీ బేస్ ధరతో పోలిస్తే ఈ ఎడిషన్ ధర రూ. 64,999 ఎక్కువ. రూ. 8.65 లక్షలతో ఎక్స్క్లూజివ్ గేమర్ ఎడిషన్ ఎంజీ కామెట్ ఈవీ - పేస్, ప్లే, ప్లష్ అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఆసక్తిగల కొనుగోలుదారులు కామెట్ 'గేమర్ ఎడిషన్'ను ఆన్లైన్లో లేదా భారతదేశం అంతటా ఎంజీ డీలర్షిప్లలో బుక్ చేసుకోవచ్చు. (కొత్త సేఫ్టీ ఫీచర్లు, షాకింగ్ ధర: 2023 టయోటా వెల్ఫైర్ ) బోల్డ్, వైబ్రంట్, డైనమిక్ , టెక్నో వైబ్ ప్రేరణగా ఈ కామెట్ EV ఎడిషన్, గేమింగ్లో అడ్రినలిన్ రష్ని ఇష్టపడే Gen Z కోసం డార్క్ అంట్ లైట్ తేలికపాటి థీమ్లలో డార్క్ క్రోమ్, మెటల్ ఫినిషింగ్తో రీసైకిల్ చేయబడిన ప్లాస్టిక్ మెటీరియల్తో స్పెషల్ఎట్రాక్షన్గా ఉంటుందని కంపెనీ చెప్పింది. ఈస్తటిక్ అండ్ డిజైన్ ఓరియంటెడ్గా, గేమింగ్ స్ట్రీమర్, ఇన్ఫ్లుయెన్సర్ మోర్టల్ (నమన్ మాథుర్) సహకారంతో దీన్ని రూపొందించింది. సైడ్ మౌల్డింగ్లు, కార్పెట్ మ్యాట్లు, ఇంటీరియర్ ఇన్సర్ట్లు, బాడీ గ్రాఫిక్స్, స్టీరింగ్ వీల్ కవర్, సీట్ కవర్లు వంటి ప్రత్యేకతలున్నాయి. (శుభవార్త: భారీగా పడిన వెండి, మురిపిస్తున్న పసిడి) ఇంకా డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్లు, ABS +EBD, ఫ్రంట్ & రియర్ 3 pt తోపాటు, సీట్ బెల్ట్లు, వెనుక పార్కింగ్ కెమెరా & సెన్సార్, TPMS (పరోక్ష) , ISOFIX చైల్డ్ సీట్లు లాంటి ఇతర ఫీచర్లున్నాయి. ఎంజీ కామెట్ EV 17.3 KWH Li-ion బ్యాటరీతో 230 కిమీ (క్లెయిమ్) బ్యాటరీ పరిధితో వస్తుంది మరియు దాదాపు 7 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. (టమాటా షాక్: ఇప్పట్లో తగ్గేదే లేదు, కారణాలివిగో..!) కాగా ఎంజీ మోటార్స కామెట్ ఎలక్ట్రిక్ వాహనం ఏప్రిల్ 2023లో భారతదేశంలో లాంచ్ చేసింది. దేశీయంగా ఇదే కాంపాక్ట్కారుగా పాపులర్ అయింది. పేస్ వేరియంట్ కోసం 7,98,000 నుండి (ఎక్స్-షోరూమ్), రూ. ప్లష్ వేరియంట్ కోసం 9,98,000 (ఎక్స్-షోరూమ్)గా ఉన్న సంగతి తెలిసిందే. -
కొత్త సేఫ్టీ ఫీచర్లు, షాకింగ్ ధర: 2023 టయోటా వెల్ఫైర్
New Toyota Vellfire టయోటా ఇండియా తదుపరి తరం వెల్ఫైర్ ఎంపీవీ లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 1.19 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా నిర్ణయించింది. ఇది హై గ్రేడ్, VIP గ్రేడ్ అనే రెండు వేరియంట్లలో లభ్యమవుతుంది. ఎక్స్టీరియర్ స్టైలింగ్, మూడు ఇంటీరియర్ థీమ్లతో పాటు మూడు బాహ్య రంగులను పొందుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్లో వస్తుందని భావిస్తున్న వెల్ఫైర్ను ఊహించిన దానికంటే ముందుగానే ప్రారంభించింది. ధరలు హాయ్ గ్రేడ్ రూ. 1.20 కోట్లు, ఎగ్జిక్యూటివ్ లాంజ్ ప్యాకేజీతో VIP గ్రేడ్ రూ. 1.30 కోట్లుగా ఉండనుంది. వెల్ఫైర్ ఇంజన్: 2.5-లీటర్ 4 సిలిండర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్, 190bhp , 240Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది 19.28kpl మైలేజీ ఇస్తుందని టయోటా పేర్కొంది.వెల్ఫైర్ కొత్త TNGA-K ప్లాట్ఫారమ్ ద్వారా మద్దతునిస్తుంది 2023 వెల్ఫైర్ ఇంటీరియర్ అప్డేట్ క్యాబిన్ సన్సెట్ బ్రౌన్, బ్లాక్ , న్యూట్రల్ లేత గోధుమరంగు థీమ్లలో ఉంటుంది. డ్యాష్బోర్డ్ ఇప్పుడు Apple CarPlay మరియు Android Autoతో పాటు JBL నుండి 15-స్పీకర్ సౌండ్ సిస్టమ్తో పెద్ద 14-అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ జోడించిది. రెండవ-వరుస లాంజ్ సీట్లు మసాజ్ సీట్లు, పవర్డ్ పుల్-డౌన్ సైడ్ సన్ బ్లైండ్లు అమర్చింది. కొత్త టయోటా వెల్ఫైర్ డిజైన్ విషయానికి వస్తే అవుట్గోయింగ్ మోడల్తో పోలిస్తే కొత్త వెల్ఫైర్ డిజైన్ పెద్దగా మారలేదు. టయోటా లోగో స్ప్లిట్ హెడ్ల్యాంప్, సిక్స్-స్లాట్ గ్రిల్ మధ్యలో ఉంటుంది.హెడ్ల్యాంప్ల దిగువ భాగంలో LED డేటైమ్ రన్నింగ్ ల్యాంప్లు ఉంటాయి. U-ఆకారపు క్రోమ్ స్ట్రిప్ రెండు హెడ్ల్యాంప్లను కలుపుతూ బంపర్ ఉంటుంది. మిడ్-లైఫ్ అప్డేట్గా క్రోమ్ , స్లీకర్ LED హెడ్ల్యాంప్లతో కూడిన పెద్ద ఫ్రంట్ గ్రిల్ అమర్చింది. స్లైడింగ్ రియర్ పవర్ డోర్లు , ఫ్లాట్ రూఫ్లైన్లో ఎలాంటి మార్పు లేదు, 2023 వెల్ఫైర్ సేఫ్టీ ఫీచర్లు ఆరు ఎయిర్బ్యాగ్లు, 360-డిగ్రీ కెమెరా , హిల్-అసిస్ట్ కంట్రోల్తో పాటు, వెల్ఫైర్ లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ మానిటర్ , హై బీమ్ అసిస్ట్ వంటి ADAS ఫీచర్లనులాంటివి కొత్త అప్డేట్స్గా ఉన్నాయి. ముందస్తు బుకింగ్లను కంపెనీ ఇప్పటికే షురూ చేసింది. రపండుగ సీజన్లో భారతదేశంలో వాహన డెలివరీలు ప్రారంభమవుతాయని ప్రకటించింది. దేవీయ మార్కెట్లో దీని పోటీ గురించి ఆలోచిస్తే కొత్త Lexus LM లాంచ్ అయ్యేవరకు వెల్ఫైర్కి భారత మార్కెట్లో ఎలాంటి పోటీ ఉండదు. -
ఇండియాలో అత్యధికంగా అమ్ముడుబోయిన కారు ఇదే: ఎన్ని కార్లు తెలుసా?
Maruti Alto: మారుతీ సుజుకి ఆల్టో మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. గత రెండు దశాబ్దాలలో 45 లక్షల యూనిట్లకు పైగా అమ్ముడై భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా అవతరించింది. తమ ఆల్టో దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమలో చారిత్రాత్మక మైలురాయిని చేరుకుందని మారుతి సుజుకి ప్రకటించింది. ఆల్టో బ్రాండ్ ఎంట్రీ లెవల్ హ్యాచ్బ్యాక్ సెగ్మెంట్లో వివిధ మోడళ్లున్న సంగతి తెలిసిందే. గడచిన 23 ఏళ్లలో 45 లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడై ఆల్టో అత్యధికంగా అమ్ముడైన కారుగా అవతరించిందని మారుతి పేర్కొంది. కీలకమైన మైలు రాయిని అధిగమించినందుకు సంతోషంగా ఉందన్న మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ & సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ వినియోగదారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆల్టో అద్భుతమైన ప్రయాణం చాలా గర్వంగా ఉంది. 45 లక్షల కస్టమర్ మైలురాయి అంటే ఇప్పటి వరకు ఏ ఇతర కార్ బ్రాండ్ సాధించలేని ఘనత అని అన్నారు. (టమాటా షాక్: ఇప్పట్లో తగ్గేదే లేదు, కారణాలివిగో..!) దేశంలో మారుతి ఆల్టో 2000 సంవత్సరంలో లాంచ్ అయింది. 2010లో మారుతి ఆల్టో కె10, ఆల్టో సిఎన్జిలను విడుదల చేసింది. 2012 నాటికి 20 లక్షల యూనిట్లకు పైగా విక్రయించింది. 2012 సంవత్సరంలో ఆల్టో 800ని విడుదల చేసింది, ఆ తర్వాత రెండు సంవత్సరాల తర్వాత రెండో తరం ఆల్టో కె10ని విడుదల చేసింది. 2016లోఆల్టో 30 లక్షల అమ్మకాల సంబరాలను జరుపుకుంది. 2020లో అమ్మకాలు 40 లక్షల యూనిట్ల మార్కును అధిగమించాయి. గత ఏడాది కంపెనీ మూడవ తరం ఆల్టో కె10ని భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇది ప్రస్తుతం పెట్రోల్ , సీఎన్జీ పవర్ట్రెయిన్లతో అందుబాటులో ఉంది. (శుభవార్త: భారీగా పడిన వెండి, మురిపిస్తున్న పసిడి) -
శుభవార్త: భారీగా పడిన వెండి, మురిపిస్తున్న పసిడి
Gold And Silver Check Latest Rates: అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు వరుసగా దిగి వస్తున్నాయి. ఆగస్టు 3న దేశవ్యాప్తంగా పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా వెండి ధర భారీ పతనాన్ని నమోదు చేసింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. (టమాటా షాక్: ఇప్పట్లో తగ్గేదే లేదు, కారణాలివిగో..!) హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24క్యారెట్ల బంగారం 160 క్షీణించి 59,950 పలుకుతోంది. 22 క్యారెట్ల పసిడి రూ. 54, 950 వద్ద ఉంది. కిలో వెండి ధర ఏకంగా 1800 రూపాయిలు తగ్గి, రూ. 78500 పలుకుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరల కోసం క్లిక్ చేయండి ఇక దేశ రాజధాని నగరం ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 150 క్షీణించి రూ. 55,100 వద్ద, రూ. 160 పడిన 24 క్యారెట్ల పది గ్రాముల ధర రూ. 60,100గా ఉంది. వెండి ధర కిలోకు 2300 పతనమై రూ. 75,000గా ఉంది. (విమాన ప్రయాణీకులకు బంపర్ ఆఫర్:మెగా సేల్) మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో గురువారం నాడు 10 గ్రాముల రూ. 59,415 వద్ద ప్రారంభమయ్యాయి. ఇంట్రాడేలో రూ. 59,373 వద్ద కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. వెండి కిలోకు రూ.72,696 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లోబంగారం ధరలు ట్రాయ్ ఔన్స్కు దాదాపు 1,937.25 డాలర్లుగా ఉన్నాయి. వెండి ఔన్స్ ధర 23.68 డాలర్లుగా ఉంది. -
టమాటా షాక్: ఇప్పట్లో తగ్గేదే లేదు, కారణాలివిగో..!
ఎక్కడ చూసినా టమాటా మాటలు.. మంటలే.. సూపర్ బ్యాట్మెన్స్తో పోటీపడుతూ సెంచరీ..డబుల్ సెంచరీ.. దాటేసి ట్రిపుల్ సెంచరీ వైపు దూసుకుపోతోంది. ఇప్పటికే అందనంత ఎత్తుకు ఎదిగి సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న టమాట ధరలు ఇంకా పైపైకి దూసుకు పోతున్నాయి. దేశంలో చాలా ప్రాంతాల్లో రూ. 250 స్థాయిని కూడా దాటేసింది. తాజాగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. త్వరలోనే కేజీకి రూ. 300 లకు చేరే అవకాశముంది. (విమాన ప్రయాణీకులకు బంపర్ ఆఫర్:మెగా సేల్) నెల రోజులుగా టమాటా ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో కిలో రూ.300లకు చేరుకుంటుందని హోల్సేల్ వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. టమాట రాక తగ్గడంతో హోల్ సేల్ ధరలు పెరుగుతాయని హోల్ సేల్ వ్యాపారులు తెలిపారు. దాని ప్రభావం చిల్లర ధరల పెరుగుదల కనిపిస్తుందని అంటున్నారు. దీనికి తోడు భారీ వర్షాలుకూడా మరింత అగ్గి రాజేస్తున్నాయి. ఢిల్లీలోని ఆజాద్పూర్ టమోటా అసోసియేషన్ అధ్యక్షుడు, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ) సభ్యుడు అశోక్ కౌశిక్ మాట్లాడుతూ.. గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురియడంతో సాగులో పంట దెబ్బతినడంతో టమోటాల రాక తగ్గింది. అలాగే టమోటాలు, క్యాప్సికం, ఇతర సీజనల్ కూరగాయల విక్రయాలు భారీగా తగ్గిపోవడంతో కూరగాయల హోల్సేల్ వ్యాపారులు నష్టాలను ఎదుర్కొంటున్నారన్నారు. (నితిన్ దేశాయ్ అకాల మరణం: అదే కొంప ముంచింది!) వర్షాలు, సరఫరా,రవాణా ఇబ్బందులు ప్రధానంగా సాగుచేసే ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో నెల రోజులుగా టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఆజాద్పూర్ కూరగాయల మార్కెట్ హోల్సేలర్ సంజయ్ భగత్ “హిమాచల్ ప్రదేశ్లో కొండచరియలు విరిగిపడటం , భారీ వర్షాల కారణంగా, కూరగాయల రవాణాలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. సాగుదారుల నుంచి కూరగాయలు తీసుకురావడానికి సాధారణం కంటే ఆరు-ఎనిమిది గంటలు ఎక్కువ సమయం పడుతోంది. ఫలితంగా ధర పెరగడంతో పాటు, కూరగాయల నాణ్యతపై ప్రభావం పడుతోందన్నారు. మొత్తంగా టమాటా ధర కిలో రూ.300కి చేరడం ఖాయమంటున్నారు. కాగా ధర విపరీతంగా పెరిగిన నేపథ్యంలో జులై 14 నుంచి కేంద్ర ప్రభుత్వం టమాటాలను సబ్సిడీపై విక్రయిస్తోంది. దీని కారణంగా దేశ రాజధాని ఢిల్లీలో చిల్లర ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ, సరఫరా కొరత కారణంగా ధరలు మళ్లీ ఊపందుకున్నాయి. అటు మదర్ డెయిరీ తన ‘సఫాల్ స్టోర్స్’ ద్వారా కిలో రూ.259కి టమాట విక్రయిస్తోంది. -
రూ. 26,399కే యాపిల్ ఐఫోన్14: ఎలా?
Apple iPhone 14 యాపిల్ ఐఫోన్ మరోసారి తగ్గింపు ధరలోఅందుబాటులోకివచ్చింది. ప్రస్తుతం యాపిల్ లైనప్లో చౌక ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ ఐఫోన్ 14. త్వరలోనే ఐఫోన్ 15ను లాంచ్ చేయనున్న తరుణంలో ఐఫోన్ 14పై భారీ తగ్గింపు లభిస్తోంది. ముఖ్యంగా ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ షురూ కానున్న నేపథ్యంలో ఈ తగ్గింపు అందుబాటులోకి రావడం గమనార్హం. దాదాపు రూ. 43,600 వరకు తగ్గింపుతో రూ. 26,399కే ఐఫోన్ 14ను కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం అధికారిక స్టోర్లో రూ. 10,901 తగ్గింపుతో రూ. 68,999 వద్ద లిస్ట్ అయింది. దీనితో పాటు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ , డెబిట్ కార్డ్ EMI లావాదేవీలపై రూ. 4000 తగ్గింపును పొందవచ్చు. అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్, ఇతర ఆఫర్లతో కలిపి ఫ్లిప్కార్ట్ సేల్ కంటే ముందుగా యాపిల్ ఐఫోన్ 14ని కేవలం 26,399 రూపాయలకే పొందవచ్చు. కాగా ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ఆగస్టు 4-9 వ తేదీవరకు కొనసాగనుంది. సేల్ ఫ్లిప్కార్ట్ ప్లస్ సభ్యుల కోసం రేపటి నుండే ప్రారంభం. కాగా యాపిల్ ఐఫోన్14 ప్లస్, ఐఫోన్ 14 ప్రొ, యాపిల్ 14 ప్రో మాక్స్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. యాపిల్ ఐఫోన్ 15 ఈ ఏడాది సెప్టెంబర్ ప్రారంభంలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. (Today August 2nd gold price గుడ్ న్యూస్: దిగొస్తున్న పసిడి, వెండి ధరలు) -
ప్రపంచ వాణిజ్యంలో ఎక్కడున్నాం..?
జూన్ నెలలో దేశ ఎగుమతులు 22 శాతం తగ్గిపోయినట్టు తాజా నివేదికలు చెబుతున్నాయి. గూడ్స్ మార్కెట్లో భారత్ వాటా 2 శాతమే. ఐర్లాండ్ లాంటి చిన్న దేశాల కంటే ఇది తక్కువ. చైనా వాటా ఏకంగా 12.5 శాతం. ప్రపంచంలోని ఏ దేశానికైనా ఇది అత్యధికం. దేశంలోని చాలా పరిశ్రమలు స్థానిక అవసరాలు తీరి వస్తువులు అదనంగా ఉన్నప్పుడు మాత్రమే ఎగుమతుల గురించి ఆలోచిస్తున్నాయి. సహజ సిద్ధంగా ఎగుమతులకు మొగ్గు చూపడం లేదు. దేశం ఏదో ఒక భారీ ప్రాంతీయ వ్యాపార గ్రూపులో భాగంగా లేకపోవడం ఎగుమతులు పెరగకపోవడానికి మరో కారణం. అయితే ఐటీ, వ్యాపార సేవల విషయంలో మాత్రం చాలా మెరుగ్గా ఉన్నాం. ఇది సానుకూలాంశం. విదేశాలతో వ్యాపారం చేయడం భారత్కు చాలా పాతవిద్య. ఆర్థిక వ్యవస్థ గణనీయంగా, వేగంగా క్షీణించిన వలస పాలకుల ఏలుబడిలోనూ చైనా సహా ఇతర ఇరుగు పొరుగు దేశాలతో విదేశీ వ్యాపారాన్ని కొనసాగించిన ఘనత మనది. అయితే శతాబ్దాల విదేశీ వ్యాపార అనుభవమున్నప్పటికీ పలు దశాబ్దాలుగా విదేశీ వ్యాపారం దేశ ఆర్థిక వ్యవస్థలో అతి బలహీనమైన లంకెలా మిగిలిపోయింది. 2022–23లో వర్తకపు సరుకుల ఎగు మతులు 45,000 కోట్ల డాలర్లకు చేరడంతో విదేశీ వ్యాపారం పరిస్థితి కొంత మెరుగైనట్లు కనిపించింది. కానీ ఈ రికార్డు స్థాయి వ్యాపారం కోవిడ్ తదనంతరం అకస్మాత్తుగా పెరిగిన డిమాండ్ వల్లనే అని తేలింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో వ్యాపారం మళ్లీ తగ్గి పోయింది. జూన్ నెలలో ఎగుమతులు 22 శాతం తగ్గిపోయినట్లు తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మంద గమనానికి, అధిక ద్రవ్యోల్బణం, కఠినమైన ద్రవ్య విధానాలకు ఇది నిదర్శనం. అయితే ఇక్కడ ఓ సానుకూల అంశం లేకపోలేదు. సేవల ఎగు మతులు ఇప్పటికీ పెరుగుతున్నాయి. ఈ విషయంలో భారత వాణిజ్యం ప్రతికూల పరిస్థితులను కాదని ముందుకు సాగుతున్నది. సమీప భవిష్యత్తులోనే కాకుండా దీర్ఘకాలంలోనూ ఇదే ధోరణి కొనసాగవచ్చు. సేవల రంగంలో భారత్ భాగస్వామ్యం రికార్డు స్థాయిలో 4.9 శాతానికి చేరుకున్నట్లు మోర్గన్ స్టాన్లీ ఇటీవల విడుదల చేసిన ఓ నివేదిక తెలియజేయడం చెప్పుకోవాల్సిన అంశం. ఇది ప్రధానంగా ఐటీ సేవల (46 శాతం) వల్లనే. దీంతోపాటు వ్యాపార సేవలు కూడా 24 శాతంతో తమదైన ముద్ర వేశాయి. సేవల విషయంలో పరిస్థితి ఇలా ఉంటే, వస్తువుల విషయంలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నం. వస్తువుల ఎగుమతులు అమెరికా, యూరప్ వంటి మార్కెట్ల డిమాండ్లపై అధికంగా ఆధారపడి ఉన్నాయి. గూడ్స్ మార్కెట్లో భారత్ వాటా కేవలం రెండు శాతం మాత్రమే. ఐర్లాండ్ లాంటి చిన్న దేశాల కంటే ఇది తక్కువ. మన పొరుగునే ఉన్న చైనా వాటా ఏకంగా 12.5 శాతం. ఒక దేశానికి సంబంధించి ప్రపంచంలోనే ఇది ఎక్కువ. శేష ప్రశ్నలు ఎన్నో... దేశంలో చెప్పుకోదగ్గ స్థాయిలో పరిశ్రమలు ఉన్నాయి. అంటే అంతర్జాతీయ వాణిజ్యంలో మన పాత్ర పెంచుకునేందుకు అవకాశం ఉంది. అయితే ఎగుమతుల విషయంలో వెనుకబడి ఉండేందుకు కారణాలేమిటి? మొదటిది... దేశీ మార్కెట్ ఒకటి లేకపోవడం. దేశీ మార్కెట్ ఒకటి ఉండి ఉంటే స్థానిక చిన్న, మధ్యతరహా పారిశ్రామిక వేత్తలు ఇక్కడే వ్యాపారం చేసుకునేందుకు వీలు ఏర్పడుతుంది. వ్యయ ప్రయాసలకు ఓర్చి విదేశీ మార్కెట్లను వెతుక్కునే శ్రమ తగ్గుతుంది. దేశంలో కొన్ని పరిశ్రమలు కేవలం ఎగుమతులపైనే దృష్టి పెట్టి పనిచేస్తున్నాయి. వీటిల్లో కొన్ని సంప్రదాయ రంగాలకు చెందినవీ ఉన్నాయి. రెడీమేడ్ గార్మెంట్స్, హస్తకళలు, జ్యువెలరీ, రంగురాళ్లు వంటివి. వీటితోపాటు ఫార్మా, ఇంజినీరింగ్ వస్తువులు, రిఫైన్డ్ నూనె ఉత్పత్తులు కూడా పెద్ద ఎత్తున ఎగుమతి అవుతున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ చాలా పరిశ్రమలు స్థానికంగా మార్కెట్ అవస రాలు తీరి వస్తువులు అదనంగా ఉన్నప్పుడు మాత్రమే ఎగుమతుల గురించి ఆలోచిస్తున్నాయి. ఇంకోలా చెప్పాలంటే స్థానిక పరిశ్రమలు సహజ సిద్ధంగా ఎగుమతులకు మొగ్గు చూపడం లేదన్నమాట. ఎగుమతులు పెరగకపోవడానికి రెండో లోపం... దేశం ఏదో ఒక భారీ ప్రాంతీయ వ్యాపార గ్రూపులో భాగంగా లేకపోవడం. ప్రపంచ వాణిజ్య సంస్థపై మనం చాలాకాలం ఆశలు పెట్టుకున్నాం. ఎదుగు తున్న మార్కెట్లకు కొన్ని లాభాలు అందిస్తుందని ఆశపడ్డాం. ఈ క్రమంలో ప్రాంతీయ లేదా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు చేసుకునే సమయం కాస్తా మాయమైపోయింది. ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగ స్వామ్యం (రీజినల్ కాంప్రహెన్సివ్ ఎకనమిక్ పార్ట్ట్నర్షిప్–ఆర్సీఈపీ) నుంచి వైదొలగాలన్న నిర్ణయం కూడా ఆచితూచి తీసుకున్నదే. ఏదో ఒక దేశం ద్వారా చైనా తన చౌక వస్తువులను దేశంపై గుమ్మరిస్తుందన్న ఆందోళన కూడా ఉండింది. అయినా కూడా... ఇతర ప్రాంతీయ వాణిజ్య గ్రూపుల్లోకి చేరే దిశగా చాలాకాలం క్రితమే ప్రయత్నాలు చేసి ఉండాల్సింది. ఉదాహరణకు... పదకొండు మంది సభ్యులున్న ‘కాంప్రహెన్సివ్ అండ్ ప్రోగ్రెసివ్ అగ్రిమెంట్ ఫర్ ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్’ (సీపీటీపీపీ). ఈ వ్యాపార వర్గంలో చేరి ఉంటే దేశ విదేశీ వ్యాపారం, ఎగుమతులు పెరిగేందుకు తగిన సహకారం లభించి ఉండేది. ఇప్పటికీ సమయం మించిపోలేదు. ఆస్ట్రేలియా, జపాన్, మలేసియాలు భాగస్వాములుగా ఉండి... అతి జాగ్రత్తగా చైనా లేకుండా చేసుకున్న వ్యాపార వర్గంలో చేరేందుకు భారత్ ప్రయత్నించాలి. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల విషయానికి వస్తే... యూరోపి యన్ యూనియన్తో చేసుకున్న ఒప్పందం పదేళ్లుగా అమల్లో లేకుండా పోయింది. భారత్కున్న అతి పెద్ద వాణిజ్య భాగస్వాముల్లో ఒకటైన ఈ ప్రాంతంతోనూ వాణిజ్య ఒప్పందం విషయమై ఇటీవలే చర్చలు మొదలయ్యాయి. అదృష్టవశాత్తూ దేశంలోనూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల్లో భాగం కావడం దేశ హితం కోసమే అన్న భావన ప్రబలుతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియాలతో ఇలాంటి ఒప్పందాలు ఇటీవలే కుదరడం గమనార్హం. గల్ఫ్ కో–ఆపరేషన్ కౌన్సిల్, యునైటెడ్ కింగ్డమ్లతోనూ ఇదే తరహా ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు వేగవంతమయ్యాయి. మళ్లీ వెనక్కి? యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకోవడం ఏడేళ్లుగా స్తబ్ధుగా ఉంది. ఒప్పందం చేసు కోవడంలో ఉన్న ఇబ్బందులను పరిష్కరించుకునేందుకు చర్చలు ఒక్కటే మార్గమని ఇటీవలే గుర్తించి ఆ దిశగా ముందుకు కదులుతూండటం హర్షించదగ్గ విషయం. పర్యావరణం, లేబర్, డిజిటల్ వాణిజ్యం వంటి వాణిజ్యేతర అంశాలను కూడా ఇప్పుడు చర్చి స్తున్నారు. యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్తో ఒప్పందం కుదిరితే చాలా లాభాలుంటాయి. స్విట్జర్లాండ్, నార్వే, ఐస్లాండ్ వంటి హైటెక్ దేశాల్లో మన దేశానికి చెందిన నిపుణులు పనిచేయడం సులువు అవుతుంది. చివరగా... ఎగుమతులు మరింత జోరు అందుకునేందుకు ఉన్న ఇంకో అవరోధం ఇటీవలి కాలంలో పెరిగిపోయిన రక్షణాత్మక ధోరణులు. దిగుమతులకు సంబంధించి ఉన్న అడ్డంకులను తొలగించాల్సిన సమయం ఆసన్నమైంది. విదేశీ తయారీదారుల నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకునేందుకు భారతీయులు ఇప్పుడు సిద్ధంగానే ఉన్నారు. స్థానికంగా పారిశ్రామిక రంగానికి సహాయం అవసరమని అనుకుంటే ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల వంటివి ఉండనే ఉన్నాయి. దిగుమతి చేసుకునే వస్తువులు మరింత ఖరీదు చేయడం కంటే దేశీ తయారీ రంగం ఊపందుకునేందుకు ఈ ప్రోత్సాహకాలు సరిపోతాయి. ఆత్మ నిర్భర్ భారత్ విధానం కూడా గతంలోని ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్(దిగుమతికి ప్రత్యామ్నాయం) విధానాన్ని గుర్తు చేస్తోంది. లైసెన్స్ రాజ్ కాలంలో ఇది చాలా ప్రధానమైందన్నది తెలిసిందే. దేశంలో ఇప్పటికే దిగుమతి సుంకాలు క్రమేపీ పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం అవి చైనా, ఆగ్నేయాసియా దేశాల సుంకాలకు రెట్టింపు స్థాయిలో ఉండటం గమనార్హం. ఈ పరిస్థితి మారితేనే భారత్ అంతర్జాతీయ వాణిజ్య విపణిలో కీలక పాత్ర పోషించగలుగుతుంది. వ్యాసకర్త: సుష్మా రామచంద్రన్ ఆర్థిక వ్యవహారాల సీనియర్ జర్నలిస్ట్ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
అమెజాన్ గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ సేల్ వచ్చేస్తోంది..ఆఫర్లు ఎలా ఉన్నాయంటే?
Amazon Great Freedom Festival sale 2023 ఆన్లైన్ దిగ్గజం మరోసారి ఫెస్టివల్ సేల్ను షురూచేసింది. అమెజాన్ గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ సేల్ ఆగస్ట్ 5వ తేదీన ప్రారంభం కానుంది. స్వాతంత్ర్య దినోత్సవం సమీపిస్తున్న తరుణంలో, అమెజాన్ ఇండియా అద్భుతమైన సేల్ ఈవెంట్కు సిద్ధమవుతోంది. వివిధ ఉత్పత్తులపై ఆకర్షణీయమైన తగ్గింపులను అందిస్తోంది. ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్స్, ల్యాప్ టాప్స్, హోం అప్లయన్సెస్, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, తదితర పలు విభాగాల్లో ఆకర్షణీయమైన డిస్కౌంట్లు లభించనున్నాయి. దీనికి తోడు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా జరిపే కొనుగోళ్లపై అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ప్రతీ ఆగస్ట్ నెలలో గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ సేల్ ప్రకటించే అమెజాన్ ఈ ఏడాది గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ సేల్ తేదీలను శుక్రవారం ప్రకటించింది. ఈ సేల్ ఆగస్ట్ 5 నుంచి 9వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు కొనసాగుతుంది. ప్రైమ్ మెంబర్స్ కు ఒక రోజు ముందే ఈ సేల్ ప్రారంభమవుతుంది అనేది తెలిసిన సంగతే. కొనుగోళ్లపై స్పెషల్ ఫ్లాట్ డిస్కౌంట్తోపాటు, బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్చేంజ్ బోనస్, వీటన్నింటికి తోడు క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అందుబాటులోఉంటాయి. ముఖ్యంగా ఈ సేల్ లో శాంసంగ్ వన్ ప్లస్, రియల్ మి, ఎంఐ తదితర కంపెనీల స్మార్ట్ ఫోన్స్ పై 40 శాతానికి మించి డిస్కౌంట్ లభించనుంది. (పెరిగిన బంగారం ధరలు, వెండి కూడా పైపైకే) వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు వంటి గృహోపకరణాలు కూడా ఆకర్షణీయమైన తగ్గింపు ధరల లభ్యం. సోనీ ప్లేస్టేషన్ 5 ఇతర గేమింగ్ ఉత్పత్తులపై 50 శాతం వరకు తగ్గింపు. గేమ్లు కూడా గరిష్టంగా 80 శాతం తగ్గింపుతో అందుబాటులో ఉంటాయి. ల్యాప్టాప్లు , వైర్లెస్ ఇయర్బడ్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. టీజర్ పేజీ ల్యాప్టాప్లు, ఇయర్ఫోన్లు, స్మార్ట్వాచ్లు మరియు అనేక ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై 75 శాతం వరకు తగ్గింపు లభించనుంది. అంతేకాకుండా యాపిల్, తదితర కంపెనీల టాబ్లెట్లు గరిష్టంగా 50 శాతం తగ్గింపుతో అందుబాటులో ఉంటాయి. -
పెరిగిన బంగారం ధరలు, వెండి కూడా పైపైకే
Today Gold and Silver Price పసిడి ధరలు శనివారం మరోసారి పెరిగాయి. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో విలువైన రెండు లోహాల ధరలు ఊపందుకున్నాయి. హైదరాబాద్లో శుక్రవారం 350 రూపాయలకు పైగా పడిన 22 క్యారెట్ల పసిడి శనివారం 10 గ్రాములు రూ.250 ఎగిసి రూ.55,350 స్థాయికి చేరింది. అలాగే 24 క్యారెట్ల గోల్డ్ 270 రూపాయలు పుంజుకుని రూ.60,380గా ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, విశాఖపట్నం, పొద్దుటూరు, గుంటూరు నగరాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధర కిలోకి మరోసారి 80వేలకు చేరింది. 500 రూపాయలు పెరిగి కిలోకు రూ.80,000 పలుకుతున్నది. శుక్రవారం 2వేల రూపాయల మేర క్షీణించిన సంగతి తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.55,600గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం రూ.60,640 పలుకుతోంది. f వెండి కిలో 600 రూపాయలు పెరిగి 77,000 పలుకుతోంది. బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్లో రోజువారీ మార్పులు, చేర్పులకు లోనవుతూ ఉంటాయనే విషయాన్ని గమనించాలి. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
హానర్ లవర్స్కు గుడ్ న్యూస్: 200 ఎంపీ కెమెరా స్మార్ట్ఫోన్తో రీఎంట్రీ!
Honor 90 Coming Soon చైనీస్ స్మార్ట్ఫోన్ బ్రాండ్ హానర్ మళ్లీ భారత మార్కెట్లో అడుగుపెడుతోంది. తాజా నివేదికల ప్రకారం ఈ ఏడాది సెప్టెంబరులో హానర్ 90 స్మార్ట్ఫోన్తో భారతీయ యూజర్లను ఆకట్టుకునేందుకు రడీ అవుతోంది. ఇప్పటికే ఇతర మార్కెట్లలో లాంచ్ అయిన హానర్ 90ని ఇక్కడ లాంచ్ చేయనుంది. దీనికి తోడు రియల్మీ మాజీ సీఈవో మాధవ్ సేథ్ హానర్ ఇండియా హెడ్కు రానున్నారు. ఇటీవల దుబాయ్ లాంచ్ ఈవెంట్లో మాధవ్ సందడి చేశారు. అలాగే 15 మంది ఉద్యోగులతో పాటు కొంతమంది ఉన్నతాధికారులు Realmeకి గుడ్బై చెప్పి ఇప్పటికే HonorTechలో చేరారని ఐఏఎన్ఎస్ నివేదించిన నేపథ్యంలో ఈ వార్తలకు బరింత బలం చేకూరింది. (జియో ఫైబర్ రూ. 398 ప్లాన్, ఆఫర్లేంటో తెలుసా?) ఖచ్చితమైన తేదీ ఇంకా వెల్లడి కానప్పటికీ, టెక్నికల్ గురూజీ గౌరవ్ చౌదరి లీక్ చేసిన వివరాల ప్రకారం హానర్ 90 లాంచ్ సెప్టెంబర్ మధ్యలో ఉంటుందని ధర రూ. 50వేలలోపు ఉంటుందట. అంటే సెగ్మెంట్లో వన్ప్లస్ 11ఆర్, ఒప్పో రెనో 10 ప్రో, నథింగ్ ఫోన్ 2 లాంటి స్మార్ట్ఫోన్లకు గట్టి పో వ్వనుందని అంచనా. పీకాక్ బ్లూ, డైమండ్ సిల్వర్, మిడ్నైట్ బ్లాక్ మరియు ఎమరాల్డ్ గ్రీన్తో సహా ప్రపంచవ్యాప్తంగా నాలుగు విభిన్న రంగులలో అందుబాటులోకి రానుంది. ఫీచర్స్, స్పెసిఫికేషన్స్కు సంబంధించిన పూర్తి వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు అంచనాలు ఇలా ఉన్నాయి. హానర్ 90 ఫీచర్లు అంచనాలు 6.7 ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే స్నాప్డ్రాగన్ 7 జెన్ 1 ఎస్ఓసీ 200+12+2 ఎంపీ ట్రిపుల్ రియర్కెమెరా 50ఎంపీ సెల్పీ కెమెరా 5000ఎంఏహెచ్ బ్యాటరీ,66వాట్ ఛార్జింగ్ సపోర్ట్ కాగా కొన్నేళ్ల క్రితం హువావే ఉప-బ్రాండ్గా ఉన్న ఈ చైనీస్ స్మార్ట్ఫోన్ బ్రాండ్,అమెరికా గూగుల్ సేవలను ఉపయోగించ కుండా హువావేపై ఆంక్షల నేపథ్యంలో పలు సవాళ్లు ఎదుర్కొంది. కానీ హానర్ ఇండియాలో మాత్రం కొత్త ఉత్పత్తులను కొనసాగించింది. Honor Watch ES, Honor Pad 5 వంటి స్మార్ట్వాచ్లు టాబ్లెట్లపై దృష్టి సారించింది. మరోవైపు ఇండియాలో హానర్ విడుదల చేసిన చివరి స్మార్ట్ఫోన్. రూ.10వేల బడ్జెట్ ధరలో హానర్ 9ఏ. -
షాకిస్తున్న వెండి, బంగారం ధరలు, ఏకంగా రూ. 1100 జంప్
Gold And Silver Rate Today: దేశంలో బంగారం ధరలు మళ్లి పరుగందుకున్నాయి. ఒక వైపు ఎడతెగని వర్షాలతో దేశంలోని చాలా ప్రాంతాలు అతలాకుతలమవుతున్నాయి. మరోవైపు బులియన్ మార్కెట్లో వెండి, బంగారం ధరలు గురువారం జోరందుకున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు, ద్రవ్యోల్బణం, ఫెడ్ వడ్డీ రేట్లు, ఆర్థిక అనిశ్చితి వంటి అంశాలు పసిడి ధరల పెరుగుదలకు కారణమని బులియన్ వర్గాలు చెబుతున్నాయి. (బ్లాక్రాక్ బ్యాక్ టూ ఇండియా: అంబానీ మరో సంచలనం) 22క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 300 పెరిగి, రూ. 55,450 పలుకుతోంది. 24 క్యారెట్ల బంగాం పది గ్రాములు 330 రూపాయలు ఎగిసి రూ. 60,490కి చేరింది. వెండి కూడా ఇదే బాటలో ఉంది. (మారుతి జిమ్నీని సింగిల్ బెడ్తో అలా మార్చేసిన జంట; వైరల్ వీడియో) హైదరాబాద్ మార్కెట్లె పుత్తడి పది గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 55,450 గానూ, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,490గానూ ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలో కొన సాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,600గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,640గా ఉంది. వెండి ధగ ధగలు దేశీయంగా వెండి ధరలు కూడా పుంజుకున్నాయి. వెండి కిలో ధర 1100 రూపాయిలు ఎగిసింది. హైదరాబాద్లో కిలో వెండి 8,1500గా ఉంది. అమెరికా ఫెడ్ నిర్ణయం అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ రేటు పెంపు మరింత ఆందోళనకు దారి తీసింది. ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించారు దీంతో వడ్డీరేటు పెంపు ఉండదన్న ఇన్వెస్టర్ల ఆశలపై నీళ్లు జల్లినట్టైంది. దీంతో అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకోనుందని అంచనాలు ఊపందుకున్నాయి. -
తక్కువ ధరలో సరికొత్త 5జీ స్మార్ట్ ఫోన్
ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ఇన్ఫినిక్స్ సరికొత్త 5జీ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. అతితక్కువ ధరకే ఇన్ఫినిక్స్ హాట్ 30 పేరుతో దీన్ని తీసుకొచ్చింది. 5జీ తోపాటు, భారీ బ్యాటరీ ఇతర ఆకర్షణీయమైన ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ.12 వేలకే లభ్యం కానుంది. బడ్జెట్ ఫోన్లతో ఆకట్టుకుంటున్న ఇన్ఫినిక్స్ లేటెస్ట్ స్మార్ట్ఫోన్ హాట్ 30 ఫోను సేల్ జులై 18 నుంచి ప్రారంభం కానుంది. ఫ్లిప్కార్ట్లో హాట్ 30 సేల్ షురూ అవుతుందని సంస్థ వెల్లడించింది. రెండు వేరియంట్లలో ఇది లభించనుంది. 4జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ ధర రూ.12,499 కాగా, 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ.13,499 గా నిర్ణయించింది. ఇక ఆఫర్ విషయానికి వస్తే యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేస్తే రూ.1000 ఇన్స్టాంట్ డిస్కౌంట్తో పాటు, రూ. నెలకు 2,250 చొప్పున నో-కాస్ట్ EMI కూడా అందుబాటులో ఉంటుంది. ఇన్ఫినిక్స్ హాట్ 30 స్పెసిఫికేషన్లు 6.78 ఇంచెస్ ఫుడ్ హెచ్డీ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్ మీడియా టెక్ డైమెన్సిటీ 6020 SoC ప్రాసెసర్ 50 + 2 ఎంపీ డ్యుయల్ రియర్ కెమరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ 6000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ -
సంచలనం సృష్టించి కనుమరుగైపోయిన భారతీయ బడా కంపెనీలు ఇవే!
ప్రపంచం మార్కెట్లో ఎన్నో కంపెనీలు ఆవిర్భవించి కొన్ని దశాబ్దాలు తిరుగులేని సంస్థలుగా అవతరించి కాల గర్భంలో కలిసిపోయాయి. అలాంటి కోవకు చెందిన టాప్ 5 ఇండియన్ కంపెనీలను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రీమియర్ ఆటోమొబైల్ (Premier Automobiles) 19వ దశకంలో భారతదేశంలో ఒక మెరుపు మెరిసిన ప్రీమియర్ ఆటోమొబైల్ కంపెనీ మొదటి కార్ రిపేర్ వర్స్క్ షాప్ మాదిరిగా ముంబైలో ప్రారంభమైంది. ఆ తరువాత ఆటో మొబైల్ రంగంలోకి అడుగు పెట్టింది. ఇందులో భాగంగానే కంపెనీ 1970లో 'ప్రీమియర్ పద్మిని' అనే అద్భుతమైన కారుని పరిచయం చేసింది. ఇది 2004 వరకు మార్కెట్లో విస్తృతమైన అమ్మకాలను పొందింది. మార్కెట్లో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో విఫలమైన ఈ కంపెనీ కొత్త కార్లను పరిచయం చేయడంలో కూడా సక్సెస్ కాలేక పోయింది. ఆ తరువాత ప్రీమియర్ పద్మిని ఉత్పత్తి 1980లోనే నిలిచిపోయింది. కాగా కంపెనీ ఆటోమొబైల్ రంగం నుంచి పూర్తిగా 2004కి బయటకు వచ్చేసింది. గోల్డ్ స్పాట్ (Gold Spot) భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొంది, ప్రత్యర్థులను ఎదుర్కోలేక నిలిచిపోయిన కంపెనీలలో ఒకటి ఈ గోల్డ్ స్పాట్. 1950లోనే యూత్ ఫెవరెట్ బ్రాండ్గా మారిన ఈ సాఫ్ట్ డ్రింక్ 'పార్లే' (Parle) కంపెనీకి చెందినది కావడం గమనార్హం. 1960 & 70లలో బాగా పాపులర్ అయినప్పటికీ.. కోక్ అండ్ పెప్సీ కంపెనీ సాఫ్ట్ డ్రింకులతో పోటీ పడలేక 2000 ప్రారంభంలో కంపెనీ ఈ ఉత్పత్తిని నిలిపివేసింది. హెచ్ఎమ్టి (HMT) ఆధునిక కాలంలోనే హెచ్ఎమ్టి వాచ్ల గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఒకప్పుడు ఈ బ్రాండ్కు పెద్ద ఫాలోయింగ్ ఉండేది. నిజానికి 1953లో ఇండియన్ గవర్నమెంట్ ఆధ్వరంలో మన దేశంలో ఈ కంపెనీ ప్రారంభమై 2016 వరకు కొనసాగింది. ఇందులో హెచ్ఎమ్టి జనతా అనే వాచ్ చాలా మందికి ఇష్టమైనదని చెబుతారు. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా కంపెనీ మారలేక.. కొత్త ఉత్పత్తులకు సరైన పోటీ ఇవ్వలేక 2016లో కనుమరుగైపోయింది. రాజ్దూత్ మోటార్సైకిల్స్ (Rajdoot MotorCycles) ఆటో మొబైల్ మార్కెట్లో చరిత్ర సృష్టించిన రాజ్దూత్ మోటార్ సైకిల్స్ 1960 నుంచి 2005 వరకు కుర్రకారుని ఎంతగానో ఆకర్శించింది. ఈ బైకులు ప్రముఖ ఇంజినీరింగ్ కంపెనీ ద్వారా రూపుదిద్దుకున్నాయి. కావున చాలా వరకు అప్పట్లోనే అడ్వాన్స్డ్ ఫీచర్స్ కలిగి ఉండేది. 1973లో విడుదలైన బాబీ అనే చిత్రం ద్వారా ఈ బైక్ మరింత పాపులర్ అయింది. అయితే మార్కెట్లో జరిగుతున్న ఆధునీకరణకు, ఇతరత్రా కారణాల వల్ల కంపెనీ రాజ్దూత్ ఉత్పత్తిని నిలిపివేసింది. అప్పుడప్పుడు వింటేజ్ బైకుల మాదిరిగా అక్కడక్కడా దర్శనమిస్తూ ఉంటాయి. (ఇదీ చదవండి: ఎంత మిలియనీర్ అయినా.. ఇండియాలో ఇలాగే ఉంటది!) అంబాసిడర్ (Ambassador) ఇక భారతదేశ ఆటో మోటివ్ ఇండస్ట్రీ సింబల్ మాదిరిగా ప్రజాదరణ పొంది సాధారణ ప్రజల దగ్గర నుంచి గవర్నమెంట్ ఉద్యోగుల వరకు విరివిగా ఉపయోగించిన కార్లలో అంబాసిడర్ ఒకటి. ఇప్పటికి కూడా అక్కడక్కడా కనిపించే ఈ కార్లు ఒకప్పుడు తిరుగులేని అమ్మకాలను పొందాయి. డిజైన్, ఫీచర్స్ పరంగా ఉత్తమంగా ఉండే ఈ కారు ఇండియన్ రోడ్ కండిషన్కి అనుకూలంగా ఉండేది. అయితే కాలక్రమంలో ఏర్పడిన పోటీ, ఆధునికతను తట్టుకోలేక 2014లో వీటి ఉత్పత్తి కూడా నిలిచిపోయింది. (ఇదీ చదవండి: ఒక ఒప్పందం.. వేల కోట్లు ఇన్వెస్ట్ - గోగోరో ప్లాన్ ఏంటంటే?) కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ (Kingfisher Airlines) భారతదేశంలో అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని పొందగలిగిన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ విజయ్ మాల్యా ద్వారా 2005లో ముంబై హెడ్ క్వార్టర్గా ప్రారంభమైంది. ప్రయాణికులకు సౌకర్యవంతమైన సదుపాయాలను అందిస్తూ ముందుకు సాగిన ఈ కంపెనీ ఎయిర్లైన్స్లో ఒక రికార్డ్ సృష్టించింది. ఆ తరువాత ఆర్థిక పరమైన ఇబ్బందులను ఎదుర్కొలేకే 2012లో తన కార్య కలాపాలను నిలిపివేసింది. ఆ తరువాత 2013లో కంపెనీ పూర్తిగా దివాళా తీసినట్లు ప్రకటించింది. -
చైనా స్మార్ట్ఫోన్ మేకర్కి ఎదురుదెబ్బ: సీఈవో గుడ్బై, ప్రత్యర్థికి సై!?
చైనా స్మార్ట్ఫోన్ మేకర్ రియల్మీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రియల్మీ ఇండియా సీఈవో మాధవ్ సేత్ తన పదవికి రాజీనామా వేశారు. సంస్థకు ఐదేళ్ల పాటువిజయంతంగా సేవలందించి, ఇండియన్ స్మార్ట్ఫోన్ మార్కెట్లో రియల్మీ ప్రముఖ బ్రాండ్గా నిలబెట్టిన మాధవ్ సేత్ ఉన్నట్టుండి గుడ్ బై చెప్పడం కార్పొరేట్ వర్గాల్లో చర్చకు దారి తీసింది.ఆయన నిష్క్రమణ కంపెనీకి గణనీయమైన ఎదురుదెబ్బ అని మార్కెట్ వర్గాల అంచనా. (యూట్యూబర్లకు గుడ్ న్యూస్, 500 చాలట!) ఈ సమాచారాన్ని మాధవ్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. సంస్థకు వీడ్కోలు పలకడం కష్టమే కానీ, కొత్త ప్రయాణాన్ని ప్రారంభించే సమయం వచ్చిందంటూ ఒక నోట్ను మాధవ్ ట్వీట్ చేశారు. రియల్మీకి తన జీవితంలో చాలా ప్రాముఖ్యత ఉందని ఎన్నో అద్భుతమైన మరపురాని క్షణాలను అందించిందని పేర్కొన్నారు. అంతేకాదు ఈ సందర్భంగా తన పదవీ కాలంలో కొన్ని ముఖ్యమైన విజయాలను హైలైట్ చేశారు. రియల్మీ తన స్మార్ట్ఫోన్ను తొలిసారిగా యూనివర్సిటీలో విడుదల చేసి చరిత్ర సృష్టించింది. కంపెనీ 50 మిలియన్లకు పైగా ఉత్పత్తులను విక్రయించి, వేగంగా అమ్ముడవుతున్న బ్రాండ్గా మారింది. దేశంలో రెండవ అతిపెద్ద స్మార్ట్ఫోన్ మార్కెట్ ప్లేయర్గా కూడా నిలిచింది. నాణ్యత, కమిట్మెంట్కు తోడు "మేక్ ఇన్ ఇండియా" చొరవ ఫలితంగా 5 జీ స్మార్ట్ఫోన్ల ఉత్పత్తికి దారితీసింది. గత ఐదేళ్లలో తనకు మద్దతుగా నిలిచిన అభిమానులు, టీమ్లు, పార్టనర్స్, ఇలా ప్రతి ఒక్కరికీ షేత్ తన కృతజ్ఞతలు తెలిపారు. (Adipurush Promotions: స్పెషల్ శాలువాతో కృతి సనన్, దీని విశేషాలు తెలిస్తే ) మాధవ్ సేత్ పయనం ఎటు? రియల్మిని వీడిన తరువాత, మాధవ్ ప్రస్థానం ఎటు అనేదే ఇపుడు ప్రధాన ప్రశ్న. దీనిపై అధికారిక ప్రకటన లేనప్పటికీ, మరో స్మార్ట్ఫోన్ కంపెనీ, ప్రధాన ప్రత్యర్థి హానర్లో చేరవచ్చని మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మాధవ్ అధికారిక ధృవీకరణ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. హానర్ భారత మార్కెట్ నుండి వైదొలగనుందంటూ గతంలో వచ్చిన పుకార్లొచ్చాయి. అయాతే కంపెనీ ప్రతినిధి ఈ వాదనలను ఖండించిన సంగతి తెలిసిందే. -
కేటీఎం తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేస్తోంది: ఫీచర్లు ఎలా ఉంటాయంటే!
ఆటోమొబైల్ దిగ్గజం కేటీఎం భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ల ర్యాలీలో దూసుకొస్తోంది. త్వరలోనే ఇండియాలో ఎలక్ట్రిక్ స్కూటర్ను తీసుకు రానుంది. బజాజ్ సహకారంతో ఎలక్ట్రిక్ స్కూటర్ను అభివృద్ధి చేస్తోంది. ఈ ఏడాది చివర్లో ఇటలీ మిలాన్లో జరగనున్న ఈఐసీఎంఏ షోలో దీన్ని ఆవిష్కరించనుందదని భావిస్తున్నారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన టెస్ట్ మ్యూల్లో ఎటువంటి బ్రాండింగ్ లేనప్పటికీ, కేటీఎం లివరీతో కూడిన జాకెట్తో రైడర్ ఉండటంతో ఈ స్కూటర్ను విదేశాలలో పరీక్షిస్తున్నట్టు తెలుస్తోంది. (మహీంద్రా థార్ దెబ్బకి రెండు ముక్కలైన ట్రాక్టర్? వైరల్ వీడియో) కేటీఎం ఈ-స్కూటర్ సాధారణ ఎలక్ట్రిక్ స్కూటర్ కంటే కొంచెం పెద్దదిగా ఉండనుంది. విండ్స్క్రీన్ కూడా పెద్దగా ఉన్నట్టు తెలుస్తోంది. అల్లాయ్ వీల్స్, TFT డిస్ప్లే , ట్విన్ ప్రొజెక్టర్ హెడ్లైట్లు, ఎయిర్ డక్ట్, ఫ్రెంట్, రేర్ వీల్స్కు డిస్క్ బ్రేక్స్ ముఖ్య ఫీచర్లుగా కనిపిస్తున్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక భాగంలో తేలికపాటి అల్యూమినియం స్వింగార్మ్ , సింగిల్/ డ్యూయెల్ ఛానెల్ ఏబీఎస్ సిస్టెంతో లాచ్కానుందని అంచనా. (అపుడు పాల ప్యాకెట్ కొనలేక పాట్లు, ఇపుడు 800 కోట్ల ఆస్తులు!) 2025 ప్రారంభంలో లాంచ్ కానున్న ఈ కేటీఎం ఎలక్ట్రిక్ స్కూటర్ను బజాజ్ చకాన్ ప్లాంట్లో చేసి ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ధరలపై ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు. -
షావోమీ సరికొత్త ట్యాబ్లెట్ వచ్చేసింది, ధర, ఆఫర్లు ఎలా ఉన్నాయంటే?
చైనా స్మార్ట్మేకర్ షావోమీ కొత్త ట్యాబ్లెట్ను లాంచ్ చేసింది. హైఎండ్ ఫీచర్స్తో షావోమీ ప్యాడ్ 6 మోడల్ను తీసుకొచ్చింది. షావోమీ ప్యాడ్ 5 అప్గ్రేడ్ వేరియంట్గా ఆల్ మెటల్ డిజైన్తో దీన్ని ఆవిష్కరించింది. ధర, ఆఫర్ షావోమీ ప్యాడ్ 6 రెండు వేరియంట్లలో లభిస్తుంది. 6జీబీ ర్యామ్ , 128జీబీ స్టోరేజ్ ధర రూ.26,999గా నిర్ణయించింది.అలాగే 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ధర రూ.28,999. జూన్ 21న సేల్ ప్రారంభం. షావోమీ ఆన్లైన్ స్టోర్లతోపాటు,అమెజాన్లో లభిస్తుంది. (స్టార్ క్రికెటర్ కోహ్లీ పార్టనర్, ఈ బిలియనీర్ గురించి తెలుసా? నెట్వర్త్ ఎంతంటే?) ఇక ఆఫర్ విషయానికి వస్తే..ఐసీఐసీఐ బ్యాంక్ కార్డు ద్వారా కొనుగోలు చేసిన వారికి రూ.3,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.ఫలితంగా షావోమీ ప్యాడ్ 6 ట్యాబ్లెట్ 6జీబీ+128జీబీ వేరియంట్ రూ.23,999కు, 8జీబీ+256జీబీ వేరియంట్ రూ.26,999 ధరకు కొనుగోలుచేయవచ్చు. షావోమీ ప్యాడ్ 6 స్పెసిఫికేషన్స్ 11 అంగుళాల 2.8K ఎల్సీడీ డిస్ప్లే 144Hz రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 స్క్రీన్ ప్రొటెక్షన్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 13 + ఎంఐయూఐ 14 ఆపరేటింగ్ సిస్టమ్ HDR10+, డాల్బీ విజన్ ఫీచర్స్ 13 ఎంపీ రియర్ కెమెరా 8 ఎంపీ సెల్పీ కె కెమెరా 8,840mAh బ్యాటరీ 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ -
సరికొత్త ఫీచర్లతో ప్రీమియం హీరో బైక్ వచ్చేస్తోంది: ఎప్పుడంటే?
హిస్టారిక్ ప్రీమియం మోటార్సైకిల్ బ్రాండ్, కరిజ్మా ఎక్స్ఎంఆర్ బైక్ మళ్లీ ఎంట్రీ ఇస్తోందన్న ఊహాగానాలు, ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ దారు హీరో మోటోకార్ప్ దాఖలు చేసిన ట్రేడ్మార్క్ దరఖాస్తుతో మరోసారి ఊపందు కున్నాయి. హీరో మోటోకార్ప్, రాబోయే మోటార్సైకిల్కి సంబంధించిన 14 సెకన్ల టీజర్ వీడియోను ఇటీవల విడుదల చేసింది. జూన్ 14న లాంచ్ డేట్ నిర్ధారించినప్పటికీ నిర్దిష్ట మోడల్ ఇంకా వెల్లడించలేదు. ఎక్స్ఎంఆర్ 210 లేదా ఎక్స్ట్రీమ్ 160R అప్డేటెడ్ వెర్షన్ అని కావచ్చని భావిస్తున్నారు. హీరో మోటార్స్ అప్డేట్ చేసిన రీమోడల్ బైక్ ఎక్స్ట్రీమ్160R అప్డేటెడ్ వెర్షన్లో ఫీచర్లు, డిజైన్, ఇంజన్ స్పెసిఫికేషన్లు పెద్దగా మారకపోవచ్చని అంచనా. అప్డేటెడ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, బ్లూటూత్ కనెక్టివిటీ, 5-స్పీడ్ గేర్బాక్స్ లాంటి అదనపు ఫీచర్లతో కీలక అప్గ్రేడ్స్నే అందిస్తోందట. కొత్త టూ-టోన్ బాడీ షేడ్స్ను కూడా పరిచయం చేసే అవకాశం ఉంది. అయితే, డ్యూయల్-ఛానల్ ABS సిస్టమ్తో వస్తుందా అనేది స్పష్టత లేదు. 163cc ఎయిర్-కూల్డ్ ఇంజిన్ 15 పవర్ను, 14 ఎన్ఎం గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. బైక్ ధర రూ. 1.30 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది. -
10.25 అంగుళాల టచ్స్క్రీన్తో నెక్సన్ ఈవీ మ్యాక్స్: ధర ఎంతో తెలుసా?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ దేశంలోని మూడవ అతిపెద్ద వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తన సరికొత్త అప్గ్రేడ్ చేసిన తయారీ సంస్థ టాటా మోటార్స్ నెక్సన్ ఈవీ మ్యాక్స్ శ్రేణిలో ఎక్స్జడ్ ప్లస్ మోడల్ను అప్గ్రేడ్ చేసింది. వీటిలో ఎక్స్జడ్ ప్లస్ 3.3 కిలోవాట్ ఏసీ ఫాస్ట్ చార్జర్, ఎక్స్జడ్ ప్లస్ లక్స్ 7.2 కిలోవాట్ ఏసీ ఫాస్ట్ చార్జర్ వర్షన్లు ఉన్నాయి. ఎక్స్షోరూంలో ధర రూ.18.79 లక్షల నుంచి ప్రారంభం. హెచ్డీ డిస్ప్లేతో 10.25 అంగుళాల టచ్స్క్రీన్ హర్మన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, హెచ్డీ రేర్ వ్యూ కెమెరా, ఆరు భాషల్లో వాయిస్ అసిస్ట్, మెరుగైన వాయిస్ కమాండ్ వంటి హంగులు ఉన్నాయి. జిప్ట్రాన్ టెక్నాలజీతో 40.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఏర్పాటు చేశారు. (ఐసీఐసీఐ,పీఎన్బీ ఖాతాదారులకు షాకింగ్ న్యూస్!) 141.04 బీహెచ్పీ, 250 ఎన్ఎం టార్క్ ఉంది. ఒకసారి చార్జింగ్తో 453 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 9 సెకన్లలో అందుకుంటుంది. నెక్సన్ ఈవీ శ్రేణిలో ఇప్పటి వరకు 45,000 పైచిలుకు కార్లను విక్రయించినట్టు టాటా మోటార్స్ తెలిపింది. ఇదీ చదవండి: అంబానీ మనవరాలంటే అట్లుంటది! పాపాయి పేరు, రాశి ఇదేనట? మరిన్ని టెక్ వార్తలు, బిజినెస్ అప్డేట్స్ కోసం చదవండి: సాక్షిబిజినెస్ -
తక్కువ ధరలో ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్, ధర ఎంతంటే?
సాక్షి, ముంబై: స్వదేశీ ఎలక్ట్రిక్ వాహన సంస్థ ఏథర్ ఎనర్జీ భారతదేశంలో కొత్త ఏథర్ 450ఎస్ను విడుదల చేసింది. ఫేమ్-II సబ్సిడీ కోతతో ఈవీల ధరలు బాగా పెరిగిన నేపథ్యంలో ఏథర్ 450ఎస్ పేరుతో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్ను లాంచ్ చేసింది. దీని ధర రూ. 1,29,999గా నిర్ణయించింది. బుకింగ్లను కూడా షురూ చేసింది. (AsmiJain ఫ్రెండ్ అంకుల్ కోసం: ఇండోర్ అమ్మడి ఘనత) తమ 450 ఎస్ IDC (ఇండియన్ డ్రైవింగ్ కండిషన్స్) 3 kWh బ్యాటరీ ప్యాక్తో పరిధి 115 కి.మీ. రేంజ్ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. గంటకు 90 కి.మీవేగంతో అత్యుత్తమ సాంకేతికత, పనితీరును అందిస్తుందని ఏథర్ఎనర్జీ కో-ఫౌండర్, సీఈవో తరుణ్ మెహతా తెలిపారు. ఫేమ్-IIఫ్రేమ్వర్క్ కింద తమ బెస్ట్ సెల్లింగ్ స్కూటర్ 450 ఎక్స్ కొత్త ధరలను కూడా ప్రకటించింది. మునుపటి ధరతో పోలిస్తే స్వల్పంగా పెరిగి రూ. 1,65,000 (ఎక్స్-షోరూమ్ బెంగుళూరు)కి అందుబాటులో ఉంటుంది. టాప్ వేరియంట్ ప్రో ప్యాక్ ఏథర్ 450 ఎక్స్ రూ. 1.45 లక్షల నుండి రూ. 1.65 లక్షల వరకు ఉంటుంది. పాత ధరలతో పోలిస్తే దాదాపు రూ. 32,000 వరకు పెరిగింది. -
చిన్న క్యూఆర్.. పెద్ద వ్యాపారం
రోడ్డు పక్కన ఉన్న టీ కొట్టు, చాట్ బండి, పండ్ల షాపులను గమనించారా? అక్కడ మీకో యూపీఐ క్యూఆర్ కోడ్ దర్శనమిస్తుంది. చూడ్డానికి చిన్నదే అయినా వాటి ఆధారంగా జరుగుతున్న వ్యాపారం గురించి తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే! దేశ వాణిజ్యంలో యూపీఐ క్యూఆర్ కోడ్స్ అత్యంత కీలకంగా మారాయంటే అతిశయోక్తి కాదు. కుగ్రామాల్లోని చిరు వ్యాపారుల వద్ద కూడా దర్శనమిస్తున్న ఈ కోడ్లను గమనిస్తే, డిజిటల్ పేమెంట్స్ రంగంలో భారతావని ముఖచిత్రం ఎలా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. వ్యక్తుల నుంచి వర్తకులకు చేరిన డిజిటల్ పేమెంట్స్లో సంఖ్యపరంగా రూ.500 లోపు విలువ చేసే లావాదేవీల వాటా ఏకంగా 84.27 శాతం ఉంది. చిన్న చిన్న మొత్తాలే డిజిటల్ రూపంలో చేతులు మారుతున్నాయనడానికి ఇదే నిదర్శనం. ∙నూగూరి మహేందర్ ఇన్స్టంట్ పేమెంట్ సిస్టమ్ భారత వాణిజ్యాన్ని పునర్నిర్మించింది. అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి కోట్లాది మందిని తీసుకొచ్చింది. రోజువారీ జీవితాన్ని మరింత సౌకర్యవంతం చేసింది. కోట్లాదిమంది భారతీయులకు క్రెడిట్, సేవింగ్స్ వంటి బ్యాంకింగ్ సేవలను విస్తరించింది. ప్రభుత్వ కార్యక్రమాలు లబ్ధిదారులకు నేరుగా చేరాయి. పన్నుల వసూళ్లలో వృద్ధి నమోదవుతోంది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు భారతదేశం ఇంతకు ముందు చూడని స్థాయిలో ఈ సాంకేతిక ఆవిష్కరణ ప్రభావం చూపించింది. సౌకర్యాల కలబోత.. చాక్లెట్ కొన్నా షాపు యజమానికి అక్కడి క్విక్ రెస్పాన్స్ (క్యూఆర్) కోడ్ లేదా బ్యాంకు ఖాతాకు అనుసంధానమైన మొబైల్ నంబరు సాయంతో డబ్బులు చెల్లించొచ్చు. అదీ 10 సెకన్లలోపే. కస్టమర్కి గాని, వ్యాపారస్తుడికి గాని చేతిలో చిల్లర లేదన్న బెంగ లేదు. క్యాష్ కోసం ఏటీఎమ్కి, బ్యాంకుకు పరుగెత్తే పని లేదు. షాపింగ్ కోసం చేతినిండా నగదు ఉంచుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. కావాల్సిందల్లా చేతిలో ఉన్న ఫోన్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) పేమెంట్ యాప్ ఉంటే చాలు. క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి క్షణాల్లోనే చెల్లింపులు పూర్తి చేయవచ్చు. వర్తకులు ప్రతిసారీ తమ మొబైల్ను చెక్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా వాయిస్ బాక్సులు వచ్చాయి. వినియోగదారుడి బ్యాంకు ఖాతా, లేదా డిజిటల్ వాలెట్ నుంచి లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాకు డబ్బులు నేరుగా బదిలీ అవుతాయి. యూపీఐ యాప్లో ప్రతి బ్యాంకు ఖాతాకు ఒక వర్చువల్ పేమెంట్ అడ్రస్ (ఐడీ) క్రియేట్ అవుతుంది. ఈ యూపీఐ ఐడీ లేదా బ్యాంకు ఖాతాకు అనుసంధానమైన మొబైల్ నంబరుతో కూడా డబ్బులు చెల్లించవచ్చు. బ్యాంకు ఖాతా నుంచి మరో బ్యాంకు ఖాతాకు జరిగే చెల్లింపులకు ఎటువంటి చార్జీ ఉండదు. అంటే బ్యాంకు ఖాతా నుంచి క్యూఆర్ కోడ్ ద్వారా జరిగే లావాదేవీలు కూడా ఉచితం అన్నమాట. మొబైల్ రీచార్జ్, ఎలక్ట్రిసిటీ బిల్లులు, బీమా, డీటీహెచ్ చెల్లింపులు, సిలిండర్ బుకింగ్ చేసుకోవచ్చు. లావాదేవీల పరిమితి రోజుకు రూ.1 లక్ష వరకు ఉంది. దేశవ్యాప్తంగా అధికారికంగా జరుగుతున్న ఆర్థిక లావాదేవీల్లో విలువ పరంగా యూపీఐ వాటా 43 శాతం ఉందంటే అతిశయోక్తి కాదు. పీవోఎస్ టెర్మినల్స్ను మించి.. క్యూఆర్ కోడ్స్కు ఆదరణ అంతా ఇంతా కాదు. విక్రేతలు ఎవరైనా డిజిటల్ రూపంలో నగదును స్వీకరించేందుకు వీటిని వినియోగిస్తున్నారు. దీనికి ప్రధాన కారణమేమిటంటే తెల్లకాగితం మీద కూడా క్యూఆర్ కోడ్ను ప్రింట్ తీసుకుని వినియోగించే వెసులుబాటు ఉండడం. పైగా పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) మెషీన్ ఖరీదు సుమారు రూ.12 వేల వరకు ఉంది. ఎంపీవోఎస్ ఖరీదు అయిదు వేల వరకు పలుకుతోంది. చౌకైన వ్యవహారం కాబట్టే క్యూఆర్ కోడ్స్ పాపులర్ అయ్యాయి. వినియోగదారులు సైతం డిజిటల్ పేమెంట్లకు మొగ్గు చూపుతుండటమూ వీటి వినియోగం పెరిగేందుకు దోహదం చేసింది. నగదుతో పోలిస్తే చాలా సందర్భాల్లో అతి తక్కువ సమయంలో డిజిటల్ చెల్లింపులు పూర్తి చేయవచ్చు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది మార్చి నాటికి వర్తకుల కోసం 26 కోట్ల పైచిలుకు క్యూఆర్ కోడ్స్ జారీ అయ్యాయి. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా నగదును స్వీకరించే పీవోఎస్ టెర్మినల్స్ 78 లక్షలు ఉన్నాయి. పీవోఎస్ టెర్మినల్స్ను మించి క్యూఆర్ కోడ్స్ జారీ అయ్యాయంటే యూపీఐ ఆధారిత డిజిటల్ చెల్లింపుల వేగాన్ని అర్థం చేసుకోవచ్చు. ఫోన్పే, గూగుల్పే, పేటీఎం వంటి డిజిటల్ పేమెంట్స్ సంస్థలు క్యూఆర్ కోడ్స్ను జారీ చేస్తున్నాయి. ఆధార్ ఆధారంగా.. దేశంలో 99 శాతం మంది పెద్దలు బయోమెట్రిక్ గుర్తింపు సంఖ్యను కలిగి ఉన్నారని ప్రభుత్వం చెబుతోంది. మొత్తం 130 కోట్లకుపైగా ఆధార్ ఐడీలు జారీ అయ్యాయి. ఈ ఐడీలు కొత్తగా బ్యాంక్ ఖాతాలు తెరిచే పనిని సులభతరం చేశాయి. అలాగే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అని పిలిచే తక్షణ చెల్లింపు వ్యవస్థకు పునాదిగా మారాయి. 2016 నవంబర్లో భారత ప్రభుత్వం రూ.500, 1,000 నోట్లను రద్దు చేసింది. నోట్ల కొరత కూడా డిజిటల్ లావాదేవీల వైపు మళ్లడానికి కారణం అయింది. గత ఏడాది భారత్లో ఇన్స్టంట్ డిజిటల్ పేమెంట్స్ లావాదేవీల విలువ యూఎస్, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ల కంటే చాలా ఎక్కువ. ఈ నాలుగు దేశాల మొత్తం లావాదేవీలే కాదు, ఈ మొత్తం విలువను నాలుగుతో గుణించినదాని కంటే భారత లావాదేవీలు అధికమని ఇటీవల వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశం సందర్భంగా కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. దేశంలో 30 కోట్ల పైచిలుకు వ్యక్తులు, 5 కోట్లకు పైగా వర్తకులు యూపీఐ వేదికపైకి వచ్చి చేరారు. భారత్లో 2016 నుంచి.. సౌలభ్యం ఉంది కాబట్టే చెల్లింపుల వ్యవస్థలో రియల్ టైమ్ పేమెంట్ సిస్టమ్ అయిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు విప్లవం సృష్టిస్తోంది. భారత్లో అయితే వీటి లావాదేవీల సంఖ్య, విలువ అనూహ్య రీతిలో పెరుగుతూ వస్తోంది. విభిన్న బ్యాంకు ఖాతాలను పేమెంట్ యాప్కు అనుసంధానం చేయడం ద్వారా నగదుకు బదులు డిజిటల్ రూపంలో చెల్లింపులను సురక్షితంగా, క్షణాల్లో పూర్తి చేయవచ్చు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) 2016 ఏప్రిల్ 11న యూపీఐ సేవలను పైలట్ ప్రాజెక్టుగా 21 బ్యాంకులతో కలసి భారత్లో ప్రారంభించింది. అదే ఏడాది ఆగస్ట్ 25 నుంచి గూగుల్ ప్లే స్టోర్లలో బ్యాంకులు తమ పేమెంట్ యాప్స్ను జోడించడం మొదలుపెట్టాయి. భారత్లో ప్రస్తుతం 414 బ్యాంకులు యూపీఐ సేవలను అందిస్తున్నాయి. కోవిడ్ కాలంలో రెండింతలు.. 2016 డిసెంబర్లో రూ.708 కోట్ల విలువైన యూపీఐ ఆధారిత డిజిటల్ చెల్లింపులు జరిగాయి. 2017లో ఒక నెలలో గరిష్ఠంగా రూ.13,174 కోట్లు నమోదయ్యాయి. 2018 డిసెంబరులో లక్ష కోట్ల మార్కును దాటింది. ఏడాదిలోనే రెట్టింపు అయ్యాయి. 2020 జూలై నుంచి యూపీఐ లావాదేవీల వేగం పుంజుకుంది. ఆ నెలలో రూ.2,90,538 కోట్ల విలువైన 149.7 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి కాలంలో వైరస్ భయానికి నోట్లను ముట్టుకోవడానికి ప్రజలు ససేమిరా అన్నారు. దీంతో డిజిటల్ చెల్లింపులకు మళ్లారు. ఫలితంగా 2020, 2021లో డిజిటల్ లావాదేవీల విలువ రెట్టింపైంది. 2022 మే నెలలో రూ.10 లక్షల కోట్ల మైలురాయి దాటి యూపీఐ సరికొత్త రికార్డు సృష్టించింది. అంటే 40 నెలల్లోనే పదిరెట్లు అయ్యాయంటే పేమెంట్ యాప్స్ ఏ స్థాయిలో ప్రజల్లోకి చొచ్చుకుపోయాయో అర్థం చేసుకోవచ్చు. యూపీఐదే 43 శాతం వాటా.. ఏటీఎమ్ల నుంచి నగదు స్వీకరణ, జమ, చెక్కులు, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు, ఇతర మార్గాల్లో దేశవ్యాప్తంగా నమోదైన ఆర్థిక లావాదేవీల పరిమాణం 2022–23లో 10,620.6 కోట్లు. వీటి విలువ రూ.3,22,36,700 కోట్లు. ఇందులో యూపీఐ సింహభాగం కైవసం చేసుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో యూపీఐ వేదికగా 8,375.1 కోట్ల లావాదేవీలు జరిగాయి. వీటి విలువ రూ.1,39,20,678 కోట్లు. అధికారికంగా జరిగిన మొత్తం ఆర్థిక లావాదేవీల్లో యూపీఐ ఏకంగా 43.18 శాతం వాటా కైవసం చేసుకుందన్న మాట. చెక్ ట్రంకేషన్ సిస్టమ్ (సీటీఎస్) చెక్ క్లియరింగ్ విధానం ద్వారా రూ.71,67,040 కోట్ల లావాదేవీలు జరిగాయి. మొబైల్ ఫోన్స్ ద్వారా బ్యాంకుల మధ్య ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ సేవలైన ఇమ్మీడియేట్ పేమెంట్ సర్వీస్ (ఐఎంపీఎస్) వేదికగా రూ.55,86,147 కోట్లు నమోదయ్యాయి. ఏటీఎమ్లలో నగదు జమ, స్వీకరణ లావాదేవీల విలువ రూ.16,62,419 కోట్లు ఉంది. ప్రజల వద్ద చలామణీలో ఉన్న నగదు రూ.36 లక్షల కోట్లు. ఇవీ డిజిటల్ లావాదేవీలు.. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఫిన్టెక్ మార్కెట్లలో భారత్ ఒకటిగా నిలిచింది. ప్రధానంగా డిజిటల్ చెల్లింపుల విభాగంలో పురోగతి ఇందుకు తోడ్పడింది. 2017–18లో దేశంలో డిజిటల్ లావాదేవీల సంఖ్య 2,000 కోట్లు. గత ఆర్థిక సంవత్సరంలో ఇది 10,000 కోట్లు దాటింది. దీంతో డిజిటల్ లావాదేవీల విలువ 50 శాతానికిపైగా ఎగసింది. యూపీఐ ఇందుకు దోహదం చేసింది. 2022లో రూ.149.5 లక్షల కోట్ల విలువైన 8,792 కోట్ల డిజిటల్ లావాదేవీలు జరిగాయి. ఇందులో రూ.126 లక్షల కోట్ల విలువైన 7,405 కోట్ల లావాదేవీలు యూపీఐ కైవసం చేసుకుంది. డిజిటల్ పేమెంట్ల విలువ 2026 నాటికి 10 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని ఫోన్పే, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఇటీవలి నివేదిక వెల్లడించింది. ఇదే జరిగితే నగదు లావాదేవీల వాటా 60 నుంచి 35 శాతానికి వచ్చి చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి. డిజిటల్ చెల్లింపుల విషయంలో భవిష్యత్ అంతా 3–6 తరగతి శ్రేణి నగరాలు, పట్టణాలదే. గడిచిన రెండేళ్లుగా కొత్త మొబైల్ పేమెంట్ కస్టమర్లలో ఈ నగరాలు, పట్టణాలకు చెందినవారు 60–70 శాతం ఉన్నారట. 2023 మార్చినాటికి భారత్లో 96.12 కోట్ల డెబిట్ కార్డులు జారీ అయ్యాయి. 5.5 కోట్ల మంది వద్ద 8.53 కోట్ల క్రెడిట్ కార్డులు ఉన్నాయి. డిజిటల్ వేదికల రాకతో బ్యాంకులపై భారం గణనీయంగా తగ్గింది. బ్యాంకుల్లో ఇప్పుడు క్యూలు కానరావడం లేదు. ఎక్కడ ఎక్కువంటే.. గ్రాసరీస్, సూపర్మార్కెట్లలో అత్యధికంగా యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయి. ఆ తర్వాతి స్థానంలో ఆహార విక్రయ కేంద్రాలు, రెస్టారెంట్లు, టెలికం సేవలు, ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్స్, గేమ్స్, డిపార్ట్మెంటల్ స్టోర్స్, సర్వీస్ స్టేషన్స్, ఔషధ దుకాణాలు, బేకరీస్ నిలిచాయి. విలువ పరంగా 2023 ఏప్రిల్లో నమోదైన లావాదేవీల్లో వ్యక్తుల నుంచి వ్యక్తులకు (పీర్ టు పీర్) చేరిన మొత్తం 77.18 శాతం. మిగిలినది వ్యక్తుల నుంచి వర్తకులకు (పీర్ టు మర్చంట్) చేరింది. పీర్ టు పీర్ విభాగంలో రూ.2 వేలు ఆపైన విలువ చేసే లావాదేవీలు 87.05 శాతం, రూ.500–2000 వరకు 9.73, రూ.500 లోపు 3.21 శాతం కైవసం చేసుకున్నాయి. పీర్ టు మర్చంట్ విభాగంలో రూ.2,000 పైన 67.3 శాతం, రూ.500–2000 వరకు 17.72, రూ.500 లోపు 15.24 శాతం నమోదయ్యాయి. లావాదేవీల సంఖ్య పరంగా 2023 ఏప్రిల్లో పీర్ టు మర్చంట్ అధికంగా 56.63 శాతం దక్కించుకుంది. మిగిలినది పీర్ టు పీర్ చేజిక్కించుకుంది. పీర్ టు మర్చంట్ విభాగంలో సింహభాగం అంటే 84.27 శాతం లావాదేవీలు రూ.500 లోపు విలువైనవే. రూ.500–2000 విలువ చేసేవి 11.01 శాతం, రూ.2 వేలకుపైగా విలువ కలిగిన కొనుగోళ్లు 4.71 శాతం ఉన్నాయి. వ్యక్తుల నుంచి వ్యక్తులకు రూ.500 లోపు బదిలీ చేసినవి 54.22 శాతం, రూ.500–2,000 వరకు 22.25 శాతం, రూ.2 వేలకుపైగా చెల్లించినవి 23.53 శాతం ఉన్నాయి. ఇంటర్నెట్ తోడుగా.. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ), మార్కెట్ డేటా అనలిటిక్స్ సంస్థ కాంటార్ సంయుక్త నివేదిక ప్రకారం.. భారత్లో సగానికి పైగా జనాభా ఇంటర్నెట్ను తరచుగా వినియోగిస్తోంది. 2022లో దేశవ్యాప్తంగా 75.9 కోట్ల మంది యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు. ఈ స్థాయిలో యాక్టివ్ యూజర్లు ఉండడం భారత్లో ఇదే ప్రథమం. వీరు కనీసం నెలకు ఒకసారైనా నెట్లో విహరిస్తున్నారు. రెండేళ్లలో ఈ సంఖ్య 90 కోట్లకు చేరనుంది. మొత్తం యాక్టివ్ యూజర్లలో 39.9 కోట్ల మంది గ్రామీణ ప్రాంతాల వారు కాగా, మిగిలిన వారు పట్టణ ప్రాంతాల నుంచి ఉన్నారు. దేశీయంగా ఇంటర్నెట్ వినియోగ వృద్ధికి గ్రామీణ ప్రాంతం దన్నుగా నిలుస్తోందనడానికి ఇది నిదర్శనమని నివేదిక వివరించింది. ఏడాది వ్యవధిలో పట్టణ ప్రాంతాల్లో నెట్ వినియోగ వృద్ధి 6 శాతంగా ఉండగా, గ్రామీణ భారతంలో ఇది 14 శాతంగా నమోదైందని వివరించింది. 2025 నాటికి కొత్త ఇంటర్నెట్ యూజర్లలో 56 శాతం మంది గ్రామీణ ప్రాంతాల నుంచే ఉండవచ్చని నివేదిక తెలిపింది. ఇక డిజిటల్ చెల్లింపులు చేసేవారి సంఖ్య 2021తో పోలిస్తే గతేడాది 13 శాతం దూసుకెళ్లి 33.8 కోట్లకు చేరింది. వీరిలో 36 శాతం మంది గ్రామీణ ప్రాంతాలవారు ఉన్నారు. డిజిటల్ చెల్లింపులు చేస్తున్న వారిలో 99 శాతం మంది యూపీఐ యూజర్లే ఉండడం విశేషం. క్రెడిట్ను విస్తరించడానికి.. భారతదేశం యూపీఐ రూపంలో ప్రపంచంలోనే అత్యంత అధునాతన డిజిటల్ చెల్లింపు వ్యవస్థలను కలిగి ఉంది. ఇప్పుడు యూపీఐ పట్టాలను క్రెడిట్ లావాదేవీలకు విస్తరించడానికి సమయం ఆసన్నమైంది. రూపే క్రెడిట్ కార్డ్లపై యూపీఐ లావాదేవీలను ప్రారంభించడం ద్వారా దీని మొదటి దశ ఇప్పటికే ప్రారంభమైంది. అయితే భారత్ కేవలం 5.5 కోట్ల క్రెడిట్ కార్డ్ వినియోగదారులను కలిగి ఉంది. క్రెడిట్ కార్డ్లకు ఎటువంటి లింక్ లేకుండా నిజమైన క్రెడిట్ లావాదేవీలను ప్రారంభించడానికి ఈ పట్టాలను విస్తరించడం చాలా ముఖ్యం. ఇది అధికారిక క్రెడిట్ పరిధికి దూరంగా ఉన్న 60 కోట్లకుపైగా మందికి క్రెడిట్ను విస్తరించడానికి వివిఫై, ఇతర కంపెనీలకు వీలు కల్పిస్తుంది. – అనిల్ పినపాల,ఫౌండర్, వివిఫై ఇండియా ఫైనాన్స్. -
సూపర్ ఫీచర్లతో లెనోవో కొత్త ట్యాబ్ ఎం9: ధర రూ.15 వేల లోపే
సాక్షి,ముంబై: లెనోవో కొత్త ట్యాబ్ను లాంచ్ చేసింది. లెనోవో ట్యాబ్ ఎం9 పేరుతో భారీ మార్కెట్లో కొత్త టాబ్లెట్ను లాంచ్ చేసింది. దీని ధరను రూ. 12,999తోగా నిర్ణయించింది. మార్కెట్లో ఉన్న అత్యంత తేలికైన టి టాబ్లెట్లలో ఎమ్9 ఒకటని కంపెనీ ప్రకటించింది. LTE, Wi-Fi ఓన్లీ ఇలా రెండు వేరియంట్లలో, అలాగే ఫ్రాస్ట్ బ్లూ , స్టార్మ్ గ్రే రంగులలో లెనోవో సరికొత్త ఆండ్రాయిడ్ టాబ్లెట్ లభించనుంది. (వరల్డ్ ఫాస్టెస్ట్ కారు కొన్న దిగ్గజ ఆటగాడు: రూ. 29 కోట్లు) 9 అంగుళాల IPS LCD డిస్ప్లే , 1,340 x 800 పిక్సెల్ల స్క్రీన్ రిజల్యూషన్, ఆండ్రాయిడ్ 12, డాల్బీ అట్మాస్ సపోర్ట్ , MediaTek Helio G80 ఆక్టా-కోర్ ప్రాసెసర్,గరిష్టంగా 64జీబీ స్టోరేజ్,8 ఎంపీ ప్రైమరీ కెమెరా, 2ఎంపీ సెల్ఫీ కెమెరా, 5,100mAh బ్యాటరీ(10W ఛార్జింగ్ సపోర్ట్) గరిష్టంగా 13 గంటల వీడియో ప్లేబ్యాక్ బ్యాటరీ లైఫ్ ,ఫేస్-అన్లాక్ లాంటివి ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. డ్యూయల్-టోన్ మెటల్ ఛాసిస్ 344 గ్రాముల బరువుతో తీసుకొచ్చిన పట్టుకోవడానికి ఎం9 సౌకర్యంగా ఉంటుంది. జూన్ 1 నుండి రూ. 12,999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంటుంది. కస్టమర్లు సంస్థ అధికారిక వెబ్సైట్తోపాటు, అమెజాన్, ఫ్లిప్కార్ట్ తోపాటు, రిలయన్స్ డిజిటల్, క్రోమా ఆఫ్లైన్ రిటైల్ స్టోర్లలో ముందస్తు ఆర్డర్ చేసుకోవచ్చు. (మరో సంచలనం: బ్రెయిన్ చిప్, మస్క్కు గ్రీన్ సిగ్నల్) ఇలాంటి మరిన్ని ఇంట్రస్టింగ్ వార్తలు, అప్డేట్స్ కోసం చదవండి సాక్షిబిజినెస్ -
మిడ్-రేంజ్ స్మార్ట్ఫోన్ కావాలా? తగ్గింపు ధరలో ఇదిగో బెస్ట్ ఆప్షన్!
సాక్షి, ముంబై: లావా అగ్ని-2 5జీ స్మార్ట్ఫోన్పై తగ్గింపుతో అందుబాటులో ఉంది. రూ. 2000 తగ్గింపుతో బుధవారం నుంచి దేశీయ మార్కెట్లో అమ్మకానికి సిద్ధంగా ఉంది. ముఖ్యంగా మిడ్-రేంజ్ స్మార్ట్ఫోన్ కోసం చూస్తున్న వారికి లావా అగ్ని 2 5జీ బెస్ట్ అని చెప్పవచ్చు. ఈ రోజు (మే 24) నుండి ఈ స్మార్ట్ఫోన్ అమెజాన్లో అమ్మకానికి సిద్ధంగా ఉంది. (నైజిరియన్ చెఫ్ రికార్డ్: ఏకంగా 100 గంటలు వంట, ఎందుకో తెలుసా?) లావా అగ్ని 2 5జీ ఫీచర్లు 6.78-అంగుళాల FHD+ స్క్రీన్, మీడియా టెక్ సరికొత్త డైమెన్సిటీ 7050 ప్రాసెసర్, 16 ఎంపీ సెల్పీ కెమెరా 1.0-మైక్రాన్ (1 um) పిక్సెల్ సెన్సార్తో 50ఎంపీ క్వాడ్ కెమెరా 8 జీబీ ర్యామ్ 256జీబీ స్టోరేజ్ 6W ఛార్జర్తో 4700mAh బ్యాటరీ ఫోన్ ధర రూ. 21,999 వద్దర ఆన్లైన్ స్టోర్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. అయితే ప్రధాన క్రెడిట్ , డెబిట్ కార్డ్లపై రూ. 2,000 ఫ్లాట్ తగ్గింపుతో రూ. 19,999 లభించనుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. (‘నేనే కింగ్’: మాంగో అయినా లగ్జరీ వాచ్ అయినా...!) ఇదీ చదవండి: ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న ‘గార్బేజ్ క్వీన్స్’ : వైరల్ ఫోటోలు -
సింపుల్ వన్: లాంగెస్ట్ రేంజ్ స్కూటర్ వచ్చేసింది, ధర ఎంతో తెలుసా?
చెన్నై: ఎలక్ట్రిక్ టూ వీలర్ల తయారీలో ఉన్న బెంగళూరు కంపెనీ సింపుల్ ఎనర్జీ తాజాగా సింపుల్ వన్ మోడల్ను ప్రవేశపెట్టింది. ధర బెంగళూరు ఎక్స్షోరూంలో రూ.1.45 లక్షలు. ఒకసారి చార్జింగ్తో 212 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. కస్టమర్లు రూ. 13,000 అదనంగా చెల్లించి 750-వాట్ల పోర్టబుల్ ఛార్జర్ని తీసుకోవచ్చు. (వార్నీ.. రేఖలా మారిపోయిన అమితాబ్, అందంగా సల్మాన్ ఖాన్) 2021 ఆగస్ట్ 15న రూ.1.10 లక్షల ధరతో ఈ మోడల్ను కంపెనీ ఆవిష్కరించింది. కాగా, జూన్ 6 నుంచి డెలివరీలు ప్రారంభం అవుతాయని సింపుల్ ఎనర్జీ తెలిపింది. దేశవ్యాప్తంగా విస్తరణ, సామర్థ్యం పెంపునకు వచ్చే 12-18 నెలల్లో సుమారు రూ.820 కోట్లు వెచ్చించనున్నట్టు సంస్థ ఫౌండర్ సుహాస్ రాజ్కుమార్ తెలిపారు. ఏడాదిలో 40-50 నగరాల్లో 180 వరకు ఔట్లెట్లను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. సింపుల్ వన్ కోసం ఇప్పటికే ఒక లక్ష యూనిట్లకు బుకింగ్స్ ఉన్నాయని వెల్లడించారు. ధర రూ.35 వేలు పెరిగినప్పటికీ బుకింగ్స్ రద్దు కాకపోవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తమిళనాడులోని శూలగిరి వద్ద ప్లాంటుకు ఇప్పటికే కంపెనీ రూ.110 కోట్లు ఖర్చు చేసింది. వార్షిక తయారీ సామర్థ్యం 5 లక్షల యూనిట్లు. (కొత్త వ్యాపారంలోకి నయన్, అంత సాహసం ఎందుకు చేస్తోంది? క్లారిటీ) -
Realme Narzo N53 లాంచ్ : స్పెషల్ ఆఫర్ రూ. 9వేలకే
సాక్షి, ముంబై: బడ్జెట్ ధరలస్మార్ట్ఫోన్ మేకర్ రియల్మీ తాజగా కొత్త స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. రియల్మీ నార్జో ఎన్53 పేరుతో రెండు వేరియంట్లలో 4 జీబీ ర్యామ్+64 జీబీ స్టోరేజ్, ధర రూ. 8,999, 6జీబీ ర్యామ్+ 125 జీబీ స్టోరేజ్ ధర రూ. 10,999 వద్ద లభ్యం. (Infosys: ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం, షాక్లో ఉద్యోగులు!) ఈ స్మార్ట్ఫోన్ మే 24 నుంచి రియల్మీ, Amazon సైట్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఫెదర్ గోల్డ్, ఫెదర్ బ్లాక్ కలర్ వేరియంట్లలో లభ్యం. పరిచయ ఆఫర్గా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డ్ కొనుగోలుపై రూ. 1,000 వరకు తగ్గింపును అందిస్తోంది. రియల్మీ నార్జో ఎన్53 ఫీచర్లు 6.74-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్. . ఫోన్ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్, 90.3 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తిని అందిస్తుంది. Unisoc T612 SoC చిప్సెట్ , ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ 8 ఎంపీ సెల్ఫీ కెమెరా వద్ద వాటర్ డ్రాప్ నాచ్ ఫీచర్ ఉంది. f/1.8 ఎపర్చరు, 5P లెన్స్ ,LED ఫ్లాష్తో కూడిన 50MP ప్రైమరీ కెమెరా సెన్సార్ అందిస్తోంది ఇందులో నైట్ మోడ్, పనోరమిక్ వ్యూ, ఎక్స్పర్ట్, టైమ్లాప్స్, పోర్ట్రెయిట్ మోడ్, HDR, AI సీన్ రికగ్నిషన్, స్లో మోషన్ , బోకె ఎఫెక్ట్ కంట్రోల్ లాంటివి ఉన్నాయి. 33W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 5,000mAh బ్యాటరీ మరిన్ని టెక్ న్యూస్, గాడ్జెట్స్ వార్తల కోసం చదవండి: సాక్షి బిజినెస్ ఇదీ చదవండి : Massive layoffs: 55వేలమందిని తొలగించనున్న అతిపెద్ద టెలికాం సంస్థ -
Enigma హై-స్పీడ్ ఎలక్ట్రిక్ టూ-వీలర్లు కమింగ్ సూన్!
నోయిడా: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఎనిగ్మా త్వరలో ఆరు హై–స్పీడ్ టూ వీలర్లను ప్రవేశపెట్టనుంది. ఈ ఏడాది ఆఖరు నాటికి ఇవిఅందుబాటులోకి రాగలవని సంస్థ ఎండీ అన్మోల్ బోహ్రీ తెలిపారు. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తగలిగే కెఫే రేసర్-ఎనిగ్మా సీఆర్22 వీటిలో ఉండనున్నట్లు వివరించారు. ఒక్కసారి చార్జి చేస్తే ఇది 105 కి.మీ. రేంజి ఇస్తుందని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: (యూట్యూబ్ వీడియో లైక్ చేస్తే..రోజుకు రూ. 8వేలు: కట్ చేస్తే!) గిఫ్ట్ నిఫ్టీగా ఎస్జీఎక్స్ నిఫ్టీ జూలై 3 నుంచి అమల్లోకి సింగపూర్లో ట్రేడయ్యే నిఫ్టీ సూచీ పేరు ఎస్జీఎక్స్ నిఫ్టీ నుంచి గిఫ్ట్ నిఫ్టీగా మారనుంది. జూలై 3 నుంచి ఇది అమల్లోకి రానున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) తెలిపింది. ఎస్జీఎక్స్ ఆర్డర్లు అన్నీ మ్యాచింగ్ కోసం గిఫ్ట్ సిటీలోని ఎన్ఎస్ఈ ఐఎఫ్ఎస్సీ ఎక్స్ఛేంజీకి బదలాయించనున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో ఎన్ఎస్ఈ అనుబంధ సంస్థ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్ (ఐఎఫ్ఎస్సీ) ఎక్స్ఛేంజీ ఉంది. (టీ స్టాల్ కోసం ఐఏఎస్ డ్రీమ్ను వదిలేశాడు: ఏకంగా ఏడాదికి రూ. 150 కోట్లు ) -
ఒప్పో ఎఫ్ 23 5జీ స్మార్ట్ఫోన్ లాంచ్, ధర, ఫీచర్లు తెలుసుకోండి!
సాక్షి,ముంబై: స్మార్ట్ఫోన్ మేకర్ ఒప్పో కొత్త స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లో లాంచ్చేసింది. ఒప్పో ఎఫ్23 పేరుతరు 5జీ మొబైల్ను తీసుకొచ్చింది. దీని ప్రారంభ ధర రూ. 24,999గా నిర్ణయించింది కంపెనీ. ఇందులో 64 ఎంపీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. బోల్డ్ గోల్డ్ , కూల్ బ్లాక్ రెండు రంగులలో మే 18 నుంచి ఒప్పో Oppo స్టోర్, అమెజాన్ , మెయిన్లైన్ రిటైల్ అవుట్లెట్లలో అందుబాటులో ఉంటుంది. ఒప్పో ఎఫ్23 5జీ స్పెసిఫికేషన్స్ 6.72-అంగుళాల 3D కర్వ్డ్ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ 91.4% స్క్రీన్-టు-బాడీ రేషియో క్వాల్కం స్నాప్డ్రాగన్ సాక్ 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ 1 టీబీ వరకు విస్తరించుకునే అవకాశం 64 ఎంపీ ఏఐ కెమెరా 2+2 ఎంపీ రియర్ ట్రిపుల్ కెమెరా 5000mAh బ్యాటరీ 67W SUPERVOOCTM ఫ్లాష్ ఛార్జింగ్ ఇది కేవలం 18 నిమిషాల్లో ఫోన్ను 50శాతం వరకు ఛార్జ్, 5 నిమిషాల ఛార్జ్ గరిష్టంగా 6 గంటల ఫోన్ కాల్లను లేదా 2.5 గంటల YouTube వీడియోలు చూడొచ్చు. పూర్తిగా ఛార్జ్ చేస్తే, 39 గంటల ఫోన్ కాల్స్ , 16 గంటల యూట్యూబ్ వీడియో లు చూడొచ్చని కంపెనీ వెల్లడించింది. -
చీపెస్ట్ ఈవీ ‘ఎంజీ కామెట్’ వెయిటింగ్కు చెక్: బుకింగ్ ప్రైస్ తెలిస్తే!
సాక్షి, ముంబై: ఎంజీ మోటార్స్ కాంపాక్ట్ ఈవీ కామెట్ కోసం ఎదురు చూస్తున్న వారికి కంపెనీ తీపి కబురు. భారతదేశపు చౌకైన ఎలక్ట్రిక్ కారు ఎంజీ కామెట్ ఇవీ ఇప్పుడు బుకింగ్లకు అందుబాటులో ఉంది. ఎంజీ మోటార్ ఇండియా వెబ్సైట్ ద్వారా లేదా ఎంజీ డీలర్షిప్ల వద్ద కస్టమర్లు కేవలం రూ. 11వేలు మాత్రమే చెల్లించి మే బుక్ చేసుకోవచ్చు. కంపెనీ ‘MyMG’ యాప్లో ‘ట్రాక్ అండ్ ట్రేస్’ ఫీచర్ను కూడా ప్రవేశపెట్టింది. కస్టమర్లు తమ కార్ బుకింగ్ల స్టేటస్ను వారి ఫోన్ల నుండే ట్రాక్ చేయవచ్చు. కామెట్ ఈవీ ప్రత్యేక ఆఫర్ ధరలో అందుబాటులో ఉంటుంది. పేస్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 7.98 లక్షలు. ప్లే, ప్లష్ వేరియంట్ ధరలు రూ. 9.28 లక్షలు, రూ. 9.98 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి. ఈ ఆఫర్ మొదటి 5వేల బుకింగ్లకు మాత్రమే పరిమితం. మే నెలలోనే దశలవారీ డెలివరీలు ప్రారంభమని కంపెనీ తెలిపింది. (టీ స్టాల్ కోసం ఐఏఎస్ డ్రీమ్ను వదిలేశాడు: ఏకంగా ఏడాదికి రూ. 150 కోట్లు) కామెట్ ఈవీ: 10.25-అంగుళాల డిజిటల్ క్లస్టర్తో ఫ్లోటింగ్ట్విన్ డిస్ప్లే వైడ్స్క్రీన్తో వస్తోంది. ఫుల్లీ కస్టమైజ్డ్ విడ్జెట్లతో కూడిన ఎంటర్టైన్మెంట్ సిస్టమ్, స్మార్ట్ కీ మరో ప్రత్యేక లక్షణం, స్టైలిష్ డిజైన్ కామెట్ ఒకే ఛార్జ్పై దాదాపు 230 కి.మీ పరిధిని అందజేస్తుందని కంపెనీ పేర్కొన్న సంగతి తెలిసిందే. Introducing the MG Comet EV, the no-nonsense car that keeps it real. The car’s latest tech keeps you connected with your squad and has all the space for your fam. Experience the plush interiors, latest tech and futuristic design of the Comet EV! Bookings open now! #MGCometEV — Morris Garages India (@MGMotorIn) May 13, 2023 ఇదీ చదవండి: స్వీట్ కపుల్ సక్సెస్ స్టోరీ: తొలి ఏడాదిలోనే రూ.38 కోట్లు -
ప్యూర్ ఈవీ కొత్త ఈ-స్కూటర్:150 కి.మీ రేంజ్, ధర ఎంతంటే?
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్కు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ప్యూర్ ఈవీ కొత్త ఇ-స్కూటర్ను పరిచయం చేసింది. ప్యూర్ ఈవీ ఈప్లూటో 7జీ ప్రో పేరుతో టాప్ ఎండ్ మోడల్ స్కూటర్ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. PURE EV ePluto 7G ప్రో రూ. 94,999 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరగా ప్రకటించింది. బుకింగ్లను ఇప్పటికే ప్రారంభించగా, డెలివరీలు మే 2023 చివరి నాటికి ప్రారంభమవుతాయి. (మోటో వాచ్ 200 వచ్చేస్తోంది...ఫీచర్లు చూశారా!) ప్యూర్ ఈవీ ఈప్లూటో 7జీ ప్రో : బ్యాటరీ, ఫీచర్లు ఏఐఎస్ 156 సర్టిఫైడ్ 3.0 kWh బ్యాటరీ ప్యాక్, 1.5 kW ఎలక్ట్రిక్ మోటార్ను ఇందులోజత చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎంపిక చేసిన మోడ్ను బట్టి ఒకే ఛార్జ్పై 100 -150 కిమీల డ్రైవింగ్ పరిధిని అందిస్తుందని, మూడు రైడింగ్ మోడ్లు లభిస్తాయని కంపెనీ పేర్కొంది. స్మార్ట్ బీఎంఎస్, బ్లూటూత్ కనెక్టివిటీ, రౌండ్ LED హెడ్ల్యాంప్ లాంటి ఇతర ఫీచర్లుగా ఉన్నాయి. మాట్ బ్లాక్, గ్రే , వైట్ మూడు కలర్ వేరియంట్లలో ఇది లభించనుంది. తమ బెస్ట్ సెల్లింగ్ 7జీ మోడల్కు ఇది అప్గ్రేడ్ వెర్షన్ అని, లాంగర్ రేంజ్ స్కూటర్లను కోరుకునే కస్టమర్ల లక్ష్యంగా దీన్ని తీసుకొచ్చినట్టు ప్యూర్ ఈవీ కో-ఫౌండర్, సీఈఓ రోహిత్ వదేరా లాంచింగ్ సందర్బంగా తెలిపారు. ప్రీ-లాంచ్ టైంలోనే 5వేల బుకింగ్లను అందుకున్నామంటూ సంతోషం ప్రకటించారు. తొలి నెలలో 2వేలకు పైగా బుకింగ్లను ఆశిస్తున్నామన్నారు. మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాల వార్తలకోసం చదవండి ‘సాక్షి బిజినెస్’ మీకెలాంటి వార్తలు కావాలో కామెంట్ల ద్వారా తెలియజేయండి. -
మోటో వాచ్ 200 వచ్చేస్తోంది...ఫీచర్లు చూశారా!
సాక్షి,ముంబై: స్మార్ట్ఫోన్ తయారీదారు మోటోరోలా త్వరలోనే మోటో వాచ్లను లాంచ్ చేయనుంది. కొన్ని కీలక స్పెక్స్, డిజైన్లతో టెస్ట్ స్మార్ట్వాచ్లను వెబ్సైట్లో వెల్లడించింది. మోటో స్మార్ట్వాచ్ లైనప్లో మోటోవాచ్ 70, మోటోవాచ్ 200 లిస్ట్ చేసింది. బడ్జెట్-సెంట్రిక్ వినియోగదారుల కోసం మోటో వాచ్ 70ని, ప్రీమియం ఫీచర్లతో మోటో వాచ్ 200 ద్వారా ప్రీమియం స్మార్ట్ వాచ్ సెగ్మెంట్లోకి ఎంట్రీ ఇస్తోంది. మోటో వాచ్ 200 ఫీచర్లు: డిస్ప్లే: 1.78 అంగుళాలు బ్యాటరీ: 355 ఎంఏహెచ్ (14 రోజుల వరకు) 5 ఏటియం వాటర్ప్రూఫ్; హార్ట్రేట్ మానిటర్ ఎస్పీవో2 మీటర్ బ్లూటూత్: 5.3 ఎల్ఈ; బిల్డ్–ఇన్ జీపిఎస్ మైక్రోఫోన్, స్పీకర్ కలర్స్: వార్మ్ గోల్డ్ అండ్ ఫాంటమ్ బ్లాక్. కంపెనీ ఇంకా ధరను వెల్లడించనప్పటికీ, ధర సుమారురూ. 12 వేలు (149.99 డాలర్లు) ఉంటుందని అంచనా. మోటో వాచ్ 70 కర్వ్డ్ 1.69-అంగుళాల LCD డిప్స్లే, 43mm జింక్ అల్లాయ్ కేస్, హార్ట్రేట్ మానిటర్ , టెంపరేచర్ సెన్సార్, స్లీప్ ట్రాకింగ్ లాంటి ప్రధాన ఫీచర్లున్నాయి. -
నోకియా సీ22 స్మార్ట్ఫోన్ వచ్చేసింది: అదిరే ఫీచర్లు, అతి తక్కువ ధర
సాక్షి, ముంబై: బడ్జెట్ ఫోన్ల సంస్థ నోకియా మరోసారి తన ఫ్యాన్స్ను మెస్మరైజ్ చేసింది. అతి తక్కువ ధరలో నోకియా సీ 22 ఫోన్నుభారత మార్కెట్లోలాంచ్ చేసింది. మెరుగైన డ్రాప్ ప్రొటెక్షన్తో భారత దేశంలో విడుదల చేస్తున్నట్లు హెచ్ఎండీ గ్లోబల్ గురువారం ప్రకటించింది. (BharatPe controversy: అష్నీర్ గ్రోవర్, ఫ్యామిలీకి భారీ షాక్ ) దీని ధర రూ. 7999 గా నిర్ణయించింది. చార్కోల్, సాండ్, పర్పుల్ కలర్స్ లభ్యం. 4జీబీ ర్యామ్ 2 జీబీ వర్చువల్ స్టోరేజ్, 4జీబీ (2GB + 2GB RAM), 6జీబీ(4GB + 2GB వర్చువల్ RAM) 64జీబీ స్టోరేజ్ కాన్ఫిగరేషన్తో లభించ నుంది. మూడు రోజుల బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. ఏడాది రిప్లేస్మెంట్ గ్యారంటీతోపాటుఅందిస్తున్న నోకియా సీ 22 ఈ రోజు నుంచే( మే 11) కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఇంకా IP52గా రేట్ బ్యాటరీ సేవర్ ఫీచర్ , స్ప్లాష్ అండ్ డస్ట్ ప్రొటెక్షన్ ఇస్తుందని కంపెనీ తెలిపింది. (శాంసంగ్ 32 అంగుళాల స్మార్ట్టీవీ: కేవలం రూ. 5వేలకే) నోకియా సీ-సిరీస్ నమ్మదగిన, సరసమైన స్మార్ట్ఫోన్లను అందించడంలో కస్టమర్ల నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయదని హెచ్ఎండీ గ్లోబల్ ప్రొడక్ట్ మార్కెటింగ్ హెడ్ ఆడమ్ ఫెర్గూసన్ ఒక ప్రకటనలో తెలిపారు. నోకియా సీ22 ఫీచర్లు 6.5 అంగుళాల HD+ డిస్ప్లే ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్ 13 ఎంపీ డ్యూయల్ రియల్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 5000 mAh బ్యాటరీ Introducing the all-new Nokia C22 comes with 4GB RAM + 2GB virtual RAM, 13MP dual rear camera, 1 year replacement guarantee and 3-day battery life to make you #LiveUntamed. Buy now: https://t.co/tKvqK84hWj#NokiaC22 pic.twitter.com/gVNg4kA7ki — Nokia Mobile India (@NokiamobileIN) May 11, 2023 -
భారత్లో ఎంజీ మోటార్ రెండో ప్లాంటు!
న్యూఢిల్లీ: వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్ ఇండియా మరో ప్లాంటును ఏర్పాటు చేయాలని భావిస్తోంది. 1.8 లక్షల యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ఇది రానుంది. గుజరాత్లోని హలోల్ వద్ద 1.2 లక్షల యూనిట్ల వార్షిక తయారీ సామర్థ్యంతో కంపెనీకి ఇప్పటికే ప్లాంటు ఉంది. జనరల్ మోటార్స్ నుంచి ఈ కేంద్రాన్ని కొనుగోలు చేసింది. భారత్లో అయిదేళ్ల వ్యాపార ప్రణాళికలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ 4–5 కొత్త మోడళ్లను ప్రవేశపెట్టాలని ఎంజీ మోటార్ ఇండియా నిర్ణయించింది. 2028 నాటికి మొత్తం విక్రయాల్లో ఈవీల వాటా 65–75 శాతానికి చేరవచ్చని కంపెనీ భావిస్తోంది. సంయుక్త భాగస్వామ్య కంపెనీ లేదా థర్డ్ పార్టీ ద్వారా సెల్ తయారీ, హైడ్రోజన్ ప్యూయల్ సెల్ టెక్నాలజీలోని ప్రవేశించే అవకాశాలను అన్వేషిస్తున్నట్టు వెల్లడించింది. దేశంలో ఉద్యోగుల సంఖ్యను 20,000 స్థాయికి చేర్చాలని భావిస్తోంది. మెజారిటీ వాటా విక్రయం.. వచ్చే 2–4 ఏళ్లలో మెజారిటీ వాటాలను స్థానిక భాగస్వాములకు విక్రయించాలన్నది ఎంజీ మోటార్ ఇండియా ప్రణాళిక. 2028 నాటికి దేశంలో కార్యకలాపాలను విస్తరించేందుకు రూ.5,000 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించిన ఈ సంస్థ.. తదుపరి దశ వృద్ధికి నిధులు సమకూర్చేందుకు కొంత కాలంగా మూలధనాన్ని సమీకరించాలని చూస్తోంది. చైనా నుండి భారత్కు మరింత మూలధనాన్ని తీసుకురావాలన్న కంపెనీ ప్రణాళికలు ఇప్పటివరకు విజయవంతం కాలేదు. రెండేళ్లుగా ప్రభుత్వ అనుమతి కోసం వేచి ఉన్న ఎంజీ మోటార్ ఇండియా మూలధనాన్ని పెంచడానికి ఇతర మార్గాలను వెతకడం ప్రారంభించింది. లక్ష మంది విద్యార్థులు.. ఎంజీ నర్చర్ కార్యక్రమం కింద 1,00,000 మంది విద్యార్థులను ఈవీ, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీస్ విభాగాల్లో శిక్షణ ఇవ్వనున్నట్టు ఎంజీ మోటార్ ఇండియా సీఈవో రాజీవ్ ఛాబా తెలిపారు. బ్రిటిష్ బ్రాండ్ అయిన ఎంజీ మోటార్ ప్రస్తుతం చైనాకు చెందిన దిగ్గజ వాహన తయారీ సంస్థ ఎస్ఏఐసీ మోటార్ కార్పొరేషన్ చేతుల్లో ఉంది. భారత మార్కెట్లో హెక్టర్, ఆస్టర్, గ్లోస్టర్, జడ్ఎస్ ఈవీని విక్రయిస్తోంది. ఇటీవలే చిన్న ఎలక్ట్రిక్ వాహనం కామెట్ను ఆవిష్కరించింది. -
లావా బ్లేజ్ 1ఎక్స్ 5జీ చూశారా? బడ్జెట్ ధరలో కొత్త 5జీ స్మార్ట్ఫోన్
సాక్షి,ముంబై: స్వదేశీ మొబైల్ తయారీ సంస్థ లావా మొబైల్స్ సరికొత్త 5జీ స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లోలాంచ్ చేసింది. Lava Blaze 1X 5G పేరుతో బడ్జెట్ 5జీ ఫోన్ను తీసుకొచ్చింది. గత ఏడాది తీసుకొచ్చి బ్లేజ్ 5జీ అప్గ్రేడెడ్ వెర్షన్గా దీన్ని అందుబాటులోకి తెచ్చింది. లావా బ్లేజ్ 1 ఎక్స్ 5జీ స్పెసిఫికేషన్లు 6.5 అంగుళాల IPS LCD డిస్ప్లే 1600 × 720 పిక్సెల్స్ HD+ రిజల్యూషన్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 SoC చిప్సెట్ 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ f/1.8 ఎపర్చర్ 50+2+వీజీఏ రియర్ ట్రిపుల్ కెమెరా 8ఎంపీ సెల్ఫీ కెమెరా 5000mAh బ్యాటరీ, 12W ఛార్జర్, ధర: రూ.11,999. ఇది గ్లాస్ గ్రీన్ , గ్లాస్ బ్లూ రంగులలో ప్రత్యేకంగా ఆఫ్లైన్ ప్లాట్ఫారమ్లలో అందుబాటులో ఉంటుంది. -
రూ.8 లక్షలకే ఎంజీ ఎలక్ట్రిక్ కారు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్ ఇండియా దేశీయ మార్కెట్లో చౌకైన ఎలక్ట్రిక్ వెహికిల్ కామెట్ను ప్రవేశపెట్టింది. ధర ఎక్స్షోరూంలో రూ.7.98 లక్షలు. ఒకసారి చార్జింగ్తో 230 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 17.3 కిలోవాట్ అవర్ లిథియం అయాన్ బ్యాటరీ పొందుపరిచారు. ఏడు గంటల్లో చార్జింగ్ పూర్తి అవుతుంది. రెండు డోర్లు, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, రెండు ఎయిర్బ్యాగ్స్, రివర్స్ పార్కింగ్ కెమెరా వంటి హంగులు ఉన్నాయి. ఎలక్ట్రిక్ విభాగంలో ఎంజీ ఇప్పటికే భారత్లో జడ్ఎస్ ఈవీ మోడల్ను విక్రయిస్తోంది. గుజరాత్లోని హలోల్ ప్లాంటులో కామెట్ కార్లను తయారు చేస్తున్నారు. -
వివో ఎక్స్ 90, 90ప్రొ స్మార్ట్ఫోన్లు లాంచ్, ధరలు చూస్తే
సాక్షి, ముంబై: చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ వివో ఎక్స్ సిరీస్లో కొత్త మోడల్స్ను భారతీయ మార్కెట్లోకి లాంచ్ చేసింది. వివో ఎక్స్90, ఎక్స్90 ప్రొ స్మార్ట్ఫోన్లను బుధవారం లాంచ్ చేసింది. MediaTek డైమెన్సిటీ 9200 SoC,కెమెరా-ఫోకస్డ్ Zeiss-బ్రాండెడ్ ట్రిపుల్ రియర్, V2 చిప్ ప్రధాన ఆకర్షణగా ఉండనున్నాయి. ఇప్పటికే చైనా, మలేషియాలో లభ్యమవుతున్న ఈ స్మార్ట్ఫోన్లు వచ్చే వారం దేశంలో అందుబాటులోకి వస్తున్నాయి గత ఏడాది ఎక్స్ 80 సిరీస్ను లాంచ్ చేసిసక్సెస్ అయిన సంగతి తెలిసిందే. వివో ఎక్స్ 90 ప్రొ, వివో ఎక్స్ 90 ధర, లభ్యత వివో ఎక్స్ 90 ప్రొ ధర సింగిల్ వేరియంట్ను తీసుకొచ్చింది. 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ధర రూ. 84,999. లెజెండరీ బ్లాక్ షేడ్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. (ఓర్నీ వయ్యారం..ఇదేమి ట్రైన్ భయ్యా! ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్న వీడియో) వివో ఎక్స్ 90 రూ. 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ 59,999గా ఉంది. అలాగే 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 63,999. ఆస్టరాయిడ్ బ్లాక్ , బ్రీజ్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభ్యం. (ముంబై ఇండియన్స్ బాస్ గురించి తెలుసా? అంబానీని మించి సంపాదన) ఈ రెండు మోడల్స్ ప్రస్తుతం ప్రీ-బుకింగ్కు సిద్ధంగా ఉన్నాయి . మే 5 నుండి అమ్మకాలు ప్రారంభం. ఫ్లిప్కార్ట్, వివో ఇండియా ఆన్లైన్ స్టోర్లు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటాయి.ఎస్బీఐ, ఐసీఐసీఐ,హెచ్డీఎఫ్సీ, ఐడీఎఫ్సీ బ్యాంక్ కార్డ్లను ఉపయోగించి కొత్త స్మార్ట్ఫోన్లను ప్రీ-బుకింగ్ చేసే కస్టమర్లు 10 శాతం వరకు క్యాష్బ్యాక్ పొందవచ్చు. ఇక స్పెసిఫికేషన్స్కి వస్తే..దాదాపు రెండు మోడల్స్ ఫీచర్లు దాదాపు ఒకేలా ఉన్నాయి. వివో ఎక్స్ 90 ప్రొ స్పెసిఫికేషన్స్ 6.78-అంగుళాల AMOLED 3D కర్వ్డ్ డిస్ప్లే 1,260x 2,800 పిక్సెల్స్ రిజల్యూషన్ Android 13-ఆధారిత FunTouch OS, 120Hz రిఫ్రెష్ రేట్ ఆక్టా-కోర్ 4nm MediaTek డైమెన్సిటీ 9200 SoC 50+50+12 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 50W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్, 4,870mAh బ్యాటరీ 8 నిమిషాల్లో సున్నా నుంచి 50 శాతం వరకు బ్యాటరీ ఛార్జ్ ఇదీ చదవండి: MG Comet EV: ఎంజీ కామెట్ కాంపాక్ట్ ఈవీ వచ్చేసింది..యూజర్లకు పండగే! -
ఎంజీ కామెట్ కాంపాక్ట్ ఈవీ వచ్చేసింది..యూజర్లకు పండగే!
సాక్షి, ముంబై: ఎప్పటినుంచో ఎదురు చేస్తున్న ఎంజీ బుజ్జి ఈవీ కామెట్ లాంచ్ అయింది. అందరూ ఊహించినట్టుగానే రూ. 10లక్షల లోపు ధరతోనే తీసుకొచ్చింది. పరిచయ ఆఫర్గా దీని ప్రారంభ ధరను రూ.7.98 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది. సిటీ రన్అబౌట్ కోసం చూస్తున్న కొనుగోలుదారులే లక్ష్యంగా స్పోర్టీ లుక్, యూనిక్ కలర్స్లో కామెట్ ఈవీ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ను లాంచ్ చేసింది. అందుబాటులో లభ్యం కానున్న ఈ కారు ఛార్జింగ్ ఖర్చు చాలా తక్కువేనని సగటున నెలకు ధర రూ. 519 ఖర్చవుతుందని కంపెనీ వెల్లడించింది. ఎంజీ కామెట్ ఈవీ ఎలక్ట్రిక్ ధర, లభ్యత కామెట్ ఈవీ ప్రారంభ ధర రూ.7.98లక్షలు (ఎక్స్-షోరూమ్). ఏప్రిల్ 27 నుండి టెస్ట్ డ్రైవ్కి అందుబాటులో ఉంటుంది. బుకింగ్లు మే 15న ప్రారంభమవుతాయి. డెలివరీలు నెల తర్వాత మొదలవుతాయి. వైట్, బ్లాక్, సిల్వర్ సింగిల్ కలర్ ఆప్షన్లతో ఎంజీ కామెట్ ఈవీ ఎలక్ట్రిక్ కారు వచ్చింది. బ్లాక్ రూఫ్తో గ్రీన్, బ్లాక్ రూఫ్తో వైట్ డ్యుయల్ టోన్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉంటాయి. (ఏఐపై ఆనంద్ మహీంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు: అద్భుతమైన వీడియో ) ఎంజీ కామెట్ ఈవీ ఎలక్ట్రిక్ ఫీచర్లు ఎంజీ కామెట్ ఈవీ ఎలక్ట్రిక్ కారు 17.3kWh బ్యాటరీతో వచ్చింది. ఇది 41 hp పీక్ పవర్ను, 110 Nm పీక్ టార్క్యూను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక దీని టాప్ స్పీడ్ గంటకు 100 కిలోమీటర్లు (100kmph)గా ఉంది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 230 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని ఎంజీ మోటార్స్ పేర్కొంది. ఎకో, నార్మల్, స్పోర్ట్ అనే మూడు డ్రైవింగ్ మోడ్లతో కామెట్ ఈవీని తీసుకొచ్చింది. 2,974mm పొడవు, 1,505mm వెడల్పు ,1,640mm ఎత్తును 2,010mm వీల్బేస్తో వచ్చింది. ఇక పరిమాణాన్ని దృష్టిలో ఉంచుకుంటే, భారతదేశంలో లభించే ఇతర చిన్న కారు ఆల్టో K10 కంటే , కామెట్ ఈవీ కంటే 556 మిమీ పొడవు తక్కువ. 10.25 ఇంచుల సైజ్ ఉండే రెండు స్క్రీన్లలో ఒకటి ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లేగా, రెండోది ఆల్-డిజిటల్ డ్రైవర్ డిస్ప్లేగా ఉంటుంది. యాపిల్ కార్ ప్లేకు సపోర్ట్ చేసే ఆండ్రాయిడ్ ఆటో కంట్రోల్లతో కూడిన టూ స్పోక్ స్టీరింగ్ వీల్ ఉంటుంది. ఇంకా 12 ఇంచుల వీల్స్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, టైల్ ల్యాంప్స్, డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్, రేర్ పార్కింగ్ కెమెరా, కీలెస్ ఎంట్రీ లాంటి ప్రధాన ఫీచర్లున్నాయి. టాటా టియాగో ఈవీ, సిట్రాయిన్ ఈసీ3 ఎలక్ట్రిక్ కార్లకు ఎంజీ కామెట్ ఈవీ గట్టిపోటీ ఇవ్వనుంది. టాటా టియాగోతో పోలిస్తే ధర కూడా తక్కువే కావడం గమనార్హం. (ముంబై ఇండియన్స్ బాస్ గురించి తెలుసా? అంబానీని మించి సంపాదన) -
వన్ప్లస్ ప్యాడ్ వచ్చేసింది: ధర చూస్తే ఇపుడే కావాలంటారు!
సాక్షి, ముంబై: స్మార్ట్ఫోన్ మేకర్ వన్ప్లస్ టాబ్లెట్ విభాగంలో తన అరంగేట్రం చేసింది. తన తొలి ఫ్లాగ్షిప్ టాబ్లెట్ను లాంచ్ చేసింది. MediaTek Dimensity 9000 చిప్సెట్, కార్టెక్స్-X2 కోర్ 3.05GHz తదితర ఫీచర్లతో దీన్ని తీసుకొచ్చింది. వన్ప్లస్ ప్యాడ్ 35శాతం పనితీరు ప్రయోజనాన్ని, 35 శాతం పవర్ ఎఫిషియెన్సీ అందజేస్తుందని కంపెనీ వెల్లడించింది. (ఇదీ చదవండి: బిచ్చగాళ్లను పారిశ్రామికవేత్తలుగా మార్చేసిన ఓ జర్నలిస్టు సాహసం) వన్ప్లస్ ప్యాడ్: ధర, ఆఫర్లు వన్ప్లస్ ప్యాడ్ రెండు స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. 8జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్/256 జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో లాంచ్ చేసింది. వీటి ధరలు రూ. 37,999, రూ. 39,999. వన్ప్లస్ యాప్, ఎక్స్పీరియన్స్ స్టోర్తోపాటు, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఈకామర్స్ సైట్లలోనూ, రిలయన్స్ క్రోమా స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డ్లు, డెబిట్ కార్డ్లు, ఈఎంఐ ద్వారా కొనుగోలు చేసిన వారు రూ. 2000 తక్షణ తగ్గింపును పొందవచ్చు. OnePlus Xchange కింద వన్ప్లస్ స్మార్ట్ఫోన్ల మార్పిడిపై అదనంగా రూ. 5000 లేదా ఎంపిక చేసిన స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్ల మార్పిడిపై రూ. 3000 ఆఫర్ లభిస్తుంది. ఏప్రిల్ 28 నుంచి ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు. ఓపెన్ సేల్ మే 2, 2023 నుండి మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. (ఏఐపై ఆనంద్ మహీంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు: అద్భుతమైన వీడియో) It's almost D-Day. The all-new #OnePlusPad will be open for pre-orders starting April 28, at ₹37,999. Mark your calendars! Stay tuned: https://t.co/PSbe5gA0aF pic.twitter.com/aaO7ak9yNG — OnePlus India (@OnePlus_IN) April 25, 2023 వన్ప్లస్ ప్యాడ్ ఫీచర్లు భారీ 11.61-అంగుళాల 144 Hz రీడ్-ఫిట్ డిస్ప్లే 7:5 స్క్రీన్ నిష్పత్తి, మెటల్ బాడీ 2.5D రౌండ్ ఎడ్జ్ .కాంబెర్డ్ ఫ్రేమ్ డిజైన్ 144Hz రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్ , డాల్బీ అట్మోస్ సపోర్ట్ 9510mAh బ్యాటరీ 67w ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ 13 ఎంపీ రియర్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరా -
Infinix INBook Y1 Plus Neo రూ. 20వేలకే ల్యాప్ట్యాప్, ఎట్రాక్టివ్ ఫీచర్స్!
సాక్షి, ముంబై: బడ్జెట్ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లు,స్మార్ట్ టీవీలు, ఇతర ఉత్పత్తులతో ఆకట్టుకున్నఇన్ఫినిక్స్ ఇపుడిక ల్యాప్టాప్ విభాగంలో క్రమంగా విస్తరిస్తోంది. తాజాగా పోర్టబుల్ కంప్యూటర్ లాంటి సరికొత్త ల్యాప్టాప్ను ఆవిష్కరించింది. ఇన్ఫినిక్స్ ఇన్బుక్ వై1 ప్లస్ నియో పేరుతో బడ్జెట్ ధరలో లాంచ్ చేసింది. అల్యామినియమ్ అలాయ్ మెటల్ బాడీ, 15.6 ఇంచుల ఫుల్హెచ్డీ డిస్ప్లే, ఇంటెల్ సెలెరోన్ ఎన్5100 (Intel Celeron N5100) క్వాడ్కోర్ ప్రాసెసర్ లాంటి ఫీచర్లను ఇన్ఫినిక్స్ ఇన్బుక్ వై1 ప్లస్ నియోలో అందించింది. ఈ ల్యాప్టాప్ ఫస్ట్ సేల్లో లాంచింగ్ ధరను ఆఫర్ చేస్తోంది. (బీ అలర్ట్: మంటల్లో టాటా నెక్సాన్ ఈవీ, కంపెనీ స్పందన ఏంటంటే?) ఇన్ఫినిక్స్ ఇన్బుక్ వై1 ప్లస్ నియో స్పెసిఫికేషన్లు 15.6 అంగుళాల ఫుల్హెచ్డీ డిస్ప్లే, విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టం, ఇంటెల్ సెలెరోన్ ఎన్5100 క్వాడ్కోర్ బడ్జెట్ ప్రాసెసర్, 260 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ ఇంటెల్ యూహెచ్డీ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్తో,డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్, రెండు యూఎస్బీ పోర్టులు, ఓ హెచ్డీఎంఐ పోర్టు, రెండు యూఎస్బీ టైప్-సీ పోర్టులు, ఓ మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్, 3.5mm హెడ్ఫోన్ జాక్,బ్యాక్లిట్ కీబోర్డ్ ,యాంటీ-గ్లేర్ గ్లాస్ టచ్ప్యాడ్ లాంటి ఫీచర్లతో దీన్ని తీసుకొచ్చింది. ఈ ల్యాప్టాప్ బరువు 1.76 కేజీలుగా ఉంది. (layoffs: షాకిచ్చిన ఇండియన్ ట్విటర్, 30 శాతం మందికి గుడ్ బై?) 2 మెగాపిక్సెల్ ఫుల్ హెచ్డీ వెబ్క్యామ్ , 2 వాట్ల సౌండ్ ఔట్పుట్ ఇచ్చే స్పీకర్లు, 40Wh బ్యాటరీ45 వాట్ల పీడీ టైప్-సీ ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. ఈ బ్యాటరీ 75 శాతం చార్జ్ అవుతుందని ఇన్ఫినిక్స్ వెల్లడించింది. ఇక ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే ఈ ల్యాప్టాప్ 7 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ ఇస్తుంది. ఇన్ఫినిక్స్ ఇన్బుక్ వై1 ప్లస్ నియో ధర, సేల్ 8 జీబీ ర్యామ్, 256 జీబీఎస్ఎస్డీ స్టోరేజ్ వేరియంట్ ఇన్ఫినిక్స్ ఇన్బుక్ వై1 ప్లస్ నియో ల్యాప్టాప్ ధర రూ.20,990గా ఉంది.అలాగే 8 జీబీ ర్యామ్, 512జీబీ ఎస్ఎస్డీ స్టోరేజ్ టాప్ వేరియంట్ ధర రూ.22,990లు. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్కార్ట్ ద్వారా ఈనెల 26వ తేదీ కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. సిల్వర్, బ్లూ, గ్రే కలర్ ఆప్షన్లలో లభ్యం. -
యానివర్సరీ సేల్, ఈ మొబైల్స్పై భారీ తగ్గింపు
సాక్షి, ముంబై: ఐక్యూ మొబైల్స్పై భారీ తగ్గింపు లభిస్తోంది. కంపెనీ మూడవ వార్షికోత్సవం సందర్బంగా ఐక్యూ బ్రాండ్ స్పెషల్ సేల్ ప్రకటించింది. ఈ రోజునుంచి (ఏప్రిల్ 19, బుధవారం) ఏప్రిల్ 24 వరకు ఈ సేల్ కొనసాగుతుంది. ఫ్లాగ్షిప్, నియో సిరీస్ స్మార్ట్ఫోన్లపై ఆకర్షణీయమైన తగ్గింపులను అందిస్తోంది. కంపెనీ తాజా గేమింగ్-ఫోకస్డ్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ ఐక్యూ 11 5జీతోపాటు, ఐక్యూ 9, ఐక్యూ 9 ప్రో మోడల్స్ కొనుగోళ్లపై డిస్కౌంట్ లభ్యం. దీంతోపాటు ఆఫర్లు బ్యాంక్ ఆఫర్ కూడా ఉన్నాయని, అయితే హైస్టోరేజ్ వేరియంట్కు ఈ తగ్గింపు వర్తించదని కంపెనీ వెల్లడించింది. కంపెనీ షేర్ చేసిన వివరాల ప్రకారం, ఇండియాలో ఐక్యూ 11 5జీ బేస్ మోడల్ ఇపుడు రూ. 49,999కే లభ్యం. లిస్టెడ్ ధర రూ. 59,999. (ఇదీ చదవండి: ఆన్బోర్డింగ్ కష్టాలు: ఫ్రెషర్స్కు విప్రో మరో షాక్?) ఈ సేల్లో ఐక్యూ 9, ఐక్యూ 9ప్రో ప్రస్తుత ధర రూ. 30,990, రూ. 39,990. అమెజాన్ ఇండియాలో వీటి ధర ప్రస్తుతం రూ. 35,990, రూ. 44,990 గా ఉంది. దీంతోపాటు ఐక్యూ Neo 6 5జీ స్మార్ట్ఫోన్ను 5,000 తగ్గింపు తరువాత రూ. 29,999కే కొనుగోలు చేయవచ్చు. (అదరగొట్టిన టీసీఎస్: ఉద్యోగం కోసం చూస్తున్నారా? లేటెస్ట్ చిట్కాలివిగో!) ఐక్యూ 11 5జీ స్పెసిఫికేషన్స్ 6.78-అంగుళాల 2K E6 AMOLED డిస్ప్లే Android 13-ఆధారిత Funtouch OS 13 క్వాల్కం స్నాప్ డ్రాగన్ 8 Gen 2 SoC 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 13-మెగాపిక్సెల్ టెలిఫోటో/పోర్ట్రెయిట్ సెన్సార్ మరియు 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరా, 120W ఫాస్ట్ ఛార్జింగ్కు మద్దతుతో 5,000mAh బ్యాటరీ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. కేవలం 8 నిమిషాల్లో బ్యాటరీ 50 శాతం ఛార్జ్ అవుతుంది. కాగా చైనీస్ టెక్ దిగ్గజం వివో మద్దతుతో, 2020లో భారతదేశంలో అడుగుపెట్టిన కొత్త స్మార్ట్ఫోన్ బ్రాండ్ ఐక్యూ. -
భారత్లో విడుదల కానున్న కొత్త హ్యుందాయ్ కారు - ఇదే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ ఈ ఏడాది భారత్లో విడుదల చేయనున్న చిన్న ఎస్యూవీకి ఎక్స్టర్గా నామకరణం చేసింది. ఈ మేరకు టీజర్ను విడుదల చేసింది. జూలైలో ఉత్పత్తి ప్రారంభం కానుంది. ఆగస్ట్ నుంచి మార్కెట్లో అడుగు పెట్టనుందని సమాచారం. దక్షిణ కొరియాతోపాటు పలు దేశాల్లో అమ్ముడవుతున్న ఏఐ3 (క్యాస్పర్) మోడల్కు స్వల్ప మార్పులతో ఇక్కడ ప్రవేశపెట్టనున్నారు. ఈ వాహనం భారత్ కోసం తయారు చేస్తున్నారు. భవిష్యత్లో పొరుగున ఉన్న దేశాలకూ ఎగుమతి చేస్తారు. గ్రాండ్ ఐ10 నియోస్ ప్లాట్ఫామ్పై దీనిని అభివృద్ధి చేస్తున్నారు. 1.0 లీటర్ టీ–జీడీఐ టర్బో పెట్రోల్ ఇంజన్, 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ వేరియంట్లతో తయారు కానుంది. -
అక్షయ తృతీయకు ముందు పసిడి ప్రియులకు భారీ షాక్! రికార్డ్ హై
న్యూఢిల్లీ: పసిడి ధరలు మరోసారి రికార్డు స్థాయికి పెరిగాయి. అంతర్జాతీయంగా పసిడికి డిమాండ్ పుంజు కోవడంతో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. ముఖ్యంగా వారం రోజుల్లో అక్షయ తృతీయ రానున్న తరుణంలో కొనుగోలు దారులకు భారీ షాకిస్తున్నాయి. బంగారం, వెండి ధరలు ఆల్ టైమ్ హైకి చేరాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఆల్టైం హైకి చేరాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.480 పెరిగి రూ.61,780కి చేరింది. వెండి సైతం కిలో రూ.410 పెరిగి రూ.77,580 స్థాయికి ఎగిసింది. స్పాట్ గోల్డ్ ఔన్స్కు 2,041డాలర్ల వద్ద, వెండి ఔన్స్ 25.88 డాలర్లుగా ఉంది. (27వేల మంది తొలగింపు: అమెజాన్ సీఈవో కీలక వ్యాఖ్యలు) దేశీయంగా హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 600 రూపాయలు ఎగిసి 61,200 వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ. 550పెరిగి 56, 650 వద్ద ఉంది. అలాగే మరో విలువైన లోహం వెండి ఏకంగా కిలోకి 1200 రూపాయలు పెరిగి రూ.83,800గా ఉంది. మార్చి1న రూ. 70వేలుగా ఉన్న కిలో వెండి ధర మార్చి 31 నాటికి 77500 స్థాయికి చేరింది. తాజాగా 83వేలకు చేరడం విశేషం. (సల్మాన్ ఖాన్ మూవీ బూస్ట్: ఏకంగా 21 వేల కోట్లకు ఎగబాకిన బిజినెస్మేన్) అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో దేశీయంగానూ ప్రభావం చూపుతున్నట్టు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. అటు ఆరు కరెన్సీల బాస్కెట్కు వ్యతిరేకంగా గ్రీన్బ్యాక్ బలాన్ని అంచనా వేసే డాలర్ ఇండెక్స్ 101 మార్క్ దిగువకు పడి పోయింది. మార్చిలో అమెరికా పీపీఐ ఇండెక్స్ ఊహించని విధంగా క్షీణించడంతో వారంవారీ జాబ్లెస్ క్లెయిమ్ల సంఖ్య 2,39,000 పెరిగింది. దీంతో ట్రెజరీ దిగుబడులు కూడా తగ్గినట్టు తాజా గణాంకాల ద్వారా తెలుస్తుంది. (ఇదీ చదవండి: అమెరికాలో ఉద్యోగం వదిలేసి: ఇండియాలో రూ.36 వేలకోట్ల కంపెనీ) -
బైక్ కొనాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్: కీవే బైక్స్పై భారీ ఆఫర్
సాక్షి, ముంబై: కొత్త బైక్ కొనుగోలు చేయాలనుకుంటున్నారు. అయితే మీకో చక్కటి అవకాశం. కీవే ఇండియా కంపెనీ తన లేటెస్ట్ 300 సీసీ బై బైక్స్ ధరలను భారీగా తగ్గించింది. కే300 ఎన్, కే 300 ఆర్ మోడళ్లపై భారీ తగ్గింపు ఆఫర్ ప్రకటించింది. (మహీంద్రా అండ్ మహీంద్రా మాజీ చైర్మన్ కేషుబ్ మహీంద్రా కన్నుమూత) కంపెనీ తాజా నిర్ణయంతో నేక్డ్ స్ట్రీట్ వెర్షన్ బైక్ కే 300 ఎన్ ధర రూ. 2.65 లక్షల -రూ. 2.85 లక్షల దాకా ఉంది. ఈ మోడల్పై ఇపుడు 33వేల రూపాయల దాకా తగ్గింపు లభిస్తోంది. అలాగే రూ. 2.99 లక్షల నుంచి రూ. 3.2 లక్షల ధర పలికే కే 300 ఆర్ ధర ఇపుడు రూ. 55 వేలు దిగి వచ్చింది. అంటే దీన్ని రూ. 2.65 లక్షలకే కొనుగోలు చేయవచ్చు. కే 300 ఎన్, కే 300 ఆర్ అనే బైక్స్ రెండూ కూడా ఒక ప్లాట్ఫామ్పై తయారైనవే. వీటిల్లో 292 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఇది హెచ్పీ 27.5. అలాగే టార్క్ 25 ఎన్ఎం ను అందిస్తాయి. బైక్ ముందు, వెనుక డిస్క్ బ్రేకులు, అలాగే డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్,డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, LED లైట్లు , 2 రైడింగ్ మోడ్లు(ఎకో & స్పోర్ట్)హైలైట్ ఫీచర్లుగా చెప్పుకోవచ్చు. ఈ ధరలు 6 ఏప్రిల్ 2023 నుండి అమల్లోకి రాగా రెండు మోడల్లలోని మొత్తం 3 కలర్ ఆఫర్లలో ప్రామాణికంగా ఉంటాయి. -
అదిరిపోయే ఫీచర్లతో లావా బ్లేజ్: పరిచయ ఆఫర్ చూస్తే ఫిదా!
సాక్షి, ముంబై: దేశీయ మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీ లావా మార్కెట్లోకి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ లావా బ్లేజ్-2ను విడుదల చేసింది. ప్రీమియం గ్లాస్ ఫినిషింగ్ , పంచ్-హోల్ డిస్ప్లే,డ్యూయల్ కెమెరా , 5,000mAh బ్యాటరీ వంటి ఫీచర్లతో బ్లేజ్ 2 స్మార్ట్ఫోన్ను రూ.10,999 వద్ద లాంచ్ చేసింది. అయితే పరిచయ ఆఫర్గా కేవలం రూ.8,999కే అందించనుంది. లావా బ్లేజ్-2 స్మార్ట్ఫోన్ ప్రత్యేకంగా ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్లో ఈ నెల 18 నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. (Billionaire Barber Story: ఒకపుడు తినడానికి లేదు..ఇపుడు 600 లగ్జరీ కార్లు..‘బిలియనీర్ బాబు’ స్టోరీ చూస్తే..!) టైప్ C ఛార్జింగ్ పోర్ట్తో పాటు సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 13కి అప్గ్రేడ్ చేయబడుతుందని , రెండు సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్లను అందిస్తామని కంపెనీ వెల్లడించింది. (మాజీ సీఈవో పరాగ్ అగర్వాల్ దెబ్బ! మస్క్కు భారీ ఝలక్!) లావా బ్లేజ్-2 స్పెసిఫికేషన్స్ 6.5-అంగుళాల హెచ్డీ + డిస్ప్లే విత్ పంచ్ హోల్ డిజైన్ యూనిసోన్ టీ616 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 12 6జీబీ రామ్,128 జీబీ స్టోరేజీ 13 మెగా పిక్సెల్స్ డ్యుయల్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీకెమెరా 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ భారత్లో లావా బ్లేజ్-2 ధర రూ.8,999. గ్లాస్ బ్లూ, గ్లాస్ బ్లాక్, గ్లాస్ ఆరెంజ్ రంగుల్లో లభిస్తుంది. ఈ నెల 18 మధ్యాహ్నం నుంచి సేల్స్ ప్రారంభం. -
2023 కవాసకి వల్కాన్-ఎస్ లాంచ్, ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే
సాక్షి, ముంబై: కవాసకి ఇండియా భారత మార్కెట్లో వినియోగదారుల కోసం 2023 వల్కన్ ఎస్ బైక్ను లాంచ్ చేసింది. మిడిల్వెయిట్ క్రూజర్ బైక్ వల్కన్ ఎస్ మోడల్తో పోలిస్తే 2023 వెర్షన్ బైక్ను కొన్ని అప్గ్రేడ్లతో విడుదల చేసింది. (2023 ఈవీ 6: కియా కస్టమర్లకు గుడ్ న్యూస్!) 2023 కవాసకి వల్కాన్ ఎస్ ఇంజీన్ 659 సీసీ ప్యార్లల్ ట్విన్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్ను అందించింది. ఇది 7500rpm వద్ద 59.9bhp శక్తిని , 6600rpm వద్ద 62.4Nm గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే 6 స్పీడ్ గేర్బాక్స్ ఆప్షన్ను కూడా జతచేసింది. 14 లీటర్ ఇంధన ట్యాంక్, 705 మిమీ సీట్ ఎత్తు, 18 అంగుళాల ఫ్రంట్వీల్స్, 17 అంగుళాల రియర్వీల్స్, 130 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్, డ్యూయల్ ఛానల్ ABS (ప్రామాణికం)తో ఈ బైక్ను అందిస్తోంది. అయితే బైక్ డిజైన్లో పెద్దగా మార్పులేవీలేవు. ఈ క్రూయిజర్ బైక్లో సింగిల్ పాడ్ హెడ్ ల్యాంప్, టియర్ డ్రాప్ షేప్ ఫ్యూయల్ ట్యాంక్ ఉన్నాయి. 2023 కవాసకి వల్కాన్ ఎస్ ధర ఇండియాలో దీని రూ.7.10లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. మెటాలిక్ మ్యాక్ కార్బన్ గ్రే కలర్ స్కీమ్లో మాత్రమే ఈ 2023 వెర్షన్ బైక్ అందుబాటులోకి వచ్చింది. రాయల్ ఎన్ఫీల్డ్ సూపర్ మెటోర్ 650 , బెనెల్లీ 502C ఈ సరికొత్త బైక్కి గట్టి పోటీ అని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. (ఇదీ కూడా చదవండి: వామ్మో..పసిడి పరుగు, వెండి హై జంప్!) -
Gold rate 3 April 2023: తగ్గిన పసిడి ధర,గుడ్ న్యూసేనా?
సాక్షి,ముంబై: అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో సోమవారం బంగారం ధరలుభారీగా తగ్గాయి. రూ. 500కుపైగా క్షీణించి 10 గ్రాములకు రూ. 59,251స్థాయికి చేరింది. శుక్రవారం 10 గ్రాములు రూ. 59,751గా ఉంది. వెండి ధర కూడా కిలోకి రూ.409 తగ్గి రూ.71,173కి పడిపోయింది. (ఇదీ చదవండి: NMACC పార్టీలో టిష్యూ పేపర్ బదులుగా, రూ.500 నోటా? నిజమా?) హైదరాబాద్మార్కెట్లో రూ. 300 క్షీణించి 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.59670, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.54700 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి కూడా 500 తగ్గి 74000గా ఉంది. (NMACC: డాన్స్తో ఇరగదీసిన షారూక్, గౌరీ, ఇక ప్రియాంక చోప్రా డాన్స్కైతే) ఇండియన్ బులియన్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) వెబ్సైట్ ప్రకారం, సోమవారం (ఏప్రిల్ 3, 2023) పది గ్రాములకు రూ. 59251 వద్ద ట్రేడవుతోంది. అలాగే శుక్రవారం రూ.1582 పెరిగిన కిలో వెండి ధర రూ.71173 వద్ద ట్రేడవుతోంది. (మెక్ డోనాల్డ్స్ అన్ని ఆఫీసులు మూత, ఉద్యోగాల కోతకు రంగం సిద్ధం!) అటు మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో కూడా బంగారం వెండి ధరలు బలహీనంగా ఉన్నాయి. ఏప్రిల్ 2023 ఫ్యూచర్స్ రూ. 342.00 పతనంతో రూ. 59,060.00 వద్ద, మే 5, 2023న వెండి ఫ్యూచర్స్ ట్రేడింగ్ రూ. 604.00 పతనంతో రూ.71,614.00 స్థాయికి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం 4.33 డాలర్ల లాభంతో 1,953.72 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, వెండి ఔన్స్కు 0.21 డాలర్లు తగ్గి 23.64 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. -
రెడ్మి 12సీ, రెడ్మి నోట్12 వచ్చేశాయ్! అందుబాటు ధరలే
సాక్షి, ముంబై: చైనా స్మార్ట్ఫోన్కు షావోమి రెడ్ మి 12 సిరీస్లో రెండు కొత్త స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. గత వారం యూరప్లో విడుదల చేసిన రెడ్మినోట్12 4జీతోపాటు, రెడ్మి12 సీనిక ఊడా ఇపుడు భారతదేశంలో తీసుకొచ్చింది. రెడ్మినోట్12 4జీ 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 6జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ అనే రెండు స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంటుంది రెడ్మినోట్12 4జీ ధర , లభ్యత 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ.16,999 6జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ధర రూ.14,999గా ఉంది. లూనార్ బ్లాక్, ఫ్రాస్టెడ్ ఐస్ బ్లూ సన్రైజ్ గోల్డ్ కలర్స్లో లభ్యం. అలాగే లిమిటెడ్ ఆఫర్ కింద కొనుగోలుదారులు ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్లపై రూ. 1,000 తగ్గింపుకు అర్హులు. ఏప్రిల్ 6 నుండి ఎం స్టేర్లతోపాటు, అమెజాన్, ఇతర రిటైల్ స్టోర్ల ద్వారా విక్రయంజ రెడ్మినోట్12 4జీ స్పెసిఫికేషన్స్ 6.67అంగుళాల పంచ్-హోల్ AMOLED FHD+ డిస్ప్లే | 2400 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్ 120Hz వరకు రిఫ్రెష్ రేట్ Qualcomm Snapdragon 685 చిప్సెట్ Android 13 ఆధారంగా MIUI 14 50+ 8+ 2ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 13ఎంపీ సెల్ఫీ కెమెరా 33W ఫాస్ట్ ఛార్జింగ్కు 5,000mAh బ్యాటరీ రెడ్మి 12 సీ స్పెసిఫికేషన్స్ 6.71-అంగుళాల HD+ డిస్ప్లే MediaTek Helio G85 SoC ఆండ్రాయిడ్ 12 OS 50 + 2 ఎంపీ రియర్ డ్యూయల్ కెమెరాలు 5ఎంపీ సెల్ఫీ కెమెరా 5,000W బ్యాటరీ రెడ్మి 12 సీ లభ్యత,ధరలు 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ ధర : రూ. 8,999 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ రూ. 10,999 ఏప్రిల్ 16నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. బ్యాంక్ కార్డ్తో 500 తక్షణ తగ్గింపు -
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ , అదిరిపోయే లాంచింగ్ ఆఫర్ కూడా!
సాక్షి,ముంబై: శాంసంగ్ కొత్త 5జీ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. 5nm ప్రాసెసర్ , 6000 mAh బ్యాటరీ శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ స్మార్ట్ఫోన్ను ఈరోజు (మార్చి 24) భారత మార్కెట్లో విడుదల చేసింది. 5జీ సెగ్మెంట్లో మాత్రమే వస్తోంది. ఈ కనెక్టివిటీ కోసం 13 బ్యాండ్లను సపోర్ట్ చేస్తుందీ మొబైల్. అలాగే Exynos 1330 చిప్సెట్తో వస్తుందని, ఇందులోన బిగ్ బ్యాటరీ 2 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. పరిచయ ఆఫర్గా శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీను ఎంపిక చేయబడిన బ్యాంక్ కార్డ్ల కొనుగోళ్లపై 4 జీబీ ర్యామ్ +128 జీబీ స్టోరేజ్ కోసం రూ. 12,990, 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ. 14,490కే అందిస్తోంది. మార్చి 30 మధ్యాహ్నం 12 గంటలనుంచి సేల్ మొదలవుతుంది. ఫ్లిప్కార్ట్, శాంసంగ్ తోపాటు ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో త్రి కలర్స్లో అందుబాటులో ఉంటుంది. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ స్పెసిఫికేషన్స్ 6.6-అంగుళాల పూర్తి HD+ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్, Android 13 ఆధారంగా One UI 5 50ఎంపీ ప్రధాన కెమెరా 2MP మాక్రో కెమెరా 13 ఎంపీ సెల్ఫీ కెమెరా . 6000 mAh బ్యాటరీ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అతేకాదు గరిష్టంగా 2 తరాల OS అప్గ్రేడ్లను 4 సంవత్సరాల వరకు భద్రతా అప్డేట్లను అందిస్తుంది. ఫైనాన్షియల్ అప్లికేషన్లు, వ్యక్తిగత ఐడీలు, ఇతర రహస్య పత్రాలను స్టోర్ చేసుకునేందుకు ఆల్-ఇన్-వన్ అప్లికేషన్ వాయిస్ ఫోకస్ ఫీచర్ , Samsung Walletకి మద్దతు కూడా ఉంది. -
మళ్లి పెరిగిన బంగారం ధర: వెయిట్ చెయ్యాలా? కొనుక్కోవాలా?
సాక్షి, ముంబై: వెండి , బంగారం ధరలు మళ్లీ నింగివైపు చూస్తున్నాయి. రెండు రోజులు కాస్త తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు గురు, శుక్రవారాల్లో మళ్లీ ఊపందుకున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.600 పెరిగింది. గురువారం నాటి రూ. 54,200తో పోలిస్తే రూ 54,800 పలుకుతోంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 650 ఎగిసి రూ.59,780గా ఉంది. మరోవైపు వెండి ధరలు కూడా పెరిగాయి. గురువారంతో పోలిస్తే వెయ్యి రూపాయలు పెరిగి కేజీ వెండి ధర రూ. 72,600గా ఉంది. అయితే మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో, బంగారం ఏప్రిల్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ. 225 లేదా 0.38శాతం తగ్గి రూ.59,340 వద్ద ఉంది. ఎంసీఎక్స్లో సిల్వర్ మే ఫ్యూచర్స్ కిలో రూ.7 తగ్గి రూ.70,205 వద్దకు చేరింది. (ఇది చదవండి: జియో కస్టమర్లకు ట్విస్ట్: ఎంట్రీ-లెవల్ రూ.199 ప్లాన్ ఇక రూ. 299లు) మరోవైపు ప్రతికూల ప్రపంచ సంకేతాలతో గ్లోబల్గా పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఫెడ్ రేటు పెంపు అంచనాలతో డాలర్ స్థిరంగా ఉండటంతో స్పాట్ బంగారం 0.1శాతం తగ్గి ఔన్సుకు 1,991 డాలర్లుగాఉంది. వెండి రేటు 0.01శాతం తగ్గింది. ఈ ప్రభావం దేశీయంగా ఉండే అవకాశం ఉందని అంచనా. IPL 2023: జియో అదిరిపోయే ఆరు ప్రీపెయిడ్ ప్లాన్స్ -
ఔషధ నియంత్రణపై రెండు నాలుకలు
దేశీ మార్కెట్లో చాలా నకిలీ మందులు చలామణీలో ఉన్నాయన్న కేంద్ర ఆరోగ్య మంత్రి వ్యాఖ్యలు బయటికి పొక్కడం కలకలం రేపింది. మళ్లీ ఆయనే అధికారిక సమావేశాల్లో నాణ్యమైన ఔషధాలు తయారవుతున్నాయని నొక్కిచెప్పారు. ప్రజలందరికీ చౌకగా, చక్కగా పనిచేసే మందులు అందివ్వాల న్నదే ప్రభుత్వ లక్ష్యమైతే అందుకు ఒక సమగ్రమైన పద్ధతిని అనుసరించాలి. ప్రస్తుతం మార్కెట్లో ఒకే రసాయనానికి సంబంధించి వందలాది బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కోదాని ధర, సామర్థ్యాల్లో అంతరమూ కనిపిస్తోంది. అహేతుకమైన మిశ్రమాలున్న మందులూ దొరుకుతున్నాయి. జన ఔషధి కేంద్రాలు కొన్ని వేలు తెరచినంత మాత్రాన సమస్యకు పరిష్కారం లభించదు. వీటికి దన్నుగా నిలిచే సరఫరా వ్యవస్థ కూడా అత్యవసరం. ఉజ్బెకిస్తాన్, గాంబియా... రెండు వేర్వేరు దేశాల్లో సుమారు 70 మంది పిల్లలు కల్తీ దగ్గుమందు కారణంగా మరణించారు. ఇటీవలి కాలంలో సంభవించిన ఈ దుర్ఘటనకు కారణమైన దగ్గు మందు సరఫరా అయ్యింది మన దేశం నుంచే. కొన్ని వారాల క్రితం నోయిడా పోలీసులు ఉజ్బెకిస్తాన్ మరణాలకు సంబంధించి ముగ్గురు ఫార్మా కంపెనీ ఉద్యోగులను అరెస్ట్ చేయగా... కొన్ని నెలల క్రితం గాంబియా ఘటనకు సంబంధించి దేశంలో పెద్ద దుమారమే చెలరేగింది. ఈ రెండు కేసుల్లోనూ దగ్గుమందులో విషపూరిత రసాయనాలు కలిసి ఉండటం గమనార్హం. గాంబియా ఘటనలను ముందుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచం దృష్టికి తెచ్చింది. భారత్ నుంచి ఎగుమతి అయిన దగ్గు ముందులో గుర్తించిన డైఎథిలీన్ గ్లైకోల్ (డీఈజీ) కారణంగా మూత్ర పిండాలు పనిచేయకుండా పోయి పిల్లలు మరణించినట్లు అమెరికాకు చెందిన ‘సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్’ కూడా ఈ వారమే ధ్రువీకరించింది. ఈ ఘటనలకు కేంద్ర ఆరోగ్య శాఖ, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ), రాష్ట్రాల డ్రగ్ కంట్రోలర్లు, ఫార్మా స్యూటికల్ డిపార్ట్మెంట్ల స్పందన అంతంత మాత్రమే. ప్రపంచ ఆరోగ్య సంస్థ, గాంబియా ప్రభుత్వం చేసిన ప్రకటనల్లో లోపాలపై దృష్టి పెట్టాయి కానీ... ఆయా సంస్థలు గుర్తించిన అంశాల జోలికి ఇవి పోలేదు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఒక కమిటీని ఏర్పాటు చేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ సమాచారం ఇవ్వకపోవడాన్ని విమర్శించి ఉరకున్నాయి. ఆరోగ్య శాఖ నెపం మొత్తాన్ని గాంబియాపై నెట్టేసింది. దిగుమతి చేసుకునేటప్పుడు పరీక్షించుకోవాల్సిన బాధ్యత ఆ దేశానిదేనని తేల్చేసింది. అంతటితో ఆగకుండా... ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక్కో కేసులో మరణానికీ, ఔషధానికీ ఉన్న సంబంధాన్ని వివరించలేదని వ్యాఖ్యానించింది. ఆ తరువాత తెలిసిందేమిటంటే... గాంబియా కొన్ని కేసుల్లో శవపరీక్షలు కూడా నిర్వహించి డీఈజీ అవశేషాలను గుర్తించిందని! అన్నింటి కంటే ముఖ్యంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవియా ఈ ఘటనలన్నింటినీ భారత ఔషధ పరిశ్రమను దెబ్బతీసేందుకు జరుగుతున్న కుట్రగానే పరిగణించడం! గత నెల 24న వంద భాగస్వామ్య దేశాల భారత దౌత్యవేత్తలు పాల్గొన్న సమావేశంలోనూ మాండవియా దేశంలో నాణ్యమైన మందులు తయారవుతున్నాయని నొక్కి చెప్పడం ఇక్కడ ప్రస్తావించ దగ్గ అంశం. కేంద్ర ఆర్యోగ శాఖ మంత్రి ప్రకటనల్లో ద్వంద్వ ప్రమాణాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 26న హైదరాబాద్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులతో జరిగిన ఓ రహస్య సమావేశంలో దేశంలో మందుల నియంత్రణ దుఃస్థితిని ఆయన నేరుగా అంగీకరించారు. ‘‘దేశీ మార్కెట్లో చాలా నకిలీ మందులు చలామణిలో ఉన్నాయి. కల్తీ మందులు ఎగుమతి అవుతున్నాయి కూడా. దీనివల్ల ఫార్మా రంగం విశ్వసనీయతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి’’ అని ఒప్పు కొన్నారు. ఈ దుఃస్థితికి అధికారులే కారణమని కూడా ఆయన కుండబద్దలు కొట్టారు. ‘‘ఫార్మా రంగానిదే బాధ్యత. కానీ అంతకంటే ముందు ఇది మన బాధ్యత’’ అని ఆయన అధికారులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నియంత్రణ వ్యవస్థల గురించి కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ‘‘ఇది చురుకుగా లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వ యమూ కొరవడుతోంది’’ అని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి అంచనా ప్రకారం, ప్రస్తుత నియంత్రణ వ్యవస్థ కేంద్ర, రాష్ట్రాల సంస్థలు, ఫార్మాస్యూటికల్ విభాగాల పేరుతో ముక్కలు ముక్కలుగా ఉంది. మాండవియా ప్రసంగం యూట్యూబ్ ఛానల్లో ఎనిమిది నిమిషాల పాటు ప్రత్యక్ష ప్రసారమైంది. ఆ తరువాత ఆగిపోవడమే కాకుండా... అప్పటివరకూ రికార్డయిన వీడియోను కూడా ఛానల్ నుంచి తొలగించారు. అయితే వీడియో తొలగించినంత మాత్రాన విషయం బయ టకు పొక్కకుండా ఉంటుందా? నిపుణులు ఎంతో కాలంగా చెబుతున్న విధంగానే నియంత్రణ సంస్థల నిర్లక్ష్యం కారణంగా నాణ్యత లేని, కల్తీ, నకిలీ మందులు భారతీయ మార్కెట్లో చలామణి అవుతున్నట్లు అందరికీ అధికారికంగా తెలిసిపోయింది. ఇలాంటి మందులు విదేశాలకూ ఎగుమతి అవుతున్నట్లు... దుష్ఫలితాలూ వాటివల్లనే అన్న విషయమూ స్పష్టమైంది. మంత్రి ప్రకటనను బట్టి చూస్తే దేశ ఫార్మా రంగం దుఃస్థితికి కారణాలు ఆయనకూ తెలుసన్నమాట. మరి ఇదే నిజమైతే ఆయన, కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకూ ఏం చేస్తున్నట్లు? గాంబియా, ఉజ్బె కిస్తాన్ ఘటనలపై వ్యతిరేక నివేదికలు వచ్చినప్పుడు బహిరంగంగా ఫార్మా రంగాన్ని, నియంత్రణ వ్యవస్థలకు మద్దతుగా మాట్లాడటం ఎందుకు? ఈ రెండు నాల్కల ధోరణిని వదిలిపెట్టాల్సిన తరుణం ఆసన్నమైంది. ఎందుకంటే ఇది ప్రజల జీవితాలతో కూడిన వ్యవహారం. దేశ ఫార్మా రంగ నియంత్రణ సంస్థల్లోని అకృత్యాలు ఇప్పుడు కొత్తగా తెలిసినవి ఏమీ కాదు. 2012లోనే ఒక పార్లమెంటరీ కమిటీ సీడీఎస్సీఓ పనితీరుపై విచారణ జరిపి, కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో ఉన్న అక్రమాలను బయటపెట్టింది. దురదృష్టవశాత్తూ అప్పటినుంచి ఇప్పటివరకూ జరిగిన మార్పు స్వల్పమే. పార్లమెంటరీ కమిటీ చేసిన సిఫారసులు కాగితానికే పరిమితమైపోయాయి. ప్రభుత్వాలు కూడా ఈ రంగాన్ని సంస్కరించేందుకు చిత్తశుద్ధితో పనిచేయలేకపోయాయి. ఇంకోవైపు ఫార్మా పరిశ్రమ ఎదుగుదలకు నియంత్రణ వ్యవస్థలు ప్రతిబంధకంగా మారుతున్నాయన్న ఆరోపణలు పెరిగిపోతున్నాయి. దేశ ఫార్మా మార్కెట్ సుమారు నాలుగు లక్షల కోట్ల రూపాయల విలువైందని ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించారు. ఈ మొత్తం పది లక్షల కోట్ల రూపాయలకు చేరవచ్చునని కూడా ఆయన అంచనా కట్టారు. ఇది కచ్చితంగా మంచి లక్ష్యం. కానీ భద్రత, సామర్థ్యం, మందుల ప్రమాణాలతో రాజీపడి సాధించడం ఎంతమాత్రమూ సరికాదు. స్థానిక మార్కెట్ అయినా, విదేశీ మార్కెట్ అయినా వీటిని పాటించడం అవసరం. ప్రజలందరికీ చౌకగా, చక్కగా పనిచేసే మందులు అందివ్వా లన్నదే ప్రభుత్వ లక్ష్యమైతే అందుకు ఒక సమగ్రమైన పద్ధతిని అనుసరించాలి. ప్రస్తుతం మార్కెట్లో ఒకే రసాయనానికి సంబంధించి వందలాది బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో దాని ధర, సామర్థ్యాల్లో అంతరమూ కనిపిస్తోంది. అహేతుకమైన మిశ్రమా లున్న మందులూ దొరుకుతున్నాయి. వేర్వేరు బ్రాండ్లు ఉండటంతో వైద్యులను ఆకర్షించేందుకు కంపెనీలు అనైతిక మార్కెటింగ్ కార్య కలాపాలకూ దిగుతున్నాయి. జన ఔషధి కేంద్రాలు కొన్ని వేలు తెరచి నంతమాత్రాన సమస్యకు పరిష్కారం లభించదు. వీటికి దన్నుగా నిలిచే సరఫరా వ్యవస్థ కూడా అత్యవసరం. నిజానికి జన ఔషధి కేంద్రాల స్థాపన ఆలోచన మాజీ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ది. 2005లోనే ఆయన యూపీఏ కామన్ మినిమం ప్రోగ్రామ్లో భాగంగా ఈ కేంద్రాల ఏర్పాటును ప్రస్తావించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఔషధ కంపెనీల నుంచి జెనెరిక్ మందులను ఈ కేంద్రాల ద్వారా ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆయన సంకల్పించారు. ఈ ప్రభుత్వ రంగ ఫార్మా కంపెనీల్లో అత్యధికం ఇప్పుడు పనిచేయడం లేదు. లేదా అస్తవ్యస్త పరిస్థితుల్లో ఉన్నాయి. కాబట్టి, సమస్య పరిష్కా రానికి బహుముఖ వ్యూహం అవసరం. దేశంలోని నియంత్రణ వ్యవస్థ లను గాడిలో పెట్టడంతో మొదలుపెడితే సరైన దిశలో ముందడుగు వేసినట్లు అవుతుంది! వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
నోకియా సీ12 ప్రో: అల్ట్రా-ఎఫర్డబుల్ స్మార్ట్ఫోన్
సాక్షి, ముంబై: దేశీయ మార్కెట్లో హెచ్ఎండీ గ్లోబల్ మరో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ నోకియా సీ12 ప్రో (Nokia C12 Pro) లాంచ్ అయింది. పలు కీలక ఫీచర్లతో, అందుబాటులో ధరలోఈ మొబైల్ను తీసు కొచ్చింది. నోకియా సీ12 లాంచ్ చేసిన వారం రోజుకే ప్రో వెర్షన్ను తీసుకు రావడం విశేషం.ఒక్టాకోర్ ప్రాసెసర్, 2జీబీ వర్చువల్ రామ్ సపోర్ట్తో క్లీన్ ఆపరేటింగ్ సిస్టమ్ లాంటి ఫీచర్లున్నాయి. నోకియా సీ 12 ప్రో ధర భారతదేశంలో నోకియా సీ 12 ప్రో ధర బేస్ 2జీబీ ర్యామ్/64 జీబీ స్టోరేజ్ మోడల్ కోసం రూ.6,999 గా ఉంది. అదనంగా, 3జీబీ ర్యామ్/64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 7,499 చార్కోల్, డార్క్ క్యాన్ కలర్స్లో లభ్యం. ఇది నేరుగా నోకియా ఇండియా, ఇతర ఆన్లైన్, ఆఫ్లైన్ రిటైన్ ఛానెల్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు నోకియా సీ12 ప్రో స్పెసిఫికేషన్స్ 6.3-అంగుళాల HD+ LCD ప్యానెల్ ఆండ్రాయిడ్ 12 (గో ఎడిషన్) 8 ఎంపీ రియర్ కెమెరా విత్ LED ఫ్లాష్ 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 4,000 mAh బ్యాటరీ -
‘హీరో’ లవర్స్కు షాక్: ఏప్రిల్ 1 నుంచి షురూ!
సాక్షి, ముంబై: ప్రముఖ టూ వీలర్ మేకర్ హీరో మోటో తన కస్టమర్లకు షాకిచ్చింది. ఏప్రిల్ నుంచి అన్ని వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఎంపిక చేసిన ఉత్పత్తులపై వచ్చే నెల నుండి 2 శాతం వరకు ధరలు పెరగనున్నాయి. ఈ పెరుగుదల మోడల్స్ , మార్కెట్లను బట్టి మారుతూ ఉంటుందని హీరో మోటోకార్ప్ ప్రకటించింది. (ఓలా ఎలక్ట్రిక్ దూకుడు: రూ. 2,475 కోట్ల సమీకరణ !) OBD-2 నిబంధనలకు అనుగుణంగా మారడం, ఉద్గార ప్రమాణాల అమలుతో ఉత్పత్తి వ్యయం పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. మరోవైపు కొత్త నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. దీనికి అనుగుణంగా కంపెనీలు సైతం కొత్త ఉద్గార ప్రమాణాల అమలుకోసం తమ తమ వాహనాల్లో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. (ఇది నమ్మక ద్రోహమే..తక్షణమే రాజీనామా చెయ్యండి! జుకర్బర్గ్ ఆగ్రహం) హీరో మోటోకార్ప్ తాజా లాంచ్లు: హీరో మోటోకార్ప్ ఇటీవల భారతదేశంలో రూ. 68,599 (ఎక్స్-షోరూమ్) వద్ద సరికొత్త జూమ్ 110ని విడుదల చేసింది. అలాగే రూ. 83,368, ఎక్స్-షోరూమ్ ధరతో సూపర్ స్ప్లెండర్ కొత్త హైటెక్ XTEC వేరియంట్ను కూడా పరిచయం చేసింది. కాగా ఇలీవలి కాలంలో హీరో కంపెనీ ధరల పెంపు ఇదిరెండోసారి. అటు టాటా మోటార్స్ సైతం తాజాగా తన కమర్షియల్ వాహన ధరలను 5 శాతం మేర పెంచింది. -
పోకో ‘ది 5జీ ఆల్ స్టార్’ లాంచ్: ఆఫర్ ఎంతంటే?
సాక్షి, ముంబై: పోకో ఎక్స్ 5 5జీ స్మార్ట్ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఎక్స్ సిరీస్లో భాగంగా తన రెండో ఫోన్ను కంపెనీ లాంచ్ చేసింది. దేశంలో ప్రారంభ ఆఫర్గా 2 వేల రూపాయల తగ్గింపుతో పోకో ఎక్స్ 5 5జీ రూ. 16,999 కే సొంతం చేసుకోవచ్చు. పోకో ఎక్స్5 5జీ ధర మార్చి 21 మధ్యాహ్నం 12:00 గంటలకు Flipkart ద్వారా సేల్. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ ద్వారా 2,000 తక్షణ తగ్గింపు లేదా రూ. 2000 చేంజ్ బోనస్ తొలి రోజు సేల్లో నో-కాస్ట్ EMI ఈ ఆఫర్తో, 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ రూ. 16,999 , టాప్-ఎండ్ వేరియంట్ 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ను 18,999 అందిస్తోంది.సూపర్నోవా గ్రీన్, వైల్డ్క్యాట్ బ్లూ , జాగ్వార్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభ్యం పోకో ఎక్స్5 5జీ స్పెసిఫికేషన్స్ 6.67-అంగుళాల FHD+ AMOLED డిస్ప్లే స్నాప్డ్రాగన్ 695 SoC 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ 1 టీబీ దాకా స్టోరేజ్ను విస్తరించుకునే అవకాశం 48+8 + 2 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 13 ఎంపీ సెల్ఫీ కెమెరా 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 5000 mAh బ్యాటరీ Give us a better definition of an “All-Star”, we’ll wait! The POCO X5 5G comes with 7 5G bands, Snapdragon 695, and a 120Hz Super AMOLED Display… ...the list can go on and on! The POCO X5 5G goes on sale on 21st March on @Flipkart at a special price.#The5GAllStar pic.twitter.com/orx2kNRW35 — POCO India (@IndiaPOCO) March 14, 2023 -
Nokia C12: నోకియా మరో బడ్జెట్ ఫోన్ లాంచ్, ధర చూస్తే ఫిదా!
సాక్షి, ముంబై:నోకియా మరో బడ్జెట్ స్మార్ట్ఫోన్ను భారత మార్కట్లో లాంచ్ చేసింది. సీ సిరీస్లో భాగంగా సీ-12 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్ ధరను రూ. 5,999గా నిర్ణయించింది. నోకియా సీ 12 బడ్జెట్ స్మార్ట్ఫోన్ ఫీచర్లు 6.3అంగుళాల HD+ డిస్ప్లే ఆండ్రాయిడ్ 12 (గో ఎడిషన్) ఆక్టా కోర్ ప్రాసెసర్, 2జీబీ వర్చువల్ ర్యామ్ స్ట్రీమ్లైన్డ్ OS 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా 5 ఎంపీ రియర్ కెమెరా 12 వాట్స్ చార్జింగ్ సపోర్ట్ఫో 3000 ఎంఏహెచ్ రిమూవబుల్ బ్యాటరీ మార్చి 17 నుండి ఇండియాలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. డార్క్ సియాన్, చార్కోల్ , లైట్ మింట్ మూడు రంగుల్లో లభ్యం కానుంది. పెరుగుతున్న సైబర్ థ్రెట్ నేపథ్యంలో వినియోగదారులకు తమ సీ సిరీస్ స్మార్ట్ఫోన్లు కనీసం రెండు సంవత్సరాల సాధారణ భద్రతా నవీకరణలను అందిస్తున్నమాని హెచ్ఎండీ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ఇం(డియా & మెనా) సన్మీత్ సింగ్ కొచ్చర్ ఒక ప్రకటనలో తెలిపారు. Introducing the all new Nokia C12, with Octa core processor, 4GB RAM, Night and Portrait mode on front and rear cameras, and the trust of Nokia phones. Get your hands on Nokia C12 to be #FullOnConfident pic.twitter.com/sSmmIKDf1f — Nokia Mobile India (@NokiamobileIN) March 13, 2023 -
ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్ వచ్చేసింది! భారీ డిస్కౌంట్ కూడా
సాక్షి,ముంబై: ఒప్పో తన ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ను ఎ ట్టకేలకు భారత మార్కెట్లో లాంచ్ చేసింది. పలు ప్రపంచ మార్కెట్లలో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్ ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ను సోమవారం ఆవిష్కరించింది. మరీ ముఖ్యంగా రూ. 10వేల తగ్గింపుతో ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్ను అందుబాటులోకి తీసుకురావడం విశేషం. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్4 కంటే బిగ్ డిస్ప్లేతో దీన్ని తీసుకొచ్చింది. అంతేకాదు 3.26 అంగుళాల అతిపెద్ద వెర్టికల్ కవర్ స్క్రీన్ డిస్ప్లే ఎపుడూ ఆన్లోనే ఉంటుందట. ఇండియాలో దీని ప్రారంభ ధర రూ. 89,999గా ఉంనుంది. అయితే క్యాష్బ్యాక్లు ,ఇతర ప్రోత్సాహకాల ద్వారా కస్టమర్లు దీన్ని రూ. 79,999 కంటే తక్కువకే సొంతం చేసుకోవచ్చు. (ఇంటింటికి వెళ్లి కత్తులమ్మి..ఇపుడు కోట్లు సంపాదిస్తున్న అందాల భామ) ఒప్పో స్టోర్లు, ఫ్లిప్కార్ట్ ,మెయిన్లైన్ రిటైల్ అవుట్లెట్స్లో మార్చి 17, మధ్యాహ్నం 12 గంటల నుంచి కొనుగోళ్లకు అందుబాటులో ఉంటుంది. హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ కార్డ్లు, కోటక్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, హెచ్డీబి ఫైనాన్షియల్ సర్వీసెస్, వన్ కార్డ్ , అమెక్స్పై కస్టమర్లు రూ. 5000 వరకు క్యాష్బ్యాక్, 9 నెలల వరకు నో-కాస్ట్ EMIని ఆస్వాదించవచ్చు. అలాగే ఒప్పో కస్టమర్లు రూ. 5000 వరకు ఎక్స్ఛేంజ్ + లాయల్టీ బోనస్ను పొందవచ్చు. ఇంకా ఎక్స్ఛేంజ్ ఆఫర్ మరో రూ. 2000 వరకు తగ్గింపు లభ్యం. ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్ ఫీచర్లు 6.8-అంగుళాల e6 ఫోల్డింగ్ డిస్ప్లే 4nm MediaTek డైమెన్సిటీ 9000+ చిప్సెట్ ColorOS 13 ఆండ్రాయిడ్ 13 16జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ 50+ 8(ఫిక్స్డ్-ఫోకస్ అల్ట్రావైడ్ షూటర్) ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా 32ఎంపీ ఆటో ఫోకస్ సెల్ఫీ కెమెరా 44W ఫాస్ట్ ఛార్జింగ్కు మద్దతుతో 4,300mAh బ్యాటరీ -
Redmi Fire TV: కొత్త ఓఎస్తో, కొత్త కొత్తగా వచ్చేస్తోంది!
సాక్షి,ముంబై:బడ్జెట్ ధరల స్మార్టఫోన్లు, స్మార్ట్ టీవీలతో ఆకట్టుకున్న చైనా స్మార్ట్ఫోన్ మేకర్ షావోమికి చెందిన రెడ్మీ స్మార్ట్ టీవీని తీసుకొచ్చింది. ఇండియన్ మార్కెట్లో తొలిసారిగా ఫైర్ ఓఎస్తో సరికొత్త టీవీని పరిచయం చేసింది. ఈమేరకు షావోమీ ట్విటర్లో షేర్ చేసింది. రెడ్మీ ఫైర్ స్మార్ట్ టీవీ ఈ నెల (మార్చి) 14వ తేదీన లాంచ్ కానుంది. అమెజాన్కు చెందిన ఫైర్ ఓఎస్ 7 (Fire OS7)పై ఈ స్మార్ట్ టీవీ రన్ అవుతుంది. రెడ్మీ ఫైర్ టీవీని లాంచ్ కోసం మైక్రోపేజీని క్రియేట్ చేసింది. అమెజాన్ భాగస్వామ్యంతో ఈ టీవీని షావోమీ రూపొందించింది. అమెజాన్ ద్వారా ఈ టీవీ అందుబాటులోకి రానుంది. రెడ్మీ ఫైర్ టీవీ ఫీచర్లు, అంచనాలు రెడ్మీ ఫైర్ టీవీ బెజిల్లెస్ డిజైన్, క్వాడ్-కోర్ ప్రాసెసర్, మెటాలిక్ బాడీ డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 వెర్షన్ కనెక్టివిటీ ఫోన్, ల్యాప్టాప్, టాబ్లెట్ టీవీ స్క్రీన్ కాస్టింగ్ కోసం మిరాకాస్ట్, యాపిల్ ఎయిర్ ప్లే , అలెక్సా వాయిస్ అసిస్టెంట్ ప్రధాన ఫీచర్లుగా ఉండనున్నాయి. మరోవైపు ప్రపంచవ్యాప్తంగాఫైర్ ఓఎస్తో గ్లోబల్గా ఇటీవల షావోమీ ఎఫ్2 సిరీస్లో కొన్ని టీవీలను లాంచ్ చేసింది. 4K అల్ట్రా స్క్రీన్ రిజల్యూషన్, 43, 50, 55 అంగుళాల సైజుల్లో మెటల్ యూనీబాడీ డిజైన్తో వీటిని రూపొందించినట్టు తెలుస్తోంది. ఇక ధర, ఇతర స్పెషికేషన్లపై లాంచింగ్ తరువాత మాత్రమే క్లారిటీ రానుంది. Experience the excitement of curtain raiser performances from the comfort of your home. Stay Tuned!#FireUp pic.twitter.com/mcQv20qN09 — Xiaomi TV India (@XiaomiTVIndia) March 2, 2023 -
తగ్గినట్టే తగ్గి.. షాకిస్తున్న పసిడి
సాక్షి,ముంబై: గత కొద్దిరోజులుగాఆకాశనుంచి దిగొస్తూ మురిపించిప పసిడి ధరలు మళ్లీ షాకిస్తున్నాయి. రానున్న పెళ్లిళ్ల సీజన్లో ఊరట చెందాలనుకున్న పసిడి ప్రియులకు ఇది చేదు వార్త. తాజాగా గురువారం కూడా బంగారం, వెండి ధరలు వేగాన్ని అందుకున్నాయి. బుధవారం ట్రేడింగ్ ధరతో పోలిస్తే హైదరాబాదులో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,450 పలుకుతోంది. గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర రూ.5,175 గా ఉంది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.70,200కి చేరింది. ఇక ముంబై, కోల్కతాలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,600(గురువారం)గా ఉంది చెన్నైలో రూ. 52,350, ఢిల్లీ, జైపూర్ , లక్నోలో రూ. 51,750. మరోవైపు ఢిల్లీ, కోల్కతా, పూణేలో కిలో వెండి ధర రూ.66,800గా ఉంది. గ్లోబల్గా రాయిటర్స్ ప్రకారం, వడ్డీ రేట్లు ఊహించిన దానికంటే ఎక్కువ కాలం ఉంటాయనే పెట్టుబడిదారుల ఆందోళనలను గ్లోబల్ ఎకనామిక్ డేటా మరింత పెంచింది. డాలర్ పుంజుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు గురువారం స్వల్పంగా తగ్గాయి. బుధవారం ఒక వారం గరిష్ట స్థాయికి చేరిన స్పాట్ బంగారం 0.2శాతం తగ్గి ఔన్సుకు 1,833.57 డాలర్ల వద్ద ఉంది. అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ 0.3 శాతం నష్టంతో 1,840.50 డాలర్లుగా ఉంది. కాగా బుధవారం వరుసగా మూడవ సెషన్లో లాభంతో గత వారం నుండి బంగారం దాదాపుగా తన నష్టాలనుంచి కోలుకున్న సంగతి తెలిసిందే. -
టెక్నో ఫస్ట్ ఫోల్డబుల్ ‘ఫాంటమ్ వీ ఫోల్డ్’ లాంచ్, తక్కువ ధరలో
న్యూఢిల్లీ: చైనా స్మార్ట్ఫోన్ కంపెనీ తన తొలి ఫోల్డబుల్ ఫోన్ను టెక్నో ఫాంటమ్ వీ ఫోల్డ్ బార్సిలోనా మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2023 ఆవిష్కరించింది.ఫ్లాగ్షిప్ 4nm MediaTek డైమెన్సిటీ 9000+ SoC స్మార్ట్ఫోన్ భారత మార్కెట్లో ముందుగా లాంచ్ కానుందని ప్రకటించింది. టెక్నో MWC 2023లో అలాగే టెక్నో స్పార్క్ 10 ప్రో, మెగాబుక్ ఎస్1 2023ని ఆవిష్కరించింది. అలాగే ధరను కూడా ధృవీకరించింది. 15 నిమిషాల్లో 40 శాతానికి రీఛార్జ్, 55 నిమిషాల్లో పూర్తి ఛార్జ్ అవుతుందని, శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్4 కంటే స్క్రీన్ కంటే పెద్దగా ఉందని వెల్లడించింది. అల్ట్రా-క్లియర్ 5-లెన్స్ కెమెరాలతో, ప్రపంచంలోనే మొదటి లెఫ్ట్-రైట్ ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ అని పేర్కొన్నారు ఈ స్మార్ట్ఫోన్ రెండు వేరియంట్లలో లభ్యం కానుంది. 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్, 256 జీబీ వేరియంట్ ధరలు రూ.89,999(ఆఫర్ ధర) వరుసగా రూ. 99,999. నలుపు, తెలుపు అనే రెండు కలర్ వేరియంట్లలో అందిస్తోంది. ముందుగా తీసుకున్నవారికి 10 వేల డిస్కౌంట్ కూడా అందిస్తోంది. క్యూ2లో సేల్స్ మొదలు పెట్టాలని కంపెనీ నిర్ణయించింది. టెక్నో ఫాంటమ్ వీ ఫోల్డ్ స్పెసిఫికేషన్స్ 6.42-అంగుళాల LTPO AMOLED కవర్ డిస్ప్లే 1080x2550 రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ 7.85-అంగుళాల (2000x2296) ప్రధాన డిస్ప్లే 1080x2550 రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ 50+50+13 ఎంపీ రియర్ ట్రిపుల్ కెమెరా 32+ 16 మెగాపిక్సెల్ రెండు సెల్ఫీ కెమెరాలు -
వివో వీ 27 సిరీస్ స్మార్ట్ఫోన్లు వచ్చేశాయ్.. ధరలు ఎలా ఉన్నాయంటే
సాక్షి,ముంబై: చైనీస్ స్మార్ట్ఫోన్ బ్రాండ్ వివో రెండు ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. టాప్ ఎండ్ మీడియా టెక్ సాక్ ప్రాపెసర్లతో వివో వీ27, వివో వీ27 ప్రో పేరుతో వీటిని తీసుకొచ్చింది. వివో వీ 27, వివో వీ 27 ప్రొ ఫీచర్లు ప్రాసెసర్ తప్ప వివీ వీ 27 సిరీస్ స్మార్ట్ఫోన్లు దాదాపు రెండూ ఒకే విధమైన ఫీచర్లతో వచ్చాయి. ఆండ్రాయిడ్ 13 ఆధారిత FunTouch OS 13ని, 120Hz రిఫ్రెష్ రేట్తో 6.78-అంగుళాల పూర్తి-HD+(1,080x2,400 పిక్సెల్లు) AMOLED డిస్ప్లే, 4600mAh బ్యాటరీ ప్రధాన ఫీచర్లు. ఇంకా 50+2+8 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా, అలాగే ఆటో ఫోకస్ 50 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇందులో ఉన్నాయి. వివో వీ 27, వివో వీ 27 ప్రొ ధర, లభ్యత వివో వీ 27 ప్రొ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 37,999 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ధర 39,999. టాప్-ఎండ్ మోడల్ 12 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 42,999. వివో వీ 27: 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ రూ. 32,999 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ రూ. 36,999 ఈ స్మార్ట్ఫోన్లు సిరీస్ మ్యాజిక్ బ్లూ, నోబుల్ బ్లాక్ షేడ్స్లో లభ్యం. ఫ్లిప్కార్ట్, వివొ ఆన్లైన్ స్టోర్, ఆఫ్లైన్ రిటైల్ భాగస్వాముల ద్వారా విక్రయం. వివో వీ27 ప్రొ ప్రీ-బుకింగ్ ఈ రోజు (మార్చి 1) ప్రారంభం. మార్చి 6 నుండి సేల్ షురూ. ఇక వివో వీ27 సేల్ మార్చి 23 నుండి ప్రారంభం. అలాగే కస్టమర్లు హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా బ్యాంకు కార్డు కొనుగోళ్ల ద్వారా మూడు వేలు తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు రూ. 2500 exchange బోనస్ కూడా లభిస్తుంది. -
Russian Oil: అందుకేనా! రష్యా భారత్వైపే చూస్తోంది!
రష్యా చమురుకు చైనా నుంచి డిమాండ్ పెరుగుతన్నప్పటికీ.. భారత్కే వీలైనంత ఎక్కువగా విక్రయించేందుకు మొగ్గు చూపుతుంది. అదీగాక రష్యాకి కూడా మరింత లాభదాయకంగా ఉండటంతో భారత్ మార్కట్ వైపే ఆసక్తి కనబరుస్తోంది. వాస్తవానికి ఒక ఏడాది క్రితం దాదాపుగా రష్యా చమురును భారత్ కొనుగోలు చేయలేదు. కానీ ఎప్పుడైతే అమెరికా, యూరోపియన్ దేశాలు ఉక్రెయిన్ యుద్ధ విషయమై రష్యాపై ఆంక్షలు విధించాయో అప్పుడే భారత్ రష్యాకి కీలకమైన మార్కెట్గా మారింది. గత ఫిబ్రవరిలో భారత్ రష్యా నుంచి రోజుకు 1.85 మిలియన్ బ్యారెళ్లను దిగుమతి చేసుకుంది. అంటే దాని సంభావ్య గరిష్ట స్థాయి దాదాపు 2 మిలియన్ బ్యారెల్స్కు దగ్గరగా ఉంటుందని ప్రధాన ముడి విశ్లేషకుడు విక్టర్ కటోనా వివరించారు. ప్రస్తుతం చైనా కరోనా ఆంక్షలను ఎత్తేసింది. పైగా మొత్తం రష్యా చమురు ఎగుమతులను చైనా కొనుగోలు చేయగలదు కూడా అయినప్పటికీ రష్యా భారత్ మార్కెట్నే కొనసాగించాలని ఫిక్స్ అయ్యింది. ఎందుకంటే భారత్ దాని ముడి విక్రయితలకు ఎక్కువ నియంత్రణ ఇస్తుంది. ఇదిలా ఉండగా..అంతర్జాతీయ ఎనర్జీ ఏజెన్సీ(ఐఈఏ) ప్రకారం..గత నెలలో, రష్యా చైనాకు రోజుకు 2.3 మిలియన్ బ్యారెల్స్ ముడి చమురును ఎగుమతి చేసింది. మహమ్మారి సమయంలో విధించిన ప్రయాణ ఆంక్షలు ముగిసిన తర్వాత ఈ ఏడాది ఆసియా దిగ్గజం చమురు డిమాండ్ రోజుకు సుమారు 9 లక్షల బ్యారెల్స్ పెరుగుతుందని ఐఈఏ అంచనా వేసింది. చైనా రష్యా ముడి చమురును కొనుగోలు చేయగలగడమే గాక సొంతంగా షిప్పింగ్ చేయగల సామర్థ్యాం కూడా ఉంది. ఐతే భారత్కి సరఫరా చేయడానికి స్థాపించిన ట్యాంకర్ల సమాంతర గ్రే ఫ్లీట్ నుంచి మాస్కో ఆదాయాన్ని కోల్పోయే అవకాశం ఉందని అందువల్లే భారత్ ప్రయారిటీ ఇస్తోందని విక్టర్ కటోనా చెబుతున్నారు. అదీగాక భారత్కి ఓడరేవుల ద్వారా చమురు సరఫరా కేవలం 35 రోజులు పడుతుండగా చైనాకి సుమారు 40 నుంచి 45 రోజుల వరకు పడుతుంది. అంతేగాదు పెద్ద మొత్తంలో రష్యా చమురును ఉత్పత్తి చేసే రోన్సెఫ్ట్ పీజేఎస్ నయా ఎనర్జీ లిమిటెడ్లో 49.31% వాటాను కలిగి ఉంది. దీనికి సంబంధించిన షిప్పింగ్ రిఫెనరీ గుజరాత్లోని వదినార్లో ఉంది. ఇదే భారత్కు ఉన్న రెండోవ అతిపెద్ద వెసులుబాటు కావడంతో రష్యా భారత్కే విక్రయించేందుకు ఆసక్తి చూపుతోంది. (చదవండి: నిందితుడి అతితెలివి: పోలీసులకు చిక్కుకుండా కొరియన్లా సర్జరీ! కానీ..) -
పవర్ఫుల్ షావోమీ 13 ప్రో వచ్చేసింది: రూ. 22 వేల దాకా ఆఫర్
సాక్షి, ముంబై: చైనా స్మార్ట్ఫోన్ మేకర్ షావోమీ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఇటీవల మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) 2023లో ఆవిష్కరించిన షావోమీ 13 ప్రోని తీసుకొచ్చింది. పవర్ఫుల్ చిప్సెట్తో ఐఫోన్ 14 పోటీగా దీన్ని లాంచ్ చేసిందని టెక్ వర్గాల అంచనా. షావోమీ 13 ప్రో స్పెసిఫికేషన్స్ 6.73 2K E6 AMOLED LTPO కర్వ్డ్ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 1900నిట్స్ పీక్ స్నాప్డ్రాగన్ 8 Gen 2 LPDDR5X UFS 4.0 ఆండ్రాయిడ్ 13 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ 50+50+50 ట్రిపుల్రియర్ కెమెరా 32 ఎంపీ సెల్ఫీ కెమెరా 4820mAh బ్యాటరీ 120 వాట్ 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ ధర, సేల్, ఆఫర్: మార్చి 10 నుండి షావోమీ 13 ప్రో సేల్ మొదలవుతుంది. ధర రూ. 79,999 అమెజాన్, ఎంఐ రిటైల్ స్టోర్లలో రూ.79,999కి అందుబాటులో ఉంటుంది. ఐసీఐసీఐ కార్డ్ హోల్డర్లకు ప్రత్యేక తక్షణ బ్యాంక్ తగ్గింపు రూ. 10,000 లేదా షావోమీ యూజర్లకు రూ. 12,000 అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది. -
దేశీయ మార్కెట్లో రెండు కొత్త ఈ-స్కూటర్లు: ప్రత్యేకంగా..!
బెంగళూరు: ప్రముఖ షేర్డ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ స్టార్టప్ యులు, దేశీయ ద్విచక్ర తయారీ దిగ్గజం బజాజ్ ఆటో రెండు ఈవీ స్కూటర్లను సోమవారం మార్కెట్లో లాంచ్ చేశాయి. దేశీయ వినియోగానికి అనుగుణంగా రోజువారీ వినియోగంతో పాటు డెలివరీ సేవల కోసం కూడా ఉపయోగపడేలా ఈ స్కూటర్లను రూపొందించామని కంపెనీలు వెల్లడించాయి. యులు,బజాజ్ ఆటో సంయుక్తంగా మిరాకిల్ జీఆర్, డీఎక్స్ జీఆర్ పేరుతో లాంచ్ చేశాయి. దేశీయ అవసరాలు, రోడ్లు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వీటిని లాంచ్ చేస్తున్నట్టు యూలు, బజాజ్ ఆటో ఒక ప్రకటనలో తెలిపాయి. మిరాకిల్ జీఆర్, డీఈఎక్స్ జీఆర్ ఈ-స్కూటర్లు స్వాపింగ్ బ్యాటరీలతో పని చేస్తాయి. గరిష్ట వేగం గంటకు 25 కి.మీ. అందిస్తాయి. వీటికోసం ప్రత్యేకంగా ఎనర్జీ స్టేషన్లను నెలకొల్పామని, ప్రస్తుతం న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో 100 వరకు స్టేషన్లను ఏర్పాటు చేశామని యులు తెలిపింది. 2024 నాటికి ఈ సంఖ్యను 500కి పెంచాలని కంపెనీ యోచిస్తోంది. వాహన అవసరాలు, ప్రజల అంచనాలను దృష్టిలో ఉంచుకుని బాజజ్ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు యులు సీఈవో అమిత్ గుప్తా చెప్పారు.గత మూడు నెలల్లో తమ వాహనాల సంఖ్యను రెట్టింపు చేశామనీ, దేశంలోని ప్రధాన నగరాల్లో లక్ష వాహనాలను మోహరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి పదిరెట్ల కంటే ఎక్కువ ఆదాయ వృద్ధిని సాధించాలని యూలు లక్క్ష్యంగా పెట్టుకుంది. నెక్ట్స్జెన్ మేడ్-ఫర్ ఇండియా వాహనాలు అధునాతన డిజైన్లతో మొత్తం ఎలక్ట్రిక్ మొబిలిటీ కేటగిరీకి మైలురాయిగా నిలుస్తాయని బజాజ్ ఆటో లిమిటెడ్ చీఫ్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎస్ రవికుమార్ పేర్కొన్నారు. -
Massive discount షావోమీ12ప్రొ 5జీ స్మార్ట్ఫోన్పై భారీ తగ్గింపు: డోంట్మిస్!
సాక్షి, ముంబై: చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ షావోమీ తన పాపులర్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ 12ప్రో 5జీ పై భారీ తగ్గింపును అందిస్తోంది.ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్ ద్వారా సర్ప్రైజ్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. దాదాపుగా 30 శాతం తగ్గింపును అందిస్తోంది. అమెజాన్ అద్భుతమైన ఆఫర్లో షావోమీ 12 ప్రో 12 జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజీ వేరియంట్ను రూ. 55,999 సొంతం చేసుకోవచ్చు దీని అసలు ధర రూ. 79,999. ఇంకా బ్యాంక్ ఎక్స్ఛేంజీ ఆఫర్ కూడా ఉంది. పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా మరో 26వేల రూపాయల తగ్గింపు. అంటే జస్ట్ 3,949 రూపాయలకే ఈ స్మార్ట్ఫోన్ను సొంతం చేసుకోవచ్చు. షావోమి 12ప్రో 5జీ ఫీచర్లు 6.73-అంగుళాల WQHD+ AMOLED డిస్ప్లే Qualcomm Snapdragon 8 Gen 1 120Hz రిఫ్రెష్ రేట్, 1440 x 3200 పిక్సెల్ రిజల్యూషన్ 50+5+50ఎంపీ ట్రిపుల్ రియల్ కెమెరా 32 ఎంపీ సెల్ఫీ కెమెరా 4,600mAh బ్యాటరీ -
బడాబాబులు ఎక్కడా తగ్గట్లే: లంబోర్ఘిని కార్ల హాట్ సేల్
న్యూఢిల్లీ: ఇటాలియన్ సూపర్ కార్-మేకర్ లంబోర్ఘిని ఇండియాలో రికార్డ్ సేల్స్ నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఖరీదైన కార్లను విక్రయిస్తున్న సంస్థ అద్భుతమైన వృద్ధిని సాధించింది. ఇండియాలో తమ టార్గెట్ రీచ్ అయిందని కంపెనీ ప్రకటించింది. 2023లో భారతదేశంలో 100 కార్లను విక్రయించాలనేది అసలు ప్లాన్. అయితే, ఇంకా ఫిబ్రవరి పూర్తి కాకుండానే వీటిలో 90 కార్లను ఇప్పటికే ఆర్డర్స్ను అల్ట్రా హై నెట్ వర్త్ వ్యక్తులు (UHNIలు) హాట్కేక్లా కొనుగోలు చేస్తున్నారని లంబోర్ఘిని ఆసియా-పసిఫిక్ డైరెక్టర్ ఫ్రాన్సిస్కో స్కార్డొని తెలిపారు. లంబోర్ఘిని ఉరుస్ లగ్జరీ SUV, అవెంటడోర్, హురాకాన్ వంటి లగ్జరీ కార్లను ఇండియాలో విక్రయిస్తోంది. భారతదేశంలో దాని అన్ని కార్ల ధరలు రూ. 4 కోట్లకు పైమాటే. అయినప్పటికీ, సెలబ్రిటీలు , వ్యాపారవేత్తలు ఈ కార్లను ఎగరేసుకు పోవడం విశేషం. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న లంబోర్ఘిని మార్కెట్లలో ఇండియా ఒకటి. వార్షిక ప్రాతిపదికన 30 శాతం అమ్మకాలను సాధిస్తోంది. 2022లో దేశంలో 90 కార్లు విక్రయించగా, చైనాలో 1,000 కార్లను విక్రయించింది. మహమ్మారి అనంతర డిమాండ్ లంబోర్ఘిని ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పెరిగింది. గ్లోబల్ ట్రెండ్ల గురించి మాట్లాడుతూ 2023 ఏడాదికి సంబంధించిన ఆర్డర్లు ముగిసాయి. 2024 ఆర్డర్లను తీసుకుంటున్నాం. రోజువారీ ఆర్డర్బుక్ ఇంత ఎక్కువగా ఉండటం ఆశ్చర్యంగా ఉందని స్కార్డొని సంతోషం ప్రకటించారు. ఆర్డర్ బుకింగ్ సగటున 18 నెలల కంటే ఎక్కువే. -
కంపెనీలకు కలిసొచ్చిన కాలం: హీటెక్కిన రూం ఏసీ మార్కెట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రూమ్ ఎయిర్ కండీషనర్ల (ఏసీ) మార్కెట్ వేడెక్కింది. వేసవి ముందే రావడం ఇందుకు కారణం. భానుడి ప్రతాపంతో కస్టమర్లు ఏసీలు, రిఫ్రిజిరేటర్ల కోసం ఎలక్ట్రానిక్స్ షాపులకు క్యూ కడుతున్నారు. ఒకప్పుడు లగ్జరీగా భావించిన ఈ ఉపకరణాలు ఇప్పుడు తప్పనిసరి జాబితాలోకి వచ్చి చేరాయని కంపెనీలు అంటున్నాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏసీలు, రిఫ్రిజిరేటర్ల విపణి కొత్త రికార్డులు నమోదు చేయడం ఖాయమని తయారీ సంస్థలు ధీమాగా ఉన్నాయి. హైదరాబాద్ విషయానికి వస్తే 2022 ఫిబ్రవరిలో ఈ నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్. ఈ ఏడాది ఫిబ్రవరి 13న ఏకంగా 35.6 డిగ్రీల సెల్సియస్ నమోదైందంటే వేసవి ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఆల్ టైమ్ హైలో విక్రయాలు.. దేశంలో రూమ్ ఏసీ మార్కెట్ విస్తృతి 5-7 శాతం మాత్రమే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 80 లక్షల యూనిట్లు అమ్ముడవుతాయన్న అంచనాలు ఉన్నాయి. 2023-24లో పరిశ్రమ ఏకంగా ఒక కోటి యూనిట్ల మార్కును చేరుకుంటుందని బ్లూ స్టార్ చెబుతోంది. ఇదే జరిగితే భారత రూమ్ ఏసీ మార్కెట్ ఆల్ టైమ్ హై రికార్డులు నమోదు చేసినట్టు అవుతుంది. 2029 నాటికి పరిశ్రమ 4 కోట్ల యూనిట్లను తాకుతుందని డైకిన్ వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే కంపెనీలు ఈ సీజన్లో విక్రేతల వద్ద 25 శాతం అధికంగా సరుకు నిల్వ చేశాయి. అంతేగాక తయారీ సామర్థ్యమూ అమ్మకాల తగ్గట్టుగా పెంచుకున్నాయి. భారీగా డిమాండ్ ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో ప్రకటనల బడ్జెట్లనూ అధికం చేశాయని జాన్రైస్ అడ్వర్టైజింగ్, బ్రాండింగ్ డైరెక్టర్ సుమన్ గద్దె తెలిపారు. భారీ అంచనాలతో.. కంపెనీలు ఈ సీజన్లో భారీ అంచనాలతో రెడీ అవుతున్నాయి. 2023 శ్రేణి మోడళ్లతో కస్టమర్లను ఆకట్టుకోవడానికి కసరత్తు చేస్తున్నాయి. బ్లూ స్టార్ ఏకంగా 75 మోడళ్లను రంగంలోకి దింపింది. రూమ్ ఏసీ రంగంలో విలువ పరంగా కంపెనీకి ప్రస్తుతం 13.5 శాతం వాటా ఉంది. 2025 మార్చి నాటికి దీనిని 15 శాతానికి చేర్చాలని లక్ష్యంగా చేసుకుంది. శామ్సంగ్ ఈ సీజన్ కోసం విండ్ ఫ్రీ సిరీస్తోపాటు మరో 38 మోడళ్లను ప్రవేశపెట్టింది. ఈ ఏడాది వేసవి తీవ్రంగా, మరింత ఎక్కువ కాలం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏసీ మార్కెట్ బలమైన డిమాండ్తో 30 శాతం వృద్ధి చెందవచ్చని గోద్రెజ్ అప్లయాన్సెస్ బిజినెస్ హెడ్ కమల్ నంది తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రెండింతల అమ్మకాలను ఆశిస్తున్నట్టు వెల్లడించారు. రెండంకెల వృద్ధి లక్ష్యంగా చేసుకున్నట్టు హాయర్ ప్రకటించింది. -
పోకో సీ55 స్మార్ట్ఫోన్: రూ.10వేల లోపు బెస్ట్ ఫోన్!
సాక్షి, ముంబై: పోకో కొత్త స్మార్ట్ఫోన్ భారతీయ మార్కెట్లోలాంచ్ చేసింది. పోకో సీ 55 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్ధరను పదివేల లోపే నిర్ణయించడం విశేషం. 5,000mAh బ్యాటరీ, లెదర్ ఫినిష్లాంటి ఫీచర్లతో బడ్జెట్ ఫోన్కోసం చూస్తున్న వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఫారెస్ట్ గ్రీన్, కూల్ బ్లూ మరియు పవర్ బ్లాక్ రంగులలో ఇది లభ్యం. పోకో సీ 55 ఫీచర్లు 6.71-అంగుళాల IPS LCD డిస్ప్లే MediaTek Helio G85 SoC MIUI 13 స్కిన్తో Android 12 OS 50 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమెరా ఫ్లిప్కార్ట్ వివరాల ప్రకారం పోకో సీ 55 4జీ ప్రారంభ ధర 8,499 రూపాయలు. 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,499. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 10,999. ఈ బడ్జెట్ ఫోన్ ఫిబ్రవరి 28నుంచి సేల్స్ మొదలు. సేల్ ఆఫర్గా రూ. 500 ఫ్లాట్ తగ్గింపు, బ్యాంక్ కార్డ్లపై రూ. 500 తగ్గింపు కూడా అందుబాటులో ఉంది. -
Yamaha 2023 కొత్త స్కూటర్లు చూశారా...అదిరే లుక్స్లో వచ్చేశాయ్!
సాక్షి, ముంబై: యమహా మోటార్ ఇండియా కొత్త స్కూటర్లను అప్డేటెడ్గా తీసుకొచ్చింది. 125 సీసీ స్కూటర్ లైనప్ను 2023 వర్షెన్లను లాంచ్ చేసింది. 2023 Yamaha Fascino, Ray ZR 125, RayZR స్ట్రీట్ ర్యాలీలను తీసుకొచ్చింది. కస్టమర్లను ఆకట్టుకునేలా కొత్త కలర్ స్కీమ్లు, అప్డేటెడ్ ఇంజన్ , కొత్త ఫీచర్లతో వీటిని తీసుకొచ్చింది. భారతదేశంలో రూ. 89,530, ఎక్స్-షోరూమ్ ధరలతో ప్రారంభం. 2023 యమహా ఫాసినో 125 ఎక్స్షోరూం ధర రూ. 91,030గా ఉంది. రే జెడ్ఆర్ 125 ఫై హైబ్రీడ్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 89,530గా ఉంది. అలాగే రేయ్ జెడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ 125 ఎక్స్-షోరూమ్ ధర రూ. 93,530గా ఉంది. ఫాసినో 125 డిస్క్ వేరియంట్, రేయ్ జెడ్ఆర్ 125 స్కూటర్లరు డార్క్ మ్యాట్ బ్లూ కలర్లోనూ, రేయ్ జెడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ కొత్త మ్యాట్ బ్లాక్ & లైట్ గ్రే వెర్మిలియన్ పెయింట్ స్కీమ్లలో అందుబాటులో ఉంటుంది. ఈ స్కూటర్లు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్తోపాటు, ఒకత్తగా బ్లూటూత్-ఎనేబుల్ చేయబడిన మై-కనెక్ట్ యాప్కి కనెక్ట్ చేసింది. ఫ్యూయెల్ కన్జమ్షన్ ట్రాకర్, మెయిన్టేనెన్స్ రికమెండేషన్, లాస్ట్ పార్కింగ్ లొకేషన్, మాల్ఫంక్షన్ నోటిఫికేషన్, రివర్స్ డాష్బోర్డ్, రైడర్ ర్యాంకింగ్ లాంటి ఫీచర్లు ప్రధానంగా ఉన్నాయి. ఇంజీన్ 125 సీసీ బ్లూ కోర్ ఇంజిన్ 6,500 ఆర్పీఎం వద్ద 8.2 పీఎస్ పవర్ను, 5000 ఆర్పీఎం వద్ద 10.3 ఎన్ఎం టార్క్ను జనరేట్ చేస్తుంది. హైబ్రీడ్ ఇంజిన్లో స్మార్ట్ మోటార్ జనరేటర్ సిస్టెమ్ కూడా ఉంటుంది. ఇంకా ఓబీడీఐ2, ఈ-20 ఫ్యూయెల్ కంప్లైంట్ బీఎస్6, ఎయిర్- కూల్డ్ ఫ్యూయెల్ ఇంజక్షన్ (ఎఫ్ఐ) కొత్త వెర్షన్ ప్రత్యేకతలుగా ఉన్నాయి. -
Revolt RV400: దేశంలోనే తొలి ఏఐ ఎనేబుల్డ్ ఇ-బైక్ బుకింగ్స్ మళ్లీ!
సాక్షి,ముంబై: రరట్టన్ ఇండియా ఎంటర్ప్రైజెస్ గ్రూపు యాజమాన్యంలోని kరివోల్ట్ మోటార్స్ తన బైక్ లవర్స్కు గుడ్న్యూస్ చెప్పింది. తమ ఏఐ ఎనేబుల్డ్ ఆర్వీ 400 బైక్ బుకింగ్లను తిరిగి ప్రారంభిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. దేశీయ తొలి ఏఐ ఎనేబుల్డ్ ఆర్వీ 400 ఎలక్ట్రిక్ బైక్ను స్వాపింగ్ బ్యాటరీ ప్యాక్తో తీసుకొచ్చింది. ఇది 125 సీసీ పెట్రోల్ ఇంజీన్ బైక్కు సమానమైన పనితీరును అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఏఐ ఎనేబుల్డ్ రివోల్ట్ ఆర్వీ 400 బైక్ బుకింగ్లు ఫిబ్రవరి 22న తిరిగి ప్రారంభిస్తున్నామనీ కేవలం రూ. 2,499 ముందస్తుగా బుక్ చేసుకోవచ్చని వెల్లడించింది. డెలివరీలు మార్చి 31, 2023 నాటికి ప్రారంభ మయ్యే అవకాశం ఉంది. ఏఐ ఎనేబుల్డ్ ఆర్వీ 400 ఎలక్ట్రిక్ బైక్ 72V 3.24kWh లిథియం-అయాన్ బ్యాటరీ 4.5 గంటలలోపు ఛార్జ్ అవుతుంది బ్యాటరీ 3kW మోటార్తో అనుసంధానం ఈ బ్యాటరీ 54Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. రివోల్ట్ ఆర్వీ 400 బైక్ ఫీచర్ల పరంగా, ఫుల్-LCD ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 4G కనెక్టివిటీతో వస్తుంది. ట్రావెల్ హిస్టరీ, బ్యాటరీ ఆరోగ్యం, పరిధి సమీప స్వాప్ స్టేషన్ వంటి వివరాలకు వోల్ట్ యాప్ను బైక్ను స్మార్ట్ఫోన్కు జత చేయవచ్చు. ఇ-బైక్ కీలెస్ ఇగ్నిషన్ను కూడా కలిగి ఉంది. 'ఇంజిన్ నోట్' మరో స్పెషల్ ఫీచర్. ఇది బైక్లోని అంతర్నిర్మిత స్పీకర్ల ద్వారా కృత్రిమ ఇంజిన్ సౌండ్ను కంట్రోల్ చేస్తుంది. స్క్రూ-టైప్ ప్రీలోడ్ అడ్జస్టబిలిటీతో రియర్ ఇన్వర్టెడ్ ఫ్రంట్ ఫోర్క్,మోనో-షాక్ను కలిగి ఉంటాయి. ఇటీవల రట్టన్ ఇండియా కొనుగోలు చేసిన రివోల్ట్ మోటార్స్ తన సప్లయ్ చెయిన్లో భారీ పెట్టుబడులు పెట్టింది. అలాగే హర్యానాలోని మనేసర్లోని వరల్డ్ క్లాస్ ప్లాంట్లో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచినట్టు ప్రకటించింది. -
రంగులు మార్చే ఫోన్: వివో వై100 లాంచ్, ధర ఎంతంటే?
న్యూఢిల్లీ: వివో సంస్థ వై100 స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. ఫోన్ వెనుక భాగం రంగులు మారడం ఇందులో ప్రత్యేకత. ఇందుకోసం ఫ్లోరైట్ ఏజీ గ్లాస్ ప్యానెల్ ఏర్పాటు చేశారు. 64 మెగాపిక్సల్ ఓఐఎస్ యాంటీ షేక్ కెమెరా ఏర్పాటు చేశారు. చూడ్డానికి ప్రీమియంగా, తక్కువ బరువుతో ఉంటుందని వివో తెలిపింది. పసిఫిక్ బ్లూ , ట్విలైట్ గోల్డ్ - మరియు మెటల్ బ్లాక్ కలర్ ఆప్షన్స్లో ఇది లభ్యం.181 గ్రాముల బరువుతో ఉంటుంది. వివో వై100 ఫీచర్లు 6.38 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే 90 హెర్జ్ రీఫ్రెష్ రేటు, 7.73 ఎంఎం స్లీక్ బాడీ Android 13, FunTouch OS 13 4,500 ఎంఏహెచ్ బ్యాటరీని 44వాట్ ఫ్లాష్ చార్జర్ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999. లభ్యత, ఆఫర్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, వివో ఇండియా ఈ-స్టోర్లతోపాటు, రిటైల్ అవుట్లెట్లలో లభిస్తుంది. కోటక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.1,500 వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ను కంపెనీ ప్రకటించింది. When change is the only constant, why stick to one color? Stay tuned for the Color Changing Glass Finish of vivo Y100. Stay tuned! To know more, visit https://t.co/5bNAoMyRiK#vivoY100 #ItsMyStyle #ColorMyStyle#ComingSoon #5G pic.twitter.com/wmuhn2Wj5B — vivo India (@Vivo_India) February 8, 2023 -
నోకియా ఎక్స్30 5జీ స్మార్ట్ఫోన్ లాంచ్, ధర విని షాక్ అవ్వకండి!
సాక్షి, ముంబై: ప్రముఖ మొబైల్ తయారీదారు నోకియా సరికొత్త స్మార్ట్ఫోన్ను బుధవారం లాంచ్ చేసింది. నోకియా ఎక్స్ 30 4జీ’ పేరుతో ఒక కొత్త స్మార్ట్ఫోన్ను విడుదల చేస్తున్నట్లు హెచ్ఎండీ గ్లోబల్, ప్రకటించింది. దీని ధర రూ. 48999. నోకియా అధికారిక వెబ్సైట్లో ఫిబ్రవరి 20 అందుబాటులో ఉంటుంది. నోకియా ఎక్స్ 30 4జీ ఫీచర్లు 6.43 అంగుళాల AMOLED డిస్ప్లే స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ Android 12, 1080 x 2400 పిక్సెల్స్ రిజల్యూషన్ క్వాల్కం SM6375 స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ 8 జీబీ ర్యామ్, 256 జీజీ స్టోరేజ్ 50+13ఎంపిడ్యుయల్ రియర్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 4,200ఎంఏహెచ్ బ్యాటరీ లాంచ్ ఆఫర్లు నోకియా వెబ్సైట్లో కొనుగోలు చేస్తే రూ. 1,000 తగ్గింపు ఉచిత నోకియా కంఫర్ట్ ఇయర్బడ్స్ విలువ రూ. 2,799 రూ. 2,999 33వాట్స్ ఛార్జర్ విలువ ఈ-కామర్స్ వెబ్సైట్ అమెజాన్ ఎక్స్ఛేంజ్పై అదనంగా రూ. 4000 తగ్గింపు -
లగ్జరీ ఫీచర్లతో ఆడి క్యూ3 స్పోర్ట్బ్యాక్: బుకింగ్స్ షురూ!
ముంబై: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘ఆడి’ తన నూతన స్పోర్ట్బ్యాక్ కారు ‘ఆడిక్యూ3’ స్పోర్ట్బ్యాక్ బుకింగ్లను మంగళవారం ప్రారంభించింది. రూ.2 లక్షలతో బుకింగ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. 2.0లీటర్ల టీఎఫ్ఎస్ఐ పెట్రోల్ ఇంజన్తో ఈ కారు ఉంటుంది. మంచి పనితీరు, అద్భుతమైన డిజైన్తో రోజువారీ వినియోగానికి కారు కోరుకునే వారు ఆడిక్యూ3 స్పోర్ట్బ్యాక్ను ఎంతో ఇష్టపడతారని ఆడి ఇండియా హెడ్ బల్బీర్సింగ్ దిల్లాన్ పేర్కొన్నారు. 2022లో భారత్లో 27 శాతం మేర విక్రయాల వృద్ధిని నమోదు చేశామని, 2023లోనూ విక్రయాలు ఇదే విధంగా ఉండొచ్చన్నారు. -
ఐకియా గుడ్న్యూస్: ధరలు తగ్గాయోచ్!
ముంబై: ఫర్నీచర్ రంగంలో ఉన్న యూరప్ దిగ్గజం ఐకియా కస్టమర్లకు శుభవార్త అందించింది. భారత్లో ధరలను తగ్గించింది. లివింగ్ రూమ్ ప్రొడక్ట్స్, స్టోరేజ్, కిచెన్, పరుపులు, బెడ్రూమ్ ఫర్నీచర్ వంటి విభాగాల్లో 9,000 పైచిలుకు ఎంపిక చేసిన ఉత్పత్తులపై 16-39 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. హైదరాబాద్, ముంబై, బెంగళూరులో ఐకియా స్టోర్లు ఉన్నాయి. ఆన్లైన్లోనూ కంపెనీ తన ఉత్పత్తులను విక్రయిస్తోంది. ఇవీ చదవండి: విప్రో బాటలో ఇన్ఫీ: 600 మంది ఫ్రెషర్లు ఔట్! టాటా మోటార్స్ గుడ్ న్యూస్, టాప్ మోడల్స్పై అదిరిపోయే ఆఫర్లు Zoom layoffs: అరగంటలో 1300 ఉద్యోగాలు ఊస్టింగ్ -
టాటా మోటార్స్ గుడ్ న్యూస్, టాప్ మోడల్స్పై అదిరిపోయే ఆఫర్లు
సాక్షి, ముంబై: ప్రముఖ కార్ల తయారీ దారు టాటా మోటార్స్ కూడా తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ఫిబ్రవరిలో ఎంపిక చేసిన మోడల్స్, సఫారి, హారియర్, ఆల్ట్రోజ్, టిగోర్ ,టియాగోపై రూ. 75,000 వరకు తగ్గింపు అందిస్తోంది. ఇప్పటికే మారుతి సుజుకి కూడా తగ్గింపు ధరలను ప్రకటించిన సంగతి తెలిసిందే. 2023 ఫిబ్రవరి నెలకు సంబందించిన తగ్గింపులో హారియర్, సఫారి మోడల్కార్లపై భారీ తగ్గింపును అందిస్తోంది . ముఖ్యంగా 2022, 2023 మోడల్స్పై ఈ బెనిఫిట్స్ను అందించడం విశేషం. టాటా ఫ్లాగ్షిప్ ఎస్యూవీ సఫారి 2023 అన్ని వేరియంట్లలో మొత్తం రూ. 35,000 తగ్గింపు లభ్యం. ఇందులో రూ. 10,000 నగదు తగ్గింపు రూ. 25,000 విలువైన ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ఉన్నాయి. మరోవైపు, అమ్ముడుపోని ఎంపిక చేసిన 2022 సఫారీపై మొత్తం రూ. 75,000 వరకు తగ్గింపును కూడా అందిస్తోంది. దాదాపు టాటా హారియర్ కార్పై కూడా అదే ఆఫర్ లభిస్తోంది. టాటా హారియర్: 2023 మోడళ్లపై రూ. 35,000, 2022 మోడల్స్పై 75,000 వరకు తగ్గింపు టాటా టిగోర్: కొత్త స్టాక్ 25,000 వరకు తగ్గింపు , 2022 స్టాక్ పై 35,000 వరకు తగ్గింపు టాటా టియాగో: కొత్త స్టాక్పై 25,000 వరకు తగ్గింపు, 2022 స్టాక్పై 40,000 వరకు తగ్గింపు -
Poco X5 Pro 5g: వచ్చేస్తోంది.. రాక్స్టార్ చేతులమీదుగా
సాక్షి,ముంబై: పోకో ఎక్స్5 ప్రో ఈరోజు( సోమవారం) సాయంత్రం విడుదలవుతోంది. సాయంత్రం 5.30 గంటలకు జరిగే లాంచింగ్ కార్యక్రమాన్ని కంపెనీ తమ యూట్యూబ్ చానెల్, ఫ్లిప్కార్ట్ చానెల్లో లైవ్ స్ట్రీమింగ్ చేయనుంది. పోకో ఎక్స్5 ప్రో స్మార్ట్ ఫోన్లను ఫ్లిప్కార్ట్ ద్వారా అమ్మకానికి ఉంచనున్నట్లు కంపెనీ ట్విటర్ ద్వారా తెలియజేసింది. గతేడాది విడుదల చేసిన పోకో ఎక్స్4 ధర రూ.18,999. అయితే తాజాగా లాంచ్ చేయనున్నపోకో ఎక్స్5 ప్రో బేసి వేరియంట్ ధర 20 వేల లోపే ఆవిష్కరించ నుందట. అలాగే 8జీబీ ర్యామ్, 256 జీబీ వేరియంట్ ధర రూ. 22,999 ఉంచనుంది. అయితే ఐసీఐసీఐ బ్యాంకు కార్డు ద్వారా 2వేల తగ్గింపుతో 20,999 అందించనుంది. ఫిబ్రవరి 13 నుంచి తొలి సేల్ షురూ కానుంది. ప్రత్యేకతలు ఇవే.. (అంచనా) ఈ ఫోన్ స్పెసిఫికేషన్లలో కొన్నింటిని కంపెనీ ఇదివరకే వెల్లడించింది. పోకో ఎక్స్5 ప్రో 5జీ ఫోన్ 6.67 అంగుళాల డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 778 ఎస్ఓసీ టెక్నాలజీతో రాబోతోంది. ఇదే టెక్నాలజీతో వచ్చిన శాంసంగ్, ఐక్యూ కంపెనీలకు చెందిన ఫోన్ల ధర రూ.30 వేలకు పైనే. పోకో ఫోన్లో 12 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఉంటుంది. 108+8+ 2 ఎంపీ రియర్ కెమెరా, 120హెడ్జ్ ఆమోల్డ్ డిస్ప్లే, స్లిమ్ డిజైన్ ఉండబోతోంది. 5000 ఎంఏహచ్ బ్యాటరీ సామర్థ్యం, 67 వాట్ల ఫాస్ట్ చార్జింగ్తో ఇది పనిచేస్తుంది. Rockstar on the field and a superstar IRL. Catch @hardikpandya7 #UnleashX with the #POCOX5Pro5G behind the scenes. Revealing today @ 5:30 PM on @Flipkart: https://t.co/fRPK7AdL8X pic.twitter.com/hfCNQWuCGA — POCO India (@IndiaPOCO) February 6, 2023 -
ఒప్పో రెనో 8టీ 5జీ స్మార్ట్ఫోన్ వచ్చేసిందిగా! ధర ఎంత?
సాక్షి, ముంబై: ఒప్పో రెనో 8టీ 5జీ స్మార్ట్ఫోన్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయింది. రెనో 8 సిరీస్లో శుక్రవారం దీన్ని తీసుకొచ్చింది. 120Hz 3D Curved Screen, 108 ఎంపీ పోర్ట్రయిట్ భారీ కెమెరా, బిలియన్ కలర్స్ డిస్ప్లే ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. 45 నిమిషాలలోపు ఫోన్ను పూర్తిగా ఛార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంది. ఫిబ్రవరి 10నుంచి ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. ఒప్పో రెనో 8టీ 5జీ స్పెసిఫికేషన్స్ 6.7 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ స్నాప్డ్రాగన్ 695 5G SoC 108+2+2 ఎంపీ రియర్ ట్రిపుల్ కెమెరా 32 ఎంపీ సెల్ఫీ కెమెరా 8 జీబీర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 4,800mAh బ్యాటరీ, 67W ఫాస్ట్ ఛార్జింగ్కు మద్దతు ధర రూ. 29,999 -
భారత్లో భారీ పెట్టుబడులు ఇందుకే: సీక్రెట్ రివీల్ చేసిన యాపిల్ సీఈఓ
న్యూఢిల్లీ: భారత్ మార్కెట్పై అత్యంత విశ్వాసంతో ఉన్నట్లు యాపిల్ సీఈఓ టిమ్ కుక్ చెప్పారు. భారత్ మార్కెట్ తమకు అత్యంత కీలకమని, అందుకే ఇక్కడ భారీ మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నట్లు పేర్కొన్నారు. యాపిల్ సంస్థ తమ డిసెంబర్ త్రైమాసిక ఫలితాలను గురువారం వెల్లడించింది. మొత్తం 117.2 బిలియన్ డాలర్లు (రూ.9,61,775 కోట్లు) రెవెన్యూ ఆర్జించినట్లు తెలిపింది. మార్కెట్ల సంఖ్య పరంగా ఇది ఆల్టైమ్ రికార్డ్. కెనడా, ఇండోనేషియా, మెక్సికో, స్పెయిన్, టర్కీ, వియత్నాం, బ్రెజిల్, భారత్ మార్కెట్ల నుంచి ఈ రెవెన్యూ వచ్చింది. భారత్లో యాపిల్ డబుల్ గ్రోత్ భారత్లో యాపిల్ సంస్థ రెండంకెల వృద్ధితో దూసుకెళ్తోందని, దీనిపై చాలా సంతృప్తికంగా ఉన్నట్లు టిమ్కుక్ పేర్కొన్నారు. భారత్లో కంపెనీ విస్తరణపై ప్రత్యేక దృష్టి పెట్టామని అందులో భాగంగా 2020లో ఇక్కడ ఆన్లైన్ స్టోర్ ఏర్పాటు చేశామని తెలిపారు. త్వరలో యాపిల్ రిటైల్ స్టోర్ను కూడా తీసుకురానున్నట్లు చెప్పారు. కోవిడ్ సంక్షోభం తర్వాత భారత్లో తమకు బాగా కలిసివచ్చిందన్నారు. మార్కెట్ రీసెర్చ్ సంస్థ కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ప్రకారం.. 2022లో భారత్లో రూ.30వేలుపైగా ధర ఉన్న ప్రీమియం స్మార్ట్ఫోన్ల అమ్మకాల్లో యాపిల్ వాటా 11 శాతం. ఇది మార్కెట్ రెవెన్యూలో 35 శాతం. భారత్లో గతేడాది ప్రీమియం స్మార్ట్ఫోన్ల సెగ్మెంట్లో యాపిల్దే అగ్రస్థానం. ఇందులో ఐఫోన్13 అత్యధికంగా అమ్ముడుపోయిన ప్రీమియం స్మార్ట్ఫోన్గా నిలిచింది. భారత్లో ఓవరాల్ స్మార్ట్ఫోన్ రెవెన్యూ షేర్లో 2021లో నాలుగో స్థానంలో ఉన్న యాపిల్.. 2022లో రెండో స్థానానికి ఎగబాకింది. -
రియల్మీ కోకా-కోలా స్మార్ట్ఫోన్ వచ్చేస్తోంది.. అదిరే కలర్స్లో
సాక్షి, ముంబై: చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం రియల్మీ కోకా-కోలాకంపెనీ భాగస్వామ్యంతో సరికొత్త స్మార్ట్ఫోన్ను భారతీయ మార్కెట్లో లాంచ్ చేయనుంది. రియల్మీ 10 ప్రో 5జీ స్మార్ట్ఫోన్ కోకా -కోలా ఎడిషన్ను ఫిబ్రవరి 10న చేయబోతున్నట్టు ప్రకటించింది. సరికొత్త కలర్స్లో, యూజర్ ఇంటర్ఫేస్లో (UI) కీలక మార్పులతో కస్టమర్లను ఆకట్టుకోనుంది. దీనికి సంబంధించిన ప్రీ బుకింగ్స్ను కూడా కంపెనీ మొదలు పెట్టింది. స్టోరేజ్ మార్పు తప్ప, మిగిలిన ఫీచర్లు గత ఏడాది నవంబర్లో లాంచ్ చేసిన మోడల్ మాదిరిగానే ఉండబోతున్నాయి. గతేడాది మార్వెల్ భాగస్వామ్యంతో రియల్మీ జీటీ నియో3 థోర్ ఎడిషన్ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. తాజా కోకా కోలాతో జతకట్టింది. పరిమిత-ఎడిషన్ ఫోన్ను కోకాకోలా లోగోతో బ్లాక్ అండ్ రెడ్ డ్యుయల్ టోన్ కలర్స్లో ఆకర్షణీయంగా లాంచ్ చేస్తోంది. రియల్మీ 10 ప్రో కోకా-కోలా ఎడిషన్ ఫీచర్లు (అంచనా) 6.7 ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే ఆండ్రాయిడ్ 13, స్నాప్ డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ 108 ఎంపీ ప్రోలైట్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ ధర భారత్లో రూ.20 వేల లోపే ఉండొచ్చని అంచనా. కాగా రియల్మీ 10 ప్రో 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ.18,999, 8జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వెర్షన్ ధర రూ.19,999. అలాగే రియల్మీ 10 ప్రో ప్లస్ 6జీబీ ర్యామ్ + 128 జీబీ వేరియెంట్ ధర రూ.24,999గాను, 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజీ ధర రూ.27,999గా ఉన్నాయి. -
మళ్లీ షాకిచ్చిందిగా హ్యుందాయ్: ఐ20 ఎన్-లైన్ ధరల పెంపు, ఆ వేరియంట్లు ఔట్
సాక్షి, ముంబై: దక్షిణ ఆఫ్రికా కారు దిగ్గజం హ్యుందాయ్ తన కస్టమర్లకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. హ్యుందాయ్ ఐ20, హ్యుందాయ్ ఐ20 ఎన్-లైన్ కార్ల ధరలును మరోసారి పెంచేసింది. ఈ మేరకు హ్యుందాయ్ మోటార్ ఇండియా అధికారిక ప్రకటన జారీ చేసింది. ఐ20 లైనప్ కార్ల ధరలు పెరగడం నాలుగు నెలల్లో ఇది రెండోసారి. గతేడాది ఫెస్టివల్ సీజన్ ముందు సెప్టెంబర్లో ధరలను పెంచింది. ఐ 20 లైనప్లో వేరియంట్లను బట్టి రూ.21,500 వరకు ధర పెరగనుంది. ఐ20 హ్యాచ్బ్యాక్ మోడల్ లైనప్ నుండి1.0L టర్బో-పెట్రోల్ iMT వేరియంట్లను (స్పోర్ట్జ్ టర్బో ఆస్టా టర్బో) తొలగించింది. ఇపుడిక టర్బో-పెట్రోల్ ఇంజన్ స్పోర్ట్జ్ , ఆస్టా ట్రిమ్లలో 7-స్పీడ్ DCT ఆటోమేటిక్ గేర్బాక్స్తో మాత్రం ఐ20 అందుబాటులో ఉంటుంది. వేరియంట్ లైనప్ను అప్డేట్ చేయడంతో పాటు, కార్మేకర్ హ్యుందాయ్ ఐ20 ధరలను రూ. 21,500 వరకు పెంచింది. తాజా ధరల పెంపు తర్వాత, హ్యాచ్బ్యాక్ పెట్రోల్ వెర్షన్ ధర రూ. 7.18 లక్షల నుండి రూ. 10.91 లక్షల వరకు ఉంటుంది. మోడల్ లైనప్లో మూడు 1.0L టర్బో పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్లు ఉన్నాయి . Sportz DCT, Asta DCT , Asta DCT డ్యూయల్-టోన్ - ధర రూ. 10.11 లక్షలు, రూ. 11.68 లక్షలు, రూ. 11.83 లక్షలు. నాలుగు 1.5L డీజిల్ వేరియంట్లు లలో మాగ్నా (రూ. 8.42 లక్షలు), స్పోర్ట్జ్ (రూ. 9.28 లక్షలు), ఆస్టా (ఓ) (రూ. 10.83 లక్షలు) , ఆస్టా (ఓ) డ్యూయల్-టోన్ (రూ. 10.98 లక్షలు). పైన పేర్కొన్న అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ధరలు. -
భారత్లో లంబోర్గీని రికార్డ్ సేల్స్; వచ్చే ఏడాదికి భారీ టార్గెట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సూపర్ లగ్జరీ కార్ల తయారీలో ఉన్న ఇటలీ సంస్థ ఆటోమొబైలి లంబోర్గీని 2022లో భారత్లో 92 యూనిట్లు విక్రయించింది. దేశంలో ఇప్పటి వరకు కంపెనీకి ఇవే అత్యధిక అమ్మకాలు కావడం విశేషం. 2021తో పోలిస్తే 33 శాతం వృద్ధి సాధించింది. గతేడాది ప్రపంచవ్యాప్తంగా కంపెనీ నుంచి అత్యధికంగా 9,233 యూనిట్లు రోడ్డెక్కాయి. అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 10 శాతం అధికం. మార్కెట్ సానుకూలంగా ఉందనడానికి ఈ గణాంకాలే నిదర్శనమని కంపెనీ తెలిపింది. అత్యుత్తమ మార్కెట్లలో భారత్ ఒకటిగా నిలిచిందని వెల్లడించింది. 2021తో పోలిస్తే గతేడాది ఆసియా దేశాలు 14 శాతం వృద్ధి సాధించాయి. విక్రయాల పరంగా తొలి స్థానంలో ఉన్న యూఎస్ మార్కెట్ 10 శాతం అధికంగా 2,721 యూనిట్లు నమోదు చేసింది. భారత్లో లంబోర్గీని కార్ల ధరలు రూ.3.16 కోట్ల నుంచి ప్రారంభం. అంతేకాదు 2023 సంవత్సరానికి గాను భారీ టార్గెట్ పెట్టకున్నట్టు కంపెనీ కంట్రీ హెడ్ శరద్ అగర్వాల్ తెలిపారు. 2023లో మూడు అంకెల మార్కును ఎలా సాధించి సెంచరీ కొట్టాలని భావిస్తున్నట్టు చెప్పారు. -
మహీంద్రా ఎక్స్యూవీ400 టార్గెట్ 20,000 యూనిట్లు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ఈ ఏడాది 20,000 యూనిట్ల ఎక్స్యూవీ400 ఎలక్ట్రిక్ ఎస్యూవీలను సరఫరా చేయాలని లక్ష్యంగా చేసుకుంది. పరిచయ ఆఫర్లో ధర రూ.15.99 లక్షల నుంచి ప్రారంభం. 2022 సెప్టెంబర్లో కంపెనీ ఈ మోడల్ను ఆవిష్కరించింది. జనవరి 26 నుంచి బుకింగ్స్ మొదలు కానున్నాయి. మార్చి నుంచి ఈఎల్ వేరియంట్, దీపావళి సమయంలో ఈసీ వేరియంట్ డెలివరీలు ప్రారంభం అవుతాయని కంపెనీ సోమవారం ప్రకటించింది. 34.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ కలిగిన ఈసీ వేరియంట్ కారు ఒకసారి చార్జింగ్తో 375 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 39.4 కిలోవాట్ అవర్ బ్యాటరీతో రూపొందిన ఈఎల్ ట్రిమ్ ఒకసారి చార్జింగ్తో 456 కిలోమీటర్లు పరుగెడుతుంది. ప్రతి వేరియంట్లో 5,000 యూనిట్లు మాత్రమే పరిచయ ఆఫర్ ధరలో విక్రయిస్తారు. చదవండి: ర్యాపిడోకి గట్టి షాకిచ్చిన కోర్టు.. అన్ని సర్వీసులు నిలిపివేయాలని ఆదేశాలు! -
భారత్కు స్కోడా ఎన్యాక్ ఐవీ
న్యూఢిల్లీ: వాహన తయారీలో ఉన్న చెక్ కంపెనీ స్కోడా.. భారత మార్కెట్లో వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఎన్యాక్ ఐవీ మోడల్ను ప్రవేశపెట్టనుంది. పూర్తిగా తయారైన కారును దిగుమతి చేసుకుంటామని స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ పెటర్ సాక్ తెలిపారు. అమ్మకాలు పెరిగిన తర్వాత దేశీయంగా తయారీ చేపడతామన్నారు. ‘కంపెనీకి టాప్–3 మార్కెట్లలో భారత్ ఒకటి. యూరప్ వెలుపల అతిపెద్ద మార్కెట్ కూడాను. మరిన్ని ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ వాహనాలతోపాటు ఈవీలను సైతం భారత్కు పరిచ యం చేస్తాం. గతేడాది దేశంలో 57,721 యూ నిట్లు విక్రయించాం. 2021తో పోలిస్తే రెండింతలకుపైగా వృద్ధి సాధించాం. 2023లో రెండంకెల వృద్ధి నమోదు చేస్తాం’ అని వివరించారు. -
గృహోపకరణాల విభాగంలోకి ఫినోలెక్స్ కేబుల్స్
హైదరాబాద్: చిన్నపాటి గృహోపకరణాల విభాగంలోకి ఫినోలెక్స్ కేబుల్స్ అడుగు పెట్టింది. ఎలక్ట్రికల్, కమ్యూనికేషన్ కేబుల్స్లో ప్రముఖ సంస్థగా ఉన్న ఫినోలెక్స్.. క్రీజ్ ఫ్రీ ఐరన్ శ్రేణిని (ఇస్త్రీ పెట్టె) విడుదల చేసింది. 750 వాట్ నుంచి 1600వాట్ సామర్థ్యంతో డ్రై, స్టీమ్ ఐరన్ బాక్స్లను తీసుకొచ్చింది. అందుబాటు ధరకే, దీర్ఘకాలం పాటు మన్నే ఉత్పత్తులను కస్టమర్లకు అందించాలన్న లక్ష్యంలో భాగమే నూతన శ్రేణి ఉత్పత్తుల విభాగంలోకి ప్రవేశించడమని సంస్థ తెలిపింది. 25వేలకు పైగా అవుట్లెట్లలో ఇవి లభిస్తాయని, వచ్చే ఏడాది కాలంలో లక్ష స్టోర్లలో దేశవ్యాప్తంగా విక్రయానికి అందుబాటులో ఉంచుతామని ఫినోలెక్స్ కేబుల్స్ ప్రకటించింది. చదవండి భారీ ఎత్తున ఉద్యోగుల తొలగింపు, అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్కు భారీ షాక్! -
గుడ్ న్యూస్: భారీ డిస్కౌంట్, ఈ బైక్పై రూ.50వేలు తగ్గింపు!
హోండా మోటార్ సైకిల్ & స్కూటర్ ఇండియా తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ను ప్రకటించింది. బైక్ లవర్స్ను ఆకట్టుకోవడంతో పాటు అమ్మకాలు పెంచుకునేందుకు తాజాగా లాంచ్ చేసిన కొత్త హోండా CB300F నేకెడ్ స్ట్రీట్ఫైటర్ బైక్పై భారీగా డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఏడాది ఆగస్ట్లో సరికొత్తగా హోండా CB300F బైక్ని మార్కెట్లోకి విడుదల చేసింది. ఇప్పుడు, ప్రారంభించిన కొన్ని నెలల్లోనే, కంపెనీ ఈ నేక్డ్ స్ట్రీట్ఫైటర్ ధరను రూ.50,000 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ పరిమితి కాలానికే వర్తించనుందని తెలిపింది. భారీ తగ్గింపు! కొత్త హోండా CB300F స్ట్రీట్ఫైటర్ బైక్ రెండు వేరియంట్లలో లభిస్తోంది. అది డీలక్స్ అండ్ డీలక్స్ ప్రో. వాటి ప్రారంభ ధర రూ.2.26 లక్షలు, రూ.2.29 లక్షలు ఉండగా తాజాగా కంపెనీ వాటిపై రూ. 50,000 తగ్గించింది. దీంతో డీలక్స్ ధర రూ. 1.76 లక్షలుకాగా, డీలక్స్ ప్రో వేరియంట్ ధర రూ. 1.79 లక్షలుగా ఉంది. కొత్త ధర ప్రకారం KTM డ్యూక్ 125 అండ్ బజాజ్ డోమినార్ 250 కంటే హోండా సీబీ300F తక్కువ ధరకే లభిస్తుంది. 125 డ్యూక్ ధర రూ.1.78 లక్షలు ఉండగా, హోండా బైక్ ధర రూ. 1.76 లక్షలు ఉంది. హోండా CB300F పవర్లో 293.52cc, సింగిల్-సిలిండర్, ఆయిల్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్టెడ్ ఇంజన్తో వస్తోంది. ఈ మోటార్ 7,500 RPM వద్ద 24.1 bhp మరియు 5,500 RPM వద్ద 25.6 Nm గరిష్ట టార్క్ను విడుదల చేస్తుంది. ఇంజన్ అసిస్ట్ స్లిప్పర్ క్లచ్, హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్తో 6-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్తో వస్తోంది. -
పదేళ్లలో 17 బిలియన్ డాలర్లు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీ వజ్రాల పరిశ్రమ 2030 నాటికి 17 బిలియన్ డాలర్లకు చేరవచ్చని అంచనాలు ఉన్నాయని డైమండ్ మైనింగ్ దిగ్గజం డిబీర్స్ ఇండియా మార్కెటింగ్ డైరెక్టర్ తొరాంజ్ మెహతా తెలిపారు. ప్రస్తుతం ఇది 7 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉందని వివరించారు. అమెరికా, చైనా తర్వాత మూడో అతి పెద్ద మార్కెట్గా ఉన్న భారత్ ఇప్పుడిప్పుడే గణనీయంగా వృద్ధి చెందుతోందని ఆమె తెలిపారు. ‘‘మెచ్యూరిటీని బట్టి చూస్తే జపాన్ పూర్తి స్థాయిని దాటేసింది. అమెరికా ప్రస్తుతం దగ్గర్లో ఉంది. చైనా వృద్ధి దశలోనూ, భారత్ వర్ధమాన స్థాయిలోనూ ఉంది’’ అని మెహతా వివరించారు. మధ్య ప్రాచ్యం, యూరప్ మొదలైన ప్రాంతాల మార్కెట్ వాటా సుమారు చెరో 7 శాతం స్థాయిలో ఉన్నాయని పేర్కొన్నారు. సూరత్లోని డిబీర్స్ అధునాతన ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైమండ్స్ సందర్శన సందర్భంగా ఆమె ఈ విషయాలు తెలిపారు. ‘‘భారత ఎకానమీ వేగంగా వృద్ధి చెందుతోంది. మధ్యతరగతి జనాభా పెరగనుంది. డైమండ్స్ కొనుగోలు చేసే సంపన్న వర్గాల సంఖ్య మరింత ఎక్కువగా 25 శాతం మేర పెరగవచ్చని అంచనా. అలాగే వయస్సు రీత్యా చూస్తే కూడా వజ్రాల వైపు మొగ్గు చూపే యువత సంఖ్య కూడా పెరుగుతోంది. ఇవన్నీ కూడా రాబోయే దశాబ్దకాలంలో దేశీయంగా పరిశ్రమ వృద్ధికి తోడ్పడనున్నాయి’’ అని మెహతా వివరించారు. ఫరెవర్ మార్క్ అనే తమ బ్రాండ్ విషయానికొస్తే అమ్మకాలపరంగా భారత్ అతి పెద్ద మార్కెట్గా ఉంటోందని ఆమె చెప్పారు. ప్రస్తుతం తమకు 60 నగరాల్లో 270 పైచిలుకు రిటైల్ అవుట్లెట్స్, 14 ఎక్స్క్లూజివ్ స్టోర్స్ ఉన్నాయని మెహతా వివరించారు. కార్యకలాపాలను మరింతగా విస్తరించే క్రమంలో ఈ నెలాఖరు నాటికి ఇండోర్, మంగళూరులో కొత్తగా రెండు ఎక్స్క్లూజివ్ స్టోర్స్ను తెరుస్తున్నట్లు ఆమె తెలిపారు. దక్షిణాదిలో నాణ్యత .. ఉత్తరాదిలో పరిమాణం.. దక్షిణాది, ఉత్తరాది మార్కెట్లలో డిజైన్ల ప్రాధాన్యాలు చాలావరకు భిన్నంగా ఉంటాయని మెహతా తెలిపారు. దక్షిణాదిలో డైమండ్ పరిమాణం చిన్నదిగా ఉన్నా మంచి రంగు, అత్యుత్తమ క్వాలిటీకి ప్రాధాన్యమిస్తారని, అదే ఉత్తరాదిలో డైమండ్ పరిమాణానికి కొంత ఎక్కువ ప్రాధాన్యమిస్తుంటారని పేర్కొన్నారు. తమకు దక్షిణాది మార్కెట్లో అమ్మకాలు అత్యధికంగా ఉండగా, ఉత్తరాదిలో పుంజుకుంటున్నాయని మెహతా చెప్పారు. అతి పెద్ద కేంద్రం.. డిబీర్స్కు ప్రపంచవ్యాప్తంగా మూడు (బ్రిటన్, బెల్జియం, భారత్) డైమండ్ ఇనిస్టిట్యూట్స్ ఉన్నాయి. వీటన్నింటిలోకెల్లా సూరత్లోని ఇనిస్టిట్యూట్ అతి పెద్దది. దీని ద్వారా డిబీర్స్ అధునాతన యంత్రాలు, నిపుణులతో డైమండ్ గ్రేడింగ్, టెస్టింగ్, ఇన్స్క్రిప్షన్ సేవలు అందిస్తోంది. 2015లో ప్రారంభించిన ఈ కేంద్రంపై దాదాపు 15 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. ఏడాదికి దాదాపు 10 లక్షల సర్టిఫికెషన్లు చేసే సామర్థ్యాలతో ఇది ఏర్పాటైంది. -
మార్కెట్లోకి హెచ్పీ స్మార్ట్ట్యాంక్ ప్రింటర్స్
సాక్షి, హైదరాబాద్: హ్యూలెట్ప్యాకర్డ్ (హెచ్పీ) సంస్థ..‘హెచ్పీ స్మార్ట్ట్యాంక్’ పేరుతో బుధవారం సరికొత్త ప్రింటర్లను విడుదల చేసింది. సులువుగా వా డు కోగలగడం, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడం, సురక్షితం వంటి మూడు అంశాల ప్రాతిపదికగా తయారైన ఈ కొత్త ప్రింటర్లు ప్రస్తుతం మూడు మోడళ్లలో లభిస్తున్నట్లు హెచ్పీ ప్రింటింగ్ విభాగం ప్రెసిడెంట్ సునీశ్ రాఘవన్ తెలిపారు. హెచ్పీ స్మా ర్ట్ ట్యాంక్ 521 కేవలం ప్రింటింగ్కు ఉపయోగపడుతుందని, హెచ్పీ 510, హెచ్పీ 580లు ప్రింట్, స్కానింగ్, కాపీ పనులు చేయగలవ ని చె ప్పారు. ఈ మూడు మోడళ్ల ధరలు రూ. 13,000 –19,000 మధ్యలో ఉంటాయని ఆయన తెలిపారు. చదవండి: ఉద్యోగుల ఆశలన్నీ ఆవిరి: కేంద్రం షాకింగ్ న్యూస్ -
మారుతి కార్ లవర్స్కి షాకింగ్ న్యూస్: ఆ కారణం చెప్పి..!
సాక్షి, ముంబై: దేశీయ కార్ల తయారీదారు మారుతీ సుజుకి తన కస్టమర్లకు షాకిచ్చింది. వచ్చే ఏడాది జనవరి నుంచి కార్ల ధరలను భారీగా పెంచేందుకు యోచిస్తోంది. ప్రధానంగా ద్రవ్యోల్బణం, నియంత్రణ అవసరాల నిమిత్తం 2023, జనవరి నుంచి ధరల పెంపు ఉంటుందని శుక్రవారం ప్రకటించింది. అలాగే ఎలక్ట్రిక్ కాంపోనెంట్స్ కొరత డిసెంబరు కార్ల ఉత్పత్తిపై ప్రభావాన్ని చూపిస్తుందనే ఆందోళన వ్యక్తం చేసింది. (బెంజ్ కొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీ వచ్చేసింది: త్వరపడకపోతే..!) అమ్మకాలు పెరుగుతున్నప్పటికీ, ఎలక్ట్రిక్ కాంపోనెంట్స్ కొరత కారణంగా దేశీయ మోడళ్ల ఉత్పత్తిపై ప్రభావం చూపుతోంది. ద్రవ్యోల్బణం, ఖర్చుల నియంత్రణ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ధరల పెరుగుదల 2023 జనవరిలో ఉంటుందని ప్రకటించింది. మోడల్ని బట్టి, ధర పెంపు ఉంటుందని ప్రకటించిన మారుతి పెంపు ఎంత శాతం అనేది ధృవీకరించలేదు.(లగ్జరీ కారు కొన్న కుమార్తెలు: గర్ల్ పవర్ అంటున్న మ్యూజిక్ డైరెక్టర్) కాగా నవంబర్ 2022లో మొత్తం అమ్మకాలలో 14 శాతం పెరుగుదల సాధించింది మారుతీ సుజుకి. గత ఏడాది ఇదే కాలంలో 1,39,18 యూనిట్లతో పోలిస్తే ఈ ఏడాది నవంబర్లో 1,59,044 యూనిట్లను విక్రయించింది. దేశీయ విక్రయాలు 1,35,055 యూనిట్లుగా ఉన్నాయి. కాంపాక్ట్ సెగ్మెంట్ (స్విఫ్ట్, సెలెరియో, ఇగ్నిస్, బాలెనో , డిజైర్) అమ్మకాలు గతేడాది నవంబర్లో 57,019 యూనిట్ల నుంచి 72,844 యూనిట్లకు పెరిగాయి. మిడ్-సైజ్ సెడాన్ సియాజ్ అమ్మకాలు 1,554 యూనిట్లుగా ఉండగా, యుటిలిటీ వెహికల్ సెగ్మెంట్ (విటారా బ్రెజ్జా, ఎస్-క్రాస్, ఎర్టిగా) అమ్మకాలు ఈ ఏడాది నవంబర్లో 32,563 యూనిట్లకు పెరిగాయి. -
శాంసంగ్ మరో గెలాక్సీ 5జీ స్మార్ట్ఫోన్ వచ్చేస్తోంది: ఫీచర్లు, ధర
సాక్షి, ముంబై: దక్షిణ కొరియా స్మార్ట్ఫోన్ దిగ్గజం శాంసంగ్కు చెందిన మరో స్మార్ట్ఫోన్ భారత మార్కెట్లో ఎంట్రీ ఇవ్వనుంది. గెలాక్సీ ఎం 54 5 జీ వచ్చే ఏడాది తొలి అర్ధ భాగంలో భారతదేశంలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. అయితే లాంచ్కు దీనికి సంబంధించిన ఫీచర్లు, ధరల తదితర వివరాలు ఫోన్ గీక్బెంచ్లో లీక్ అయ్యాయి. మల్టీ-కోర్ టెస్ట్లో 750 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్లో 2,696 పాయింట్లు సాధించిందని గీక్ బెంచ్ తెలిపింది. Exynos 1380 చిప్సెట్ స్మార్ట్ఫోన్ స్నాప్డ్రాగన్ 888 చిప్సెట్ ఇందులో జోడించింది. స్టోరేజ్ విషయానికొస్తే, గరిష్టంగా 8 జీబీ ర్యామ్, 256 జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజీని అందిస్తుందని భావిస్తున్నారు. గెలాక్సీ ఎం54 5 జీ ఫీచర్లు అంచనా 6.67-అంగుళాల FHD+ AMOLED డిస్ప్లే ఆండ్రాయిడ్ 13,1080 x 2412 రిజల్యూషన్ 90Hz రిఫ్రెష్ రేట్ హోల్-పంచ్ డిస్ప్లే 64+8+5ట్రిపుల్ రియర్ కెమెరా 32 ఎంపీ సెల్ఫీ కెమెరా 6000mAh బ్యాటరీ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ధర గెలాక్సీ ఎం53 5జీ ప్రస్తుతం 8జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.24,999 6 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.21,999 ఈ నేపథ్యంలో రానున్న ఎం54 5జీ ధర రూ.30వేలుఉంటుందని అంచనా. -
ఫాస్టెస్ట్ ఈ-బైక్.. వాటి వేరియంట్లపై ఓ లుక్కేద్దాం!
బెంగళూరుకు చెందిన ప్రముఖ EV స్టార్టప్ కంపెనీ 'అల్ట్రావయోలెట్' (Ultraviolette) ఇటీవల ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్ 'F77' లాంచ్ చేసిన విషయం తెలిసిందే. కంపెనీ లాంచ్ సమయంలోనే మూడు వేరియంట్స్ (ఎఫ్77, రీకాన్, ఎఫ్77 లిమిటెడ్ ఎడిషన్) గురించి వెల్లడించింది. అయితే బైక్ ప్రేమికులు చాలా మంది ఈ మూడు వేరియంట్స్ గురించి పూర్తిగా తెలుసుకోవాలని చాలా కుతూహలంతో ఉన్నారు. ఈ మూడు వేరియంట్స్ డిజైన్, ఫీచర్స్, రేంజ్ వంటి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.. రండి. అల్ట్రావయోలెట్ ఎఫ్77: ఎఫ్77 అనేది కంపెనీ మూడు వేరియంట్స్ లో మొదటి మోడల్ (బేస్ మోడల్). దీని ధర రూ. 3.80 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ ఎలక్ట్రిక్ బైక్ 7.1 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంటుంది. ఇది ఒక సింగిల్ ఛార్జ్తో ఏకంగా 207 కిమీ పరిధిని అందిస్తుంది. ఈ బైక్ కేవలం 3.4 సెకన్లలో గంటకు 0 నుంచి 60 కిమీ వేగం, 8.3 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వేగాన్ని చేరుకుంటుంది. అల్ట్రావయోలెట్ ఎఫ్77 లోని బ్యాటరీ ప్యాక్ మీద కంపెనీ 3 సంవత్సరాలు లేదా 30,000 కిమీ వారంటీని అందిస్తుంది. అయితే దీనిని 5 సంవత్సరాలు లేదా 50,000 కిమీ వారంటీకీ అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఇది కొనుగోలుదారులు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక కలర్ ఆప్సన్ విషయానికి వస్తే, ఎఫ్77 బ్లాక్, సిల్వర్, రెడ్ కలర్లో అందుబాటులో ఉంటుంది. అల్ట్రావయోలెట్ ఎఫ్77 రీకాన్: అల్ట్రావయోలెట్ మరో వేరియంట్ అయిన ఎఫ్77 రీకాన్ విషయానికి వస్తే, దీని ధర రూ. 4.55 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ బైక్ ఒక సింగిల్ ఛార్జ్ తో గరిష్టంగా 307 కిమీ రేంజ్ అందిస్తుంది. దీని కోసం కంపెనీ ఇందులో 10.3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉపయోగించింది. ఈ బైక్ కేవలం 3.1 సెకన్లలో గంటకు 0 నుంచి 60 కిమీ, 8.0 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగాన్ని అందుకుంటుంది. దీన్ని బట్టి చూస్తే ఇది బేస్ మోడల్ కంటే కూడా ఎక్కువ వేగవంతంమైన బైక్ అని స్పష్టంగా తెలుస్తుంది. ఇక బ్యాటరీ ప్యాక్ వారంటీ విషయానికి వస్తే, స్టాండర్డ్ గా 5 సంవత్సరాలు లేదా 50,000 కిమీల వారంటీని పొందవచ్చు. అయితే దీనిని 8 సంవత్సరాలు లేదా 80,000 కిమీ వారంటీకీ అప్డేట్ చేసుకోవచ్చు. కలర్స్ విషయానికి వస్తే బేస్ మోడల్ ఏ కలర్ ఆప్సన్లో లభిస్తుంది. అదే కలర్స్ (బ్లాక్, సిల్వర్, రెడ్) ఇది కూడా లభిస్తుంది. అల్ట్రావయోలెట్ ఎఫ్77 లిమిటెడ్ ఎడిషన్: ఇక చివరగా ఇందులోని చివరి మోడల్ ఎఫ్77 లిమిటెడ్ ఎడిషన్ పేరుకి తగిన విధంగానే ఇది లిమిటెడ్ యూనిట్లలో మాత్రమే లభిస్తుంది. కావున ఇది కేవలం 77 యూనిట్లకు మాత్రమే పరిమితం చేయబడింది. అంటే ఈ బైక్ కేవలం 77 మంచి కస్టమర్లు మాత్రమే కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. అల్ట్రావయోలెట్ ఎఫ్77 లిమిటెడ్ ఎడిషన్ ధర రూ. 5.50 లక్షలు (ఎక్స్-షోరూమ్). ధరను బట్టి చూస్తే ఇది కంపెనీ అత్యంత ఖరీదైన బైక్. అయితే పనితీరు విషయంలో మిగిలిన రెండు బైకులంటే కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ బైక్లో రీకాన్ వేరియంట్లో ఉన్న అదే బ్యాటరీ (10.3 కిలోవాట్) ఉంటుంది. కావున రేంజ్ కూడా రీకాన్ మోడల్ మాదిరిగానే 307 కిమీ ఉంటుంది. ఎఫ్77 లిమిటెడ్ ఎడిషన్ కేవలం 2.9 సెకన్లలో గంటకు 0 నుంచి 60 కిమీ, 7.8 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ లిమిటెడ్ ఎడిషన్ బ్యాటరీ ప్యాక్ మీద 8 సంవత్సరాలు లేదా 80,000 కిమీ వారంటీ మాత్రమే అందుబాటులో ఉంటుంది. బుకింగ్స్, డెలివరీ: కంపెనీ ఈ ఎలక్ట్రిక్ బైకుని మార్కెట్లో లాంచ్ చేయకముందు నుంచే బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. కావున ఆసక్తి కలిగిన కొనుగోలుదారులు రూ. 10,000 చెల్లించి కంపెనీ అధికారిక వెబ్సైట్ లో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు మొదట బెంగళూరులో ప్రారంభమవుతాయి. ఆ తరువాత దశల వారిగా డెలివరీలు ప్రారభించనుంది కంపెనీ. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ బైక్ భారతీయ తీరాలను కూడా దాటి విదేశాలలో కూడా విక్రయించే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
కొత్త వెర్షన్లో సిద్దమవుతున్న 'హ్యుందాయ్ ఐ10 నియోస్'.. ప్రత్యర్థులకు ఇక గట్టి పోటీనే!
భారతీయ ఆటోమొబైల్ రంగంలో ప్రముఖ కార్ల కంపెనీ 'హ్యుందాయ్' (Hyundai) తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఈ కంపెనీ లాంచ్ చేసిన 'ఐ10' మోడల్ కారు ప్రారంభం నుంచి మంచి ఆదరణ పొందుతూ ముందుకు సాగుతూ ఉంది. అయితే ఆ తరువాత ఐ10 నియోస్ పుట్టుకొచ్చింది, కాగా ఇప్పుడు 'ఐ10 నియోస్ ఫేస్లిఫ్ట్' రావడానికి సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి ఫోటోలు కూడా ఇటీవల కెమెరాకి చిక్కాయి. హ్యుందాయ్ నుంచి రానున్న 'ఐ10 నియోస్ ఫేస్లిఫ్ట్' గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూద్దాం.. గత కొన్ని సంవత్సరాలు హ్యుందాయ్ తన గ్రాండ్ ఐ10 నియోస్ ను ఫేస్లిఫ్ట్ వెర్షన్లో తీసుకురావడానికి శ్రమిస్తూనే ఉంది, అయితే ఇప్పటికి ఆ కల నిజమయ్యే సమయం వచ్చేసింది. ఇటీవల ఈ ఫేస్లిఫ్ట్ వెర్షన్ కనిపించింది. అయితే ఈ వెర్షన్ టెస్టింగ్ సమయంలో చెన్నైలోని కంపెనీ ప్లాంట్కు సమీపంలో కనిపించింది. కావున దీనికి సంబంధించిన ఎక్కువ సమాచారం అందుబాటులో లేదు. కానీ ఇది చూడటానికి దాని మునుపటి మోడల్ను గుర్తుకు తెస్తుంది. కొత్తగా రానున్న ఐ10 నియోస్ ఫేస్లిఫ్ట్ ముందు మరియు వెనుక చాలా వరకు కప్పబడి ఉండటం వల్ల ఖచ్చితమైన డిజైన్ వెల్లడి కాలేదు. అయితే ఇందులో అప్డేటెడ్ ఎల్ఈడీ డిఆర్ఎల్ ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్లు, ఫాగ్ ల్యాంప్ కేసింగ్ డిజైన్ వంటివి మునుపటి మాదిరిగానే ఉన్నాయి. ఫ్రంట్ గ్రిల్ కూడా కొంత అప్డేట్ పొందే అవకాశం ఉన్నట్లు అనిపిస్తుంది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఫేస్లిఫ్ట్ సైడ్ ప్రొఫైల్ కూడా చాలా వరకు దాని మునుపటి మోడల్ మాదిరిగా ఉంటుంది. ఇందులో అప్డేటెడ్ అల్లాయ్ వీల్స్ చూడవచ్చు. రియాక్ర్ ప్రొఫైల్లో రిఫ్రెష్ చేసిన టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. ఇంటీరియర్ విషయానికి వస్తే, రాబోయే 2023 ఐ10 నియోస్ ఫేస్లిఫ్ట్ అప్డేట్ చేయబడిన డ్యాష్బోర్డ్, కొత్త ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ వంటి ఫీచర్స్ ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ వెర్షన్ స్మార్ట్ఫోన్ కనెక్టివిటీతో అందుబాటులో ఉన్న 8 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కలిగి ఉంది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఫేస్లిఫ్ట్ 2023లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ మోడల్ హ్యుందాయ్ ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చేలా ఉంది. చదవండి: రైల్వే శాఖ ఆదాయానికి గండి.. ఆ ప్యాసింజర్ల సంఖ్య తగ్గుతోంది, కారణం అదేనా! -
షావోమి నుంచి వస్తున్న స్టైలిష్ స్మార్ట్ఫోన్.. లాంచ్ డేట్ ఎప్పుడో తెలుసా!
ఆధునిక కాలంలో యువకుల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ ప్రాడెక్ట్ వాడకంపై ఆసక్తి చూపుతుంటారు. అయితే మిగిలిన వాటితో పోలిస్తే ఈ కొత్తదనం 'మొబైల్స్' లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. అందుకే కంపెనీలు కూడా ఎప్పటికప్పుడు మార్కెట్లో కొత్త టెక్నాలజీ, ఫీచర్లతో మొబైల్స్ విడుదల చేస్తుంటాయి. ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ 'షియోమీ' (Xiaomi) మార్కెట్లో కొత్త మొబైల్ '13 సిరీస్' లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగానే లాంచ్ డేట్ కూడా ప్రకటించింది. ఈ ఫోన్ని 2022 డిసెంబర్ 01 న చైనాలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ సిరీస్లో కంపెనీ 'షియోమీ 13' 'షియోమీ 13 ప్రో' అనే రెండు మోడల్స్ ఉన్నాయి. త్వరలో విడుదలకానున్న కొత్త 'షియోమీ 13 సిరీస్' అవుట్ ఆఫ్ ది బాక్స్తో వస్తున్నట్లు కంపెనీ అధికారికంగా ధృవీకరించింది. మొత్తానికి ఈ సంవత్సరం చివరిలో మరో కొత్త ఫోన్ మార్కెట్లోకి వచ్చేస్తుంది. కంపెనీ తెలిపిన సమాచారం ప్రకారం.. స్మార్ట్ఫోన్ సిరీస్లో లైకా బ్రాండెడ్ సెన్సార్లు ఉండనున్నాయి. ఈ స్మార్ట్ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్లో ఇది రన్ అవుతుంది. షావోమి 13 Pro 12GB ర్యామ్తో రానున్నట్లు తెలుస్తుంది. అంతే కాకుండా హ్యాండ్సెట్ 2k రిజల్యూషన్తో 6.7 ఇంచెస్ సామ్సంగ్ ఈ6 అమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది. ఫోన్ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ను అందిస్తుంది. షావోమీ కొత్త సిరీస్ రెండు రకాల ర్యామ్ లతో రావచ్చని రూమర్ల ద్వారా తెలిసింది. అవి 8 GB, 12GB,అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ 128GB, 256GB, 512GB వరకు జత చేసుకోవచ్చు. ఇక కెమెరా విషయానికొస్తే.. కెమెరా సిస్టమ్ 50MP అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్తో జత చేయబడిన 50MP సోనీ IMX989 ప్రైమరీ సెన్సార్, రెండవ 50MP టెలిఫోటో లెన్స్ను పొందుతుంది. ఇక సెల్ఫీల కోసం ముందు భాగంలో 32MP కెమెరా అందుబాటులో ఉంటుంది. చివరగా బ్యాటరీ విషయానికి వస్తే, Xiaomi 13 సిరీస్ 4,800mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. కాగా Xiaomi 13 Pro 120watt ఫాస్ట్ ఛార్జింగ్ పొందవచ్చు. చదవండి: రైల్వే శాఖ ఆదాయానికి గండి.. ఆ ప్యాసింజర్ల సంఖ్య తగ్గుతోంది, కారణం అదేనా! -
రెండో సారి నెం.1గా నిలిచిన ప్రముఖ కంపెనీ
న్యూఢిల్లీ: వినియోగదారులకు సేవలు అందించే విషయంలో ఎంజీ ఇండియా వరుసగా రెండో ఏడాది మొదటి స్థానంలో నిలిచినట్టు జేడీ పవర్ తెలిపింది. ఇండియా కస్టమర్ సర్వీసెస్ ఇండెక్స్ అధ్యయనాన్ని నీల్సన్ ఐక్యూ భాగస్వామ్యంతో జేడీ పవర్ నిర్వహించింది. సర్వీస్ అభ్యర్థనల ధ్రువీకరణ, సర్వీస్కు ముందు, సర్వీస్కు తర్వాత కస్టమర్ల అభిప్రాయం, ఎప్పటికప్పుడు సర్వీస్కు సంబంధించి తాజా సమాచారం అందించే విషయంలో ఎంజీ ఇండియా సేవల పట్ల ఎక్కువ మంది కస్టమర్లు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ఎంజీ ఇండియా 25 ఇండెక్స్ పాయింట్లు (మొత్తం 1,000 పాయింట్ల స్కేల్పై) పెంచుకుంది. సర్వీసు నాణ్యత బాగుందని 80 శాతం మంది కస్టమర్లు చెప్పారు. ఇండెక్స్లో ఎంజీ ఇండియా అత్యధికంగా 860 స్కోర్ సంపాదించింది. హోండా 852, టయోటా 852 పాయింట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. చదవండి: రైల్వే ప్రయాణికులకు బంపరాఫర్.. మీ ట్రైన్ టికెట్ వెయిటింగ్ లిస్టులో ఉంటే ఫ్రీగా ఫ్లైట్ జర్నీ చేయొచ్చు! -
మెటాకు భారత మార్కెట్ కీలకం
కోల్కతా: భారత మార్కెట్ మెటా ప్లాట్ఫామ్స్కు కీలకమైనదిగా ఉంటోందని కంపెనీ తెలిపింది. గ్రూప్లో భాగమైన ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, వాట్సాప్ ప్లాట్ఫామ్లలో కొత్త ఫీచర్లను ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు వేదికగా మారిందని పేర్కొంది. అలాగే లక్షల కొద్దీ క్రియేటర్లు, అసంఖ్యాక బ్రాండ్లు తమ సృజనాత్మకను ప్రదర్శించడానికి, ఆడియెన్స్కు మరింత చేరువ కావడానికి మెటా ద్వారా మంచి అవకాశాలు లభిస్తున్నాయని ఫేస్బుక్ ఇండియా (మెటా) డైరెక్టర్ మనీష్ చోప్రా తెలిపారు. ‘వివిధ కోణాల్లో మా ప్లాట్ఫామ్లకు భారత్ చాలా కీలక మార్కెట్. పలు కొత్త ఉత్పత్తులు, ఫీచర్లను పరీక్షించి తెలుసుకునేందుకు ప్రధాన మార్కెట్గా ఉంటోంది‘ అని మెటా వార్షిక ’క్రియేటర్ డే’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన వివరించారు. రెండేళ్ల క్రితం ఆవిష్కరించిన ’రీల్స్’ (పొట్టి ఫార్మాట్ వీడియోలు) భారత్లో గణనీయంగా ప్రాచుర్యం పొందాయని చెప్పారు. ఒక అధ్యయన నివేదిక ప్రకారం దాదాపు 20 కోట్ల మంది ప్రజలు రోజుకు 45 నిమిషాల పాటు రీల్స్పై వెచ్చిస్తున్నారని, ఇది 60 కోట్లకు చేరుకోగలదని చోప్రా తెలిపారు. టీ20 వరల్డ్ కప్ క్రికెట్ హైలైట్స్ను చూపేందుకు ఇటీవలే ఐసీసీతో కూడా భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించారు. మెటా ప్లాట్ఫ్లామ్స్ ద్వారా నకిలీ ప్రొఫైల్స్, తప్పుడు సమాచారం వ్యాప్తి కాకుండా నిరంతరం చర్యలు తీసుకుంటూనే ఉన్నామని ఆయన వివరించారు. -
మోటరోలా బడ్జెట్ ఫోన్ వచ్చేసింది..ధర చూస్తే పండగే!
సాక్షి, ముంబై: మోటరోలా కంపెనీ భారతీయ మార్కెట్లో కొత్త బడ్జెట్ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. మోటో ఈ 22 ఎస్ పేరుతో దీన్ని సోమవారం తీసుకొచ్చింది. MediaTek చిప్సెట్తో రూ. 10,000 ధరలోపే దీన్ని తీసుకు రావడం విశేషం. (వాట్సాప్ లేటెస్ట్ అప్డేట్స్: 5 ఫీచర్లు కమింగ్ సూన్) మోటో ఈ 22 ఎస్ ధరను రూ. 8,999గా నిర్ణయించింది. అక్టోబర్ 22 నుండి ఫ్లిప్కార్ట్తోపాటు, ప్రముఖ రిటైల్ స్టోర్లలో కొనుగోలుకు లభ్యం. 64 జీబీ వేరియంట్లో ఆర్కిటిక్ బ్లూ , ఎకో బ్లాక్ అనే రెండు రంగుల్లో ఈ స్మార్ట్ఫోన్ అందుబాటులోఉంటుంది. (ఫ్లిప్కార్ట్ బిగ్ దివాలీ సేల్: కస్టమర్లకు మరో గుడ్ న్యూస్ ) మోటో ఈ 22 ఎస్ స్పెసిఫికేషన్స్ 6.5అంగుళాల IPS LCD డిస్ప్లే Android 12, 1600x720 రిజల్యూషన్ 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ 16+2 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 5000mAh బ్యాటరీ ఇదీ చదవండి: రిలాక్స్ అండ్ రీ-ఎనర్జైజ్: ఉద్యోగులకు బ్రహ్మాండమైన దివాలీ ఆఫర్ -
స్టార్టప్లో ధోనీ పెట్టుబడి
బెంగళూరు: రెడీ టు కుక్ రంగంలో ఉన్న శాఖా హ్యారీ స్టార్టప్లో క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ వాటా కొనుగోలు చేశారు. ఇప్పటికే కంపెనీ బెటర్ బైట్ వెంచర్, బ్లూ హారిజోన్, పాంథెరా పీక్ వెంచర్స్ నుంచి రూ.16 కోట్ల సీడ్ ఫండ్ అందుకుంది. దేశవ్యాప్తంగా 10 నగరాల్లో నెలకు 30,000 పైచిలుకు వినియోగదార్లకు శాఖా హ్యారీ ఉత్పత్తులను విక్రయిస్తోంది. -
బాబోయ్, నకిలీ బ్రాండెడ్ ఉత్పత్తులు.. ఆందోళనలో పెద్ద కంపెనీలు
పోర్టబుల్ ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీస్కు దేశంలో బలమైన డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ఇదే ఇప్పుడు బ్రాండెడ్ ఉత్పత్తుల తయారీ కంపెనీలకు ఆందోళన కలిగిస్తోంది. బ్రాండెడ్ ఉత్పత్తులతో సమాంతరంగా నకిలీలు, దొంగిలించిన, చట్ట విరుద్ధంగా దిగుమతి చేసుకున్న ప్రొడక్ట్స్తో ఆఫ్లైన్, ఆన్లైన్ మార్కెట్ వృద్ధి చెందడం ఇందుకు కారణం. నకిలీలను అరికట్టడానికి తగిన చర్యలు తీసుకోకపోవడం, చైనా నుండి తక్కువ ధరలకు పెద్దమొత్తంలో ఉత్పత్తులు వెల్లువెత్తుతుండడం కంపెనీలకు కునుకు లేకుండా చేస్తోంది. ఒకవైపు తమ ఉత్పత్తుల మార్కెటింగ్పై దృష్టిసారిస్తూనే మరోవైపు నకిలీలకు అడ్డుకట్ట వేసేందుకు ఆహోరాత్రులూ శ్రమించాల్సిన పరిస్థితి బ్రాండెడ్ కంపెనీలది. 2019 సెప్టెంబర్లో ఫిక్కీ విడుదల చేసిన ఓ నివేదిక ప్రకారం కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్తోసహా అయిదు రంగాల్లో నకిలీ ఉత్పత్తులు, అక్రమ రవాణా కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ ఏటా రూ.1.17 లక్షల కోట్లు నష్టపోతోంది. పట్టుపడుతూనే ఉన్నాయి.. ఈ ఏడాది జనవరి–జూన్ కాలంలో ఇయర్ఫోన్స్, చార్జర్స్, అడాప్టర్స్, యూఎస్బీ కేబుల్స్ వంటి రూ.73.8 లక్షల విలువైన 9 వేల పైచిలుకు నకిలీ ఉత్పత్తులను సీజ్ చేసినట్టు షావొమీ ప్రకటించింది. 2020లో కంపెనీ రూ.33.3 లక్షల విలువైన సుమారు 3 వేల ఉత్పత్తులను సీజ్ చేసింది. దీనినిబట్టి చూస్తే నకిలీలు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. భారత్లో కొన్ని ప్రాంతాలు ప్రత్యేకంగా ఈ నకిలీ ఉత్పత్తులను పెద్ద ఎత్తున విక్రయిస్తున్నాయని షావొమీ అంటోంది. కోవిడ్ రాకతో ఈ ఉత్పత్తులను ఏకంగా ఆన్లైన్ వేదిక ద్వారా విక్రయిస్తున్నారని వెల్లడించింది. జేబీఎల్, ఇన్ఫినిటీ బ్రాండ్ నకిలీ ఉత్పత్తులను ఢిల్లీలో ఇటీవలే స్వాధీనం చేసుకున్నట్టు శామ్సంగ్ అనుబంధ కంపెనీ హర్మాన్ తెలిపింది. కాగా, ఐడీసీ గణాంకాల ప్రకారం భారత మార్కెట్లో 2022 జనవరి–జూన్ కాలంలో 3.8 కోట్ల యూనిట్ల వేరబుల్స్ అమ్ముడయ్యాయి. నియంత్రణ లేక.. చిన్న గ్యాడ్జెట్స్లో నకిలీలను సులువుగా తయారు చేయవచ్చని, వీటిని చైనా నుంచి సులభంగా తీసుకు రావొచ్చని టెక్ఆర్క్ ఫౌండర్ ఫైజల్ కవూసా తెలిపారు. ‘ఆఫ్లైన్ మార్కెట్లు ప్రధాన విక్రయ కేంద్రంగా ఉన్నప్పటికీ.. ఆన్లైన్ మార్కెట్ప్లేస్లో కఠినమైన తనిఖీలు లేకపోవడం వల్ల నకిలీ ఉత్పత్తుల చెలామణి పెరిగింది. ఆన్లైన్లో ఎవరైనా ఉత్పత్తులను నమోదు (లిస్ట్) చేసి విక్రయించవచ్చు. ఇది నకిలీలను విక్రయించడాన్ని సులభతరం చేసింది’ అని వివరించారు. ఐఎంఈఐ నంబర్తో స్మార్ట్ఫోన్లను ట్రాక్ చేయడానికి, గుర్తింపునకు ఆస్కారం ఉంది. యాక్సెసరీస్కు ఇటువంటి సౌకర్యం లేదు. యాపిల్ఎయిర్పాడ్స్ను ఫోన్ ద్వారా ట్రాక్ చేయవచ్చు. చదవండి: వెనకాల ఇంత జరుగుతుందా.. ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు భారీ షాక్! -
అన్ని మోడళ్ల కార్లను మార్చేస్తున్న వోల్వో.. కారణం ఇదే!
లగ్జరీ కార్ల తయారీలో ఉన్న స్వీడన్ కంపెనీ వోల్వో 2030 నాటికి భారత మార్కెట్లో పూర్తిగా ఎలక్ట్రిక్ మోడళ్లనే ప్రవేశపెట్టనుంది. ఈ క్రమంలో దేశీయ మార్కెట్లో లభిస్తున్న అన్ని మోడళ్లను మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్కు మార్చింది. ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో వోల్వో ఖాతాలో ప్రస్తుతం భారత్లో ఎస్యూవీ ఎక్స్సీ40 రిచార్జ్ కొలువుదీరింది. వచ్చే ఏడాది మధ్య కాలంలో పూర్తి ఎలక్ట్రిక్ మోడల్ మరొకటి రానుంది. కాగా, 2023 శ్రేణి మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ ఎక్స్సీ40 ఎస్యూవీ, ఎస్90 సెడాన్, మిడ్ సైజ్ ఎస్యూవీ ఎక్స్సీ60, ఎస్యూవీ ఎక్స్సీ90 కార్లను కంపెనీ బుధవారం ఆవిష్కరించింది. కొత్త ఫీచర్లను జోడించి వీటికి రూపకల్పన చేసినట్టు వోల్వో కార్ ఇండియా ఎండీ మల్హోత్రా తెలిపారు. చదవండి: కొన్ని గంటల్లో ఈ బ్యాంక్ షట్ డౌన్: అంతకుముందే సొమ్ము తీసుకోండి!