
అమెరికా ఎస్ఈసీతో విప్రో 5 మిలియన్ డాలర్ల సెటిల్మెంట్
ఆరేళ్ల క్రితం నాటి నిధుల గోల్మాల్ వివాద పరిష్కారానికి సంబంధించి అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్చంజ్ కమిషన్ (ఎస్ఈసీ)తో ఐటీ దిగ్గజం విప్రో ఒప్పందం కుదుర్చుకుంది.
న్యూఢిల్లీ: ఆరేళ్ల క్రితం నాటి నిధుల గోల్మాల్ వివాద పరిష్కారానికి సంబంధించి అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్చంజ్ కమిషన్ (ఎస్ఈసీ)తో ఐటీ దిగ్గజం విప్రో ఒప్పందం కుదుర్చుకుంది. 5 మిలియన్ డాలర్ల జరిమానా చెల్లించేందుకు అంగీకరించామని విప్రో పేర్కొంది. 2009 నవంబర్, డిసెంబర్ మధ్య కాలంలో తమ ఉద్యోగుల్లో ఒకరు రూ. 22.8 కోట్ల మేర (సుమారు 4 మిలియన్ డాలర్లు) నిధులను స్వాహా చేసినట్లు విప్రో గుర్తించింది. ఆ తర్వాత సదరు ఉద్యోగి నుంచి సింహభాగం రాబట్టింది. 2010 సెప్టెంబర్లో దర్యాప్తు ప్రారంభించిన ఎస్ఈసీ తాజాగా సెటిల్మెంట్కు అనుమతించింది.