బీమా సంస్థల విలీనంపై సలహాలివ్వండి | Merger of public sector insurance firms | Sakshi
Sakshi News home page

బీమా సంస్థల విలీనంపై సలహాలివ్వండి

Published Fri, Jun 29 2018 12:30 AM | Last Updated on Fri, Jun 29 2018 12:30 AM

Merger of public sector insurance firms - Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని మూడు సాధారణ బీమా సంస్థలను ఒక్కటి చేయాలని నిర్ణయించిన కేంద్రం... ఈ విషయంలో తగిన సలహాలు ఇచ్చేందుకు గాను కన్సల్టెంట్ల నుంచి బిడ్లను ఆహ్వానించింది. నేషనల్‌ ఇన్సూరెన్స్, ఓరియంటల్‌ ఇన్సూరెన్స్, యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ను విలీనం చేయాలనుకుంటున్నట్టు ఈ ఏడాది బడ్జెట్‌ సమయంలోనే ప్రభుత్వం ప్రకటించింది.

విలీనం ద్వారా బలమైన కంపెనీని సృష్టించడం, సంస్థ వ్యాపార విలువను, వాటాదారుల విలువను పెంచడం ప్రభుత్వ ఉద్దేశమని ఈ బీమా సంస్థలు తెలిపాయి. 2017 మార్చి నాటికి ఈ మూడు ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలకు ఉమ్మడిగా 200 బీమా ఉత్పత్తులుండగా, మొత్తం ప్రీమియం ఆదాయం రూ.41,461 కోట్లుగా ఉంది. మార్కెట్‌ వాటా 35 శాతం. ఉమ్మడి నికర విలువ రూ.9,243 కోట్లు. మొత్తం ఉద్యోగులు 44,000 మంది.  కన్సల్టెంట్‌గా బిడ్లు వేసేందుకు జూలై 16 వరకు గడువు ఇచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement