
సాక్షి, చిత్తూరు : జిల్లాలోని కెవి. పల్లి మండలం మహల్ క్రాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఐదుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్నకారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. తీవ్రగాయాలైన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలియాల్సిఉంది.
Comments
Please login to add a commentAdd a comment