ఎన్‌ఎస్‌ఈలో ఒక శాతం వాటా విక్రయం: ఎస్‌బీఐ | SBI Planning To Sell One Percentage Stake In NSE | Sakshi
Sakshi News home page

ఎన్‌ఎస్‌ఈలో ఒక శాతం వాటా విక్రయం: ఎస్‌బీఐ

Jan 4 2020 2:07 AM | Updated on Jan 4 2020 2:07 AM

SBI Planning To Sell One Percentage Stake In NSE - Sakshi

న్యూఢిల్లీ: నేషనల్‌ స్టాక్‌ ఎక్సే్చంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ)లో 1.01 శాతం వాటాను ఎస్‌బీఐ (స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా)విక్రయించనున్నది. మూలధన నిధుల సమీకరణలో భాగంగా 1.01 శాతం వాటాకు సమానమైన 50 లక్షల షేర్లను విక్రయించనున్నామని ఎస్‌బీఐ వెల్లడించింది. కాంపిటేటివ్‌ బిడ్డింగ్‌ ప్రక్రియ ద్వారా ఈ షేర్లను విక్రయిస్తామని తెలిపింది. నిర్దేశిత ఫార్మాట్‌లో కనీసం పది లక్షల షేర్లకు బిడ్‌ చేయాల్సి ఉంటుందని, ఆసక్తి గల సంస్థలు ఈ నెల 15 వ తేదీలోగా దరఖాస్తు  చేయాలని పేర్కొంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఎస్‌బీఐకు 5.19 % వాటా ఉంది. 2016లో ఎన్‌ఎస్‌ఈలో 5 శాతం వాటాను మారిషస్‌కు చెందిన వెరాసిటి ఇన్వెస్ట్‌మెంట్స్‌కు రూ.911 కోట్లకు ఎస్‌బీఐ విక్రయించింది. ఎన్‌ఎస్‌ఈలో వాటా విక్రయంతో పాటు మరో రెండు కంపెనీల్లో కూడా వాటా విక్రయం ద్వారా నిధులు సమీకరించాలని ఎస్‌బీఐ యోచిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement