పసుపు తాడు మెడలో కట్టి..  | Sexual Assult On Minor Girl In Warangal | Sakshi
Sakshi News home page

బాలికపై లైంగిక దాడి 

Jun 3 2018 10:25 AM | Updated on Jul 23 2018 9:15 PM

Sexual Assult On Minor Girl In Warangal - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సంగెం : అభం, శుభం ఎరుగని ఓ మైనర్‌ బాలికను మభ్యపెట్టి పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వరంగల్‌ రూరల్‌జిల్లా సంగెం మండలంలో జరిగిన సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని మొండ్రా యికి చెందిన తొమ్మిదో తరగతి చదివే ఓ బాలికను అదే గ్రామానికి చెందిన తాళ్లపల్లి భరత్‌(20) అతడి స్నేహితులు బోనగిరి కోటేశ్వర్‌ అలియాస్‌ వివేక్, దామెరుప్పుల కపిల్‌తో కలిసి.. సదరు బాలికకు మాయమాటలు చెప్పి మే 3న వరంగల్‌ భద్రకాళి గుడికి తీసుకెళ్లాడు. అక్కడ బాలికను  పెళ్లి చేసుకుంటున్నానని చెప్పి భరత్‌ పసుపు తాడును మెడలో కట్టాడు.

ఈ తతంగాన్ని భరత్‌ స్నేహితులు వివేక్, కపిల్‌.. వారి సెల్‌ఫోన్లలో వీడియోలు తీశారు. అనంతరం ఇంటికి వచ్చారు. ఆ తర్వాత భరత్‌ ఆ బాలికను గ్రామ సమీపంలోని పాడుబడిన పాఠశాల గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే ఈ విషయం తెలిసిన వివేక్, కపిల్‌ కూడా.. సెల్‌ఫోన్‌లో ఫొటోలు తీశామని అవి బయట పెడతామని బెదిరించి ఆ బాలికపై లైంగిక దాడికి దిగారు. దీంతో బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు తెలపగా వారు ఎంచేయాలో తెలియక ఆందోళన చెందారు. చివరకు శనివారం సాయంత్రం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితులు భరత్, వివేక్, కపిల్‌పై నిర్భయ,  పోక్సోచట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై దీపక్‌ తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement