కొత్త ‘టిగోర్‌ ఈవీ’ వచ్చింది... | Tata Motor Launch Tigor Electric Car | Sakshi
Sakshi News home page

కొత్త ‘టిగోర్‌ ఈవీ’ వచ్చింది...

Published Thu, Oct 10 2019 8:56 AM | Last Updated on Thu, Oct 10 2019 8:56 AM

Tata Motor Launch Tigor Electric Car - Sakshi

దేశీ ప్రముఖ వాహన తయారీ కంపెనీ టాటా మోటార్స్‌ తన టిగోర్‌ ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ (ఈవీ)లో అధునాతన వెర్షన్‌ను బుధవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ నూతన ఎలక్ట్రిక్‌ కాంపాక్ట్‌ సెడాన్‌ కారులో 21.5 కిలోవాట్‌ అవర్‌ (కేడబ్ల్యూహెచ్‌) బ్యాటరీని అమర్చింది. దీంతో ఒక్కసారి చార్జింగ్‌తో 213 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని ప్రకటించింది. ఎక్స్‌ఈ ప్లస్, ఎక్స్‌ఎం ప్లస్, ఎక్స్‌టీ ప్లస్‌ పేర్లతో మొత్తం మూడు వేరియంట్లలో ఈ నూతన కారు అందుబాటులోకి వచ్చింది. ప్రభుత్వ రాయితీల అనంతరం ఈ కారు ప్రారంభ ధర రూ. 9.44 లక్షలని కంపెనీ ప్రకటించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement