గొంతు నులిమి కొడుకును చంపిన కసాయి తండ్రి..! | Father Kills Son And Committed Suicide In Nizamabad | Sakshi
Sakshi News home page

గొంతు నులిమి కొడుకును చంపిన కసాయి తండ్రి..!

Published Sun, May 19 2019 10:45 AM | Last Updated on Sun, May 19 2019 10:55 AM

Father Kills Son And Committed Suicide In Nizamabad - Sakshi

సాక్షి, నిజామాబాద్‌ : కొడుకును కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఓ తండ్రి కర్కశంగా మారాడు. ముక్కుపచ్చలారని ఆరేళ్ల కొడుకును అతి దారుణంగా గొంతునులిమి హతమార్చాడు. అనంతరం తానూ ఉరిపోసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాదకర ఘటన జిల్లాలోని ముప్కాల్‌ మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. మృతులు.. తండ్రి విజయ్‌ తుల్జారాం, కొడుకు దినేష్‌ రాజస్తాన్‌ వాసులుగా స్థానికులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement