శ్రీశైలం సమీపంలో లోయలోకి దూసుకెళ్లిన బస్సు | Bus Accident At Srisailam | Sakshi
Sakshi News home page

శ్రీశైలం సమీపంలో లోయలోకి దూసుకెళ్లిన బస్సు

Jan 13 2019 10:42 AM | Updated on Jan 13 2019 5:13 PM

Bus Accident At Srisailam - Sakshi

సాక్షి, కర్నూలు : జిల్లాలోని శ్రీశైలం సమీపంలో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీశైలం దగ్గరలోని చిన్నారుట్ల వద్ద ఓ ప్రైవేట్‌ బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఘాట్‌ రోడ్డులో బస్సు ప్రహరీగోడను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే డ్రైవర్‌ చాకచక్యం వల్ల ఈ ప్రమాదం నుంచి ప్రయాణీకులు సురక్షితంగా బయటపడ్డారు.

ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. బస్సు బ్రేకులు ఫెయిల్‌ కావడంతో ప్రమాదం జరిగిందని డ్రైవర్‌ చెప్పారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. ప్రయాణీకులను సురక్షితంగా బస్సులోనుంచి కిందకు దించారు. బస్సులో ఉన్న ప్రయాణికులందరూ  మహారాష్ట్రకు చెందినవారని పోలీసులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement