
ప్రభుత్వానికి ఎన్ఎండీసీ రూ.952 కోట్ల డివిడెండ్
హైదరాబాద్: ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎండీసీ, కేంద్ర ప్రభుత్వానికి రూ.952 కోట్ల డివిడెండ్ను చెల్లించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి మధ్యంతర డివిడెండ్(300 శాతం)గా రూ.952 కోట్లు కేంద్రానికి చెల్లించామని ఎన్ఎండీసీ ఒక ప్రకటనలో తెలిపింది. కంపెనీ సీఎండీ నరేంద్ర కొఠారి ఈ రూ.952 కోట్ల చెక్కును కేంద్ర ఉక్కు శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్కు అందించారని పేర్కొంది.
ఈ కార్యక్రమంలో ఉక్కు శాఖ సహాయ మంత్రి విష్ణు దియోసాయి, ఉక్కు కార్యదర్శి రాకేశ్ సింగ్లతో పాటు ఉక్కు మంత్రిత్వ శాఖ, ఎన్ఎండీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా తాము 2011-12 ఆర్థిక సంవత్సరంలో 450 శాతం, 2012-13 ఆర్థిక సంవత్సరంలో 700 శాతం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 850 శాతం డివిడెండ్ను చెల్లించామని పేర్కొంది.