
కారులో ఇరుక్కున్న శ్రీకాంత్ మృతదేహం
బాలానగర్ (జడ్చర్ల) మహబూబ్ నగర్ : వేగంగా దూసుకెళ్తున్న ఓ కారు టైరు పగిలి మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మండలంలోని పెద్దాయపల్లి గ్రామ శివారులో సోమవారం జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఏఎస్ఐ గోపాల్ కథనం ప్రకారం.. కర్నూలు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు కుడి వైపు ముందుటైర్ పగిలి డివైడర్ పైనుంచి హైదరాబాద్ నుంచి బెంగుళూరు వైపు వెళ్తున్న మరో కారును ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారులో శ్రీకాంత్(33) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా.. హైదరాబాద్ వైపు బెంగుళూరు వైపు వెళ్తున్న కారులో తగరం దేవన్న, విఠల్ తీవ్రంగా గాయపడ్డారు. శ్రీకాంత్ది కర్నూలు జిల్లా జవహారపురం స్వగ్రామం. దేవన్న, విఠల్లు హైదరాబాద్కు చెందినవారు. గాయపడిన వారిని జీఎంఆర్ అంబులెన్స్లో షా ద్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంత రం శ్రీకాంత్ మృతదేహానికి షాద్నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment