ఎంఅండ్‌ఎం ఫైనాన్షియల్‌.. భలే జోరు | M&M Financial services turns into exrights | Sakshi
Sakshi News home page

ఎంఅండ్‌ఎం ఫైనాన్షియల్‌.. భలే జోరు

Jul 22 2020 12:36 PM | Updated on Jul 22 2020 12:36 PM

M&M Financial services turns into exrights  - Sakshi

మహీంద్రా గ్రూప్‌ ఎన్‌బీఎఫ్‌సీ.. ఎంఅండ్‌ఎం ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కౌంటర్‌కు ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 13 శాతంపైగా దూసుకెళ్లి రూ. 157 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 159ను సైతం అధిగమించింది. గత రెండు వారాల్లో ఈ షేరు 34 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! కంపెనీ రైట్స్‌ ఇష్యూ చేపట్టేందుకు ఇటీవలే బోర్డు అనుమతించింది. దీనిలో భాగంగా రైట్స్‌ పొందేందుకు రికార్డ్‌ డేట్‌ను ఈ నెల 23గా ప్రకటించింది. దీంతో నేటి నుంచి ఎక్స్‌రైట్స్‌లో ఈ కౌంటర్‌ ట్రేడవుతున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఇతర వివరాలు చూద్దాం..

1:1 నిష్పత్తిలో..
రైట్స్‌ ఇష్యూలో భాగంగా ఎంఅండ్‌ఎం ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ వాటాదారులకు తమదగ్గరున్న ప్రతీ 1 షేరుకీ మరో షేరుని ఆఫర్ చేస్తోంది. ఇందుకు రూ. 2 ముఖ విలువగల ఒక్కో షేరుకీ రూ. 50 ధరను నిర్ణయించింది. ఇష్యూ ఈ నెల 28న ప్రారంభమై ఆగస్ట్‌ 11న ముగియనుంది. రైట్స్‌ ద్వారా రూ. 3089 కోట్లవరకూ సమీకరించనున్నట్లు కంపెనీ ఇప్పటికే తెలియజేసింది.

క్యూ1 ఓకే
ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో ఎంఅండ్ఎం ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఆకర్షణీయ ఫలితాలు సాధించిన సంగతి తెలిసిందే. క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన నికర లాభం 300 శాతం జంప్‌చేసి రూ. 432 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం మాత్రం 8 శాతమే పెరిగి రూ. 2838 కోట్లకు చేరింది. స్టాండెలోన్‌ ప్రాతిపదికన జూన్‌ చివరికల్లా నిర్వహణలోని ఆస్తుల విలువ(ఏయూఎం) 14 శాతం వృద్ధితో రూ. 81,436 కోట్లుగా నమోదైంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement