Gender Issues
-
పింక్ ట్యాక్స్ అంటే..? ఆఖరికి అందులో కూడా వ్యత్యాసమేనా..!
పెంపకంలో.. అవకాశాల్లో.. వేతనాల్లో లింగ వివక్ష క్రిస్టల్ క్లియర్! అది ధరల్లో కూడా ఉందన్న విషయం తెలుసా? అదీ స్త్రీ, పురుషులు ఇద్దరూ ఉపయోగించే ఒకే రకమైన వస్తువుల ధరల్లో! నిజం..!కేవలం ప్యాకింగ్లో తేడా వల్ల పర్సనల్ హైజీన్, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ నుంచి దుస్తుల దాకా మగవాళ్ల కన్నా మహిళలు ఎక్కువ ధర చెల్లించి కొంటున్నారు. దీన్ని పింక్ టాక్స్ అంటున్నారు. ఇద్దరూ వాడే ఒకేరకమైన ప్రొడక్ట్స్ మీద స్త్రీలు సగటున ఏడు శాతం అధికంగా చెల్లిస్తున్నారట. కేవలం పింక్ ప్యాక్లో ఉన్నందున రేజర్ బ్లేడ్స్ మీద 29 శాతం, బాడీ వాష్ మీద 16 శాతం ఎక్కువ వెచ్చిస్తున్నారట. ఆ లెక్కన ఒకేరకమైన వస్తువులు,సేవల మీద పురుషుల కన్నా స్త్రీలు ఏడాదికి సగటున లక్ష రూపాయలు అధికంగా చెల్లిస్తున్నట్టు అంచనా. దీని మీద బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజూందార్ షా కూడా స్పందించారు. ‘పింక్ టాక్స్ అనేది లింగ వివక్షకే పరాకాష్ట. దీన్ని మహిళలు తీవ్రంగా పరిగణించాలి. ధరల్లో వ్యత్యాసమున్న అలాంటి ప్రొడక్ట్స్ను కొనకుండా ఆ వివక్షను వ్యతిరేకించాలి’ అంటూ ఎక్స్లో ట్వీట్ చేశారు. పింక్ టాక్స్ అనేది మహిళల మీద ఆర్థిక భారాన్ని మోపడమే కాదు సమాజంలో ఇప్పటికే ఉన్న వివక్షను బలపరచే ప్రమాదాన్నీ సూచిస్తోందంటున్నారు సామాజిక విశ్లేషకులు. మార్కెట్లో ఏ తీరైనా.. ధోరణి అయినా న్యాయమైన ధరతో పాటు జెండర్ ఈక్వాలిటీని ప్రమోట్ చేసేట్టుగా, వివక్షతో కూడిన సామాజిక నియమాలను సవాలు చేసేట్టుగా ఉండాలి తప్ప వివక్షను ప్రేరేపించేట్టుగా ఉండకూడదని చెబుతున్నారు. ఈ పింక్ టాక్స్ను సవాలు చేయడానికి మన దగ్గర ప్రత్యేకమైన చట్టం లేక΄ోయినప్పటికీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 14.. రైట్ టు ఈక్వాలిటీ కింద కోర్ట్లో దావా వేయొచ్చు. Pink Tax! A shameful gender bias that women must respond to by shunning such products! pic.twitter.com/U3ZQm2s7W9— Kiran Mazumdar-Shaw (@kiranshaw) March 12, 2024 (చదవండి: భాషలోనూ వివక్ష ఎందుకు?) -
భాషలోనూ వివక్ష ఎందుకు?
భాషకు రెండువైపులా పదును ఉంటుంది! అందుకే దాన్ని జెండర్ ఈక్వాలిటీతో న్యూట్రల్ చేద్దాం! చాలారోజుల కిందట ... ‘అమెరికాలోని ఆడవాళ్లంతా జిడ్డుపాత్రలతో కుస్తీ పడుతున్నారు’ అంటూ తన ప్రొడక్ట్ అయిన అంట్లు తోమే సబ్బు గురించి ఒక యాడ్ ఇచ్చింది ప్రాక్టర్ అండ్ గాంబుల్ సంస్థ. వెంటనే ఆ కంపెనీకి ఓ పదకొండేళ్ల అమ్మాయి నుంచి ఉత్తరం వచ్చింది.. ‘భోజనం అందరికీ కావాలి, అంట్లతో కుస్తీ మాత్రం ఆడవాళ్లే పట్టాలి. మగవాళ్లెందుకు అంట్లు తోమకూడదు? దయచేసి మీ యాడ్లో అమెరికాలోని ఆడవాళ్లు అని తీసేసి అమెరికా ప్రజలు అని మార్చండి?’ అని! ప్రాక్టర్ అండ్ గాంబుల్ తన తప్పు తెలుసుకుని ‘అమెరికా ప్రజలు’ అని మార్చుకుంది. ఆ ఉత్తరం రాసిన అమ్మాయెవరో కాదు.. మీడియా పర్సనాలిటీ, బ్రిటిష్ రాచకుటుంబం కోడలు మెఘన్ మార్కల్. ఈ మధ్య.. ‘మా సోషల్ బుక్లో ఒకచోట ‘మ్యాన్ మేడ్ ఆర్ నేచురల్?’ అని ఉంది. విమెన్ అని ఎందుకు లేదు? వాళ్లకు చేతకాదనా? మ్యాన్ లేదా ఉమన్ అనే బదులు ప్రజలు అనొచ్చు కదా? అబ్రహం లింకన్ కూడా ఆల్ మెన్ ఆర్ క్రియేటెడ్ ఈక్వల్ అన్నాడు. ప్రజలంతా సమానమే అనుంటే బాగుండేది కదమ్మా!’ నిండా పదేళ్లు లేని ఓ చిన్నారి ఆలోచన! సవరించుకోవాలి.. పై రెండు ఉదాహరణల్లోని విషయం.. భాషకూ జెండర్ ఈక్వాలిటీ ఉండాలనే! కొడుకు, కూతురు ఇద్దరూ సమానమనే ఎరుక పెంపకంతోనే మొదలవ్వాలని ఎలా అనుకుంటున్నామో.. భాష విషయంలోనూ అలాగే అనుకోవాలి. పనికి సామర్థ్యం, నిర్దేశిత అర్హతలు ప్రామాణికమవుతాయి కానీ స్త్రీ, పురుష జెండర్లు కావు కదా! ఆడవాళ్లు అల్లికలకే పరిమితమై పొవట్లేదు.. అంతరిక్షానికీ వెళ్తున్నారు. అందుకే తదనుగుణంగా భాషను సవరించుకోవాలి. వాళ్లూ మినహాయింపు కారు.. జెండర్ స్పృహ ఉన్న రచయితలు, దర్శకులూ వాస్తవికత, రానెస్ పేరుతో స్త్రీల వ్యక్తిత్వాన్ని కించపరచే తిట్లన్నిటినీ రచనల్లో, సినిమాల్లో ఉపయోగిస్తున్నారు. అదేమంటే ‘దాన్నెందుకు జెండర్ కోణంలోంచి చూస్తారు? కోపానికో.. ఆవేశానికో ఎక్స్ప్రెషన్గా చూడాలి కానీ’ అంటూ బదులిస్తున్నారు. అలా స్త్రీల వ్యక్తిత్వాన్ని హననం చేసే మాటలను భావోద్వేగ వ్యక్తీకరణగా భాషలో సర్దేసి.. దాన్నో సాధారణ విషయంగా మన మెదళ్లకు తర్ఫీదునిచ్చిందీ పితృస్వామ్యమే! కానీ అవగాహన పెరుగుతున్న కొద్దీ ఆ ఆలోచనను మార్చుకోవలసిన .. ఆ భాషను సరిదిద్దుకోవలసిన అవసరాన్ని గ్రహించాలి. పనులు, వృత్తులకున్న పేర్ల నుంచే ఇది మొదలవ్వాలి. ఈ కసరత్తు వల్ల లైంగిక పరిభాష, స్త్రీల వ్యక్తిత్వాన్ని హననం చేసే భావోద్వేగ వ్యక్తీకరణలూ నెమ్మదిగా మెదళ్ల నుంచి డిలీట్ అవుతాయి.దస్తావేజులు.. పాఠ్యపుస్తకాల్లోనూ.. ఈ విషయంలో పాశ్చాత్యదేశాల్లో కృషి జరుగుతోంది. ముఖ్యంగా ఇంగ్లిష్లో! ఎయిర్ హోస్టెస్ని ఫ్లయిట్ అటెండెంట్గా, మ్యాన్.. ఉమన్ అనే పదాలను పర్సన్గా, బాలుడు.. బాలికను చైల్డ్గా, వెయిటర్.. వెయిట్రస్ను సర్వర్గా, యాక్టర్.. యాక్ట్రెస్ను పెర్ఫార్మర్గా.. ఇంకా ఫైర్ఫైటర్, పోలీస్ ఆఫీసర్ వంటి ఎన్నో జెండర్ న్యూట్రల్ పదాలను ఉపయోగిస్తున్నారు.ఇంకో అడుగుముందుకేసి జెండర్ను కేవలం స్త్రీ, పురుషులకే పరిమితం చేయకుండా మిగిలిన ఐడెంటీలనూ కలుపుకుంటూ అతడు, ఆమెకు బదులు They అనే పదాన్ని వాడుకలోకి తెచ్చుకున్నారు. స్కాండినేవియన్ దేశాలు సహా జర్మనీ, పోర్చుగల్, నెదర్లండ్స్ లాంటి యూరోపియన్ దేశాలైతే అధికారిక వ్యవహారాలు, దస్తావేజులు, పాఠ్యపుస్తకాల్లోనూ జెండర్ న్యూట్రల్ లాంగ్వేజ్ను ప్రోత్సహిస్తున్నాయి. చట్టాలు కూడా ప్రగతిశీల దేశాలు కొన్ని లింగ వివక్షను రూపుమాపేందుకు థర్డ్ జెండర్నీ కలుపుకుంటూ జెండర్ న్యూట్రల్ లాంగ్వేజ్ను ్ర΄ోత్సహించే చట్టాలనూ తెచ్చుకున్నాయి. ఆ జాబితాలో అమెరికా (ట్రంప్ వచ్చాక మార్పు వచ్చి ఉండొచ్చు), కెనడా, యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా వంటి దేశాలున్నాయి. ఇదివరకు స్త్రీకి చదువు లేదు. ఇంటిపట్టునే ఉండేది కాబట్టి ఆ పనులు ఆడవాళ్లకే పరిమితమై వాటి పరిభాష అంతా స్త్రీ లింగంలోనే స్థిరపడింది. ఇప్పుడు మహిళలు అన్నిరంగాల్లో పురుషులతో సమంగా రాణిస్తున్నారు. వాళ్ల పనికి గుర్తింపు, గౌరవ మర్యాదలు కావాలి. ఆ ప్రయత్నంలో తొలి అడుగు భాషదే. స్త్రీ, పురుష సమానత్వ ప్రయాణంలోని ప్రతి మార్పునూ గమనిస్తూ తదనుగుణంగా భాషను దిద్దుకోవాలి. భాషకూ జెండర్కూ సంబంధం ఉంది భాషకు, జెండర్కు ఉన్న సంబంధాన్ని సామాజిక శాస్త్రం, సాంస్కృతిక సిద్ధాంతాలు, భాషాశాస్త్రం, స్త్రీవాద కోణాల నుంచి చూడవచ్చు. విశ్లేషించవచ్చు. దీనిపై 1970ల నుంచే పాశ్చాత్య దేశాల్లో పరిశోధనలు జరుగుతున్నాయి. నిత్యజీవితంలో భాషను జెండర్ను నిర్దేశిస్తూ కాక, జెండర్ న్యూట్రల్గా వాడడానికి అవకాశం ఉందా అన్నది ఇటీవల మనదేశంలోనూ జరుగుతున్న చర్చ. పనిగట్టుకుని స్త్రీ అని చెప్పాలా లేక ఆ హోదా, ఆ పదవి, ఆ స్థానం మాత్రమే చెప్పి, అందులో ఉన్నది స్త్రీ అయినా, పురుషుడైనా సమానమేనని ధ్వనించేలా పదప్రయోగం ఉండాలా అన్నది దీని సారాంశం. ఫలితంగా తెలుగులో అధ్యక్షుడు, అధ్యక్షురాలు అనకుండా ‘అధ్యక్షులు’ అని, మేనేజింగ్ డైరెక్టర్ని కార్యనిర్వహణాధికారి అంటే చాలనే అవగాహనకు వచ్చేశాం. మంత్రి, ఆచార్య, గురువు అనే పదాలనూ ఇద్దరికీ వాడుతున్నాం. చెప్పొచ్చేదేంటంటే భాషకూ జెండర్కూ సంబంధం ఉంది. స్త్రీలు మొరటుగా మాట్లాడినా, బూతులు వాడినా వెంటనే గగ్గోలవుతుంది. పురుషుడి దుర్భాషలను సహజంగా తీసుకునే అలవాటు ఇంకా పోలేదు. ఇవన్నీ స్త్రీవాద విమర్శలో చర్చించాల్సిన విషయాలు. – సి. మృణాళిని, రచయిత అనాగరికులుగా పరిగణిస్తారు.. మా ఫినిష్ భాష స్వతహాగా జెండర్ న్యూట్రల్ భాష. స్త్రీ, పురుషులిద్దరికీ ఒకే సర్వనామం ఉంటుంది. చిన్నా, పెద్ద అనే తేడా కూడా లేకుండా అందరికీ ఒకేరకమైన సంబోధన ఉంటుంది. తెలుగులో స్త్రీకి ఇది, అది అనే పదాలున్నట్టు మా భాషలో లేవు. అందుకే స్త్రీ వ్యక్తిత్వాన్ని కించపరచే మాటలు ఉండవు. ఎప్పుడైనా ఎవరినోటి నుంచైనా అలాంటి ఇంగ్లిష్ మాటలు వినిపిస్తే వాళ్లను అనాగరికులుగా పరిగణిస్తారు. – ముచ్చర్ల రైతా ప్రదీప్, ఆంట్రప్రెన్యూర్ (తెలుగు వ్యక్తిని పెళ్లి చేసుకుని హైదరాబాద్లో ఉంటున్న ఫిన్లండ్ వనిత)– సరస్వతి రమ, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి(చదవండి: కాంతివంతమైన కళ్లకోసం...) -
International women's day 2025: 115 ఏళ్లు గడిచాయి? ఎక్కడుందీ సమానత్వం?
అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రకటించి 115 సంవత్సరాలైంది. అమానవీయమైన అణచివేతను, వివక్షను ఎదుర్కొన్న మహిళా కార్మికులు నెత్తురు ధారబోసి హక్కులకోసం తెగించి పోరాడారు. ఫలితంగా 8 గంటల పని దినాన్ని, వేతన పెంపుదలను, మరికొన్ని హక్కులను సాధించుకున్నారు. అయినప్పటికీ మహిళలు నేటికీ అనేక సవాళ్లను ఎదుర్కొంటూ కనిపిస్తున్నారు. మన సమాజంలో, ఆర్థిక, రాజకీయ వ్యవస్థలో మహిళా లోకం పురుషుల కంటే తక్కువగానే ఉంటూ వస్తోంది. ఇంట్లోనూ, బయట ఉద్యోగాల్లోనూ – మహిళలు పూర్తి బాధ్యతను మోస్తున్నప్పటికీ – ఈ అసమానత కొనసాగుతుంది. మహిళలు బలమైన పోరాటాలు చేస్తున్నప్పటికీ, వారి మీద లైంగిక హింస పెరుగుతూనే వుంది. దళిత, మైనారిటీ మహిళలు ఎక్కువగా దాడులకు గురి అవుతున్నారు. ప్రొఫెసర్లు, సైంటిస్టులు, డాక్టర్ల దగ్గర నుండి పారిశుధ్య కార్మికుల వరకు – అందరికీ కాంట్రాక్టు, తాత్కాలిక పనులే తప్ప ప్రభుత్వ ఉద్యోగాలు లేవు. ఈ పనుల్లో కూడా మహిళలకు సమాన పనికి సమాన వేతనాలు రావడం లేదు. ఉద్యోగ బీమా పథకాన్ని కోల్పోవడం అంటే మహిళలను ప్రసూతి ప్రయోజనాలకుదూరంగా పెట్టినట్లే. చదవండి! International Women's Day 2025 : యాక్సలరేట్ యాక్షన్ అంటే? మాటలేనా!1970లో పురుడు పోసుకున్న ‘ప్రగతిశీల మహిళా సంఘం’ ఎన్నో సమరశీల పోరాటాలు నిర్వహించింది. నిర్బంధానికి అణచివేతకు గురయ్యింది. అనేక మంది వీరవనితలు అమరులయ్యారు. 12 రాష్ట్రాల్లో గుర్తింపు కలిగిన మహిళా పోరాటాలు నిర్వహించింది. భూమికోసం, ఇళ్ళస్థలాలకోసం, స్త్రీ పురుష సమానత్వంకోసం లైంగిక హింసకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలను నిర్మించాం. ఈ క్రమంలో 2013లో సంస్థ చీలికకు గురయ్యింది. ఫలితంగా మహిళా ఉద్యమాలు తీవ్రంగా నష్టాన్ని చవిచూసాయి. వీటిని సమీక్షించుకొన్న తర్వాతరెండు సంస్థలు కలిసి భవిష్యత్లో ఒకే సంస్థగా పనిచేయాలని నిర్ణయించుకున్నాయి. మార్చి 8వ తేదిన అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం సందర్భంగా విలీనం కావాలని రెండు సంస్థలు భావించాయి. ఈ విలీనానికి ఒంగోలు వేదిక కాబోతుంది. – బి.పద్మ, ప్రధాన కార్యదర్శి,ప్రగతిశీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ), ఏపీ -
International Women's Day 2025: మహిళా విముక్తిలో ఓ అంకం
‘కన్యాశుల్కం’ నాటకం గుర జాడను అత్యుత్తమ నాటక రచ యి తగా తెలుగు సాహిత్యంలో నిలిపింది. ఈ నాటకాన్ని ‘జగన్నాథ విలాసినీ సభ’ 1892 ఆగస్టులో మొదట ప్రదర్శించింది. కన్యాశు ల్కంలో ప్రధానమైన సమస్య సుబ్బి పెళ్లి తప్పించటం! ఆడవాళ్లకి ఏ ఆలోచనాశక్తి లేదని, చులకనగా వారిని చూసే నాటి సమాజంలో మహిళలను ధైర్యవంతులుగా చిత్రించి మహిళల చరిత్రను పునర్లిఖించారు గురజాడ. సుబ్బమ్మ లేక సుబ్బి ఈ కథకి మూలం. నాటకంలో ఎక్కడా కనిపించదు. వెంకమ్మ – కృష్ణరాయపురం అగ్రహారీ కుడు అగ్నిహోత్రావధాన్ల భార్య. బుచ్చమ్మ-అగ్ని హోత్రావ ధాన్ల పెద్ద కూతురు, వితంతువు. మీనాక్షి - రామచంద్రా పురం అగ్రహారీకుడు లుబ్ధావధాన్ల కుమార్తె, వితంతువు. మధురవాణి–విజయనగరానికి చెందిన వేశ్య. పూట కూళ్ళమ్మ విజయనగరంలో పూట కూళ్ళిల్లు నడిపే వితంతువు. వెంకమ్మ అన్నగారు కరటక శాస్త్రి. ఇతడు కృష్ణరాయ పురం అగ్రహారంలో ఉన్న చెల్లెలి ఇంటికి వచ్చినపుడు సుబ్బి పెళ్ళి విషయం తెలుస్తుంది. ఈ సంబంధం ఇష్టంలేనివెంకమ్మ అన్న కరటకశాస్త్రిని ఈ సంబంధం తప్పించమని వేడుకుంటుంది. ఎలాగైనా మేనకోడలు పెళ్లి తప్పించాలని పథకాన్ని రూపొందిస్తాడు అతడు.మధురవాణిది నాటకంలో కీలకమైన పాత్ర. ఆమె వేశ్య. విజయనగరంలో ఉండే మధురవాణి కారణాంతరాల చేత రామచంద్రపురం అగ్రహార నివాసి, ఊరి కరణం రామప్ప పంతులి ఇంటికి చేరుతుంది. సుబ్బితో పెళ్లి ఖాయం చేసు కున్న లుబ్ధావధాన్లు రామచంద్రపుర వాసి. రామప్పపంతులు నయవంచకుడని ఆమె తొంద ర్లోనే కనిపెట్టేసింది. స్వతహాగా ఎదుటివారికి సాయం చెయ్యాలనే సద్బుద్ధి కలి గిన మధురవాణి... లుబ్ధావధాన్ల పెళ్లి రామప్ప పంతులు కుదిర్చాడని తెలిసిన వెంటనే ‘ఈ పెళ్లి మాన్పించకపోతే నేను మీతో మాట్లాడను’ అంటుంది. ఆ తరువాత అసలు కథ మొదలైంది.కరటకశాస్త్రి తన ప్రణాళిక అమలు చెయ్యటానికి రామప్ప పంతులు ఇంటికి వస్తాడు. అక్కడ మధుర వాణిని చూసి తన మేనకోడలి పెళ్లి తప్పించమని కోరతాడు. ఆమె అంగీకరించి కొన్ని సలహాలు ఇస్తుంది. తన ‘కంటె’ని పెళ్లిలో పెళ్లికూతురికి పెట్టటానికి కూడా ఒప్పుకుంటుంది. ఆడవేషంలో ఉన్న కరటకశాస్త్రుల శిష్యుడు మహేష్ని ఇచ్చి పెళ్ళి జరిపించి, తద్వారా సుబ్బి పెళ్లి ఆపటంలో మధురవాణి చాకచక్యాన్ని ప్రదర్శించింది. తర్వాత లుబ్ధావధా న్లను పెళ్లి చేసుకున్న మహేష్...మధురవాణి దగ్గరకు వచ్చి ఆమె ‘కంటె’ ఆమెకి ఇచ్చేస్తాడు. మధురవాణి ఆడపిల్ల వేషంలో ఉన్న మహేష్కు దాసరి వేషం వేసి ఊరు దాటిస్తుంది.‘కంటె’ కోసం రామప్ప పంతుల్ని ఇబ్బంది పెట్టడంతో అతడే హెడ్ కానిస్టేబుల్తో లుబ్ధావధాన్ల మీద ఖూనీ కేసు పెట్టిస్తాడు. ఈ వ్యవహారంలో లుబ్ధావధాన్లను కేసునుంచి బయట పడెయ్యడానికి మధురవాణి, సౌజన్యా రావు పంతులు ఇంటికి వెళుతుంది. అదే సమయంలో గిరీశం కూడా ఆ ఇంటికి వస్తాడు. బుచ్చమ్మని లేవదీసుకు పోయిన గిరీశం అంతటితో తృప్తిపడక లుబ్ధావధాన్ల ఆస్తి చేజిక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తూ అక్కడికి వచ్చాడు. గిరీశం నిజస్వరూపం తెలుసుకున్న సౌజన్యా రావు పంతులు బుచ్చమ్మను పూనాలో విడోస్ హోవ్ుకు పంపే ఏర్పాట్లు చేస్తాడు. నాటకంలో మీనాక్షి పాత్ర కూడా ముఖ్యమైనదే. ముసలి తండ్రి పెళ్లి కరటకశాస్త్రి శిష్యుడు మహేశంతో జరి పించటంలో సిద్ధాంతికి సంపూర్ణ సహకారం అందిస్తుంది. ఒక రాత్రివేళ రామప్ప పంతులితో తమ ఇంట్లో తండ్రికి దొరికిపోతుంది. తండ్రి బయటికి గెంటేస్తాడు. ఈ చర్యకి మీనాక్షి ఏమీ జంకకుండా ‘‘... ఈ జన్మలో ఈ ఇంట్లో అడు గుపెట్టను’’ అంటూ రామప్ప పంతు లుతో వెళ్లిపోతుంది.ఇక గంపెడు చాకిరీ చేస్తూ నెత్తిన ముసుగేసుకుని జీవి తాన్ని గడుపుతున్న బుచ్చమ్మ ఆలోచనాశక్తి, తెంపరితనం ఉన్న మహిళ. బుచ్చమ్మకి గిరీశం తన కళ్లముందు నిలిపిన రంగుల లోకం... అందరి ముత్తయిదువలలాగ జీవించాలనే ఆశని కల్గించింది. ఇంకో పక్క గిరీశం తన ఈ నిర్ణయం వల్ల ముసలాడితో చెల్లెలి పెళ్లి ఆగిపోతుందని నచ్చ చెప్పాడు. ధైర్యంగా ఆమె గిరీశంతో అగ్ని హోత్రావధాన్ల కళ్లుగప్పి వెళ్లి పోయింది. విజయనగరంలో పూటకూళ్ల ఇల్లు నడుపుకునే పూటకూళ్లమ్మ ఇంట్లో పనీపాటూ చేసు కుంటూ, ఆకతాయిగా తిరిగే మాయలాడు గిరీశం... ఆమెని మోసగించినందుకు అతడిని చీపురు తీసుకుని వెంటబడు తుంది. దానితో కృష్ణరాయ పురం అగ్రహారం వెంకటేశంతో చేరతాడు గిరీశం. లుబ్ధా వధాన్లకి వరసకి తమ్ముడైన గిరీశం: సుబ్బిని పెళ్లి చేసు కోవద్దంటూ లుబ్ధావధాన్లకి అర్థం అయ్యేటట్లు, భయ పెడుతూ ఉత్తరం రాస్తాడు. కాబట్టి సుబ్బి పెళ్లి ఆపటంలో పూటకూళ్లమ్మ కూడా తెలీకుండానే పెద్దసాయం చేసింది. గిరీశం కృష్ణరాయపురం చేరేటట్టు చేసింది.కన్యాశుల్కం నాటకం సుబ్బి కొరకే, సుబ్బికోసమే నడి చింది. చెప్పాలంటే అదృశ్యంగా కథ నడిపింది సుబ్బే. తలా ఒక చెయ్యివేసి దుర్మార్గాన్ని అడ్డుకున్నది మహిళా శక్తి! అదే గురజాడ మహిళలకు చూపిన వెలుగుదారి. డా. తుర్లపాటి రాజేశ్వరి వ్యాసకర్త కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద పురస్కార విజేత -
నా దారి రహదారి
అవని నుంచి అంతరిక్షం వరకు మహిళలు అసాధారణ విజయాలు సాధించి తమ సత్తా చాటుతున్నా.... ఇంకా లింగవివక్షతతో కూడిన బోలెడు ఆశ్చర్యాలు మిగిలే ఉన్నాయి. ఫిలింనగర్ బస్తీలో మక్కల మాధవి బస్ డ్రైవర్గా స్టీరింగ్ పట్టినప్పుడు... ‘ఇదేందీ!’ అని ఆశ్చర్యపోయిన వాళ్లే ఎక్కువ. ‘పెద్ద బస్పు నడపడం నీ వల్ల ఏమవుతుందమ్మా!’ అని నిరాశ పరిచిన వారే ఎక్కువ. అయినా సరే...‘నా దారి రహదారి’ అంటూ మాధవి దూసుకువెళుతూ తన డ్రైవింగ్ స్కిల్స్తో శభాష్ అనిపించుకుంటోంది...హైదరాబాద్ ఫిలింనగర్లోని గౌతమ్నగర్ బస్తీలో నివసించే మక్కల మాధవి భర్త రాజేష్ ‘జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్’ బస్సు డ్రైవర్గా గత పది సంవత్సరాలుగా పని చేస్తున్నాడు. ఇదే బస్సులో మాధవి అటెండర్గా పని చేసేది. భర్త బస్సు నడుపుతున్న తీరు చూసి డ్రైవింగ్పై ఆసక్తి పెంచుకుంది. స్కూల్ మైదానంలో భర్త ద్వారా డ్రైవింగ్లో శిక్షణ తీసుకొని ఏడాది క్రితం నుంచే బస్సు నడపడం మొదలుపెట్టింది. స్కూల్ చైర్మన్, ప్రిన్సిపాల్తోపాటు టీచర్లు కూడా ఆమె పట్టుదలకు ఫిదా అయ్యారు. ప్రోత్సహించారు. పూర్తి అనుభవం వచ్చాకే స్కూల్ బస్సు నడుపుతానని జేహెచ్పీఎస్ యాజమాన్యానికి తెలియజేసింది.డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడానికి ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లిన మాధవిని చూసి ‘బక్కపల్చగా ఉన్న ఈమె బస్సు ఏం నడుపుతుంది!’ అని అధికారులు వ్యంగ్యంగా మాట్లాడటమే కాకుండా బస్సు నడపడానికి తిరస్కరించారు. అయితే మాధవి ఏమాత్రం నిరాశ పడలేదు. మూడోసారి వెళ్ళి ఒకసారి తాను బస్సు నడపడం చూడాలని, నచ్చకపోతే లైసెన్స్ ఇవ్వొద్దని వేడుకుంది. ఎత్తు, ఒంపుల్లో బస్సును నడిపించి ఎలాగైనా అనర్హురాలిగా చేసి పంపాలనుకున్న అధికారులు మాధవి బస్సు నడిపించే తీరు చూసి ఆశ్చర్యపోయారు. అభినందించారు. పరీక్షలో పాస్ కావడంతో మాధవికి డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు చేశారు. స్కూల్ యాజమాన్యం కూడా ఆమెను మరింత ప్రోత్సహిస్తూ పిల్లలను తీసుకురావడం, ఇంటి దగ్గర దింపేందుకు బస్సు నడిపే బాధ్యతను అప్పగించింది. గో ఎ హెడ్డ్రైవింగ్ చేస్తానని చెప్పినప్పుడు నా భర్త కాస్త భయపడ్డాడు. అయితే నాకు నేర్పించే క్రమంలో గ్రౌండ్లో నా డ్రైవింగ్ చూసి ఆయనకు భయం పోయింది. దీంతో మెల్లమెల్లగా ప్రతిరోజూ అదే గ్రౌండ్లో రెండు గంటలపాటు డ్రైవింగ్ప్రాక్టిస్ చేసేదాన్ని. బస్సు డ్రైవింగ్ పూర్తిగా వచ్చాక ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. స్కూల్ యాజమాన్యం, టీచర్లు వెన్ను తట్టి ప్రోత్సహించడం, బస్సు నడుపుతున్నప్పుడు గో ఏ హెడ్ అని పిల్లలు అరవడం నాకు ఉత్సాహాన్ని ఇచ్చింది.– మక్కల మాధవి – పురుమాండ్ల నరసింహారెడ్డి,సాక్షి, హైదరాబాద్ -
జమ... ఖర్చుల్లో... ఆమె ఎక్కడ?
ఎక్కడైనా జమ, ఖర్చులదే లెక్క! దాన్ని బట్టే ఇంటికైనా.. దేశానికైనా జరుగుబాటు!అప్పు, ఆదా సమంగానే పంచినా బలహీనుల పట్ల ఆపేక్ష సహజం!అయితే ఆ బలహీనత అర్థమే మారిపోతోంది ఇంటి బడ్జెట్లో అయినా.. దేశ బడ్జెట్లో అయినా!చిత్రంగా ఆ వర్గంలో ఎక్కడా స్త్రీ కనిపించదు! అమ్మాయి నుంచి ఆంట్రప్రెన్యూర్ వరకు ఎవరికీ కేటాయింపులు ఉండవు! ఇల్లాలి సేవలకైతే గుర్తింపే కరవు!మహిళలకు బడ్జెట్లో స్థానం కల్పించాలని ‘జెండర్ బడ్జెటింగ్’ పేరుతో ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం ప్రపంచానికి వినిపించేలా గళమెత్తింది. ఆప్రాధాన్యాన్ని గ్రహించిన దేశాలు భారత్ సహా జెండర్ బడ్జెట్ మీద దృష్టిపెట్టాయి!కానీ కొన్నేళ్లుగా మన దగ్గర ఆ పదం వినిపించకుండా పోవడమే కాదు... బడ్జెట్లో మహిళలు కనిపించడమూ తగ్గుతోంది. ఫిబ్రవరి 1న కేంద్రబడ్జెట్ ప్రవేశపెట్టనున్న సందర్భంగా ‘జెండర్ బడ్జెటింగ్’ మీద పలు రంగాల్లోని మహిళా నిపుణుల అభిప్రాయాలు ...సంక్షేమపథకాలు జెండర్ బడ్జెట్ కిందికి రావుపదిహేనేళ్లుగా జెండర్ బడ్జెటింగ్ను మరచిపోయారు. మహిళలకు ఇస్తున్న పెన్షన్లు, గృహలక్ష్మి, ఉచిత రవాణా సౌకర్యాలు వంటివన్నిటినీ విమెన్ బడ్జెట్ కింద చూపిస్తున్నారు. అధికార పార్టీల సంక్షేమపథకాలు జెండర్ బడ్జెట్ కిందికెలా వస్తాయి? మహిళలకు సంబంధించి మౌలిక సదుపాయాల కల్పన, శాఖలన్నిటి కేటాయింపుల్లో మహిళలకుఇస్తున్న వాటా, స్త్రీ చదువు, జీవనోపాధి, ఆంట్రప్రెన్యూర్షిప్ గురించి, మొత్తం స్ట్రక్చర్ను విమెన్ ఫ్రెండ్లీ చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలు, స్త్రీ, పురుష అసమానతలను రూపుమాపడానికి తీసుకుంటున్న చర్యలు విమెన్ బడ్జెట్ కిందికి వస్తాయి. కేరళలో గ్రామ పంచాయతీ బడ్జెట్లో కూడా 30 శాతం మహిళలకు కేటాయిస్తారు. సాధారణ బడ్జెట్లోనూప్రాధాన్యం ఇస్తారు. దాన్ని కేంద్రప్రభుత్వమూ అనుసరించాలి. కిందటేడు కేంద్ర బడ్జెట్లో నరేగా(మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎం΄్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్)కు రూ.35 వేల కోట్లు తగ్గించారు. సవరించిన బడ్జెట్లో 120కోట్లకు గాను 95వేల కోట్లను కేటాయించి, కేవలం రూ. 60 వేల కోట్లతో సరిపెట్టారు. ఈ కోతలు గ్రామీణ ఉపాధిరంగంలోని స్త్రీల మీద తీవ్రప్రభావం చూపిస్తున్నాయి. వ్యవసాయరంగంలో 58 శాతం మహిళలున్నారు. వాళ్లు ఎక్కువగా కౌలు చేస్తారు. వాళ్ల పేరుమీద పొలాలుండవు. భర్త పేరుమీదో.. ఉమ్మడి కుటుంబ ఆస్తిగానో ఉంటాయి. లేదంటే పిల్లల పేరుమీద ఉంటాయి. ఈ లెక్కన వాళ్లకు ఆర్థిక భద్రత ఏది? పట్టణ ఉపాధి రంగంలో 23 శాతమున్న మహిళల పరిస్థితీ అంతే! నరేగా లాంటివి అక్కడ అప్లయ్ చేయరు. ఇక భద్రత, రక్షణ విషయాలకు వస్తే.. నిర్భయ ఫండ్కి గత మూడేళ్లుగా కేటాయింపుల్లేవు. మొదట్లో వెయ్యి కోట్లేమో కేటాయించారు. తర్వాత తగ్గించుకుంటూ వచ్చారు. ఎవరూ దరఖాస్తు చేసుకోవట్లేదని ఇప్పుడు దానికి బడ్జెట్టే లేకుండా చేశారు. అయితే ఎలాంటి పరిస్థితుల్లో అప్లయ్ చేసుకోవచ్చో రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టతనివ్వలేదు. స్త్రీ విద్య, ఆరోగ్యం, ఉపాధి, భద్రత రంగాల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు బడ్జెట్లో కేటాయింపులు ఉంటేనే అది జెండర్ బడ్జెట్. అది అత్యంత అవసరం! – దేవి, యాక్టివిస్ట్‘అవగాహన’కు ఖర్చు చేయాలి ఎమ్మెస్సెమ్మీలో 20 వేల కోట్ల రూపాయల మిగులు నిధులున్నట్లుగా డేటా చూపిస్తోంది. దాని అర్థం ఆ స్కీమ్స్ ప్రజలకు చేరట్లేదని! ఆ మిగులును చూసి కేటాయింపులు తగ్గిస్తారు లేదంటే రివర్స్ చేస్తారు తప్ప.. దాన్ని మహిళా సాధికారత మీద అవగాహన కలిగించే కార్యక్రమాలకో, ఆడపిల్లల చదువుకో మళ్లించరు! ఎమ్మెస్సెమ్మీ స్కీమ్స్ గురించి కాలేజీల్లో అవేర్నెస్ క్యాంప్లు పెట్టండని ప్రభుత్వాన్ని పోరుతున్నాం. కాలేజీస్థాయిలోనే అవగాహన వస్తే చదువైపోయాక ఉద్యోగం కోసం వెంపర్లాడకుండా తక్కువ పెట్టుబడితోనే ఏదో ఒక వ్యాపారం మొదలుపెట్టుకుంటారు. దీనివల్ల ప్రభుత్వాల మీదా ఒత్తిడి తగ్గుతుంది. యువతలో ఆంట్రప్రెన్యూర్షిప్ పెరుగుతుంది. ఓరియంటల్ మహిళా వికాసం, ముద్ర లోన్స్, స్త్రీ శక్తి యోజన.. సిం«ద్ మహిళాశక్తి యోజనలాంటి వాటితో భారతీయ మహిళా బ్యాంక్ (బీఎమ్బీ) లాంటి స్కీమ్స్ ఎన్నో ఉన్నాయి. బీఎమ్బీలో రూ. 50 వేల నుంచి రూ. 50 లక్షల వరకు లోన్స్ «తీసుకోవచ్చు. ధరావత్తు అవసరం లేదు. అయితే వీటి గురించి ఎవరికీ అంతగా తెలీదు. ఈ కోవలోనిదే స్టార్టప్ ఇండియా స్కీమ్. దీన్ని ఎస్సీ, ఎస్టీ, మహిళల కోసం డిజైన్ చేశారు. ఇంకా గ్రూప్ లోన్స్ ఉన్నాయి. అయిదుగురు మహిళలు కలిసి ఓ సంస్థను పెట్టుకోవచ్చు. ఈరోజున ఒక ఆంట్రప్రెన్యూర్ మహిళ నెలకు రూ. 3 లక్షలు సంపాదిస్తోంది. గ్రామీణ, పట్టణ, దళిత మహిళలందరినీ ఆంట్రప్రెన్యూర్షిప్ వైపు నడిపించాలంటే.. వారికోసం ప్రభుత్వాలు కల్పిస్తున్న పథకాల పట్ల అవగాహన కల్పించే కార్యక్రమాలకు బడ్జెట్లో కేటాయింపులు సమృద్ధిగా ఉండాలి. ఆ కార్యక్రమాలతో ఇల్లిల్లూ తిరిగి చైతన్యం కలిగించాలి. కేక్ తయారీ నుంచి చేపల పెంపకం దాకా అన్నిటికీ ఎమ్మెస్సెమ్మీలో శిక్షణ ఉంది. అవగాహన కల్పించాలంతే! – బి.ఎన్. రత్న, ప్రెసిడెంట్, దలీప్ (దళిత్ ఆదివాసీ విమెన్ ఆంట్రప్రెన్యూర్స్ అసోసియేషన్)ప్రత్యేక కేటాయింపులు కావాలిఆంట్రప్రెన్యూర్షిప్ స్కిల్స్ని డెవలప్ చేసే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి సరిపోయేంత బడ్జెట్ ఉండట్లేదు. దానికోసం ప్రత్యేక కేటాయింపులు కావాలి. పెట్టుబడి కోసం కూడా మహిళల దగ్గర డబ్బు ఉండదు. అందుకే పది, పదిహేను శాతం సీడ్ క్యాపిటల్ అసిస్టెన్స్ కూడా ఉంటే బాగుంటుంది. – అరుణ దాసరి, ప్రెసిడెంట్ డిక్కీ, తెలంగాణవాళ్లూ జాతీయోత్పత్తిలో భాగస్వాములే!వ్యవసాయం లాంటి అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న మహిళలకు క్షేత్రస్థాయిలో ఈ రోజుకీ ఎలాంటి వసతులు లేవు. కనీసం టాయిలెట్ సౌకర్యం కూడా లేదు. వర్కింగ్ విమెన్స్ హాస్టల్స్, బేబీ కేర్ సెంటర్స్ను ఏర్పాటుచేస్తామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుస్థిర వ్యవసాయ పద్ధతుల గురించి మాట్లాడినప్పుడల్లా అది మహిళల మీద అదనపు భారాన్నే మోపుతోంది. వీరి ఈ శ్రమను ఇంటిపనిగానే చూస్తున్నారు తప్ప ఉత్పత్తిలో భాగంగా చూడట్లేదు. ఎలాంటి కూలీ చెల్లించట్లేదు. మహిళా రైతుల ఆత్మహత్యలను లెక్కలోకి తీసుకోవట్లేదు. వాళ్లను అసలు రైతులుగానే గుర్తించట్లేదు. ఒంటరి మహిళలకు అందాల్సిన పెన్షన్లు, ఎక్స్గ్రేషియా విషయంలోనూ నిర్లక్ష్యమే కనిపిస్తోంది. నిర్వాసిత ప్రాజెక్ట్ నిర్మాణాల వల్ల) మహిళలైతే అనేకరకాల అభద్రతలకు లోనవుతున్నారు. వీళ్లంతా జాతీయోత్పత్తిలో భాగస్వాములే! వీళ్లందరి అభివృద్ధి, భద్రత, రక్షణలకు బడ్జెట్లో స్థానం ఉంటోందా? నిజాయితీగా సమీక్షించుకోవాలి. నిష్పక్షపాతంగా ఒప్పుకోవాలి. అప్పుడే బడ్జెట్లో స్త్రీకి సముచితస్థానం లభిస్తుంది. – పద్మ వంగపల్లి, ఇండిపెండెంట్ జర్నలిస్ట్కేర్ ఎకానమీకీ స్థానం ఉండాలిస్త్రీ, పురుష ఆర్థిక సమానత్వ సాధనలో జెండర్ బడ్జెటింగ్ అనేది కీలకం. ఆర్థిక వనరులను నేరుగా ప్రభావితం చేసే రంగాల్లో స్త్రీలకు ఎంతమేర కేటాయింపులుంటున్నాయి, వాటినెలా ఉపయోగిస్తున్నారు, మహిళల భద్రత కోసం ఎంత కేటాయిస్తున్నారు లాంటివన్నీ పరిగణనలోకి వస్తాయి. కేర్ ఎకానమీ అంటే ఇంట్లో స్త్రీల సేవలు.. ఇంటి పని, వంటపని దగ్గర్నుంచి భర్తకు ఇచ్చే ఎమోషనల్ సపోర్ట్, పిల్లలు.. పెద్దవాళ్ల బాగోగుల దాకా మహిళలు చేసేదంతా జీతం లేని శ్రమ. మరుగునపడిన వీరి సేవలను, శ్రమను ఆదాయ పట్టీలోకి చేర్చాలి. భార్య అన్నిరకాలుగా సహకరిస్తేనే భర్త బయటకు వెళ్లి పనిచేయగలుగుతున్నాడు. అలా ఆమె కూడా ఉత్పత్తిలో భాగమవుతూ, జాతీయ ఆదాయానికి ఊతమవుతోందని గ్రహించాలి. ఈ కేర్ ఎకానమీకీ బడ్జెట్లో స్థానం ఉండాలి. స్థూల విధానాలు జెండర్ ఈక్వాలిటీ, సామాజిక న్యాయం, మిలీనియల్ గోల్స్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు దగ్గరగా ఉండాలి. మహిళలు, జెండర్ మైనారిటీల చదువు, ఆరోగ్యం, భద్రత, ఉపాధి, జీవన నైపుణ్యాలు పెంపొందించడం వంటివన్నీ బడ్జెట్లో భాగం కావాలి. ఆ కేటాయింపులన్నీ సక్రమంగా ఖర్చవ్వాలి. కానీ అవన్నీ వేరేచోటికి మళ్లుతున్నాయి. జెండర్ ఈక్వాలిటీ మీద ఒకరకమైన ఉపేక్ష కనబడుతోంది. – అపర్ణ తోట, జెండర్ కన్సల్టెంట్ ట్రైనర్, ద పర్పుల్ వరండా– సరస్వతి రమ -
ట్రంప్ దూకుడు.. ఇక స్వేచ్ఛ స్టాచ్యూ అయిపోనుందా..!
అమెరికా అన్నిట్లో ముందుంటుంది! అభివృద్ధికి ప్రామాణికమని చెప్పుకుంటారు! ఏ మార్పైనా అక్కడే మొదలవుతుందని, దాన్ని ఏ దేశమైనా అనుసరించొచ్చనే నమ్మకం ఆ దేశానిది.. ప్రపంచానిది కూడా! స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దేశం ప్రపంచానికేమని సెలవిస్తోంది.. కొత్త అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే? ముఖ్యంగా జెండర్ విషయంలో! సాధారణంగా థర్డ్ జెండర్ హక్కుల విషయంలో అమెరికా ప్రపంచానికి మార్గదర్శిగా ఉంది. భద్రమైన, గౌరవప్రదమైన గమ్యంగా ప్రపంచంలోని ఎందరో ట్రాన్స్జెండర్స్కి ఆశ్రయం ఇచ్చింది. ఆ స్పృహ మనతో సహా ఎన్నో దేశాలకు స్ఫూర్తినిచ్చింది. వాళ్ల హక్కుల కోసం మన దగ్గరా ఉద్యమాలు సాగాయి. ప్రభుత్వాలు వాళ్లకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వమైతే ట్రాఫిక్ కానిస్టేబుల్స్గా నియమించింది. ట్రాన్స్మన్ ఐఆర్సెస్ ఆఫీసర్ అయ్యాడు. గవర్నమెంట్ డాక్టర్ కొలువొచ్చింది. ఇది కొంత మనం అగ్రరాజ్యం నుంచి నేర్చుకున్నదే! అలాంటిది ఆ దేశాధ్యక్షుడు ఇప్పుడు తాము ‘థర్డ్ జెండర్ను గుర్తించం’ అంటూ పాలనా ఉత్తర్వుల మీద సంతకం చేశాడు. ప్రమాణ స్వీకారం అయిన వెంటనే ట్రంప్ చేసిన ముఖ్య సంతకాల్లో అదొకటి. ఇప్పుడిప్పుడే సమాన హక్కుల వైపు అడుగులు వేస్తున్న దేశాలకిది విస్మయమే! ఇప్పటికే మన ఐపీసీలోని 377 సెక్షన్కు కొత్త చట్టం బీఎన్నెస్( భారతీయ న్యాయ సంహిత) ప్రత్యామ్నాయం చూపక చాలా ఆందోళనలు తలెత్తాయి. దానికిప్పుడు అమెరికా నిర్ణయాన్ని వత్తాసుగా తీసుకునే ప్రమాదమూ ఉంది. ఈ నేపథ్యం, సందర్భంలో ట్రాన్స్ జెండర్స్, వాళ్ల హక్కుల కార్యకర్తలు ఏమంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేశాం ..స్టిగ్మా, డిస్క్రిమినేషన్ ఎక్కువవుతాయిఅంతకుముందు అమెరికాలో మొదలైన మీ టూ, బ్లాక్ లైవ్స్ మ్యాటర్లాంటి మూవ్మెంట్స్ ప్రభావం మన దగ్గరా (దళిత్ లైవ్స్ మ్యాటర్) ఉండింది. కాబట్టి ఇప్పుడు ట్రంప్ డెసిషన్ వల్ల ఎల్జీబీటీక్యూని వెస్టర్న్ కాన్సెప్ట్ అని అభిప్రాయపడుతున్న వాళ్లంతా ఇక్కడ దాని రిలవెన్స్నే జీరో చేసే చాన్స్ ఉంది. ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీకి సంబంధించిన పాలసీలన్నీ కార్పొరేట్ కంపెనీల్లోనే కనిపిస్తాయి. వాళ్లకు ఉద్యోగాలుండేవీ వాటిల్లోనే! ఇవన్నీ చాలావరకు అమెరికా బేస్డ్గానే ఉంటాయి. మిగతా ఎక్కడైనా ఎల్జీబీటీక్యూ వాళ్ల ఐడెంటిటీని దాచుకునే ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే గ్లోబల్ బిజినెస్ కోసం ఇండియన్ బిజినెసెస్ కూడా వాళ్ల పాలసీలు కొన్నిటిని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. ఇప్పుడు వాళ్లే తీసేస్తే వీళ్లూ అనవసరమనుకుంటారు. ఉద్యోగాలుండవు. దానివల్ల వాళ్ల ఏజెన్సీలు కూడా పోతాయి. మళ్లీ మునుపటి స్థితికి వచ్చేస్తారు. స్టిగ్మా, డిస్క్రిమినేషన్ ఎక్కువవుతాయి. మన దగ్గర థర్డ్ జెండర్కి సంబంధించిన చట్టాలు కొంచెం భిన్నంగా, బలంగా ఉన్నాయి. వాటిని మార్చక΄ోతే పర్వాలేదు. ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మారిస్తే మాత్రం ఇబ్బందే! ఇంకో విషయం.. రెండే జెండర్లని గుర్తించడం వల్ల ఆ రోల్స్ కూడా రిజిడైపోయి స్త్రీని ఇంటికే పరిమితం చేసే ప్రమాదం, స్త్రీ మీద హింస మరింత పెరిగే ప్రమాదమూ లేకపోలేదు.– దీప్తి సిర్లా, జెండర్ యాక్టివిస్ట్హింస పెట్రేగే ప్రమాదంజెండర్ విషయంలో ట్రంప్ తీసుకున్న డెసిషన్ వల్ల ఎల్జీబీటీక్యూ, లైంగికత విషయంలో సందిగ్ధంలో ఉన్న పిల్లలు హింసకు లోనయ్యే ప్రమాదం ఉంది. పితృస్వామ్య వ్యవస్థ మరింత బలపడి స్త్రీల మీదా హింస పెట్రేగొచ్చు. ఇప్పుడిప్పుడే జెండర్ రైట్స్ మీద అవగాహన, చైతన్యం పెరుగుతున్న క్రమంలో అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచ దేశాలపై చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ట్రాన్స్ జెండర్ల జీవితాలకు రిస్క్ నుంచి ఉంది. ట్రంప్ నిర్ణయాన్ని నిలువరించడానికి అమెరికా ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ న్యాయపోరాటానికి సిద్ధమైంది. అయితే అదొక్కటే సరి΄ోదు. ట్రంప్ నిర్ణయ పర్యవసానాలను తెలుపుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రగతిశీలవాదులందరూ సామాజిక పోరాటంతో మద్దతు తెలపాలి. – రచన ముద్రబోయిన, ట్రాన్స్ రైట్స్, హ్యుమన్ రైట్స్ యాక్టివిస్ట్ఫండ్స్, ఉద్యోగాలు ప్రశ్నార్థకమే!చాలా విషయాల్లో మాదిరి జెండర్ విషయంలోనూ ట్రంప్ ఆ దేశాన్ని వెనక్కి తీసుకెళ్తున్నాడు. ఎన్నో అమెరికన్ కంపెనీలు మన దగ్గర, ఇతర దేశాల్లో ‘డైవర్సిటీ ఈక్విటీ ఇన్క్లుజన్’ కింద ఎల్జీబీటీక్యూ వాళ్లకు ఫండ్స్, ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నాయి. ఈ ΄ాలసీల వల్ల అవి ప్రశ్నార్థకమవచ్చు! అంతేకాదు తమకు భద్రమైన ప్లేస్గా భావించి అమెరికా వెళ్లిన ఎల్జీబీటీక్యుల పరిస్థితేంటి? ΄ాస్΄ోర్ట్లో కూడా ట్రాన్స్జెండర్ అనే పదం వాడకూడదని చె΄్పాడు. ఆ నేపథ్యంలో వేరే దేశాల నుంచి చదువు కోసం, టూరిజం కోసం వెళ్లే ట్రాన్స్జెండర్ల సంగతేంటి? భయాందోళనలను కలిగించే విషయమే! ఇంకా చె΄్పాలంటే హింసను ప్రేరేపించే నిర్ణయమిది!– తాషి చోడుప్, బౌద్ధ సన్యాసిని, క్వీర్ ట్రాన్స్ వెల్నెస్ సెంటర్ ఫౌండర్, సోషల్ యాక్టివిస్ట్ -
అక్షరాలై వెలిగారు
కాలక్షేప సాహిత్యానికి కాలం చెల్లిన కాలం ఇది. ఈ ఉరుకు పరుగుల కాలంలో పుస్తకం నిలబడాలంటే సత్తా ఉండాలి. సామాజిక అంశాలు ఉండాలి. అలాంటి సత్తా ఉన్న పుస్తకాలతో ఈ సంవత్సరం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెరిశారు మన మహిళా రచయిత్రులు. లింగవివక్ష నుంచి స్త్రీ సాధికారత వరకు... అట్టడుగు శ్రామిక జీవితాలను నుంచి లౌకికవాదం వరకు... ఎన్నో అంశాలపై ప్రామాణికమైన పుస్తకాలు రాశారు...రెజ్లర్ టు రైటర్సాక్షి మాలిక్ (Sakshi Malik) పేరు వినబడగానే ‘స్టార్ రెజ్లర్’ అనే శబ్దం ప్రతిధ్వనిస్తుంది. రెజ్లర్ సాక్షి కాస్తా ‘విట్నెస్’తో (Witness) రైటర్గా మారింది. సాక్షి మాలిక్ది నల్లేరు మీద నడక కాదు. ఘర్షణ లేకుండా ఆమె నడక లేదు. ఆ ఘర్షణలో పితృస్వామ్య వ్యవస్థను సవాలు చేయడం కూడా ఒకటి. పేదరికాన్ని, ప్రతికూల పరిస్థితులను తట్టుకొని ఉన్నతస్థాయికి చేరడానికి తాను పడిన కష్టాలకు జోనాథన్ సెల్వరాజ్తో (Jonathan Selvaraj) కలిసి ఈ పుస్తకం ద్వారా అక్షర రూపం ఇచ్చింది సాక్షి మాలిక్. ఆటలో పడి లేవడం సాధారణం. అయితే పడిన ప్రతిసారీ మరింత బలంగా పైకి లేవడం సాక్షి శైలి. ఒలింపిక్స్లో పతకం గెలుచుకున్న తొలి భారత మహిళా రెజ్లర్గా ఎంతోమందికి స్ఫూర్తిని ఇచ్చింది. ‘నేను తల్లి అయిన తరువాత భవిష్యత్తులో ఏదో ఒకరోజు గోడకు వేలాడుతున్న ఒలింపిక్ మెడల్ను చూస్తూ అది ఏమిటి? అని నా బిడ్డ నన్ను అడగవచ్చు. నేను ఆ మెడల్ను బిడ్డ చేతిలో పెట్టి అది ఏమిటో, అది గెలవడానికి ఎంతదూరం ప్రయాణించాల్సి వచ్చిందో వివరంగా చెబుతాను’ అంటుంది సాక్షి మాలిక్.విట్నెస్ – సాక్షి మాలిక్జ్ఞాపకాల జ్ఞాన సముద్రంఇది పుస్తకం అనడం కంటే నాలుగు తరాల జ్ఞాపకాల సంపుటి అనడం సబబుగా ఉంటుంది. ఎంతో పరిశోధిస్తే కాని ఇలాంటి పుస్తకం రాయలేము. పరిశోధనకు తోడు నుస్రత్ ఎఫ్ జాఫ్రీలోని (Nusrat Fatima Jafri) అద్భుత సృజనాత్మకత పుస్తకానికి మంచి పేరు వచ్చేలా చేసింది. తన పూర్వీకుల మతమార్పిడి అనేది ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందో ఈ పుస్తకంలో వివరిస్తుంది జాఫ్రీ. ‘నా బంధువులు వారి జీవితంలో వివిధ సందర్భాలలో కొత్త మతాలను స్వీకరించాలని నిర్ణయించుకోవడం వెనుక ఉన్న కారణాలను అన్వేషించడానికి కష్టపడాల్సి వచ్చింది. ఆ కారణాలలో రాజకీయం(Politics) నుంచి సామాజికం వరకు ఎన్నో ఉన్నాయి. ప్రతి ఒక్కరి మత మార్పిడి ప్రయాణం ప్రత్యేకమైనది’ అంటుంది జాఫ్రీ. అయితే వారి కుటుంబ చరిత్ర అంతా దేశ విస్తృత చరిత్రతో లోతుగా ముడిపడినందు వల్లే పుస్తకం ప్రత్యేకంగా నిలిచింది, వలస పాలన, స్వాతంత్య్రపోరాటం, వలసానంతర రాజకీయాలు... మొదలైనవి ‘దిస్ ల్యాండ్ ఉయ్ కాల్ హోమ్’లో కనిపిస్తాయి.దిస్ ల్యాండ్ ఉయ్ కాల్ హోమ్: ది స్టోరీ ఆఫ్ ఏ ఫ్యామిలి, క్యాస్ట్, కన్వర్జేషన్స్ అండ్ మోడర్న్ ఇండియా – నుస్రత్ ఎఫ్.జాఫ్రీఇదేం భాష?!న్యూయార్క్లోని హంటర్ కాలేజిలో ‘ఉమెన్ అండ్ జెండర్ స్టడీస్’లో ప్రొఫెసర్గా పనిచేస్తున్న రూపాల్ ఓజా రాసిన పుస్తకం ఎమియోటిక్స్ ఆఫ్ రేప్. బాధితురాలు, సర్వైవర్లాంటి పదాలకు అతీతంగా లైంగిక హింస కేసులకు సంబంధించిన భాషలో మూసధోరణులు, పితృస్వామిక భావజాలాన్ని ఈ పుస్తకంలో విశ్లేషిస్తుంది రూపా ఓజా. ప్రభుత్వ అధికారుల నుంచి గ్రామ వార్డు మెంబర్లు, కుల సంఘాల వరకు అత్యాచార కేసులను లైంగిక విషయాలపై చర్చించే వేదికలుగా ఎలా చూస్తారో ఈ పుస్తకంలో వివరిస్తుంది రుపాల్ ఓజా.ఎమియోటిక్స్ ఆఫ్ రేప్: సెక్సువల్ సబ్జెక్టివిటీ అండ్ వయొలేషన్ ఇన్ రూరల్ ఇండియా– రూపాల్ ఓజాఉద్యమమే జీవితమై..ఉన్నత విద్యావంతుల కుటుంబంలో పుట్టిన అరుణ దిల్లీ సబ్–డివిజనల్ మెజిస్ట్రేట్, లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ దిల్లీకి సెక్రటరీగా ఉన్నతోద్యోగాలు చేసినా ‘ఉద్యమ నాయకురాలు’గానే ఆమె సుపరిచితురాలు. సోషల్ వర్క్ రిసెర్చ్ సెంటర్ (బేర్ఫుట్ కాలేజీ)తో మొదలైన ఆమె ప్రయాణం ఎంతోదూరం వెళ్లింది. ఎన్నో మలుపులు తిరిగింది. తన ఉద్యమజీవితాన్ని, ఉద్యమాల బాటలో తాను కలిసి పనిచేసిన వ్యక్తుల గురించి ‘ది పర్సనల్ ఈజ్ పొలిటికల్’లో రాసింది అరుణా రాయ్. ఉద్యమం అనే మహా పాఠశాలలో తాను నేర్చుకున్న పాఠాలు ఈ పుస్తకంలో కనిపిస్తాయి.ది పర్సనల్ ఈజ్ పొలిటికల్: యాన్ యాక్టివిస్ట్ మెమోయిర్ – అరుణా రాయ్అట్టడుగు కోణం నుంచి...దేశంలోని అత్యంత మారుమూల, అణగారిన వర్గాల గురించి బేలా భాటియా రాసిన పుస్తకం ఇది. మన దేశంలోని నిరుపేద ప్రజలపై జరిగే హింసాకాండపై వెలుగును ప్రసరిస్తుంది. వర్గ, లింగ, భౌగోళిక అంశాలను మేళవించి రాసిన పుస్తకం ఇది.ఇండియాస్ ఫర్గాటెన్ కంట్రీ: ఏ వ్యూ ఫ్రమ్ ది మార్జిన్స్– బేలా భాటియాహింస ధ్వనిమన దేశంలోని తాజా రాజకీయ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని రాసిన పుస్తకం ఇది. భీమా– కోరేగావ్ ఘటనలో కొందరిని కేసులో ఎలా ఇరికించారో, సాక్ష్యాధారాలు ఎలా సృష్టించారో, కేసు లేకపోయినా రాజకీయ కారణాలతో ఎలా హింసించారో ఈ పుస్తకంలో అల్పా షా రాసింది.భీమా–కోరేగావ్ అండ్ ది సెర్చ్ ఫర్ డెమోక్రసీ ఇన్ ఇండియా: అల్పా షాఎర్రజెండ నీడలో... 1920 దశకంలో భారత రాజకీయాల్లో కమ్యూనిజం స్పష్టమైన అస్తిత్వంగా మారడం నుంచి కమ్యూనిస్ట్ మహిళల జీవితాలను సాంస్కృతిక, రాజకీయ నేపథ్యంలో విశ్లేషించడం వరకు ఎంతో సమాచారం ‘రెవల్యూషనరీ డిజైర్స్’లో కనిపిస్తుంది.ఎన్నో జీవితాల గురించిరెవల్యూషనరీ డిజైర్స్: ఉమెన్ కమ్యూనిజం అండ్ ఫెమినిజం ఇన్ ఇండియా – అనియా లూంబాశ్రామిక జనజీవన చిత్రంసాధారణ శ్రామిక వర్గ భారతీయురాలి జీవితం ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్టు చూపే ఈ పుస్తకాన్ని జర్నలిస్ట్ నేహా దీక్షిత్ రాసింది. బాబ్రీ మసీదు కూల్చివేతతో చెలరేగిన అల్లర్ల నేపథ్యంలో తన కుటుంబంతో కలిసి సైదా ఎక్స్ బెనారస్ నుంచి దిల్లీకి వెళుతుంది. దిల్లీలో బతకడానికి రోజుకు ఎన్నో ఉద్యోగాలు చేస్తుంది. ఒక రోజు సెలవు తీసుకుంటే కూడా ‘రేపు బతకడం ఎలా’ అనే భయం నుంచి రాత్రి, పగలు కష్టపడిన సైదా కథ ఈ పుస్తకంలో కనిపిస్తుంది, దిల్లీలోని చాందిని చౌక్లో రిక్షా తొక్కే కార్మికుడు ఉగ్రవాదుల బాంబు పేళుళ్లలో మరణిస్తాడు. ‘ది మెనీ లివ్స్ ఆఫ్...’లో సయిదా, బాంబు పేలుళ్లలో చనిపోయిన అమాయక రిక్షాకార్మికుడిలాంటి ఎంతోమంది సామాన్యుల, శ్రామికుల జీవితాలు కనిపిస్తాయి.ది మెనీ లైవ్స్ ఆఫ్ సైదా ఎక్స్ – నేహా దీక్షిత్స్వతంత్రభారత స్వరంఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ పుస్తకం స్వతంత్ర భారత దేశ సంక్షిప్త చరిత్ర. జాతీయవాదంలోని అనేక అంశాల గురించి తన భావాలను వెల్లడి చేస్తుంది నందిత హక్సర్. మన దేశం ఎలా ముందుకు సాగాలనే దాని గురించి కౌమార దశలో తన అమాయక ఆలోచనలు ఈ పుస్తకంలో గుర్తు తెచ్చుకుంది నందిత. అమాయక ఆలోచనల నుంచి వాస్తవికదృష్టితో ఆలోచించడం వరకు తన ఆలోచన ధోరణిలో వచ్చిన మార్పును గురించి కూడా ‘ది కలర్స్ ఆఫ్ నేషనలిజం’లో రాసింది నందితా హక్సర్ది కలర్స్ ఆఫ్ నేషనలిజం– నందితా హక్సర్‘తమాషా’ వెనుకఎంత విషాదమో!మహారాష్ట్రలోని తమాషా డ్యాన్సర్ల గురించి రాసిన పుస్తకం ది వల్గారిటీ ఆఫ్ క్యాస్ట్. ఒక విధంగా చెప్పాలంటే తమాషా కళాకారుల సామాజిక, మేధోచరిత్రను రికార్డ్ చేసిన మొదటి పుసక్తంగా చెప్పుకోవచ్చు. హిస్టరీప్రొఫెసర్ అయిన డా. శైలజ పైక్ తొలి పుస్తకం... దళిత్ ఉమెన్స్ ఎడ్యుకేషన్ ఇన్ మోడ్రన్ ఇండియా: డబుల్ డిస్క్రిమినేషన్. నలుగురు ఆడపిల్లల్లో ఒకరిగా యెరవాడ మురికి వాడలోని ఒకేగది ఇంట్లో పెరిగిన శైలజకు పేదల కష్టాలు తెలియనివేమీ కాదు. ఆ అనుభవ జ్ఞానంతోనే మహారాష్ట్రలోని తమాషా కళాకారుల జీవితానికి అద్దం పట్టేలా ‘ది వల్గారిటీ ఆఫ్ క్యాస్ట్’ పుస్తకం రాసింది.ది వల్గారిటీ ఆఫ్ క్యాస్ట్ – శైలజ పైక్ -
పుట్టింది కెనడాలో. అన్నీ ఎదురుదెబ్బలే.. కట్ చేస్తే!
బాధితురాలిగా సానుభూతి తప్ప సరిౖయెన సలహాలు, సహాయం అందుకోలేకపోయింది రసిక సుందరం.తన చేదు జ్ఞాపకాలను దృష్టిలో పెట్టుకొని ‘ఇమార’ అనే స్వచ్ఛందసంస్థను ప్రారంభించింది. జెండర్ బేస్డ్ వయొలెన్స్ను నివారించడానికి, బాధితులకు అనేక రకాలుగా అండగా నిలవడానికి ‘ఇమార’ ద్వారా కృషి చేస్తోంది రసిక సుందరం.రెండు సంవత్సరాల క్రితం రసిక సుందరపై క్లోజ్ఫ్రెండ్ దాడి చేశాడు. ఊహించని ఈ సంఘటనకు భీతిల్లిన రసిక డిప్రెషన్లోకి వెళ్లింది. ఆ చీకటి నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం తీసుకోవాలనుకుంది. అయితే వారితో వరుసగా చేదు అనుభవాలు ఆమెను నిరాశకు గురి చేశాయి.‘చాలామంది నన్ను అవమానించారు. చికిత్స ఫీజులు కూడా ఎక్కువే’ గతాన్ని గుర్తు చేసుకుంది రసిక.మంచి లాయర్ దొరకక పోవడం ఆమెకు మరో అడ్డంకిగా మారింది. దీంతో తనను వేధించిన వ్యక్తిపై కేసు పెట్టలేదు.తన అనుభవాల నేపథ్యంలో ‘ఇమార సర్వైవర్ సపోర్ట్’ ఫౌండేషన్ ప్రారంభించింది. ఇది సెక్సువల్ అండ్ జెండర్–బేస్డ్ (ఎస్జీబీవి) నివారించడానికి కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థ. ‘హింస నుంచి ప్రాణాలతో బయటపడిన వారికి మేము అండగా ఉంటాం. క్షేత్రస్థాయిలోకి వెళ్లి జెండర్–బేస్డ్ వయొలెన్స్ అంటే ఏమిటి అనేదాని గురించి అవగాహన కలిగించడం, ప్రాణాలతో బయటపడిన వారికి ఎలా సహాయపడవచ్చో చెప్పడం, ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటూ కష్టాల్లో ఉన్నవారికి ఎలా అండగా ఉండవచ్చో చెబుతాం’ అంటున్న రసిక విద్యాలయాల నుంచి కాలనీ వరకు ఎన్నో వర్క్షాప్లు నిర్వహిస్తోంది. (పాల వ్యాపారంతో ఏడాదికి రూ.3 కోట్లు సంపాదన: రేణు విజయ గాథ)న్యాయ, వైద్యసహాయం, పోలీసు సహాయం కోసం వన్–స్టాప్ సెంటర్లకు రూపకల్పన చేయనుంది. ‘ఇమార’ ఫౌండేషన్ కోసం ఫెమినిస్ట్ రిసెర్చర్ కృతి జయకుమార్ మార్గదర్శకంలో ఎంతోమంది వాలెంటీర్లు, ఇతర స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తోంది రసిక. ఆర్థిక వేధింపులు, బలవంతపు గర్భస్రావం....ఇలా ఎంతో మంది బాధితులు ‘ఇమార’ను సంప్రదిస్తున్నారు.‘వరల్డ్ పల్స్ ప్లాట్ఫామ్’ ద్వారా ఆఫ్రికాలోని మానవ అక్రమ రవాణా బాధితురాలు ఒకరు రసికను సంప్రదించారు. మానవ అక్రమ రవాణాకు పాల్పడేవారు తనను లక్ష్యంగా చేసుకొని ఎలా కష్టపెడుతున్నారో చెప్పింది. కొన్నేళ్ళుగా వారి చెరలో ఉన్న బాధితురాలు తన ఇద్దరు పిల్లలతో కలిసి బయటికి రావడానికి భద్రతను కోరింది. ‘ఇం పాక్ట్ అండ్ డైలాగ్ ఫౌండేషన్’ వ్యవస్థాపకురాలు పల్లవి ఘోష్ సహాయ సహకారాలతో బాధితురాలిని, ఆమె పిల్లలను చెర నుంచి విముక్తి కలిగించగలిగింది రసిక. అయితే బాధితురాలి కష్టాలు అక్కడితో ఆగిపోలేదు. కొత్త దేశంలో ఆహారం, ఆశ్రయం, ఆర్థిక సమస్యలలాంటి ఎన్నో సమస్యలు ఎదుర్కొంది. ఇది తెలుసుకొని యాంటీ ట్రాఫికింగ్ న్యాయవాదుల సహకారంతో గ్లోబల్ నెట్వర్కింగ్ ద్వారా ఆమెకు ఎలాంటి సమస్యలు లేకుండా చేసింది రసిక. ఇప్పటి వరకు ఏడు వందల మందికి పైగా బాధితులకు ‘ఇమార’ సహాయ సహకారాలు అందించింది. ధైర్యాన్ని ఇచ్చింది. (భార్యకోసం బంగారు గొలుసుకొన్నాడు.. దెబ్బకి కోటీశ్వరుడయ్యాడు!)కెనడాలో పుట్టిన రసిక ఎనిమిదేళ్ల వయసులో తన కుటుంబంతో కలిసి భారతదేశానికి తిరిగివచ్చింది. తమ కుమార్తెలు భారతీయ సంస్కృతి, సంప్రదాయాల మధ్య పెరగాలనే తల్లిదండ్రుల కోరికే వారు భారత్కు తిరిగిరావడానికి కారణం. చెన్నైలో డిగ్రీ చేసిన రసిక టొరంటోలోని యార్క్ యూనివర్శిటీలో పై చదువులు చదివింది. శరణార్థుల హక్కులు, వలస హక్కులు, లింగ–ఆధారిత హింస(జెండర్ బేస్డ్ వయొలెన్స్) చుట్టూ కేంద్రీకృతమైన మానవ హక్కులకు సంబంధించి ఇంటర్న్షిప్ చేసింది. జెండర్ సెక్యూరిటీ ప్రాజెక్ట్లలో పనిచేసింది.‘ఏ స్వచ్ఛంద సంస్థకు అయినా నిధుల సమీకరణకు సంబంధించి మొదటి మూడేళ్లు కష్టకాలం’ అంటున్న రసిక సుందరం తన కుటుంబం, స్నేహితులు ఇచ్చిన డబ్బుతో ‘ఇమార’ను నడుపుతోంది. ‘ఒక్క క్లిక్తో డేటాబేస్ను బాధితులు యాక్సెస్ చేసే యాప్ను రూపొందించడంపై దృష్టి పెట్టింది .లింగ ఆధారిత హింసను అంతం చేయడం కోసం పని చేస్తున్న ఇతర స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేయాలనుకుంటుంది రసిక సుందరం. -
ట్రాన్స్జెండర్లూ మహిళలేనా?
మహిళ అంటే ఎవరు? ఒక వ్యక్తి స్త్రీ అని నిర్ధారించేందుకు ప్రాతిపదిక ఏమిటి? జన్మతః సంక్రమించిన లైంగికత మాత్రమేనా? లింగ మార్పిడితో మహిళగా మారిన వాళ్లు కూడా ‘స్త్రీ’అనే నిర్వచనం కిందకు వస్తారా? తద్వారా మహిళలకు వర్తించే హక్కులన్నీ వారికీ వర్తిస్తాయా? అత్యంత సంక్లిష్టమైన ఈ అంశాలను తేల్చాల్సిన బాధ్యత బ్రిటన్ సుప్రీంకోర్టుపై పడింది. అతి వివాదాస్పదమైన ఈ అంశంపై జోరుగా కోర్టులో వాద వివాదాలు జరుగుతున్నాయి. ఒకరకంగా ‘మహిళ వర్సెస్ మహిళ’అని చెప్పదగ్గ న్యాయపోరాటం జరుగుతోంది. స్త్రీగా గుర్తింపు సర్టిఫికెట్ ఉన్న ట్రాన్స్జెండర్ వ్యక్తిని సమానత్వ చట్టాల ప్రకారం మహిళగా పరిగణించవచ్చా, లేదా అన్నది ఈ కేసు. బ్రిటన్ అత్యున్నత న్యాయస్థానంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ముందు దీనిపై మంగళవారం లోతైన వాదనలు సాగాయి. అవి బుధవారమూ కొనసాగాయి. ఇక న్యాయమూర్తులు తీర్పు వెలువరించడమే మిగిలింది. అందుకు రెండు వారాలు పట్టవచ్చు. రాబోయే తీర్పు బ్రిటన్తో పాటు ప్రపంచమంతటా లింగమార్పిడి ద్వారా మహిళలుగా మారిన వారి గుర్తింపును, హక్కులు తదితరాలపై ఎంతగానో ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. ఏమిటీ కేసు? నిజానికి మహిళా హక్కుల ఉద్యమకారులకు, స్కాట్రండ్ ప్రభుత్వానికి దీర్ఘకాలంగా సాగుతున్న వివాదమిది. స్కాట్లాండ్ ప్రభుత్వ రంగ సంస్థళ బోర్డుల్లో 50 శాతం మహిళా ప్రాతినిధ్యం ఉండేలా 2018లో అక్కడి ట్లాండ్ పార్లమెంటు చట్టాన్ని ఆమోదించింది. లింగమారి్పడి ద్వారా మహిళలుగా మారిన వారిని కూడా ఈ చట్టం ప్రకారం ‘స్త్రీ’నిర్వచన పరిధిలో చేర్చారు. దీన్ని స్కాటిష్ మహిళా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇలా ‘మహిళ’ను పునరి్నర్వచించే అధికారం పార్లమెంటుకు లేదన్నది వారి వాదన. ‘‘ఈ చట్టం అమలైతే బోర్డుల్లో 50 శాతం మంది పురుషులతో పాటు మిగతా 50 శాతం కూడా మహిళలుగా మారిన పురుషులే ఉంటారు. అది మహిళా ప్రాతినిధ్య లక్ష్యాలకే గొడ్డలిపెట్టు’’అని ‘ఫర్ విమెన్ స్కాట్లాండ్’(ఎఫ్డబ్ల్యూఎస్) అనే మహిళ స్వచ్ఛంద సంస్థ అంటోంది. అంతిమంగా ఇది మహిళల రక్షణకూ విఘాతమమేనన్ని వాదిస్తోంది. ఈ చట్టాన్ని స్కాట్లాండ్ కోర్టులో సవాలు చేయగా చుక్కెదురైంది. ఈ కేసును కోర్టు తిరస్కరించింది. అయితే దీనిపై సుప్రీంకోర్టుకు తీసుకెళ్లడానికి గతేడాది అనుమతించింది. అలా బంతి బ్రిటన్ సుప్రీంకోర్టు వద్దకు చేరింది. ట్రాన్స్జెండర్ల హక్కులకు విఘాతం: ఆమ్నెస్టీ సమానత్వ చట్టం ప్రకారం లైంగికత తల్లి గర్భంలోనే నిర్ణయమవుతుందని ఎఫ్డబ్ల్యూఎస్ తరపు న్యాయవాది అంటున్నారు. పుట్టిన అనంతరం దాన్ని మార్చడం సాధ్యం కాదని వాదిస్తున్నారు. దీనితో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్తో సహా పలు మానవహక్కుల సంఘాలు విభేదిస్తున్నాయి. ‘‘జెండర్ అనేది శారీరక వ్యక్తీకరణ. లింగ గుర్తింపు సరి్టఫికెటున్న ట్రాన్స్జెండర్లకు మహిళల హక్కులను నిషేధించడం మానవ హక్కుల సూత్రాలకు విరుద్ధం’’అని అవి అంటున్నారు. ట్రాన్స్జెండర్ల హక్కులకు విఘాతం కలగకుండా చూడాలని బ్రిటన్ సుప్రీంకోర్టును ఆమ్నెస్టీ లిఖితపూర్వకంగా కోరింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గేలి చేసినచోటే గెలిచి చూపిద్దాం!
ఆనందం ఎక్కడ ఉంటుందో ఆత్మస్థైర్యం అక్కడ ఉంటుంది. ఆత్మస్థైర్యం కొలువైన చోట అనేక ద్వారాలు తెరుచుకుంటాయి. విజయానికి సింహద్వారాన్ని చూపిస్తాయి.శారీరక మార్పుల వల్ల లింగమార్పిడికి ముందు, లింగ మార్పిడి తరువాత ఎన్నో అవహేళనలు ఎదుర్కొంది శ్వేతాసుధాకర్. అవమానాలు, కష్టాలలో ఆమె జపించిన మంత్రం... ‘జీవితం ఒక్కటే. బార్న్ 2 విన్. ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా సామాజిక కార్యకర్త, రచయిత, మోటివేషనల్ స్పీకర్గా ఎంతోమంది ట్రాన్స్జెండర్ల జీవితాలలో వెలుగులు నింపుతోంది చెన్నైకి చెందిన శ్వేతా సుధాకర్.వెయ్యి ఏనుగుల బలంతో రోజు మొదలు కావాలి అంటారు. ఆ మాట విషయం ఎలా ఉన్నా శ్వేతకు రోజు మొదలైందంటే దిగులుగా ఉండేది. ‘ఈరోజు ఎన్ని అవమానాలు పడాలో!’ అనుకునేది. చెన్నైలో పుట్టిన శ్వేత సుధాకర్లోని శారీరక మార్పులు చూసి ‘నీ బాడీ లాంగ్వేజ్ ఇలా ఉందేమిటి... అలా మాట్లాడుతున్నావేమిటీ’... ఇలా రకరకాలుగా వెక్కిరించేవారు. శారీరకంగా వచ్చిన మార్పులతో కుటుంబాన్ని వదిలి లింగమార్పిడితో ఎన్నో కష్టాలు ఎదుర్కొంది శ్వేత. ‘చదువును నమ్ముకున్నవారు ఎప్పుడూ జీవితంలో ఓడిపోరు’ తాను విన్న మాట ఆ రోజు పదే పదే గుర్తు వచ్చింది. ఇక అప్పటినుంచి చదువు తన నేస్తం అయింది. ఆత్మీయత పంచే కుటుంబం అయింది. ధైర్యం ఇచ్చే గురువు అయింది. మద్రాస్ యూనివర్సిటీలో ఎం.ఏ. సోషియాలజీ చేసిన శ్వేతాసుధాకర్ ఏదో ఒక ఉద్యోగం చూసుకోవాలనుకోలేదు. ఒక ఉద్యమంలా తనలాంటి వారి కోసం విస్తరించాలనుకుంది. ‘బార్న్ 2 విన్’ అనే స్వచ్ఛంద సంస్థకు శ్రీకారం చుట్టింది. అయితే చెన్నైలో సంస్థ కార్యాలయం కోసం గదిని అద్దెకు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఈ పరిస్థితుల్లో ఒక మానవతావాది సహాయంతో చెన్నైలోని సైదాపేటలో కార్యాలయాన్ని ఏర్పాటు చేయగలిగింది శ్వేత. (క్రేజీ.. డీజే..)గురుకులం...ఇప్పుడు ఈ కార్యాలయం వందలాది మంది ట్రాన్స్జెండర్లకు రణక్షేత్రం. ‘ఇదిగో... జీవితంలో ఎదురయ్యే సమస్యలతో ఇలా యుద్ధం చేయాలి’ అని నేర్పుతుంది. ‘చింతవద్దు. నువ్వు బతికేమార్గాలు ఎన్నో ఉన్నాయి’ అంటూ ఉపాధి విద్యలను నేర్పే గురుకులం అవుతోంది. లింగమార్పిడి చేసుకున్న వారి హక్కుల కోసం తన గళాన్ని వినిపించడంతో పాటు విద్య, ఉపాధి, లైఫ్స్కిల్స్... మొదలైన వాటిలో ప్రత్యేక తరగతులను నిర్వహిస్తోంది. సాఫ్ట్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లీష్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, టైలరింగ్, కాస్మోటాలజీ, ఫ్యాషన్ డిజైన్కోర్సులతో ఎవరికి వారు తమ సొంత కాళ్లపై నిలబడే విధంగా తీర్చిదిద్దుతుంది శ్వేతా సుధాకర్.ట్రాన్స్ అచీవర్స్ అవార్డ్తమిళనాడుకే పరిమితం కాకుండా దేశంలోని ఎన్నో రాష్ట్రాలకు విస్తరించింది బార్న్ 2 విన్. శ్రీలంక నుంచి మొదలు యూరప్లోని ఎన్నో దేశాల వరకు వివిధ రంగాలలో రాణిస్తున్న ట్రాన్స్జెండర్లను గత పదకొండు సంవత్సరాలుగా ‘ట్రాన్స్ అచీవర్స్’ అవార్డులతో సత్కరిస్తోంది శ్వేత. తమిళంతో పాటు తెలుగు, కన్నడం, మలయాళం లాంటి భాషలను అనర్గళంగా మాట్లాడుతూ ‘శ్వేతా టాక్ షో’ పేరుతో ట్రాన్స్ మీడియా యూ ట్యూబ్ను నిర్వహిస్తోంది. ‘మిస్ తమిళనాడు ట్రాన్స్ క్వీన్ ప్రొగ్రామ్ను గత ఎనిమిది సంవత్సరాలుగా నిర్వహిస్తోంది. ‘బార్న్ 2 విన్ అనేది సంస్థ కాదు. మా కుటుంబం. అది నాకు ఇచ్చిన ధైర్యం ఇంతా అంతా కాదు’ అంటుంది సుప్రియ. నిజానికి ఇది ఆమె మాటే కాదు ‘బార్న్ 2 విన్’ ద్వారా గెలుపు పాఠాలు నేర్చుకున్న ఎందరో విజేతల మాట.మన కోసం మనంకుటుంబాన్ని వదిలి నేను ఎన్నో బాధలు పడ్డాను. ఆ ఒంటరి రోజులలో పుస్తకాలు నా కుటుంబసభ్యులు అయ్యాయి. నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయి. ఇప్పుడు అదే చదువు ద్వారా ఎంతోమందికి ధైర్యం వచ్చేలా చేస్తున్నాను. ‘నా కోసం ఏదీ లేదు. నా కోసం ఎవరూ లేరు’ అని ఎప్పుడూ అనుకోవద్దు. ఈ విశాల ప్రపంచంలో మన కోసం ఎన్నో ఉన్నాయి. అయితే వాటిని వెదుక్కోగలగాలి. వాటిని వెదకాలంటే బలం కావాలి. ఆ బలం జీవనోత్సాహం నుంచి వస్తుంది. అందుకే నిరాశానిస్పృహలకు దూరంగా ఉంటూ ఎప్పుడూ సంతోషంగా ఉండేలా ప్రయత్నిస్తుంటాను. ఇప్పుడు ‘బార్న్ 2 విన్’ రూపంలో నాకంటూ ఒక కుటుంబం ఉంది. సామాజిక, రాజకీయ రంగాలలో గుర్తింపు దొరికింది.– శ్వేతా సుధాకర్, బార్న్ 2 విన్–ఫౌండర్అక్షర బలంశ్వేతా సుధాకర్ మంచి వక్త మాత్రమే కాదు రచయిత్రి కూడా. నిండైన భావుకత, చక్కని శైలి ఆమె అక్షరబలం. ‘నన్గై స్వేతాసీ’ పేరుతో హిజ్రాల జీవితాలపై ‘ఇయర్కై ఎలిదియ ఎలుత్తు పిలయ్(ప్రకృతి రాసిన అక్షర దోషం)’, కూందలుం... మీసయుం (శిరోజాలు..మీసాలు), వానం పాత్త తారగయే (ఆకాశం చూసిన తార), తర్కొలై దాహంగల్ (ఆత్మహత్యా దాహం), కల్యాణ కనువుగల్ (పెళ్లి కలలు)... మొదలైన పుస్తకాలను తన ‘నన్గై పబ్లికేషన్స్’ ద్వారా ప్రచురించింది.– అస్మతీన్ మైదీన్, సాక్షి, చెన్నై -
CISF: మరో అడుగు...
వెయ్యిమందికిపైగా మహిళలతో తొలిసారిగా మహిళా సీఐఎస్ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్) బెటాలియన్ ఏర్పాటుకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది. విమానాశ్రయాలు, మెట్రో రైలు వ్యవస్థ వంటి దేశంలోని కీలకమైన మౌలిక సదుపాయాలను సంరక్షించడం, వీఐపీలకు కమాండోలుగా భద్రత కల్పించే బాధ్యతలను ఈ బెటాలియన్ భుజాలకెత్తుకోనుంది.ప్రస్తుతం 1.80 లక్షల మంది ఉన్న సీఐఎస్ఎఫ్లో ఏడు శాతానికి పైగా మహిళలు ఉన్నారు. సీనియర్ కమాండెంట్ స్థాయి అధికారి నేతృత్వంలో 1,025 మంది సిబ్బందితో రిజర్వ్ బెటాలియన్ అని పిలిచే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కొత్త రిజర్వ్ బెటాలియన్ను ఏర్పాటు చేయడానికి ముందస్తు నియామకం, శిక్షణ, స్థలాన్ని ఎంపిక చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి.సీఐఎస్ఎఫ్ 1969లో ఏర్పాటు అయింది. ఎన్నికల భద్రత లాంటి తాత్కాలిక బాధ్యతల నుంచి పార్లమెంట్ హౌజ్ భద్రత వరకు సీఐఎస్ఎఫ్ ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తోంది. తాజాగా...ఆల్–ఉమెన్ బెటాలియన్ ఏర్పాటు చేయడమన్నది మహిళా సాధికారత విషయంలో సీఐఎస్ఎఫ్ వేసిన మరో అడుగు అనవచ్చు.‘వీఐపీ భద్రతతో పాటు విమానాశ్రయాలు, దిల్లీ మెట్రో... మొదలైన వాటి భద్రతలో కమాండోలుగా బహుముఖ పాత్రపోషించే సామర్థ్యం ఉన్న ఎలైట్ బెటాలియన్ను రూపొందిస్తున్నాం. దేశానికి సేవ చేయాలనుకునే మహిళలకు సీఐఎస్ఎఫ్ మంచి ఎంపిక. కొత్త ఆల్–ఉమెన్ బెటాలియన్ వల్ల దేశవ్యాప్తంగా మరింతమంది యువతులు సీఐఎస్ఎఫ్లో చేరేందుకు ప్రోత్సాహం లభిస్తుంది’ అని అధికార ప్రకటన తెలియజేసింది.‘ఇదొక చారిత్రక నిర్ణయం. జెండర్ ఈక్వాలిటీని ప్రమోట్ చేయడానికి ఆల్–ఉమెన్ బెటాలియన్ ఉపకరిస్తుంది’ అంటూ ‘ఎక్స్’ వేదికగా సీఐఎస్ఎఫ్ హర్షం ప్రకటించింది. -
నిషేధం.. నట్టింట్లో అపహాస్యం!
‘మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రానికి చెందిన దంపతులు ఖమ్మంలోని ఓ ఆస్పత్రిలో మొదటగా లింగనిర్ధారణ పరీక్షలు చేసేవారు. ఆపై కురవిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. అప్పటికే ఆ ఆస్పత్రి యజమానిపై లింగనిర్ధారణ, ఆబార్షన్లు చేస్తున్నారని కేసు నమోదైంది. అయితే ఆస్పత్రి యజమాని, ఆ దంపతులు కలిసి ల్యాప్టాప్ సైజులో ఉన్న స్కానింగ్ మెషిన్ కొనుగోలు చేశారు. టెక్నికల్ పరిజ్ఞానం తెలిసిన ఖమ్మం పట్టణానికి చెందిన ఆర్ఎంపీతో కలిసి గిరిజన తండాలు, పల్లెల్లో స్కానింగ్ చేయడం, ఆడపిల్ల అని తేలితే అక్కడే అబార్షన్లు చేసి ఒక్కొక్కరి నుంచి రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు వసూళ్లు చేశారు. ఈ విషయం పసిగట్టిన టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. మొబైల్ స్కానింగ్, అబార్షన్ వ్యవహారాన్ని బట్టబయలు చేసి సదరు వ్యక్తులపై కేసు నమోదు చేసి కురవి పోలీసులకు అప్పగించారు’ కామారెడ్డి జిల్లా రాజంపేటకు చెందిన ఒక ముఠా స్కానింగ్ మెషిన్ను ఓ గర్భిణి ఇంటికి తీసుకెళ్లి పరీక్షలు చేస్తుండగా ఇటీవల టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఆ కేసులో నలుగురిని అరెస్టు చేశారు. వీరు కొంత కాలంగా మొబైల్ స్కానింగ్ యూనిట్ను నిర్వహిస్తున్నారు. ఎన్ని పరీక్షలు, నిర్ధారణలు చేశారన్న విషయంపై విచారణ కొనసాగుతోంది. సాక్షి, మహబూబాబాద్: ఇప్పటి వరకు కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రత్యేకంగా స్కానింగ్ సెంటర్కు వెళ్లి.. నిబంధనల మేరకు పరీక్షలు చేయించుకునేవారు. కానీ ఇప్పుడు కొనిచోట్ల పరిస్థితులు వేరుగా ఉన్నాయి. కొత్తగా వచ్చిన మొబైల్ స్కానింగ్ మెషిన్లు.. అదీ కూడా ల్యాప్టాప్ అంత సైజులో ఉన్నవి మార్కెట్లోకి రావడంతో అక్రమార్కుల పని సులువైంది. నాలుగైదు కేసులు ఉంటే.. లేదా చుట్టూ పక్కల తండాల్లోని గర్భిణులను ఒకచోటకు రమ్మని చెబుతున్నారు. చదవండి: స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారంబ్యాగుల్లో మెషిన్లు పెట్టుకెళ్లి అక్కడే పరీక్షలు చేసి ఆడ, మగ శిశువు అని నిర్ధారిస్తున్నారు. పరీక్షలకు ఒక్కొక్కరి నుంచి రూ.5వేలకు పైగా తీసుకుంటున్నట్టు సమాచారం. పరీక్ష తర్వాత మగశిశువు అయితే ఆ గర్భిణిని ఇంటికి పంపించడం.. ఆడశిశువు అయితే అక్కడే అబార్షన్లు కూడా చేస్తున్నట్టు తెలిసింది. ఇలా చేయడంతో పలువురు మహిళలు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లడం, పెద్ద ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకొని బతికి బయటపడిన సంఘటనలు ఉన్నాయని గిరిజనులు చెబుతున్నారు. ఆయా జిల్లాల్లో ఇలా..మొబైల్ స్కానింగ్ పరికరాలతో లింగనిర్ధారణ చేసి ఆడశిశువును చంపేస్తున్న సంఘటనలు ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లాలోని కురవి మండలంలో మొబైల్ స్కానింగ్తో లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తుంటే పట్టుకున్నారు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో బీడీ ఖార్ఖానా ముసుగులో లింగనిర్ధారణ పరీక్షలు చేస్తూ పట్టుపడ్డారు. ములుగు జిల్లా మంగపేట మండలంలో, సిద్దిపేట జిల్లా అక్కన్నపేట, ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో గర్భవిచ్ఛిత్తి కేసులు బయటపడ్డాయి. అబార్షన్ సమయంలో మహిళలు చనిపోవడం, లేదా ప్రాణాపాయస్థితికి వస్తే కానీ బయటకు రావడం లేదు. మౌనంగా అధికారులుచట్టవిరుద్ధంగా లింగనిర్ధారణ చేయడం (illegal gender test) అబార్షన్లు చేస్తున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నా.. పలు జిల్లాల్లో వైద్యారోగ్యశాఖ అధికారులు మాత్రం మౌనంగా ఉంటున్నారు. స్కానింగ్ సెంటర్ల తనిఖీల సమయంలో పెద్దగా పట్టించుకోవడం లేదని, సెంటర్ల నిర్వాహకులు ఇచ్చే మామూళ్లతో కొందరు అధికారులు చూసీచూడనట్టు వదిలేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారులు ఈ విషయంపై స్పందించి చట్టవిరుద్ధంగా నిర్వహించే లింగనిర్ధారణ పరీక్షలను అడ్డుకోకపోతే ఆడపిల్లల రేషియో మరింత పడిపోయే ప్రమాదం ఉందని మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
లింగ సమానత్వంలో భారత్ ముందడుగు
న్యూఢిల్లీ: లింగ సమానత్వంలో భారత్ సాధిస్తున్న పురోగతి స్ఫూర్తిదాయకమని ఐక్యరాజ్యసమితి కొనియాడింది. అయితే సామాజిక కట్టుబాట్లు, పరిమిత శ్రామిక భాగస్వామ్యం, సరైన భద్రత లేకపోవడం లింగ సమానత్వానికి ఇంకా ఆటంకం కలిగిస్తున్నాయని అభిప్రాయపడింది. ఈ అంతరాన్ని పూడ్చడానికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ప్రయత్నాలు అవసరమని సూచించింది. దేశంలో మహిళల పురోగతి, సవాళ్లపై ఐరాస మహిళా వ్యూహాత్మక భాగస్వామ్యాల డైరెక్టర్ డేనియల్ సీమౌర్, భారత్లో ఐరాస మహిళల కంట్రీ రిప్రజెంటేటివ్ సుసాన్ జేన్ ఫెర్గూసన్ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. మహిళల జీవితాలను మార్చడానికి, మహిళలు, బాలికల నిర్దిష్ట అవసరాలకు బడ్జెట్లో 6.8 శాతానికి నిధులు పెరిగాయన్నారు. ఆరోగ్యం, విద్య, ఆర్థిక రంగాల్లో అంతరాలను తొలగించడానికి బడ్జెట్ నిరంతర విస్తరణ అవసరమని నొక్కి చెప్పారు. ఈ లక్ష్యాలను పూర్తిగా చేరుకోవడానికి ప్రైవేట్ రంగ పెట్టుబడులు అవసరమని ఫెర్గూసన్ పేర్కొన్నారు. పంచాయతీలు, స్థానిక ప్రభుత్వ సంస్థల్లో మహిళల ప్రాతినిధ్యంతో నాయకత్వంలో కూడా పురోగతి కనిపిస్తోందని చెప్పారు. పార్లమెంటులో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఆమోదం పొందడం జాతీయ రాజకీయ ముఖచిత్రంపై ప్రభావాన్ని చూపుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే లింగ ఆధారిత హింస (జీబీవీ) దేశంలో నిరంతర సమస్యగా ఉందని, ఇది మహిళల భద్రత, స్వేచ్ఛకు ఆటంకం కలిగిస్తోందని అధికారులు ఎత్తిచూపారు. చట్టాలు అమల్లో ఉన్నప్పటికీ సామాజిక కట్టుబాట్లు మహిళలను అడ్డంకిగా మారాయన్నారు. మహిళల భద్రతపై దృష్టి సారించే కమ్యూనిటీ పోలీసింగ్ ప్రయత్నాలను ప్రవేశపెట్టడానికి, పోలీసులకు శిక్షణ ఇవ్వడానికి మధ్యప్రదేశ్ వంటి రాష్ట్ర ప్రభుత్వాలతో యూఎన్ ఉమెన్ సహకరిస్తోందని తెలిపారు. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2022–23 ప్రకారం దేశంలో మహిళా కార్మిక శక్తి భాగస్వామ్య రేటు 37 శాతానికి పెరిగినప్పటికీ, సవాళ్లు ఉన్నాయని, పిల్లల సంరక్షణ, సురక్షిత రవాణా, పనిప్రాంతంలో భద్రతతో మహిళలు మరిన్ని ఆర్థిక అవకాశాలు పొందగలుగుతారని సూచించారు. -
ఇంటికొచ్చి లింగ నిర్ధారణ పరీక్ష
కామారెడ్డి టౌన్: మొబైల్ వైద్య పరీక్షల ముసుగులో ఇంటి వద్దకే వచ్చి లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న ఓ వ్యక్తి పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన గురువారం కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలో చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన బల్ల రవీందర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో స్కానింగ్ సెంటర్లో పని చేస్తూ గర్భిణీలకు లింగనిర్ధారణ పరీక్షలు ఎలా చేయాలో నేర్చుకున్నాడు. ఓ గర్భిణి లింగనిర్ధారణ కేసులో ఆ ఆస్పత్రి రెండేళ్ల క్రితం సీజ్ కావడంతో రవీందర్ రాజంపేటలో స్వయంగా లింగనిర్ధారణ పరీక్షలు ప్రారంభించాడు. ఇందుకోసం ఓ మినీ స్కానింగ్ యంత్రాన్ని కొనుగోలు చేశాడు.వాస్తవానికి అతనికి స్కానింగ్ చేసే అర్హత లేదు. అయితే వారి కుటుంబ వృత్తి అయిన బీడీ కార్ఖానా ముసుగులో స్కానింగ్ పరీక్షలు ప్రారంభించాడు. రోజూ బీడీల గంప పేరుతో జిల్లావ్యాప్తంగా పలు గ్రామాల్లో పర్యటించి గర్భిణీలకు లింగనిర్ధారణ పరీక్షలు చేస్తూ డబ్బులు దండుకుంటున్నాడు. చట్ట విరుద్ధంగా లింగ నిర్ధారణ చేస్తూ ఆడ, మగ శిశువు అని చెప్పి గర్భస్థ పిండాలను చిదిమేసేందుకు కారకుడయ్యాడు. కామారెడ్డి, గాంధారి, తాడ్వాయి, దోమకొండ, బీబీపేట, మాచారెడ్డి, సదాశివనగర్, ఎల్లారెడ్డి, బాన్సువాడ ఇలా చాలా మండలాలకు తన ద్విచక్ర వాహనంపై మినీ స్కానింగ్ యంత్రాన్ని తీసుకెళ్లి గర్భిణి ఇంటి వద్దనే లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నాడు.ఆడ పిల్లలుండి మగ పిల్లలు కావాలనుకునే వారి గురించి ఆరాతీస్తూ గుట్టుచప్పుడు కాకుండా రెండేళ్లుగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాడు. ఒక్కొక్కరి నుంచి రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నాడు. ఈ విషయమై ఫిర్యాదులు రావడంతో కామారెడ్డి సీసీఎస్ పోలీసులు బుధవారం అర్ధరాత్రి రవీందర్ ఇంటిపై దాడి చేసి అరెస్టు చేశారు. ఇంట్లో ఉన్న స్కానింగ్ యంత్రాన్ని స్వాధీనం చేసుకుని దేవునిపల్లి పోలీస్ స్టేషన్కు తరలించి విచారణ చేస్తున్నారు. -
జెండర్, లైంగిక సమస్యల పరిష్కారంలో థియేటర్ రోల్
వర్గం, మతం, జెండర్, లైంగిక సమస్యలను పరిష్కార దిశగా న్యూ ఢిల్లీలోని కిరణ్ నాడార్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ థియేటర్లో జరిగిన ఫెస్టివల్ నటీనటుల పెర్ఫార్మెన్స్ను సరికొత్తగా చూపింది. లైంగికతతో పాటు సామాజిక దుర్బలత్వాలను పరిష్కరించడంలో ఈ సమకాలీన థియేటర్ దృష్టి పెడుతుంది.ఫెస్టివల్ క్యూరేటర్గా ఉన్న బెంగళూరుకు చెందిన నటుడు, దర్శకుడు, చిత్రనిర్మాత కీర్తన కుమార్ కొత్త విషయాలను అన్వేషించే నాటకాలను ఒకచోట చేర్చాలని కోరుకున్నారు. అలాగే ‘ఈ రోజుల్లో కళాకారులు ఎలాంటి నాటకాలు వేస్తున్నారు’ అనే అంశం గురించి సంభాషణలను ప్రోత్సహించారు. ‘ఈసారి దృష్టి సమకాలీన థియేటర్పై ఉంది. ఎందుకంటే కళాకారులు ఏం చెబుతున్నారో తెలుసుకోవాలనే ఆసక్తితో ΄ాటు వారు ఏ రంగస్థల రూపాలు, భాషలను అన్వేషిస్తున్నారు, ఏ సమస్యలు వారిని ఉత్తేజపరుస్తాయి, ఎలా సృష్టిస్తారు, డబ్బు సమస్యలేంటి, వారి ప్రేరణ ఏమిటి, ఏం వ్యక్తం చేయాలనుకుంటున్నారు...అనేవి ఈ విధానం ద్వారా తెలుస్తుంది. అంతేకాదు జాతీయ దృష్టిని ఆకర్షించని కళాకారుల నాటకాలు, వారి ఆలోచనలు, రూపాలను ఆహ్వానించాలనుకుంటున్నాను’అని కీర్తన కుమార్ చెప్పింది.ఇతిహాసాల నుంచి...మైసూరు ప్రాంతాలకు సమీపంలో ఉన్న మలే మహదేశ్వర కొండలలోని హలు కురుబా కమ్యూనిటీ పురుషులతో అనుబంధించబడిన బీసు కంసలే అనే విన్యాస జానపద రూపంతో ఈ పండుగ ప్రారంభమైంది. దీని తర్వాత కటకథ పప్పెట్ ఆర్ట్స్ ట్రస్ట్ సమర్పించిన ది నైట్స్, అరేబియన్ నైట్స్ సిరియన్, చైనీస్, ఇండియన్ వెర్షన్లకు తోలుబొమ్మల గౌరవం, కీటకాలతో నిండిన అద్భుత ప్రపంచంలోకి ప్రేక్షకులను స్వాగతించింది. ఇంకా, రామాయణంలోని అరణ్యకాండ నుండి తీసుకున్న అడవిలో నివసించే సోదరులు, వాలి మరియు సుగ్రీవుల కథను పరిచయం చేసింది.మోహిత్ తకల్కర్ రాసిన ‘లవ్ అండ్ ఇన్ఫర్మేషన్ ఛానల్–హోపింగ్ / సోషల్ మీడియా స్క్రోలింగ్’ వేగాన్ని ప్రతిబింబిస్తుంది. అభి తాంబే ద్వారా పోర్టల్ పెయిటింగ్, థియేటర్లో రాక్ షో అనుభవం మనల్ని సమ్మోహితులను చేస్తాయి. నిషా అబ్దుల్లా సోలో ప్రదర్శన. ఇది పోగొట్టుకున్న, శాశ్వతమైన స్నేహాల గురించి మాట్లాడటానికి పాట, కథ, పురాణం, చరిత్రను కలిపి అల్లినది. -
చీర, గాజులా..?! తీరు మారదా? మాట వరుస మారదా?
ఇటీవల ఒక నాయకుడు మరో నాయకుడిని దూషించాడు. ఆ దూషణ మహిళలను కించపరిచే అర్థంలో సాగింది. అసమర్థతకు సమానార్థకంగా చీర, గాజులను ప్రస్తావించాడు. దూషణలో ఒక కులాన్ని ప్రస్తావిస్తే కేసు పెట్టడానికి చట్టాలున్నాయి. స్త్రీల గౌరవానికి భంగం కలిగే ఇలాంటి వ్యాఖ్యలకు గట్టి చట్టాలెక్కడ? సమాజంలో నెలకొని ఉన్న వివక్షపూరిత భావజాలానికి అడ్డకట్ట ఎప్పుడు? ఈక్వాలిటీ అంటే ఇదేనా? రాజ్యాంగం స్త్రీపురుషులిద్దరికీ సమానమైన గౌరవాలనే చెప్పింది. వివక్షకు తావులేని నిబంధనలున్నా వివక్ష తప్పలేదు. ఐక్యరాజ్య సమితి 1975 ఉమెన్స్ ఇయర్గా ప్రకటించి, అధ్యయనానికి కమిటీని వేసింది. ఆ కమిటీ 1977లో ‘టూవార్డ్స్ ఈక్వాలిటీ’ నివేదిక సమర్పించింది. మహిళల సంక్షేమం కోసం ఒక మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేశాం కదా, ఇంకా ఏం కావాలి అనే అభి్ర΄ాయంలో ఉన్న మన పాకుల కళ్లు తెరిపించింది ఆ నివేదిక. దీనికి కొనసాగింపుగా 1985 వరకు మహిళాభివృద్ధి కోసం పని చేయాలని కూడా సూచించింది ఐక్యరాజ్య సమితి. మహిళ సాధికారత సాధనలో ముందడుగు వేస్తున్న క్రమంలో 2001 సంవత్సరాన్ని ‘ఉమెన్స్ ఎంపవర్మెంట్ ఇయర్’గా ప్రకటించింది మన భారత ప్రభుత్వం. ఇన్ని జరుగుతున్నా సమాజం మాత్రం పితృస్వామ్య భావజాలం నుంచి బయటపడడం లేదు. ఒక మగవాడు సాటి మగవాడిని మాటలతో దాడి చేయాల్సి వచ్చినప్పుడు ‘చీర కట్టుకో, గాజులు వేసుకో’అంటున్నారు. ఎదుటి వ్యక్తి మీద అసమర్థత, అనైతికత ఆరోపణలు చేయడానికి స్త్రీత్వాన్ని ఆపాదించడం, స్త్రీల వస్త్రధారణతో గేలి చేయడం వంటి ప్రాక్టిస్ ఏ మాత్రం సరికాదు. ప్రజాజీవితంలోకి వచ్చే వాళ్లు ముందు దయచేసి రాజ్యాంగాన్ని చదవాలి. - ప్రొఫెసర్ తోట జ్యోతి రాణి (రిటైర్డ్), వరంగల్ మౌనంగా ఉంటే మరింత దిగజారుతుంది! ‘ఇక్కడెవరూ గాజులు తొడుక్కుని కూర్చోలేదు’ అనే మాట సమాజంలో వినిపిస్తూనే ఉంది. మగవాళ్ల నుంచే కాదు మహిళల నుంచి కూడా. ‘తాము అసమర్థులం కాదు, సమర్థులమే’ అని చెప్పుకోవడానికి మగవాళ్లు గాజులు, చీరలను మాట్లాడుతుంటారు. నిరక్షరాస్యుల్లో తరచూ వినిపిస్తుంటే చదువుకున్న వాళ్లలో అరుదుగా వినిపిస్తుంటుంది. అంతే తేడా. మరికొందరు ఎదుటి వారి మీద దుమ్మెత్తి పోయడానికి, అసమర్థుడివని దెప్పి పొడవడానికి, ‘నీకు చీర, గాజులు పంపిస్తా’ అనడాన్ని కూడా చూస్తున్నాం. మగవాళ్లు ఇలా అన్నప్పుడు ఆడవాళ్లు మౌనంగా ఉంటే ఆ మాటలను, వారి భావాన్ని, అభి్ర΄ాయాన్ని సమ్మతించి నట్లవుతుంది. అందుకే మహిళలు ప్రతిస్పందించాలి. మహిళ మౌనం వహిస్తే పరిస్థితి ఇంకా దిగజారే ప్రమాదం ఉంది. తప్పు చేసిన వాళ్లను ఒకప్పుడు గుండు గీయించి, సున్నం బొట్లు పెట్టి ఊరంతా తిప్పేవాళ్లు. ఇలా నోటి దురుసుగా మాట్లాడిన వాళ్ల వ్యాఖ్యలను ఖండించి, తగిన విధంగా తిప్పికొడుతూ ఉండాలి. అప్పుడే సమాజంలో తరతరాలుగా పాతుకు΄ోయిన ఇలాంటి మాటలకు అడ్డుకట్ట పడుతుంది. – ఎం. అమ్మాజీ, సీనియర్ జర్నలిస్ట్, విజయవాడ మాట వెనక్కి తీసుకోవాలి! ఇలాంటి మాటలు ఏ మాత్రం సమ్మతించదగినవి కావు. మగవాళ్లు ఒకరినొకరు తిట్టుకోవడానికి ‘... కొడకా’ అంటూ ఆడవాళ్లనే నిందిస్తారు. వాటి మీద మా తరమంతా పోరాడాం, పోరాడుతూనే ఉన్నాం. స్త్రీల కట్టు, బొట్టుతో గేలి చేయడమూ ఎక్కువైంది. ఒక మగవాడు మరో మగవాడిని అవహేళన చేయాలంటే స్త్రీలతో పోల్చడం, స్త్రీలలాగ వస్త్రధారణ చేసుకోమని గేలిచేయడం అంటే వాళ్ల దృష్టిలో చేతకానివాళ్లకు ప్రతీక స్త్రీలే అనే అభిప్రాయం స్థిరంగా ఉందని అర్థం. ఆ మాటలను వెనక్కి తీసుకోమని డిమాండ్ చేయాలి. మాట వెనక్కి తీసుకునే వరకు పోరాడాలి. ప్రొఫెసర్ గూడూరు మనోజ (రిటైర్డ్), హైదరాబాద్ ఇదీ చదవండి: వంటిట్లోని స్క్రబ్బర్, స్పాంజ్లతో ముప్పు : టాయిలెట్ కమోడ్కు మించి బ్యాక్టీరియా -
2036 కల్లా పెరగనున్న లింగ నిష్పత్తి
న్యూఢిల్లీ: భారత్లో లింగ నిష్పత్తి 2036 సంవత్సరాలికల్లా కొద్దిగా మెరుగుపడనుంది. ప్రతి వెయ్యి మంది పురుషులకు 952 మంది మహిళలు ఉంటారని గణాంక, ప్రణాళిక అమలు శాఖ సోమవారం విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. 2011లో మన దేశంలో లింగ నిష్పత్తి 1000: 943గా ఉంది. లింగ సమానత్వం దిశగా సానుకూల ధోరణిని ఇది సూచిస్తోందని నివేదిక పేర్కొంది. 2036 కల్లా భారత జనాభా 152.2 కోట్లకు చేరుకుంటుందని తెలిపింది. అదే సమయంలో జనాభాలో మహిళల శాతం స్వల్పంగా పెరిగి 48.8 శాతానికి చేరుకుంటుందని వివరించింది. 2011లో భారత జనాభాలో మహిళ శాతం 48.5 మాత్రమే కావడం గమనార్హం. 2011తో పోలిస్తే 2036లో పదిహేనేళ్ల లోపు వయసున్న వారి సంఖ్య తగ్గుతుందని, జననాలు తగ్గుముఖం పట్టడమే దీనికి కారణమని పేర్కొంది. మరోవైపు ఇదేకాలంలో 60 ఏళ్లు పైబడిన వృద్ధుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని తెలిపింది. -
ఒలింపిక్స్లో జెండర్ వివాదం : ఆమె మహిళే ఇదిగో సాక్ష్యం, వేధించకండి!
ప్యారిస్ ఒలింపిక్స్ మహిళల బాక్సింగ్ ఈవెంట్లో జెండర్ వివాదం చర్చకు దారి తీసింది. అల్జీరియా బాక్సర్ ఇమేని ఖాలిఫ్ (Imane Khalif)తో జరిగిన పోటీలో ‘‘ఆమె అస్సలు లేడీ బాక్సర్ కాదు’’ అంటూ ప్రత్యర్థి బాక్సర్, ఇటలీ బాక్సర్ ఏంజిలా కారిని బౌట్ నుంచి వైదొలగడంతో వివాదం రాజుకుంది. దీనిపై కొందరు ఇమేనికి మద్దతుగా పలుకుతుండగా, మరికొందరు ఏంజిలా కారినిగా సపోర్ట్గా నిలుస్తున్నారు. అయితే ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద ఇమేని ఖాలీఫ్కు మద్దతు పలికారు. ఈ మేరకు ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టారు.ఇటాలియన్ మహిళా బాక్సర్ ఏంజెలా కారినితో జరిగిన పోరాటంలో ‘బయోలాజికల్ మగ’ అని ఆరోపణల మధ్య అల్జీరియన్ బాక్సర్ ఇమానే ఖెలిఫ్ విజయం సాధించడంతో పారిస్ ఒలింపిక్స్ వివాదాస్పదమైంది. అయితే ఇమానే ఖలీఫ్ పుట్టుకతో అమ్మాయిగానే పుట్టింది. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న అల్జీరియాలో వారి లింగాన్ని మార్చుకునే హక్కు నిషేధం ఉంది అంటూ చిన్మయి చెప్పుకొచ్చారు. ఇలానే అమ్మాయిలా కనిపించడం లేదంటూ అద్భుతమైన క్రీడాకారిణి శాంతి సౌందర్రాజన్ను ఇండియాలో వేధించారు. ఇపుడు ఇమేనా ప్రపంచ వ్యాప్తంగా భయంకరమైన వేధింపులెదుర్కొంటోంది. ఆమె బావుండాలని ఆశిస్తున్నాను అంటూ చిన్నయి ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఇమానే చిన్నప్పటి ఫోటోను పోస్ట్ చేశారు.కాగా గురువారం జరిగిన మ్యాచ్లో కేవలం 46 సెకన్ల స్వల్ప వ్యవధలోనే ఆ మ్యాచ్ నుంచి తప్పుకుంటున్నట్లు కారిని ప్రకటించింది. తన ప్రాణాలను కాపాడుకునేందుకు తప్పదంటూ వైదొలగడం వివాదం రేపిన సంగతి తెలిసిందే. అటు అల్జీరియా ఒలింపిక్ కమిటీ కూడా బాక్సార్ ఇమేని ఖాలిఫ్కు మద్దతుగా నిలిచింది.Imane Khelif is BORN WOMAN. She is NOT a man. *The right to change their gender is illegal and banned in Algeria, the country she represents.*Indians have harassed and harangued Shanthi Soundarrajan, a brilliant sportswoman, just because she didn’t look the way they expect a… pic.twitter.com/JzYvTNgTVV— Chinmayi Sripaada (@Chinmayi) August 2, 2024 గతంలోనూ అల్జీరియా బాక్సర్ ఇమేని ఖాలిఫ్పై లింగ ఆరోపణలు వచ్చాయి. 2023 చాంపియన్షిప్ నుంచి డిస్క్వాలిఫై అయ్యింది. జెండర్ ఇష్యూ వల్లే ఆమెను ఆ క్రీడల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇమేనీకి డీఎన్ఏ టెస్టుల్లో ఆమెకు ఎక్స్వై క్రోమోజోమ్లు ఉన్నట్లు తేలినందని ఐబీఏ అధ్యక్షుడు ఉమర్ క్రమ్లేవ్ తెలిపారు. అయితే పారిస్ ఒలింపిక్స్లో అనుమతి లభించింది. ఖాలిఫ్ పాస్పోర్టుపై ఫిమేల్ అని రాసి ఉందని, అందుకే ఆమె మహిళల క్యాటగిరీలోని 66 కేజీల విభాగంలో అనుమతినిన్చినట్టు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రతినిధి మార్క్ ఆడమ్స్ తెలిపారు. ఐఓసీ నిర్ణయంపై కొంతమంది మాజీ మహిళా బాక్సర్లు మండిపడుతున్నారు. మరోవైపు కొన్ని దేశాలు తాను మెడల్ గెలవడాన్ని ఇష్టపడడం లేదని ఖాలిఫ్ ఆరోపించారు.దీనిపై అంతర్జాతీయ సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగుతోంది.🇮🇹🇩🇿 Angela Carini from Italy in blue realizes she doesn’t want to fight a man and pulls out mid fight against the trans from Algeria in red at the Olympics.The "fight" lasted less than a minute.Cruel pic.twitter.com/VMksyAAbsx— Lord Bebo (@MyLordBebo) August 1, 2024 -
‘థ్యాంక్యూ సర్’ అన్నందుకు విమానం నుంచి దించారు!
ఎవరైనా మిమ్మల్ని సర్..అనబోయి పొరపాటును మేడమ్ అన్నారంటే.. ఏం చేస్తారు? సర్లే.. ఏదో కంగారులో అని ఉంటారని అసలు ఆ విషయాన్నే పట్టించుకోరు కదా. కానీ ఇటీవల యునైటెడ్ ఎయిర్లైన్స్కు చెందిన విమానంలో మహిళా సిబ్బందిని పొరపాటున ‘సర్’ అన్నందుకు ఏకంగా విమానంలో నుంచే దించేశారు. దాంతో సదరు ప్రయాణికురాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.టెక్సాస్కు చెందిన జెన్నా లాంగోరియా తన కుమారుడు(16 నెలలు), తల్లితో కలిసి అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో నుంచి ఆస్టిన్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. విమానం ఎక్కే సమయంలో సిబ్బంది బోర్డింగ్ పాస్ను అందించారు. దాంతో మహిళా అటెండెంట్ను పొరపాటుగా పురుషునిగా భావించి ‘థాంక్యూ సర్’ అని తెలిపింది. వెంటనే ఆ అటెండెంట్ ఆగ్రహానికి గురైంది. జెన్నా తల్లిని, బిడ్డను లోనికి వెళ్లకుండా ఆపేసింది. అదే సమయంలో జెన్నా మరో మేల్ అటెండెంట్ సాయం కోరింది. తన తల్లి, కుమారుడిని గేట్ వద్ద మరో మేల్ అటెండెంట్ ఆపేశారని ఫిర్యాదు చేసింది. దాంతో ఆ సిబ్బంది.. మీరు ఫిర్యాదు చేయాలనుకున్న అటెండెంట్ ‘ఆయన’ కాదు ‘ఆమె’ అని బదులిచ్చారు. తన తప్పును తెలుసుకుని ఆ మహిళా సిబ్బందికి క్షమాపణలు చేప్పేందుకు ప్రయత్నించినా వినలేదు. అంతటితో ఆగకుండా విమానం నుంచి దింపేశారని సోషల్ మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.My 16-month old & I were denied entry on a @united flight back to Austin bc I used the wrong pronoun for the attendant. We have no luggage, nothing. we’re stranded in San Francisco. What are my rights? @elonmusk @jchilders98 pic.twitter.com/2b1rC14wg4— The Period Guru ® (@JennaLongoria) June 26, 2024 -
‘ఆడామగా సమానమే, కానీ పురుషుల్లో..’ సుధామూర్తి కీలక వ్యాఖ్యలు
ప్రముఖ రచయిత్రి, రాజ్యసభ ఎంపీ సుధామూర్తి లింగ సమానత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. జీవితం అనే బండికి చక్రల్లాంటివారు. జీవన యానం సాఫీగా సాగాలంటే ఇద్దరూ ఉండాలి.. తన దృష్టిలో స్త్రీపురుషులిద్దరూ సమానమే కానీ, వేర్వేరు మార్గాల్లో అన్నారు.లింగ సమానత్వం అంటే ఏమిటో వివరిస్తూ ఒక వీడియోను ఎక్స్లో షేర్ చేశారు. స్త్రీ, పురుషులు సైకిల్కి రెండు చక్రాల్లాంటివారు. వీరిలో ఎవరూ లేకపోయినా బండి ముందుకు సాగదు.. అని ఇన్ఫోసిస్ మాజీ చైర్పర్సన్ శ్రీమతి మూర్తి పేర్కొన్నారు.In my view, men and women are equal but in different ways. They complement each other like two wheels of a bicycle; you can't move forward without the other. pic.twitter.com/MMShEOtg9Q— Smt. Sudha Murty (@SmtSudhaMurty) June 27, 2024మహిళలు పురుషులు ఇద్దరూ ఒకరికొకరు భిన్నం. ఇద్దరిలోనూ ప్లస్, మైనస్లు ఉంటాయి. అయితే పురుషులతో పోలిస్తే మహిళలకు చాలా భాష తెలుసు. మేనేజ్మెంట్లో వారు చాలా అద్భుతం. పుట్టుకతోనే వారు మంచి మేనేజర్లు. ప్రేమ, జాలి కరుణ ఎక్కువ. అమ్మ, నాన్న, తోబుట్టువులు, అత్తమామలు, వదినలు, పిల్లలు ఇలా సన్నిహిత బంధువులు అందరికీ చక్కటి ప్రేమను పంచుతారు. మరోవైపు పురుషులు మహిళలంత భావోద్వేగులు కాదు. కొంచెం భిన్నం. పురుషుల్లో మంచి ఐక్యూ ఉండివచ్చు కానీ,మంచి ఈక్యూ (ఎమోషనల్ కోషెంట్) ఉండదని ఆమె అభిప్రాయపడ్డారు. -
పాఠ్యపుస్తకాల్లో లింగసమానత్వ చిత్రాలు
కొచ్చి: వంటగది అనగానే అమ్మ వండుతున్నట్లు చూపే ఫొటోలు పాఠ్యపుస్తకాల్లో ముద్రిస్తుంటారు. ఇలాంటి ధోరణికి చెల్లుచీటి ఇస్తూ కేరళ ప్రభుత్వం లింగసమానత్వ చిత్రాలకు పాఠశాల పాఠ్యపుస్తకాల్లో చోటు కలి్పంచింది. అమ్మ అంటే ఉద్యోగం చేయదని, ఇంట్లోనే ఉంటుందనే భావన బడిఈడు పిల్లల్లో నాటుకుపోకుండా ఉండేందుకు, సమానత్వాన్ని వారి మెదడులో పాదుకొల్పేందుకు కేరళ సర్కార్ కృషిచేస్తోంది. ఈ ప్రయత్నానికి ఉపాధ్యాయుల నుంచి మద్దతు లభిస్తోంది. మూడో తరగతి మలయాళం మాధ్యమం పాఠ్యపుస్తకం పేజీలను కేరళ సాధారణ విద్యాశాఖా మంత్రి వి.శివాన్కుట్టి సోషల్మీడియాలో షేర్చేశారు. తండ్రి వంటింట్లో కూర్చుని పచ్చి కొబ్బరి తురుము తీస్తున్నట్లు ఒక పేజీలో డ్రాయింగ్ ఉంది. తన కూతురు కోసం తండ్రి అల్పాహారం సిద్ధంచేస్తున్నట్లు మరో పేజీలో డ్రాయింగ్ ఉంది. ఇంటి పనిలో పురుషులు ఎంత బాధ్యతగా ఉండాలని ఈ చిత్రాలు చాటిచెబుతున్నాయని నెటిజన్లు మెచ్చుకున్నారు. -
Health: కడుపులోని బిడ్డ జాగ్రత్త!
కర్నాటక ప్రభుత్వం అల్ట్రాస్కానింగ్ గదిలోకి గర్భిణులతోపాటు వచ్చే అటెండర్స్ను నిషేధిస్తూ సర్క్యులర్ తెచ్చింది. ప్రతి తల్లి తన కడుపులో ఉన్న బిడ్డ ఆడపిల్లైనా మగపిల్లాడైనా కనడానికి సిద్ధంగా ఉంటుంది. కాని అటెండర్స్ రూపంలో వచ్చే అయినవాళ్లు అల్ట్రాస్కానింగ్ని వీడియో తీసి లింగ నిర్థారణ చేయిస్తున్నారు. తర్వాత అబార్షన్ చేయిస్తున్నారు. ఇలా ఎన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నదో. కర్నాటక మేలుకొంది. ఆ రాష్ట్రం తీసుకున్న మరిన్ని జాగ్రత్తలు..హర్యాణలోని జాట్ కుటుంబంలో యోగ్యుడైన వరునికి తగిన వధువు కోసం 3000 కిలోమీటర్ల దూరంలో కూడా వెతుకుతున్నారనే వార్తలు వస్తున్నా కానీ ఆడశిశువుల భ్రూణ హత్యల విషయంలో మనలో మార్పు రావడం లేదు. 2000 సంవత్సరం నుంచి 2019లోపు మన దేశంలో 90 లక్షల మంది ఆడపిల్లలు భ్రూణ హత్యల ద్వారా పుట్టకుండానే మరణించారని ఒక అధ్యయనం చెబుతోంది.2011 జనాభా లెక్కల ప్రకారం కశ్మీర్, హర్యాణ, మహారాష్ట్ర రాష్ట్రాలలో 120 మంది అబ్బాయిలకు 100 మంది అమ్మాయిలే ఉన్నారు. లెక్కలు ఇంత భయపెడుతున్నా నేటికీ ఒడిశా, కర్నాటక రాష్ట్రాలలో లింగ నిర్థారణ జరిపించి మరీ ఆడపిల్లలను ఛిద్రం చేస్తూనే ఉన్నారు. తాజాగా కర్నాటకలోని మాండ్య జిల్లాలో ఈ రాకెట్ ఒకటి బట్టబయలు కావడంతో ప్రభుత్వం మేల్కొని కొత్త నియమ నిబంధనలు తెచ్చింది.చట్టం ఉన్నా...ప్రీ కన్సెప్షన్ అండ్ ప్రీ నాటల్ డయగ్నొస్టిక్ టెక్నిక్స్ (పిసిపిఎన్డిటి) యాక్ట్ 1994 (లింగ నిర్థారణ నిషేధ చట్టం) కింద లింగ నిర్థారణ చేయించేవారికి గరిష్టంగా 5 సంవత్సరాల కారాగార శిక్ష, లక్ష రూపాయల జరిమానా ఉన్నా కొందరు ఎప్పటికప్పుడు దొంగదారులు కనిపెడుతూనే ఉన్నారు. ఇటీవల కర్నాటకలో లింగ నిర్థారణ నిషేధ చట్టం అమలులో భాగంగా రేడియాలిజిస్ట్లు, గైనకాలజిస్ట్లతో ఒక వర్క్షాప్ జరిగినప్పుడు వారు కొన్ని విషయాలు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు.– పేషెంట్లతోపాటు అటెండర్ల పేరుతో బంధువులు లోపలికి వస్తున్నారు.– అల్ట్రాసౌండ్ స్కానింగ్ను తమ మొబైల్ కెమెరాలలో బంధిస్తున్నారు.– సింగపూర్, థాయ్లాండ్, దుబాయ్ దేశాలలో లింగ నిర్థారణ నేరం కాదు.– కొందరు ఒక రాకెట్లాగా ఏర్పడి ఆ వీడియోలను ఈ దేశాలలోని వైద్యులకు పంపి లింగ నిర్థారణ చేయిస్తున్నారు. ఆ తర్వాత అబార్షన్లు చేయిస్తున్నారు.తాజాగా మాండ్యాలో ఇలాంటి రాకెట్ను పోలీసులు ఛేదించి పట్టుకున్నారు. ఇంకా విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కర్నాటక ప్రభుత్వం వెంటనే కొత్త సర్క్యులర్ జారీ చేసింది.ఇతరులు రాకూడదు..– అల్ట్రాసౌండ్ గదిలోకి గర్భిణితోపాటు ఇకపై అటెండర్లు రాకూడదు. వారికి ప్రవేశం లేదు.– గర్భిణి తన ఆల్ట్రాసౌండ్ పరీక్షను గమనించేలాగా గతంలో అడిషనల్ స్క్రీన్ గదిలో ఉంచేవారు. ఇకపై ఆ స్క్రీన్ ఉండదు. అంటే గర్భిణి తన అల్ట్రాసౌండ్ పరీక్షను చూడటానికి అనుమతి లేదు. ఎందుకంటే కొందరు రేడియాలజిస్ట్లు డబ్బుకు కక్కుర్తి పడి ఒక మాట గాని, చర్యగాని లేకుండా గర్భిణులకు అర్థమయ్యేలా పాయింటర్తో చూపుతున్నారు.ఆడపిల్లలు చదువులో అద్భుతంగా రాణిస్తున్నా, ఉపాధి అవకాశాలు పొందుతున్నా, క్రీడల్లో పతకాలతో మెరుస్తున్నా, రాజకీయ పదవులు పొందుతున్నా, ఉన్నతోద్యోగాలు చేస్తున్నా ఇంకా ‘కొడుకు’ కావాలనే కోరిక చాలామంది తల్లిదండ్రులను పీడిస్తోంది. ఆ భావజాలం నుంచి కొద్దిగా బయటడినా చాలామంది ఆడపిల్లలు బతికి΄ోతారు. బంగారు దేశాన్ని నిర్మిస్తారు.ఇవి చదవండి: Aditi Dugar: జీరో టు.. మ.. మ.. మాస్క్ వరకు! -
సైన్స్, టెక్నాలజీలో మహిళా గ్రాడ్యుయేట్లు పెరగాలి
న్యూఢిల్లీ: దేశీయంగా టెక్నాలజీ రంగంలో లింగ అసమానతలు గణనీయంగా ఉంటున్నాయని రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ ఈషా అంబానీ తెలిపారు. మహిళలంటే ఉపాధ్యాయ వృత్తిలాంటివి మాత్రమే చేయగలరంటూ స్థిరపడిపోయిన అభిప్రాయాలే ఇందుకు కారణమని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం దేశీయంగా టెక్నాలజీ రంగంలో మహిళల వాటా 36 శాతమే ఉండగా, స్టెమ్ గ్రాడ్యుయేట్స్లో 43 శాతం, మొత్తం సైంటిస్టులు, ఇంజినీర్లు, టెక్నాలజిస్టుల్లో 14 శాతం మాత్రమే ఉందని ఆమె చెప్పారు. ఈ నేపథ్యంలో సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్ విభాగాల్లో మహిళా గ్రాడ్యుయేట్ల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని ’ గాల్స్ ఇన్ ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) డే’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈషా తెలిపారు. నాలుగో పారిశ్రామిక విప్లవంలో పరిస్థితిని సరిదిద్దుకునే అవకాశాన్ని భారత్ అందిపుచ్చుకోవాలని ఆమె పేర్కొన్నారు. -
ట్రాన్స్జెండర్కు ఘోర అవమానం!
మహారాష్ట్రకు చెందిన తొలి మరాఠీ లింగమార్పిడి (ట్రాన్స్ జెండర్) నటి ప్రణీత్ హట్టే ఇటీవల తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. తాను ఒక హోటల్లో రూమ్ బుక్ చేశారని, అయితే తాను ట్రాన్స్ను అయినందున సదరు హోటల్ తన బుకింగ్ను రద్దు చేసిందని వాపోయారు. ఈ ఘటనపై తన ఆవేదనను ఆమె ఒక వీడియోలో పంచుకున్నారు.దానిలో ప్రణీత్ హట్టే మాట్లాడుతూ ‘నేను నాసిక్కు ఒక షోలో పాల్గొనేందుకు వచ్చాను. ఇక్కడ ఉండేందుకు ఓ హోటల్లో రూమ్ బుక్ చేశాను. అయితే నేను ట్రాన్స్జండర్ను అయినందున హోటల్ యజమానులు నా రూమ్ బుకింగ్ను రద్దు చేశారు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్లాలి?’ అని ప్రశ్నించారు. ఈ వీడియో చూసిన ప్రణీత్ హట్టే అభిమానులు ఆమెకు మద్దతుగా నిలిచారు. ఒక యూజర్ ‘నేను ఇప్పుడే ఫోన్ చేసి హోటల్వారితో మాట్లాడాను. వారు ఇప్పుడు ఖచ్చితంగా సిగ్గుపడివుంటారు’ అని రాశారు. మరో యూజర్ ‘మీరు దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేయాలి’ అని రాశారు.ప్రణీత్ హట్టే మరాఠీ నటి. ఆమె మరాఠీ చిత్రం ‘కరభారి లయభరి’లో గంగ పాత్రలో నటించి, మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నవాజుద్దీన్ సిద్ధిఖీ చిత్రం ‘హడ్డీ’లో కూడా ప్రణీత్ కనిపించారు. -
వనిత ప్రగతి పరుగు?!
"ఆడాళ్ళు మీకు జోహార్లు .. ఓపిక,ఒద్దిక మీ పేర్లు- మీరు ఒకరి కంటే ఒకరు గొప్పోళ్ళు.." - ఆచార్య ఆత్రేయ. అది అక్షరాలా నిజం. 'క్షమయా ధరిత్రి' అన్న ఆర్యోక్తికి మరోరూపం ఇచ్చారు ఆచార్యులవారు. ప్రతి రంగంలోనూ ఒకరిని మించి మరొకరు దూసుకెళ్తునే ఉన్నారు. ముళ్ళపూడి వెంకటరమణ ఇలా చమత్కరించారు. "ఆడవాళ్లు - మగవాళ్లు ఇద్దరూ సమానమే,కాకపోతే మగవాళ్ళు కాస్త ఎక్కువ సమానం". ముళ్ళపూడివారి మాటలు కూడా నిజాన్ని ప్రతిబింబించేవే. 'ఆకాశంలో సగం' అనే మాట వినడానికి అందంగానే ఉంటుంది కానీ, ఆచరణలో అన్నింటా ఆడవాళ్లకు సగభాగం దొరుకుతోందన్నది అర్ధసత్యం. ఇప్పటికీ ప్రపంచంలో స్త్రీ ఎక్కువ గౌరవాలు పొందుతున్నది మన భరతభూమిలో అన్నది కాదనలేని నిజం. కొంత ఛాందసాలు, చాదస్తాలు రాజ్యమేలుతున్నా, మన వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థలు మనల్ని మిగిలినవారి కంటే భిన్నంగా నిలుపుతున్నాయి. బంధాలు, బాంధవ్యాల వీచికలు ఇంకా వీస్తూనే ఉన్నాయి. ప్రతి మార్చి 8వ తేదీ 'అంతర్జాతీయ మహిళా దినోత్సవం' జరుపుకోవడంతోనే సరిపోదు. నిజమైన పండుగ వారి గుండె గుడిలో నిండుగ ఉదయించాలి. ఈ వేడుకను ఒకొక్క దేశంలో ఒకొక్క రకంగా జరుపుకుంటున్నారు. ప్రపంచ దేశాల్లో ఈ ఉత్సవాలు ప్రారంభం కాకమునుపే అమ్మను అమ్మవారుగా నిత్యం కొలిచే ఆచారం మనకు వేళ్లూనుకొని వుంది.అదే సమయంలో కష్టాలు,కన్నీళ్లు,బానిసత్వం, అణగదొక్కే విధానం,ఆచారాల పేరిట అసమానతలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఆధునిక సమాజంలోనూ ఆటవిక పోకళ్ళు వదలడం లేదు.'నిర్భయ' చట్టాల వంటివి ఎన్ని వచ్చినా,ఆడపిల్లలు నిర్భయంగా తిరిగే రోజులు ఇంకా రాలేదు. అక్షరాస్యత పెరుగుతున్నా,అరాచకాలు ఆగడంలేదు.ఉద్యోగిత పెరుగుతున్నా సమానత ఇంకా సాధ్యమవ్వలేదు. ఓటు హక్కు వచ్చినా,చట్ట సభల్లో మహిళలు ఇంకా ఆమడ దూరంగానే ఉన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం లభించినా, ఆచరణకు ఏళ్ళుపూళ్ళు పట్టేలా వుంది. శాసనాలు చేసే అధికారం రావాలంటే ఇంకా చాన్నాళ్ళు ఆగాల్సిందే.అప్పటిదాకా శాసించే శక్తి మగవాళ్ల దగ్గరే వుంటుంది. ప్రజాస్వామ్యం,రాజ్యాంగం అందించిన అవకాశాలతో మహిళామణులు రాష్ట్రపతి , స్పీకర్ వంటి అత్యున్నత పదవులను అందుకున్నా, అది సరిపోదు.సమత, సమతుల్యత ఇంకా సాధించాల్సి వుంది. ఇంకొక వైపు వరకట్నపు చావులు, అత్తారింటి వేదింపులు ఆగకుండా సాగుతూనే ఉన్నాయి. 'స్త్రీలకు స్త్రీలే శత్రువులు' అన్నది ఇంకా వీడడం లేదు. లింగవివక్ష నుంచి పూర్తిగా బయటపడే తరుణం కోసం తరుణులంతా ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆర్ధిక స్వేచ్ఛ,సమానత్వం కోసం ఎదురుతెన్నులు కాస్తూనే ఉన్నారు.కార్మిక సంఘాలు ఏర్పడినా,చట్టాలు వచ్చినా మహిళా కార్మికులు,కర్షకుల వేతనాల చెల్లింపుల్లో అన్యాయం జరుగుతూనే ఉంది.1991లో భారతదేశం సరళీకరణ ఆర్ధిక విధానాల వల్ల ప్రైవేట్ రంగం ఎంతో బలపడింది.ఉద్యోగ అవకాశాలు మెరుగుపడ్డాయి కానీ, ఎంపిక ప్రక్రియలో అసమానత అలాగే ఉంది.సాఫ్ట్ వేర్ రంగం మాత్రం కాస్త నయం.అమ్మాయిలను తరలించే (విమెన్ ట్రాఫికింగ్) విషవ్యాపారం,బాలికలపై అత్యాచారాలు యదేచ్ఛగా సాగుతూనే ఉన్నాయి. గ్రామీణ మహిళా సాధికారత ఎంతో పెరగాల్సి ఉంది. పేదరిక విముక్తి, ఆకలి నిర్మూలనకు ముగింపు వాక్యాలు పలకాల్సి ఉంది. 'పని సంస్కృతి' (వర్క్ కల్చర్ ) మారుతున్న క్రమంలో ఎదురవుతున్న ఇబ్బందులకు తగినట్లుగా సౌకర్యాలు పెరగాలి. 100 సంవత్సరాల పై నుంచీ 100 దేశాలకు పైగా 'అంతర్జాతీయ మహిళా దినోత్సవం' జరుపుకుంటున్నాయి. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నినాదాన్ని వినిపిస్తున్నారు. అవి నినాదాల దశ దాటి ఆచరణ దశకు చేరుకోవడం లేదు. కొంత అభివృద్ధి, ప్రగతి చోటుచేసుకున్నప్పటికీ సమగ్రత,సంపూర్ణత సాధించాల్సి ఉంది. 'లింగ సమానత్వం సాధించడం' 2022 సంవత్సరంలో ఎజెండాగా పెట్టుకున్నారు. ఈ డిజిటల్ యుగంలో, 'నవీనత్వం - సాంకేతికతలో లింగ వివక్షలేని సమానత్వం' 2023 ఎజెండాగా కల్పన చేసుకున్నారు. ' ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్ - యాక్సలరేట్ ప్రోగ్రెస్ '- 2024 ఎజెండాగా పెట్టుకున్నారు. మహిళా సాధికారితను సాధించడానికి ఇంకెన్నాళ్లు పోరాడాలి? అనుకున్నది జరగాలి, ఈ పోరాటం ఆగాలి అన్నది మహిళాలోకం కోరుకుంటున్నది. మహిళా ప్రగతి వేగం పెరగాలని ఈ ఏటి ప్రధాన ఎజెండా. వినడానికి ఎజెండాలు ఎప్పుడూ బాగానే వుంటాయి. ఆచరణలో ఎక్కడ? అనే ప్రశ్నలు ఉదయించడం మానడంలేదు. మరోపక్క...స్త్రీలు అబల దశ నుంచి సబల దశకు చేరుకుంటూనే ఉన్నారు.అనేక రంగాల్లో పురుషులతో పోటీ పడుతున్నారు. కొన్ని రంగాల్లో మించి పోతున్నారు. ఇది పూర్తిగా మహిళామణుల స్వయంకృషి,పట్టుదల, దీక్షాదక్షతలు మాత్రమే. అందివచ్చిన ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ఎదుగుతున్నారు. సవాళ్లు, దాడులు ఎదుర్కొని నిలుస్తున్నారు.కాకపోతే, సమానత్వంలో సమగ్రత సాధించాలి. మహిళాలోకం వెలగాలి, వెలుగులు పంచాలి (అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సీనియర్ జర్నలిస్టు మా శర్మ స్పెషల్ స్టోరీ..) - మాశర్మ, సీనియర్ జర్నలిస్టు -
మహిళా దినోత్సవం: మహిళల ప్రాతినిథ్యం ఎలా ఉంది?
ప్రతి ఏడాది మార్చి 8 అనంగానే మహిళల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుని ఆయా రంగాల్లో ముందంజలో ఉన్న మహిళల గురించి మాట్లాడటం వంటివి చేస్తాం. మహిళలు అందిపుచ్చుకోవాల్సిన వాటి గురించి చర్చిడం వంటివి కూడా చేస్తాం. పైగా భారత్ లింగ సమానత్వ సూచీలో మెరుగుపడిందని సంబరపడిపోతాం. అయినప్పటికీ ఇంకా చాల చోట్ల మహిళలు కొన్ని అంశాల్లో వెనుకంజలోనే ఉన్నారని వివక్షను ఎదుర్కొంటున్నారని పలు నివేదికలు చెబుతున్నాయి. ఇంతకీ మహిళల ప్రాతినిధ్యం ఎలా ఉంది?. వారి స్థితి మెరుగు పడిందా? అనే విషయాల గురించి ఈ దినోత్సవం సందర్భంగా కూలంకషంగా తెలుసుకుందామా!. ప్రపంచ ఆర్థిక వేదిక ( వరల్డ్ ఎకనామిక్ ఫోరం ) 2023 సంవత్సరానికి వెలువరించిన 146 దేశాల లింగ సమానత్వ సూచీలో భారతదేశం 0.643 స్కోర్తో 127వ స్థానంలో నిలిచింది. 2022 సంవత్సరం కంటే ఎనిమిది స్థానాలు పైకి ఎగబాకింది. అన్ని రంగాల్లో లింగ భేదాన్ని తొలగించడంలో భారతదేశం 64.3% ముందంజ వేసినా, పురుషుల ఆర్థిక భాగస్వామ్యంలో, ఆర్థిక అవకాశాల్లో 36.7% సాఫల్యాన్ని మాత్రమే సాధించిందని వివరించింది. 146 దేశాల లింగ సమానత్వ సూచీలో ఐస్లాండ్ వరుసగా 14వ సారి అగ్రస్థానానంలో ఉంది. పొరుగు దేశం బంగ్లాదేశ్ 59వ స్థానంతో మెరుగైన ఫలితాన్ని సాధించింది. అయితే భారత్ లింగ సమానత్వంలో బెటర్గా ఉన్నా.. కొన్ని విషయాలను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ఏయో వాటిలో మెరుగవ్వాల్సి ఉందంటే.. మహిళల విద్య!: భారతదేశంలో మహిళా విద్య అనేది దాదాపు దశాబ్ద కాలంగా ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించే అంశంగా ఉంది. ఎందుకంటే ఈ విషయంలో భారత్ భాగా వెనుకబడి ఉండటమే. పురుషులతో సమానంగా చదువుకునేందుకు మహిళలకు హక్కులు ఉన్నా తరతరాలుగా వేన్నేళ్లుకు పోయిన భావనల కారణంగా పురుషులే అత్యధికంగా విద్యావంతులుగా ఉంటున్నారు. ఇప్పటకీ అక్షరాస్యతలో 2021 నాటి లెక్కల ప్రకారం.. స్త్రీల అక్షరాస్యత రేటు 70.3% కాగా, పురుషుల అక్షరాస్యత రేటు 84.7%గా ఉంది. సామాజిక ఒత్తిళ్లు, పేదరికం, బాల్య వివాహాలు తదితర కారణాల కారణంగా నిర్భంధ విద్యహక్కుకు దూరమవ్వుతున్నారని చెప్పొచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకునే గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలను ప్రవేశపెట్టి విద్యనందించే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే పలు కార్యక్రమాలతో మహిళా సాధికారత కోసం ఆర్థిక సహాయం, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, స్కాలర్షిప్లు వంటివి అందిస్తున్నాయి కూడా. అయినప్పటికి పలుచోట్ల బాలికలు విద్యకు దూరమవుతుండటం బాధకరం ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉందంటే.. ప్రపంచవ్యాప్తంగా పురుషుల అక్షరాస్యత రేటు 90% ఉండగా, స్త్రీలు 82.7%తో కొంచెం వెనుకబడి ఉన్నారు. దేశాల పరంగా చూస్తే..అభివృద్ధి చెందిన దేశాలు సాధారణంగా వయోజన అక్షరాస్యత రేటు 96% లేదా అంతకంటే ఎక్కువ. దీనికి విరుద్ధంగా, తక్కువ అభివృద్ధి చెందిన దేశాల్లో సగటు అక్షరాస్యత రేటు 65% మాత్రమే ఉండటం గమనార్హం. ఏ దేశాలు మెరుగ్గా ఉన్నాయంటే.. రష్యా, పోలాండ్, ఉక్రెయిన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, క్యూబా, అజర్బైజాన్, తజికిస్తాన్, బెలారస్ మరియు కిర్గిజ్స్థాన్లు స్త్రీ పురుషుల అక్షరాస్యత రేటు 100% కలిగి ఉన్నాయి. తక్కువగా ఉన్న దేశాలు: చాద్, మాలి, బుర్కినా ఫాసో, దక్షిణ సూడాన్, ఆఫ్ఘనిస్తాన్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, నైజర్, సోమాలియా, గినియా, బెనిన్ వంటి దేశాలు ఈ విషయంలో పలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఈ దేశాల్లో అక్షరాస్యత రేటు 27% నుంచి 47% వరకు ఉంది. వ్యత్యాసం ఎలా ఉందంటే.. ప్రపంచవ్యాప్తంగా సుమారు 781 మిలియన్ల పెద్దలలో మూడింట రెండు వంతుల మంది స్త్రీలు చదవడం లేదా వ్రాయడం రాని ఉన్నారు. తక్కువ-అభివృద్ధి చెందిన దేశాల్లో అయితే పురుషులు ఉద్యోగాలు చేస్తుండగా, మహిళలు వంటింటికి పరిమితమవ్వుతున్నారు. మహిళా అక్షరాస్యత రేటు ఎక్కువగా ఉన్న దేశాలు: తైవాన్ 99.99% మహిళా అక్షరాస్యత రేటుతో ముందంజలో ఉండగా, 99.98%తో ఎస్టోనియా తర్వాత స్థానంలో ఉంది. ఇక ఇటలీ మూడో స్థానంలో ఉంది. స్త్రీలు అక్షరాస్యతలో మెరుగుపడితే, ఆర్థికపరంగా, ఉద్యోగాల్లోనూ మెరుగ్గా ఉండే అవకాశం ఉంటుంది. అప్పుడే లింగ సమానత్వానికి సరైన నిర్వచనం ఇవ్వగలం. ఈ మహిళల అక్షరాస్యతలో అసమానతను పరిష్కరించడం అనేది అత్యంత కీలకమైనది. ఇదే స్త్రీలను శక్తిమంతంగా మార్చి సాధికారతవైపుకి అడుగులు వేయించి దేశాన్ని ప్రగతి పథంలోకి దూసుకుపోయేలా చేస్తుంది. (చదవండి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఈ ఏడాది ప్రత్యేకత ఏంటి?) -
South Korea: మాతృత్వానికి దూరం.. దూరం!
ఆమె పేరు యెజిన్. టీవీ యాంకర్. ఓ సాయం వేళ స్నేహితురాళ్లతో సరదాగా గడుపుతుండగా మొబైల్లో ఓ పాపులర్ మీమ్ ప్రత్యక్షమైంది. ‘మాలా మీరూ అంతరించిపోకముందే జాగ్రత్త పడండి’ అని ఓ కార్టూన్ డైనోసార్ హితబోధ చేయడం దాని సారాంశం. దాంతో వారందరి మొహాల్లోనూ విషాద వీచికలు. 30 ఏళ్లు దాటుతున్నా వారెవరికీ ఇంకా పిల్లల్లేరు మరి! వారే కాదు, లో చాలామంది మాతృత్వానికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంటున్నారు. అక్కడి సమాజంలోని సంక్లిష్టతే ఇందుకు ప్రధాన కారణం...! దక్షిణ కొరియా చాలా ముందుంది. దాంతో ఆడవాళ్లలో అత్యధికులు ఉద్యోగులే. ఇంటిపట్టున ఉండేవారు చాలా తక్కువ. అయితే అక్కడ ఏ రంగంలోనైనా పని ఒత్తిళ్లు విపరీతంగా ఉంటాయి. సుదీర్ఘ పనిగంటలు. పైగా తరచూ ఓవర్ టైమ్ చేయడం తప్పనిసరి. నిరాకరిస్తే ఆ ప్రభావం ప్రమోషన్లతో పాటు చాలారకాలుగా పడుతుంది. దాంతో విపరీతంగా అలసిపోయి ఇంటికొచ్చే భర్తలు పిల్లల బాధ్యతలను అస్సలు పంచుకోరు. పైగా వేతనాలతో పాటు చాలా అంశాల్లో మితిమీరిన. దీనికి తోడు దాల్ చేసేలా కంపెనీలు ఒత్తిడి చేయడం సర్వసాధారణం. దాంతో పిల్లల్ని కనే క్రమంలో కెరీర్ ఒకసారి వెనకబడితే తిరిగి కోలుకోవడం చాలా కష్టం. అదీగాక దక్షిణ కొరియాలో జీవన వ్యయం చాలా ఎక్కువ. ఒక్కరి సంపాదనతో ఇల్లు గడవడం కష్టం. ఇన్ని ప్రతికూలతల మధ్య పిల్లల్ని కని, సజావుగా పెంచేందుకు కావాల్సిన సమయం, ఓపిక, కుటుంబ మద్దతు మహిళలకు ఏ మాత్రమూ ఉండటం లేదు. పిల్లలు, కెరీర్లో ఏదో ఒక్కదాన్నే ఎంచుకోక తప్పని అనివార్య పరిస్థితి. అత్యధికులు రెండో ఆప్షన్కే ఓటేస్తున్నారు. అలా మొత్తంగా మాతృత్వానికే దూరమవుతున్నారు! అట్టడుగుకు జననాల రేటు ప్రపంచవ్యాప్తంగా సంపన్న దేశాలన్నింట్లోనూ చాలాకాలంగా జనాభా క్రమంగా తగ్గుతూ వస్తోంది. కానీ దక్షిణ కొరియాలో ఈ ధోరణి మరీ ప్రమాదకరంగా ఉంది. నిజానికి అతి తక్కువ జననాల రేటు విషయంలో 20 ఏళ్లుగా ఆ దేశానిదే ప్రపంచ రికార్డు! పైగా అది ఏటికేడు మరింతగా తగ్గుతూ వస్తోంది. తాజాగా బుధవారం విడుదలైన గణాంకాలైతే ప్రమాద ఘంటికలే మోగిస్తున్నాయి. 2023లో అక్కడ జననాల రేటు (ఒక మహిళ జీవిత కాలంలో కనే పిల్లల సంఖ్య) 8 శాతం తగ్గి కేవలం 0.73గా నమోదైంది. ఇదిలాగే కొనసాగితే 2100 నాటికి దేశ జనాభా సగానికి సగం తగ్గిపోనుంది. దాంతో ఈ పరిణామాన్ని జాతీయ ఎమర్జెన్సీగా ప్రభుత్వం ప్రకటించింది! ఫలించని ప్రోత్సాహకాలు... పిల్లల్ని కనేలా జనాలను ప్రోత్సహించేందుకు దక్షిణ కొరియాలో ప్రభుత్వాలు చేయని ప్రయత్నాల్లేవు. నగదు ప్రోత్సాహకం, ఇంటి కొనుగోలుపై సబ్సిడీ, పిల్లలను చూసుకునేందుకు ఉచితంగా ఆయా సదుపాయం వంటివెన్ని ప్రకటించినా లాభముండటం లేదు. మహిళలు ఎదుర్కొంటున్న అసలు సమస్యలను పరిష్కరించనంత కాలం ఇటువంటి పథకాలు ఎన్ని తెచ్చినా ఒరిగేదేమీ ఉండబోదని సామాజికవేత్తలు అంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Nishtha Satyam: సత్య నిష్ఠతో...
వివక్ష అనేది ఎక్కడో ఉండదు. మన చుట్టూనే పొంచి ఉంటుంది. అలాంటి వివక్షను సూక్ష్మస్థాయిలో విశ్లేషిస్తోంది నిష్ఠా సత్యం. స్త్రీ సాధికారతకు సంబంధించిన కార్యక్రమాలపై నిష్ఠగా పనిచేస్తోంది... బాలీవుడ్ సినిమా ‘మొహ్రా’లోని ‘తూ చీజ్ బడీ హై మస్త్ మస్త్’ పాట యువ గళాల్లో ఎక్కువగా వినిపిస్తున్న కాలం అది. అందరిలాగే తాను కూడా ఆ పాట హమ్ చేస్తోంది నిష్ఠ. ఆమె తండ్రికి విపరీతమైన కోపం వచ్చి ‘నువ్వు ఎలాంటి పాట పాడుతున్నావో తెలుసా’ అంటు తిట్టాడు. చిన్నపాటి పనిష్మెంట్ కూడా ఇచ్చాడు. ‘సరదాగా రెండు లైన్లు పాడినందుకు ఇంత రాద్ధాంతమా?’ అనుకుంది నిష్ఠ. ఒకవేళ ఈ పాట అబ్బాయి పాడి ఉంటే ఇలాగే జరిగి ఉండేదా? ‘జరగదు’ అని బలంగా చెప్పవచ్చు. ఈ సంఘటన ఒక్కటే కాదు పెద్ద కంపెనీలలో పనిచేస్తున్న కాలంలోనూ లింగవివక్షను ఎదుర్కొంది నిష్ఠ. మల్టీనేషనల్ కంపెనీ కేపీఎమ్జీ, అమెరికన్ ఎక్స్ప్రెస్లలో ఎకానమిస్ట్గా పనిచేసిన నిష్ఠా సత్యం ఐక్యరాజ్య సమితిలోకి అడుగు పెట్టింది. ఐక్యరాజ్యసమితిలో పాట్నర్షిప్ అడ్వైజర్గా ప్రయాణం మొదలు పెట్టిన నిష్ఠ డిప్యూటీ హెడ్ హోదాలో పనిచేసింది. ఆ తరువాత యూఎన్ ఉమెన్ మిషన్ హెడ్– తిమోర్–లెస్తే బాధ్యతలు చేపట్టింది. ‘రెండు విధాలుగా మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని విశ్లేషించాలి. ఒకటి డిఫాల్ట్ సెట్టింగ్ రెండోది డిజైన్ సెట్టింగ్. డిజైన్ సెట్టింగ్ అనేది పురుషుల నుంచి వచ్చింది. వారికి అనుకూలమైనది’ అంటుంది నిష్ఠ. స్మార్ట్ ఫోన్ల సైజ్ నుంచి పీపీయీ కిట్స్ వరకు మార్కెట్లో ఉన్న ఎన్నో వస్తువుల డిజైన్లు మహిళలకు అనుకూలంగా లేకపోవడంలోని వివక్షను ప్రశ్నిస్తుంది నిష్ఠ. ‘సాంస్కృతిక సందర్భాలు వివిధ మార్గాలలో మహిళలను శక్తిమంతం చేస్తాయి. సాధికారతకు సంబంధించి మన ఆలోచనలను వారిపై బలవంతంగా రుద్దడంలో అర్థం లేదని తిమోర్–లెస్తే మహిళల నుంచి నేర్చుకున్నాను’ అంటుంది నిష్ఠా సత్యం. -
అబ్బాయిగా మారిన లేడి కానిస్టేబుల్.. తండ్రిగా ప్రమోషన్
మహారాష్ట్రకు చెందిన మహిళా కానిస్టేబుల్. ఎన్నో కష్టాలు పడి మగవాడిలా మారింది. కుటుంబాన్ని, సమాజాన్ని ఎదురించి పురుషుడిగా సర్జరీ చేయించుకుంది. తర్వాత కొన్నాళ్లకు ఓ యుతిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఆ జంట బిడ్డకు జన్మనివ్వడంతో.. కానిస్టేబుల్ తండ్రిగా ప్రమోషన్ పొందాడు. వివరాలు.. బీద్ జిల్లా రాజేగాన్ గ్రామానికి చెందిన లలితా సాల్వే(35) కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తోంది. 25 ఏళ్ల వయసులో (2013) తన శరీరంలో మార్పులు రావడాన్ని గమనించింది. ఆసుప్రతికి వెళ్లి వైద్యపరీక్షలు చేయించుకోగా.. ఆమెలో మగవారిలో ఉండే వై క్రోమోజోమ్లు ఉన్నట్లు తేలింది. (ఆడవారిలో రెండు ఎక్స్ క్రోమోజోములు మాత్రమే ఉంటాయి). జెండర్ డిస్ఫోరియాతో బాధపడుతున్న ఆమెకు లింగ మార్పిడి సర్జరీ చేయించుకోవాలని డాక్టర్లు సూచించారు. ఈ క్రమంలో లలితా సాల్వే 2017లో బాంబే హైకోర్టును ఆశ్రయించింది. లింగమార్పిడి సర్జరీ కోసం నెల రోజులు సెలవు కోరింది. బాంబే హైకోర్టుతోపాటు 2018లో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా అనుమతివ్వడంతో లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకుంది. 2018 నుంచి 2020 వరకు మూడు సర్జరీల ద్వారా పురుషుడిగా మారింది. దీంతో లలితా నుంచి తన పేరును లలిత్ కుమార్ సాల్వేగా మార్చుకుంది. అనంతరం 2020లో ఛత్రపతి శంభాజీనగర్కు (ఔరంగాబాద్) చెందిన సీమాను పెళ్లి చేసుకొని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. వివాహమైన నాలుగేళ్ల తర్వాత జనవరి 15న ఆ జంటకు బాబు పుట్టాడు. చదవండి: Video: అకస్మాత్తుగా కూలిన అయిదు అంతస్తుల భవనం లలిత్ సాల్వే మాట్లాడుతూ.. స్త్రీ నుంచి పురుషుడిగా మారిన తన ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. అనేక పోరాటాలు చేసి చివరికి తన జెండర్ మార్చుకునట్లు తెలిపారు. ఈ ప్రయాణంలో తనకు మద్దతుగా నిలిచిన అందరికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. -
టెక్కీ దారుణ హత్య.. హద్దుల్లేని ప్రేమ పరిణామాలు ఇలాగే ఉంటాయా?
చెన్నై శివారులోని తాలంబూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగి నందినిని స్నేహితురాలు మహేశ్వరి అలియాస్ వెట్రిమారన్ దారుణంగా హత్య చేయడం సంచలనం సృష్టించింది. నందినిని ప్రేమించిన మహేశ్వరి ఆరునెలల కిందటే అబ్బాయిగా మారి వెట్రిమారన్గా పేరు మార్చుకుంది. తన కోసమే లింగమార్పిడి చేసుకున్న తనను నందిని దూరంగా పెడుతుందన్న కోపంతో హత్య చేసి మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టాడు. స్నేహితుడు లేదా స్నేహితురాలి కోసం లింగమార్పిడి చేసుకున్న తర్వాత తనను పట్టించుకోకపోవడం, వేరొకరితో సన్నిహతంగా ఉండటంతో దాడులు చేసిన ఘటనలు గతంలోనూ వార్తల్లో కనిపించాయి. ఈ నేపథ్యంలో లింగమార్పిడి చుట్టూ ఉన్న సామాజిక సంక్లిష్టతల గురించి, ట్రాన్స్ జెండర్స్ పట్ల సమాజం చూపించే తిరస్కరణ గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అసలు కొందరు వ్యక్తులు జెండర్ ఐడెంటిటీలో ఎందుకు గందరగోళ పడతారనేది సంక్లిష్టమైన ప్రశ్న. దీనికి ఖచ్చితమైన సమాధానం లేదు. జెండర్ ఐడెంటిటీకి జీన్స్ కు మధ్య సంబంధాలను అనేక అధ్యయనాలు గుర్తించాయి. అయితే నిర్దిష్టంగా ఏ జీన్స్ కారణమనే దానిపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. మరోవైపు చిన్ననాటి అనుభవాలు, సామాజిక, సాంస్కృతిక ప్రభావాలు ఒక వ్యక్తి జెండర్ ఐడెంటిటీకి దోహదపడతాయి. అంటే ఒక వ్యక్తి ట్రాన్స్ జెండర్గా మారడమనేది వారి ఎంచుకున్నది కాదనేది గుర్తించాలి. ప్రతి ఒక్కరూ ‘మగ’ లేదా ‘ఆడ’ వర్గాల్లోనే కాకుండా మధ్యలో కూడా ఉండవచ్చు. వారి జెండర్ ఐడెంటిటీని గుర్తించడం, వారు గౌరవంగా జీవించడానికి సహకరించడం అవసరం. అలా జరగనప్పుడు, ఆ గుర్తింపు గౌరవం దొరకనప్పుడు తీవ్రంగా గందరగోళ పడతారు. మానసిక సమస్యలకు లోనవుతారు. తమ సమస్యలకు కారణమైన వారిపై దాడికి కూడా పాల్పడవచ్చు. ఒక వ్యక్తికి ఐడెంటిటీ అనేది ఎంత ముఖ్యమో తెలుసుకుంటే జెండర్ ఐడెంటిటీ ప్రాధాన్యం తెలుస్తుంది. ఉదాహరణకు నా పేరు విశేష్. నేను Psy.Vishesh అని రాస్తా. అంటే సైకాలజిస్ట్ గా నా ప్రొఫెషన్ తో ఐడెంటిఫై చేసుకుంటున్నా. నన్ను అలా పిలిస్తేనే నాకు ఇష్టం, మరోలా పిలిస్తే కష్టంగా ఉంటుంది. పేరు విషయంలోనూ ఇంత ఖచ్చితంగా ఉన్నప్పుడు.. బాలికగా పుట్టిన వ్యక్తిలో పురుష భావనలు ఉంటే మనసులో ఎంత కన్ఫ్యూజన్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు అలాంటి భావనలను సమాజమే కాదు కుటుంబం కూడా ఒప్పుకోదు. అలాంటి పరిస్థితుల్లో తనను పురుషుడిగా అంగీకరించిన స్నేహితురాలు దొరికితే అంతకంటే ఆనందం ఉండదు. ఆ స్నేహితురాలిని, ఆ స్నేహాన్ని శాశ్వతంగా తనది చేసుకోవాలనుకుంటారు. పురుషుడిగా మారితే నందిని తనను అంగీకరిస్తుందనే, పెళ్లిచేసుకుంటుందనే ఆశతో లేదా అపోహతో మహేశ్వరి లింగమార్పిడి చేయించుకుని వెట్రిమారన్గా మారింది. కానీ నందిని దూరంగా ఉంచడం మారన్ మనసులో కల్లోలం రేపి ఉండవచ్చు. తనకోసం, తన ప్రేమ కోసం, తనతో జీవితం గడపడంకోసం లింగమార్పిడి సైతం చేయించుకున్నా దూరంగా పెట్టడంతో నందినిపై కోపం ఏర్పడి ఉండవచ్చు. ఆ కోసం హద్దులు దాటి నందిని హత్యకు దారితీసి ఉండవచ్చు. కోరుకున్నది దక్కనప్పుడు అందరూ ఒకేరీతిలో స్పందించరు. కొందరు తీవ్ర డిప్రెషన్కు లోనైతే, మరికొందరు ఫ్రస్ట్రషన్, అగ్రెషన్ కు లోనవుతారు. కారణమైన వ్యక్తిపై ద్వేషం పెంచుకుంటారు. అప్పటికే జెండర్ ఐడెంటిటీ సమస్యలో ఉన్నవారిలో ఇలాంటి పరిస్థితులు మరింత తీవ్ర భావోద్వేగాలకు కారణమవుతాయి. అప్పటికే సమాజం నుంచి తిరస్కరణ ఎదుర్కొంటున్న వ్యక్తి మనసులో ప్రేమించిన వ్యక్తి తిరస్కరణ మరింత బలమైన గాయాలు చేస్తుంది. ఆ నేపథ్యంలోనే ఇలాంటి హింసాత్మక ప్రవర్తనలు కనిపిస్తుంటాయి. నందిని హత్య నిస్సందేహంగా బాధాకరం. అయితే ఆ నేపథ్యంలో ట్రాన్స్ జెండర్స్ పట్ల సమాజం పోకడను మనం సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. జెండర్ ఐడెంటిటీ అనేది ఏ ఒక్కరి ఎంపిక కాదని, కొందరిలో అది భిన్నంగా ఉంటుందని అర్థం చేసుకోవాలి. ఆడ, మగలతో పాటు ట్రాన్స్ జెండర్స్కు కూడా గౌరవంగా జీవించే హక్కు ఉందని గుర్తించాలి. వారి సమస్యలను సహానుభూతితో అర్థం చేసుకోవాలి. అవసరమైన సందర్భాల్లో కౌన్సెలింగ్ లేదా సైకోథెరపీ ద్వారా వారి సమస్యల పరిష్కారానికి వీలైన సహాయ సహకారాలు అందించాలి. అప్పుడే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకునే అవకాశాలు తగ్గుతాయని అందరం అర్థం చేసుకోవాలి. సైకాలజిస్ట్ విశేష్ psy.vishesh@gmail.com 8019 000066 -
ఇంకా లింగ వివక్ష: సీజేఐ
బెంగళూరు: ప్రాంతీయ భేదాలకు అతీతంగా చాలా కుటుంబాల్లో నేటికీ లింగ వివక్ష సూక్ష్మ రూపంలో కొనసాగుతూనే ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ఆవేదన వెలిబుచ్చారు. పైగా వాటిని ఎవరూ ప్రశ్నించరాదన్న ధోరణి కూడా గూడుకట్టుకుని పోయిందని ఆక్షేపించారు. ‘‘ఎవరు ఔనన్నా, కాదన్నా చేదు నిజం మాత్రం ఇదే. పైగా న్యాయస్థానాలు వ్యక్తిగత స్వేచ్ఛ కంటే వివాహ వ్యవస్థను నిలబెట్టడానికే ప్రాధాన్యతనిస్తూ రావడం ద్వారా దీనికి కొంతవరకు పరోక్షంగా ఆమోదముద్ర వేశాయి’’ అని అభిప్రాయపడ్డారు. ఆదివారం బెంగళూరులో ఆయన జస్టిస్ ఈఎస్ వెంకటరామయ్య శతాబ్ది స్మారక ప్రసంగం చేశారు. సంతానంలో ఒకరికి మించి పై చదువులు చదివించలేకపోతే అత్యధిక కుటుంబాల్లో ఆ అవకాశం కచి్చతంగా మగ సంతానానికే దక్కుతుంది. స్త్రీకి ఉండే ఆంక్షలు, ఒత్తిళ్లు మగవాడికి ఉండవన్నది కూడా వాస్తవం’’ అని సీజేఐ అన్నారు. -
భారత్లోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సమస్య ఇదే
పురుషుల మాదిరిగానే మహిళలు కూడా ప్రజా సదుపాయాలకు అర్హులని ఐఏఎస్ అధికారి శరణ్య అరి పేర్కొన్నారు. స్మిళిత పట్టణ ప్రణాళిక భారతదేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సమస్య అని లింగసమానత్వంతోనే ఇది సాధ్యమవుతుందన్నారు. తాజాగా హైదరాబాద్లోని పార్క్ హయాత్ హోటల్లో జరిగిన TEDx (టెక్నాలజీ ఎంటర్టైన్మెంట్ అండ్ డిజైన్) కార్యక్రమంలో ఆమె ఈ సందర్భంగా మాట్లాడారు. సమ్మిళిత పట్టణ ప్రణాళిక భారతీయ సమస్య మాత్రమే కాదు, ఇది ప్రపంచ సమస్య. మహిళలు పని కోసం 5 నుంచి 8 కి.మీల వరకు నడకను ఎంచుకుంటారు. చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ ప్రజా సౌకర్యాలు మహిళలకు ఉపయోగకరంగా ఉండవు. వియన్నాలో 90 శాతం కార్యాలయాలు మహిళలకు అనుకూలంగా రూపొందించబడ్డాయి. పురుషుల మాదిరిగానే స్త్రీలు కూడా సరైన రకమైన ప్రజా సదుపాయాలకు అర్హులు కాదా?అభివృద్ధిలో మహిళలను కూడా భాగస్వాములను చేయండి. బహిరంగ ప్రదేశాల్లో భద్రత లింగ సమానత్వాన్ని పెంపొందించడం ద్వారా మహిళల అవకాశాలను మెరుగుపర్చవచ్చు అంటూ ఆమె పేర్కొన్నారు. ఇక తన కెరీర్లో గత 15 ఏళ్లుగా అంగవైకల్యం ఉన్న ప్రత్యేక వ్యక్తులను తన సిబ్బందిని నియమించుకుంటూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు సస్టైనబిలిటీ/ఇఎస్జి ఇనిషియేటివ్స్ లీడర్ ఆరాధన. మాజంలోని మహిళలు, అంగవైకల్యం ఉన్నవారు..ఇలా అందరిని కలుపుకొని పోవడం తనకెంతో సంతోషాన్ని ఇస్తుందని, ఇది సంస్థలకు కూడా మేలు చేస్తుందని ఆమె తెలిపింది. సామాజిక ప్రయోజన సంస్థల్లో కేవలం 19% మహిళలు మాత్రమే నాయకత్వం వహిస్తున్నారని, పురుషులకు సమానంగా మహిళలకు కూడా అవకావాలు కల్పించాలని ఆమె తెలిపింది. -
ఆలోచన రేపుతున్న ఎంపిక
ఏటా ఇచ్చే పురస్కారాలు సైతం విజేతల ఎంపిక, వారు చేసిన కృషి రీత్యా విశిష్టంగా నిలుస్తాయి. రాయల్ స్వీడిష్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ ఈ ఏడాదికి గాను ఇప్పటి దాకా ప్రకటించిన పురస్కారాల్లో కొన్ని అలాంటివే! స్వెరిజెస్ రిక్స్బ్యాంక్ ప్రైజ్ అనే పేరు కన్నా ఆల్ఫ్రెడ్ నోబెల్ స్మారకార్థం ఇచ్చే ‘నోబెల్ పురస్కారం’గానే ప్రసిద్ధమైన ఈ గౌరవం దక్కిన ఇద్దరు మహిళల గురించి ఇప్పుడు ప్రపంచమంతా ఆసక్తి కనబరుస్తోంది. మహిళా శ్రామికశక్తిపై విస్తృత పరిశోధన జరిపిన ఆర్థిక శాస్త్రవేత్త క్లాడియా గోల్డిన్కు అర్థశాస్త్రంలో నోబెల్ ప్రైజ్, అలాగే ఇరాన్లో జైలులో మగ్గుతున్న మానవ హక్కుల ఉద్యమకారిణి నర్గిస్ మొహమ్మదీకి నోబెల్ శాంతి బహుమతి దక్కడం వారు దీర్ఘకాలంగా చేస్తున్న కృషికి అతి పెద్ద అంతర్జాతీయ గుర్తింపు. ఈ ఇద్దరి ఎంపిక వేతనాల్లో స్త్రీ పురుష వ్యత్యాసం మొదలు లింగ సమానత్వం దాకా అనేక అంశాలపై మరోసారి చర్చ రేపుతోంది. గోల్డిన్ కృషికి అర్థశాస్త్రంలో నోబెల్ పురస్కారం దక్కడం బాగున్నా, అందులోనూ వైచిత్రి ఉంది. ఆమె నాలుగు దశాబ్దాల కృషి అంతా శ్రామిక విపణుల్లో మహిళలు, లింగ సమానత్వం గురించి! విచిత్రం ఏమిటంటే 1969లో అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతిని స్థాపించినప్పటి నుంచి నిన్నటి వరకు ఆ పురస్కారం దక్కింది ఇద్దరంటే ఇద్దరు మహిళలకే! అదీ వేరేవాళ్ళతో కలసి! ఆ గౌరవం దక్కిన మూడో మహిళ గోల్డినే! పైగా, ఒక మహిళకు ఒంటరిగా అర్థశాస్త్రంలో నోబెల్ దక్కడమూ ఇదే ప్రప్రథమం. నోబెల్ బహుమతుల్లో లింగ అసమానత్వంపై విమర్శలు వస్తున్న వేళ లేబర్ మార్కెట్లో మహిళా విజయం లోతుపాతులు విశ్లేషించిన గోల్డిన్కు ఈ గౌరవం దక్కడం గమనార్హం. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసరైన గోల్డిన్ అమెరికాలోని శ్రామిక విపణినీ, అలాగే వేతనాల్లో లింగ అసమానత్వానికి కారణాలనూ నాలుగు దశాబ్దాలుగా లోతుగా అధ్యయనం చేస్తూ వచ్చారు. 200 ఏళ్ళ అమెరికా చరిత్రను లోతుగా విశ్లేషిస్తూ, చారిత్రకంగా స్త్రీ పురుషుల ఆదాయాల్లో తేడాకు ప్రధానంగా చదువు, వివిధ రకాల ఉద్యోగాలే కారణమని తేల్చారు. వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుంచి పారిశ్రామిక ఆధారిత వ్యవస్థ వైపు దేశం మారడంతో శ్రామిక విపణిలో వివాహిత స్త్రీల భాగస్వామ్యం పడిపోయిందనేది ఆమె అధ్యయన సారం. ఆ తర్వాత 20వ శతాబ్దంలో సర్వీసుల పరిశ్రమ వృద్ధి చెందడంతో, మరింత విద్యావంతులైన మహిళలు రంగంలోకి వచ్చారు. గర్భనిరోధక విధానాల లాంటివి ఆరోగ్యరంగంలో వ్యాప్తిలోకి వచ్చాయి. తత్ఫలితంగా, శ్రామికశక్తి లోకి మహిళలు మళ్ళీ ప్రవేశించారు. కానీ, అప్పటికే తలెత్తిన అంతరం మాత్రం పూడిపోలేదు. ముఖ్యంగా, తొలిచూలుతో ఈ తేడా తలెత్తుతోందని గోల్డిన్ పరిశోధన. ఇక, మరణశిక్షకు వ్యతిరేకంగా గళం విప్పినందుకూ, దేశంలో మహిళలకు సైతం సమాన హక్కులు ఉండాలని కోరినందుకూ ఇరాన్లో కటకటాలు లెక్కపెడుతున్న నర్గిస్ పోరాటం మరో పెద్ద కథ. ఇప్పటికి ఆమె 13 సార్లు అరెస్టయి, అయిదుసార్లు దోషిగా తీర్మానమై, 31 ఏళ్ళ జైలుశిక్షను ఎదుర్కొంటోంది. 2022 నాటి డబ్యూఈఎఫ్ గ్లోబల్ జెండర్ గ్యాప్ నివేదికలో అట్టడుగున అఫ్గానిస్తాన్, పాకిస్తాన్లతో పాటు నిలిచిన దేశంగా ఇరాన్ పేరుమోసింది. అలాంటి దేశాల్లో నర్గిస్ లాంటి మహిళలు కడకు తమ ఉనికిని కాపాడుకొనేందుకు సైతం పోరాడాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అటు క్లాడియా గోల్డిన్ అధ్యయనానికీ, ఇటు నర్గిస్ మొహమ్మదీ అలుపెరుగని పోరాటానికీ నోబెల్ గుర్తింపు రావడం ఆనందదాయకం. సరిగ్గా గోల్డిన్కు నోబెల్ ప్రకటించిననాడే మన దేశంలో వార్షిక ‘పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే‘ (పీఎల్ఎఫ్ఎస్) విడుదలైంది. గత 2022 జూలై నుంచి ఈ 2023 జూన్కి సంబంధించిన ఈ సర్వే శ్రమజీవుల్లో మహిళల సంఖ్య మునుపటి కన్నా కొద్దిగా పెరిగిందని పేర్కొంది. అయితే, అది సహజ మైన పెరుగుదల కాక కరోనా తర్వాత కుటుంబ ఆదాయాలు దెబ్బతినడంతో తప్పని పరిస్థితుల్లో వచ్చిన పాలపొంగు అని విశ్లేషకుల అభిప్రాయం. వెరసి, లోతుగా గమనిస్తే భారత్లోనూ మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం రేటు ఇవాళ్టికీ తక్కువగానే ఉందన్నది విచారకరమైన వాస్తవం. ఇది మారాలంటే... అర్థవంతమైన ఉపాధి, అదే సమయంలో మహిళా శ్రామికశక్తి భాగస్వామ్యం పెరి గేలా విధాన నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత మన ప్రభుత్వాలది. అందుకు ప్రొఫెసర్ గోల్డిన్ అధ్యయనం నుంచి భారతదేశం సైతం పాఠాలు నేర్వాలి. ఏ దేశమైనా సరే ఆర్థిక పురోగతి సాధించినంత మాత్రాన శ్రామిక విపణిలో లింగ వ్యత్యాసం దానంతట అది తగ్గిపోదని గోల్డిన్ నిరూపించారు. అలాగే, సామాజిక, వ్యవస్థాపరమైన అవ రోధాలు ఉన్నంత కాలం కేవలం స్త్రీ విద్య సైతం శ్రామికశక్తిలో లింగ అంతరాల్ని తగ్గించలేదు. సాంప్రదాయిక సమాజాల్లో పిల్లల పెంపకమూ ఓ కీలకాంశం. విధాన నిర్ణేతలు వీటిని దృష్టిలో ఉంచుకోవాలి. లింగ కోణం నుంచి అర్థశాస్త్ర అధ్యయనం ప్రధాన స్రవంతిలో భాగం కాదన్న భావనల్ని గోల్డిన్ బద్దలుకొట్టారు. అమెరికా నుంచి ఇరాన్ దాకా ప్రపంచంలో ప్రతి చోటా ఇవాళ్టికీ ఆడవారి పరిస్థితి ఒకేలా ఉంది. ఇవాళ పురుషుల్లో నూటికి 80 మంది ఉద్యోగాల్లో ఉంటే, ప్రపంచ మహిళా జనాభాలో కేవలం సగం మందే వేతన ఉపాధి పొందుతున్నారు. అదీ మగవాళ్ళ కన్నా తక్కువ వేతనాలకే పనిచేస్తూ, వృత్తిలో ఉన్నత శిఖరాల అధిరోహణకు అవకాశాలూ తక్కువే. అందుకే, లింగ సమానత్వ సాధనలో ప్రపంచం ప్రయాణించాల్సిన దూరం ఇంకా ఎంతో ఉంది. ఆ దిశలో నోబెల్ విజేతలైన గోల్డిన్ అధ్యయనం, నర్గిస్ పోరాటం మనకు తాజా మార్గదర్శకాలు. -
Women : ఆడబిడ్డల ఆంధ్రా!
సాక్షి, అమరావతి: దేశంలో, రాష్ట్రంలో జననాల్లో బాలికల సంఖ్య పెరుగుతోంది. 2014–15 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. దేశంలో ప్రతి వెయ్యి మంది బాలురకు 2022–23లో బాలికల నిష్పత్తి 15కు పెరగ్గా, రాష్ట్రంలో 24కు పెరిగింది. దేశం మొత్తంతోపాటు చాలా రాష్ట్రాల్లో గతంలో కన్నా జననాల్లో బాలికల నిష్పత్తి పెరుగుతోందని, ఇది శుభపరిణామమని కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే బిహార్తో పాటు మిజోరాం, నాగాలాండ్లలో గతం కన్నా బాలికల నిష్పత్తి తగ్గడం ఆందోళన కలిగిస్తోందని తెలిపింది. బేటీ బచావో బేటీ పఢావో పథకం ద్వారా బాలికలు, మహిళా సాధికారతకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో కలిసి ప్రయత్నాలు చేస్తున్నట్టు కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ పథకం కింద జనన సమయంలో లింగ నిర్ధారణను గుర్తించే చర్యలను ప్రభుత్వం నిలుపుదల చేసిందని, ఆడపిల్లల జననాల పట్ల అవగాహన పెంచేందుకు చర్యలు చేపట్టిందని తెలిపింది. ఆడపిల్లల అభివృద్ధికి ప్రోత్సాహం ఆడపిల్లల విద్య, పెరుగుదల, అభివృద్ధి, హక్కులకు మద్దతుగా సానుకూల చర్యలను ప్రోత్సహించడానికి అన్ని స్థాయిల్లో ప్రయత్నాలు చేస్తున్నట్టు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ వెల్లడించింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు తగిన మార్గదర్శకాలతో కూడిన కార్యాచరణ క్యాలెండర్ జారీ అయినట్లు తెలిపింది. దానిని జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు పేర్కొంది. లింగ నిష్పత్తి తగ్గకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసినట్టు తెలిపింది. -
భారతదేశ న్యాయవ్యవస్థలో లింగ సమానత్వానికి నాంది!
భారతీయ సమాజంలోని వివిధ రంగాలలో సమాన హక్కులు అంతుచిక్కని లక్ష్యం. న్యాయవ్యవస్థలో కూడా ఇదే ధోరణి. భారతీయ న్యాయ వ్యవస్థలోని మహిళల ప్రాతినిధ్యాన్ని నిశితంగా పరిశీలిస్తే, మగవారి ఆడవారి మధ్యలో ఉన్న అసమానత్వం స్పష్టమైన చిత్రాన్ని చిత్రీకరిస్తుంది. పైగా ఇందులో మార్పు అత్యంత అవసరం అనే విషయాన్ని నొక్కి చెబుతుంది. అత్యున్నత న్యాయస్థానంలో 36 మంది న్యాయమూర్తులలో కేవలం ముగ్గురు మాత్రమే మహిళలు. ఈ అసమానత అత్యున్నత న్యాయస్థానానికి మాత్రమే పరిమితం కాదు. ఇది హైకోర్టుల వరకు వ్యాపించింది, ఇక్కడ వెయ్యి మంది న్యాయమూర్తులలో కేవలం 96 మంది మహిళలు మాత్రమే ఉన్నారు. జిల్లా న్యాయవ్యవస్థలో కూడా పరిస్థితి మెరుగుపడలేదు. 3.3 లక్షల మంది న్యాయమూర్తులకు న్యాయ అధికారులలో కేవలం 6% మంది మహిళలు ఉన్నారు. భారతదేశంలోని విస్తృత చట్టపరమైన ల్యాండ్స్కేప్లో 15% కంటే తక్కువ మంది మహిళలు న్యాయవాదులు ఉన్నారు. ఈ నిరుత్సాహపరిచే అసమానతకు దోహదపడే కారకాలు చాల ఉన్నాయి. అవి చాలా లోతుగా పాతుకుపోయాయి. ఇప్పటికి సామాజిక పక్షపాతాలు, నిబంధనలు న్యాయవాద వృత్తిని కొనసాగించకుండా మహిళలను నిరుత్సాహపరుస్తున్నాయి. దానితో పాటు చట్టపరమైన విద్య కూడా చాల తక్కువ అవకాశాలు ఉంటున్నాయి. న్యాయవాద వృత్తిలో ఆదాయం చాలా మారవచ్చు. ఇది న్యాయమూర్తులు కావాలనుకునే మహిళా న్యాయవాదులకు కష్టతరం చేస్తుంది. న్యాయనిర్ణేతగా మారడం వారికి కష్టంగా ఉంటుంది. ఇలా చాల సవాళ్లు ఉన్నాయి. కానీ దాంతో పాటు ఆశ కూడా మిగిలి ఉంది. మాజీ, ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తులు కోర్టులలో చాల సార్లు మహిళలకు పదోన్నతులు కల్పించారు. ఇలాంటి పరిస్థితిలో చట్టపరమైన రంగంలో లింగ సమానత్వం కోసం ప్రయత్నాలు మరింత ముఖ్యమైనవిగా ఉండాలి. మెరుగైన మహిళా ప్రాతినిధ్యానికి స్థిరమైన లక్ష్యం, విధానం అవసరం. ఈ మొదటి అడుగు ప్రశంసనీయమే కానీ నిజమైన సమానత్వం కోసం ప్రతి ఒక్కరి కృషి అవసరం. న్యాయవ్యవస్థ, ప్రభుత్వం, పౌర సమాజం అందరు కలిసి పనిచేయాలి. ఇటీవలే, అస్సాం, జమ్మూ కాశ్మీర్లో మహిళా కమిటీని ఏర్పాటు చేయడం వంటి చర్యలు చూసి, కోర్టులు మహిళా న్యాయానికి కట్టుబడి ఉన్నాయని చూపిస్తున్నాయి. ఇలాంటి చర్యలు సమాన హక్కులు గూర్చి లోతైన కారణాలపై పోరాడటానికి న్యాయస్థానాలు తమ బాధ్యతను అంగీకరిస్తాయని చూపిస్తుంది. కొంతకాలం క్రితం, భారతదేశ సుప్రీంకోర్టు ఒక ముఖ్యమైన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆగస్ట్ 7న మణిపూర్లో హింసాత్మక పరిస్థితి గురించి ప్రకటన చేసారు. ఈ సమస్యను పరిశీలించడానికి ముగ్గురు న్యాయమూర్తుల బృందానికి చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నాయకత్వం వహించారు. ఇది ఒక కొలిక్కి రావాలంటే ఈ తరహా సహాయం ఆయన చేయాలనీ సుప్రీంకోర్టు గ్రహించింది. కాబట్టి, వారు సహాయం చేయడానికి మొత్తం మహిళల కమిటీని రూపొందించడానికి తమ ప్రణాళికను పంచుకున్నారు. ఈ ఏర్పడిన కమిటీలో ఉన్నత న్యాయస్థానాల నుంచి ముగ్గురు ప్రముఖ మాజీ న్యాయమూర్తులు ఉంటారు. జమ్మూ కాశ్మీర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ గీతా మిట్టల్ కమిటీకి నాయకత్వం వహిస్తారు. ఇతర కమిటీ సభ్యులు జస్టిస్ షాలినీ ఫన్సల్కర్ జోషి (బాంబే హైకోర్టు నుంచి పదవీ విరమణ చేసారు), జస్టిస్ ఆశా మీనన్ (గతంలో ఢిల్లీ హైకోర్టు నుండి పనిచేశారు). సహాయక చర్యలను పర్యవేక్షించడం, ప్రార్థనా స్థలాలు, గృహాలను పునరుద్ధరించడం, సహాయక చర్యలను మెరుగుపరచడం తోపాటు మరిన్ని బాధ్యతలు కమిటీకి ఉంటాయి. మే నుంచి జులై వరకు జరిగిన హింసాత్మక సంఘటనల గురించి పరిశోధన చేయడానికి ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి దత్తాత్రయ్ పద్సాల్గికర్ను నాయకత్వం వహించడానికి ఎంపిక చేసారు. పద్సల్గికర్ ఎన్ఐఏ, ఇంటెలిజెన్స్ బ్యూరో, నాగాలాండ్లో పనిచేశాడు. ఈ కేసుల కోసం మణిపూర్లో 6500 పైగా ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. కానీ, న్యాయవ్యవస్థలో లింగ సమానత్వాన్ని సాధించడానికి సమయం పడుతుంది. మహిళలకు మాత్రమే న్యాయస్థానాలను సృష్టించడం, మహిళలపై హింసకు వ్యతిరేకంగా పోరాడడం తదితరాలు సానుకూల అభివృద్ధి. కానీ, నిజమైన పురోగతికి మరిన్ని మార్పులు అవసరం. న్యాయవాద వృత్తిలో మహిళలకు మరింత అధికారం ఇవ్వడం ముఖ్యం. చట్టంలో మహిళలపై అన్యాయమైన నమ్మకాలను తొలగించడం చాలా కీలకం. మహిళలు ఎదగడానికి చాలా అవకాశాలు ఉన్నాయని నిర్ధారించుకోవడం కూడా చాలా ముఖ్యం. ఈ మార్పుల కోసం నిరంతర శ్రద్ధ, కృషి అవసరం. ఇలాంటి కార్యక్రమాలతో మనం స్థిరంగా కొనసాగితే, న్యాయవ్యవస్థలో మహిళలు తమ స్థానాలను సక్రమంగా చేపట్టేందుకు చాల గొప్ప అవకాశం ఉంటుంది. దీని వల్ల న్యాయ వ్యవస్థలో మహిళలకు పెద్ద పాత్ర ఉంటుంది. వైవిధ్యమైన న్యాయ వ్యవస్థ బలంగా, న్యాయంగా ఉండవచ్చు. భారతదేశ న్యాయ వ్యవస్థలో స్త్రీలను, పురుషులను సమానంగా చూడటం ముఖ్యం. మనమందరం మహిళల అభిప్రాయాన్ని ఎక్కువగా వినడానికి, చూడటానికి సహాయం చేస్తే, పరిస్థితులు మారవచ్చు. పురుషులు, మహిళలు ఒకే విధంగా పరిగణించే భవిష్యత్తును సృష్టించడానికి ప్రయాస పడాలి. -డాక్టర్ శ్రీదేవి రెడ్డి గాధే, సీనియర్ హైకోర్టు అడ్వకేట్(అభిజ్ఞా భారత్ ఆర్గనైజేషన్ ఫౌండర్) -
తీర్పుల్లో మహిళల పట్ల అనుచిత పదాలు వాడొద్దు
ఢిల్లీ: న్యాయస్థానాల్లో కేసుల విచారణ, తీర్పులు వెల్లడించే సమయంలో మహిళలపై వివక్షకు తావు లేకుండా కీలక ముందడుగు పడింది, వేశ్య, పతిత, ఎఫైర్, హౌస్వైఫ్, ట్రాన్సెక్సువల్, వ్యభిచారం వంటి పదాలు ఇక ఉపయోగించకూడదని సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు నిర్దేశించింది. ఈ మేరకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ బుధవారం ఒక హ్యాండ్బుక్ను విడుదల చేశారు. ‘‘హ్యాండ్బుక్ ఆన్ కంబాటింగ్ జెండర్ స్టీరియో టైప్స్’’ పేరుతో ఉన్న ఈ హ్యాండ్బుక్లో న్యాయస్థానాలు గతంలో ఇచి్చన తీర్పుల సమయంలో మహిళల పట్ల అనుచితంగా ఉండే 100కి పైగా పదాలు అందులో ఉన్నాయి. ఆ పదాలకు బదులుగా ఏం వాడాలో కూడా అందులో వివరంగా రాశారు. రెచ్చగొట్టే దుస్తులు, పెళ్లి కాకుండానే తల్లి, ఎఫైర్, వేశ్య వంటి పదప్రయోగాలకు చేయకూడదని, వాటికి బదులుగా దుస్తులు, తల్లి, వివాహేతరం సంబంధం, సెక్స్ వర్కర్ అని మాత్రమే రాయాలని ఆ హ్యాండ్బుక్ స్పష్టంగా చెబుతోంది. ఈవ్టీజింగ్ బదులుగా స్ట్రీట్ సెక్యువల్ హెరాజ్మెంట్, హౌస్వైఫ్ బదులుగా హోమ్మేకర్ అన్న పదాలు వాడాలని నిర్దేశించింది. మూస పదాలు వద్దు ఈ హ్యాండ్బుక్ విడుదల చేసిన సందర్భంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ మాట్లాడుతూ న్యాయ ప్రక్రియల్లో మహిళలపై మూస పద్ధతుల్లో ఎలాంటి పదాలు ఉపయోగిస్తారో ఈ పుస్తం చెబుతుందని అన్నారు. ‘‘తీర్పులు రాసే సమయంలో న్యాయమూర్తులు మహిళల పట్ల అనాలోచితంగా అనుచిత పదాలు వాడుతున్నారు. మూసపద్ధతుల్లో ఉండే పద ప్రయోగాలు చేస్తున్నారు. గతంలో వచ్చిన తీర్పుల్ని విమర్శించడం ఉద్దేశం కాదు. భవిష్యత్లో న్యాయమూర్తులు ఆ పదాలు ఉపయోగించకుండా ఈ హ్యాండ్బుక్ ఉపయోగపడుతుంది. ఏ పదాలకు గుర్తింపు ఉందో స్పష్టంగా తెలుస్తుంది. భవిష్యత్లు ఇచ్చే తీర్పుల్లో న్యాయమూర్తులు సరైన పదాలు వాడితే వారిచ్చే తీర్పులపై అపోహలకు కూడా తావుండదు’’ అని జస్టిస్ చంద్రచూడ్ వివరించారు. ఇదీ చదవండి: ఢిల్లీ చట్టంపై అసెంబ్లీ స్పెషల్ సెషన్..ఎల్జీ అభ్యంతరం -
టీ తోట నుంచి చైతన్యం
పోష్ (ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ సెక్సువల్ హెరాస్మెంట్) యాక్ట్ 2013 ప్రకారం వ్యవస్థీకృతమైన రంగాల్లో మహిళల పట్ల లైంగిక వేధింపులను నివారించడానికి ఇంటర్నల్ సెల్ ఏర్పాటు చేయడం జరుగుతోంది. కానీ అసంఘటిత రంగాల్లో పని చేసే మహిళలకు ఇలాంటి ఒక చట్టం ఉందనే సంగతి కూడా తెలియదు. ఇలాంటి స్థితిలో అస్సాంలోని టీ తోటల్లో పని చేసే మహిళలు సంఘటితమై తమ హక్కును కాపాడుకోవడానికి ఉద్యమించారు. ఒకరికొకరు అండగా మనదేశంలో వ్యవసాయరంగం తర్వాత మహిళలు అతిపెద్ద సంఖ్యలో పని చేస్తున్నది టీ తోటల్లోనే. ఈ తోటల్లో పని చేసే కార్మికుల్లో ఎనభైశాతం మహిళలే. అస్సాం, వెస్ట్బెంగాల్, కేరళ, తమిళనాడులన్నీ కలిపి దేశంలో 350కి పైగా టీ తోటలున్నాయి. దాదాపుగా ఒక్కో తోటలో వెయ్యికి పైగా మహిళలు పనిచేస్తుంటారు. దేశవ్యాప్తంగా మూడు లక్షల అరవైవేలకు పైగా మహిళలు టీ తోటల్లో పని చేస్తున్నారు. ఈ మహిళల పరిస్థితి ఒకప్పుడు అత్యంత దయనీయంగా ఉండేది. వాళ్ల మాటకు ఇంట్లో విలువ ఉండేది కాదు, పని చేసే చోట లైంగిక వేధింపులు, వివక్ష తప్పేది కాదు. ఒకరి కష్టాన్ని మరొకరికి చెప్పుకుని ఓదార్పు పొందడమే తప్ప, ఆ కష్టాల నుంచి బయటపడవచ్చని తెలియని రోజులవి. ఒకసారి తెలిసిన తరవాత ఇక వాళ్లు ఆలస్యం చేయలేదు. ఉమెన్స్ సేఫ్టీ యాక్సెలరేటర్ ఫండ్ (డబ్లు్యఎస్ఏఎఫ్) స్వచ్ఛంద సంస్థ అండతో ముందుకురికారు. అస్సాం నుంచి కేరళ వరకు తమకు భద్రత కల్పించడానికి పోష్ అనే చట్టం ఉందని తెలిసిన తర్వాత ఆ చట్టం ద్వారా ఎన్ని రకాలుగా రక్షణకవచంగా ఉపయోగించుకోవచ్చనే వివరాలు కూడా తెలుసుకున్నారు. ‘సమాజ్’ పేరుతో వాళ్లలో వాళ్లు కమిటీలుగా ఏర్పడ్డారు. బృందంగా వెళ్లి ప్రభుత్వ అధికారులను కలుస్తూ... ప్రతి తోటలో ఇంటర్నల్ సెల్ ఏర్పాటయ్యే వరకు తమ ఉద్యమాన్ని ఆపలేదు. లైంగిక వేధింపులకు గురయినప్పుడు ఎలా ప్రతిఘటించాలో, ఎలాంటి ఆధారాలతో ఇంటర్నల్ సెల్కు ఎలా తెలియచేయాలో కళ్లకు కడుతూ చిన్నచిన్న నాటికలు ప్రదర్శించారు. అస్సాం, బెంగాల్ నుంచి కొంతమంది చురుకైన మహిళలు కేరళ, తమిళనాడులకు వచ్చి ఇక్కడి వారిని చైతన్యవంతం చేసే పని మొదలుపెట్టారు. ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఒక్క ఫోన్ కాల్ చాలు! పోష్ చట్టం ప్రకారం సెక్సువల్ హెరాస్మెంట్ రిడ్రసల్ కమిటీలు భవన నిర్మాణ రంగంలో కూడా ఉండాలి. అయితే టీ తోటల్లో మహిళల్లాగ భవన నిర్మాణంలో పని చేసే మహిళలు సంఘటితం అయ్యే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే ఎక్కువ కాలం ఒకే చోట నివసిస్తున్న వాళ్లు మాత్రమే వేధింపులకు గురవుతున్న విషయాన్ని ఒకరితో ఒకరు పంచుకోగలుగుతారు. వాళ్లలో వాళ్లు మాట్లాడుకుని కలిసికట్టుగా పోరాటానికి సిద్ధమవుతారు. టీ తోటల్లో పని చేసే వాళ్లు సుదీర్ఘకాలం ఒకే చోట నివసిస్తూ, అదే తోటల్లో కలిసి పనిచేస్తూ ఉంటారు. భవన నిర్మాణ కార్మికులు అలా కాదు. ఒక భవనం పూర్తి కాగానే మరోభవనం కోసం వెళ్లిపోతుంటారు. తమ సమస్యకు పరిష్కారం కోసం సంఘటితం కాగలిగినంత సమయం కూడా ఒకేచోట ఉండరు. కాబట్టి పని చేసే ప్రదేశంలో కంప్లయింట్ ఇవ్వాల్సిన వివరాలతోపాటు ఫోన్ నంబరు రాయడమే వారిలో చైతన్యాన్ని కలిగిస్తుంది. అలాగే రైతుబజార్లు, కూరగాయల మార్కెట్లలో కూడా మహిళలు ఎక్కువగా ఉంటారు. అధికారులు సమావేశం ఏర్పాటు చేసి లైంగిక వేధింపులు ఎదురైనప్పుడు కంప్లయింట్ ఇవ్వవచ్చని తెలియచేయాలి. కంప్లయింట్ విభాగానికి చెందిన ఫోన్ నంబర్ను ఆ మార్కెట్లో కూరగాయల ధరల పట్టిక కనిపించినట్లు బాగా కనిపించేటట్లు రాయాలని సూచించారు మహిళల హక్కుల యాక్టివిస్టు కొండవీటి సత్యవతి. ఒక నోడల్ పాయింట్ లైంగిక వివక్ష, వేధింపు, హింస, బాల్య వివాహాలు, అక్రమ రవాణా, ప్రసవ సమయంలో మరణాలు దేశంలో అస్సాం మొదటిస్థానంలో ఉంటుంది. అస్సాం, బెంగాల్లో మహిళల కోసం ప్రాతినిధ్యం వహించేవాళ్లు లేరు. టీ ఎస్టేట్లలో పనిచేసే బాలికలు, మహిళల భద్రత, హింస నిరోధం కోసం ఏర్పడిన కన్షార్షియం డబ్లు్యఎస్ఏఎఫ్... మహిళలను చైతన్యవంతం చేయడంతోపాటు లీగల్ సర్వీసెస్ అథారిటీ, హెల్త్ డిపార్ట్మెంట్, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్లు, పోలీస్, గ్రామీణ ఉపాధి కార్యక్రమాలన్నింటినీ ఒక గొడుగు కిందకు తీసుకువచ్చింది. ఆ ప్రయత్నం మంచి ఫలితాన్నిచ్చింది. అస్సాం టీ తోటల్లో పని చేసే మహిళలు దేశానికి దిక్సూచి అయ్యారు. – వాకా మంజులారెడ్డి చట్టం... కమిటీలే కాదు... ప్రభుత్వం ఇంకా చేయాలి! వ్యవస్థీకృత రంగంలో పనిచేసే మహిళల కోసం ఇంటర్నల్ కమిటీలున్నట్లే అసంఘటితరంగంలో కూడా కమిటీలుండాలి. ఇళ్లలో పని చేయడం, వీధుల్లో తిరుగుతూ కూరగాయలు, పండ్లు అమ్ముకోవడం వంటి ఇతర పనుల్లో ఉండే మహిళల కోసం లోకల్ కంప్లయింట్స్ కమిటీలుండాలి. కమిటీలు వేయడంతో సమస్య పరిష్కారం కాదు. ఇలాంటి కమిటీలున్నాయనే విషయం మహిళలకు తెలియాలి. లైంగిక వేధింపులు ఎదురైనప్పుడు ఆయా కమిటీలకు కంప్లయింట్ ఎలా ఇవ్వాలో తెలియచేయాలి. ఫోన్ నంబర్ లేదా హెల్ప్లైన్ నంబర్లను పని ప్రదేశంలోనూ ఇతర కమ్యూనిటీ సెంటర్లలోనూ బాగా కనిపించేటట్లు బోర్డు మీద రాయాలి. అందుకు ప్రభుత్వమే పూనుకోవాలి. చట్టం చేసి తన బాధ్యత అయిపోయిందనుకుంటే సరిపోదు. చట్టాన్ని అమలు చేయడం, అమలయ్యే పరిస్థితులు కల్పించడం, చట్టం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం, తమ హక్కుల ఉల్లంఘన కలిగినప్పుడు గళమెత్తగలిగేటట్లు భరోసా కల్పించడం కూడా ప్రభుత్వం నిర్వర్తించాల్సిన బాధ్యతలే. – కొండవీటి సత్యవతి,భూమిక ఉమెన్స్ కలెక్టివ్, మెంబర్, లోకల్ కంప్లయింట్ కమిటీ, రంగారెడ్డి జిల్లా -
ఇద్దరు యువతుల ప్రేమ పెళ్లి.. లింగమార్పిడి చేసుకుని..
లక్నో: ఉత్తరప్రదేశ్లో విచిత్రమైన సంఘటన జరిగింది. ఇద్దరు అమ్మాయిలు వివాహం చేసుకోవడానికి కోర్టును ఆశ్రయించారు. ఇందుకోసం వారిలో ఒకరు లింగమార్పిడి చేసుకున్నారు. ఆ సంబంధిత ధ్రువపత్రంతో స్థానిక సబ్ డివిజినల్ కోర్టులో రిజిస్ట్రేషన్ వివాహానికి వీరు దరఖాస్తు చేసుకున్నారు. బరేలీలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని బరేలీలో ఇద్దరు అమ్మాయిలు ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఇద్దరి మధ్య స్నేహం.. ప్రేమగా మారింది. వీరిలో ఒకరు బరేలికి చెందినవారు కాగా.. మరొకరు బదాయూ ప్రాంతానికి చెందినవారు. ప్రేమలో ఉన్న వీరు పెళ్లి చేసుకుని కలిసి బతకాలనుకున్నారు. కానీ కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో వారు కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆ జంటలోని ఓ అమ్మాయి లింగమార్పిడి చేయించుకుంది. చికిత్స అనంతరం ధ్రువపత్రంతో స్థానిక సబ్ డివిజినల్ కోర్టులో రిజిస్ట్రేషన్ వివాహానికి వీరు దరఖాస్తు చేసుకున్నారు. డిజిస్ట్రేషన్ ద్వారా వివాహానికి ప్రత్యేక వివాహ చట్టం కింద దరఖాస్తు పెట్టుకున్నారని బరేలీ ఎస్డీఎం ప్రత్యూష పాండే తెలిపారు. ఇలాంటి కేసు చాలా అరుదుగా వస్తుంటాయని చెప్పారు. ఇదీ చదవండి: అంబులెన్సును ఢీకొట్టిన మంత్రి కాన్వాయ్.. అసలే పేషెంట్.. మళ్ళీ పేషెంట్ అయ్యాడు.. -
జెండర్ ఈక్వాలిటీ అంటే అది!'దటీజ్ జపాన్'
ఇటీవల జూన్ 24, 25 తేదీల్లో లింగ సమానత్వం, మహిళ సాధికారతపై జీ7 దేశాల శిఖరాగ్ర సదస్సు జరిగింది. దీనికి జపాన్ ఆతిధ్య ఇచ్చింది. ఈ సదస్సులో ఏడుగురు మంత్రుల బృందం సమావేశమై ప్రతిజ్ఞ చేసింది. ఆ మంత్రులంతా మహిళా కార్యనిర్వాహకులకు మద్దతు ఇస్తామని, నిర్వాహక పాత్రలలో మహిళల ప్రాతినిధ్యాన్ని విస్తరింపజేస్తామని ప్రతిజ్ఞ చేశారు. అయితే ఆ మంత్రుల సదస్సు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల దృష్టిని తెగ ఆకర్షించింది. అసాధారణరీతిలో లింగ సమానత్వ మహిళా మంత్రులు సదస్సులో ఒకే ఒక్క మగ మంత్రి తన దేశం తరుపున ప్రాతినిధ్య వహించడం విశేషం. ఈ సమావేశానకి ఆతిధ్యమిచ్చిన జపాన్ దేశమే మహిళ సాధికారతపై జరగుతున్న సదస్సుకు తన దేశం తరుఫు నుంచి ఓ ఫురుషుడిని పంపి అందర్నీ ఆశ్చర్యపర్చింది. జెండర్ ఈక్వాలిటీ అంటే అర్థం ఏమిటో చెప్పకనే చెప్పింది. పైగా చెప్పడం కాదు చేసి చూపడం లేదా ఆచరించి చూపడం అని చాచిపెట్టి కొట్టినట్లు చెప్పింది. "దటీజీ జపాన్" అని సగర్వంగా ఎలుగెత్తి చెప్పింది. ఇక ఆ సమావేశంలో తన దేశం తరుఫున పాల్గొన్న జపాన్కు చెందిన రాజకీయ ప్రముఖుడు, కేబినేట్ మంత్రి మసనోబు ఒగురా మీడియా సమావేశంలో మాట్లాడుతూ..ఆ సమావేశంలో ఏకైక పురుష డెలిగేట్ అయ్యినందుకు ఎలా భావిస్తున్నారని అడుగగా..లింగ సమానత్వం కోసం పురుషులు ఇంకాస్త చొరవ తీసుకుని ముందుకొచ్చి నాయకత్వం వహించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పాడు. ఇతర దేశాల సహకారంతో మహిళల చురుకైన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేలా పని చేస్తున్నట్లు చెప్పాడు. అలాగే లింగ సమానత్వమే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పాడు. ఇదిలా ఉండగా, టైమ్ మ్యాగ్జైన్ ప్రకారం..వరల్డ్ ఎకనామిక్ ఫోరం తన తాజా వార్షిక గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ను విడుదల చేసిన కొద్ది రోజులకే జపాన్లో నిక్కోలో ఈ జీ7 శిఖారాగ్ర సమావేశం జరగడం గమనార్హం. కాగా, ఈ ఎకనామిక్ ఫోరం ఆర్థిక భాగస్వామ్యం, అవకాశం, విద్యాసాధన, ఆరోగ్యం, మనుగడ, రాజకీయ సాధికారత తదితర కీలక కొలమానాల ఆధారంగా ఈ జెండర్ గ్యాప్ ఇండెక్స్ని అంచనా వేస్తుంది. (చదవండి: ఎవరి ఆలోచనో అది!..'స్నేహితుల బెంచ్') -
స్నేహితురాలిపై ప్రేమతో ఆమె..‘అతని’గా మారాలనుకుంది.. తరువాత జరిగిన దారుణమిదే..
ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్లో ఒక యువతి తన స్నేహితురాలిని గాఢంగా ప్రేమించింది. ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని, పురుషునిగా మారేందుకు ఒక మాంత్రికుని వద్దకు వెళ్లింది. ఇదే అవకాశంగా భావించిన ఆ మాంత్రికుడు ఆమెపై ఘాతుకానికి తెగబడ్డాడు. రెండు నెలల క్రితం కుటుంబ సభ్యులు ఆ యువతి అదృశ్యమయ్యిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు ఆ మాంత్రికునితో పాటు ఆమె స్నేహితురాలిని కూడా అరెస్టు చేశారు. ఆర్సీమిషన్ పరిధిలో ఉంటున్న పూనమ్ ఇంటి నుంచి ఏప్రిల్ 18న మాయమయ్యింది. ఏప్రిల్ 26న ఆమె సోదరుడు దీనిపై పోలీసులకు పిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాయమైన ఆ యువతి తన స్నేహితురాలు ప్రీతిని పెళ్లాడాలనుకుందని తెలిసింది.ఇదిలా ఉండగా మే 18న లఖీంపురా పరిధిలో ఒక యువతి అస్థిపంజరం పోలీసులకు లభ్యమయ్యింది. పోలీసులు ఆ అస్థిపంజరం శాంపిల్ ల్యాబ్కు పంపగా మాయమైన పూనమ్దేనని తేలింది. ఈ కేసు గురించి పోలీసులు మాట్లాడుతూ.. పువాయులో ఉంటున్న ప్రీతి, పూనమ్లు స్వలింగ సంపర్కులుగా ఉంటున్నారు. ఈ నేపధ్యంలో పూనమ్ తన స్నేహితురాలు ప్రీతిని వివాహం చేసుకోవాలని అనుకుంది. అయితే పూనమ్ కారణంగా ప్రీతికి పెళ్లి సంబంధాలు కుదరడం లేదు. దీంతో ప్రీతి తల్లి ఊర్మిళ.. లఖీంపూర్ ఖీరీ పరిధిలో ఉంటున్న రామ్నివాస్ అనే వ్యక్తిని కలుసుకుంది. తన కుమార్తె వివాహానికి పూనమ్ అడ్డుగా ఉందని, ఆమెను అంతమొందిస్తే రెండున్నర లక్షల రూపాయలు ఇస్తానని అతనికి చెబుతూ రూ. 5 వేలు అడ్వాన్స్గా ఇచ్చింది. తరువాత ప్రీతి, పూనంలను రామ్నివాస్ ఒక అడవికి తీసుకువెళ్లాడు. అక్కడ వారిద్దరికీ వివాహం చేసే విషయమై మాట్లాడాడు. మంత్ర విద్యలతో పురుషునిగా మార్చేస్తానని పూనమ్కు రామ్నివాస్ హామీనిచ్చాడు. ఇందుకోసం మరోమారు అడవికి రావాల్సివుంటుందని పూనమ్కు చెప్పాడు.అతను చెప్పిన సమయానికి పూనమ్ అడవికి రాగానే రామ్నివాస్ ఆమెపై దాడి చేసి, హత్యచేశాడు. తరువాత ఆమె మృతదేహాన్ని అక్కడున్న పొదల్లో దాచిపెట్టాడు. ఈ కేసు గురించి సిటీ ఎస్పీ సుధీర్ మాట్లాడుతూ ఈ కేసు దర్యాప్తు చేస్తున్న తాము మే 18న వివిధ ఆధారాలతో పూనమ్కు చెందిన అస్థిపంజరాన్ని గోమతి నది ఒడ్డున స్వాధీనం చేసుకున్నామన్నారు. పూనమ్ సోదరుడు పర్వీందర్ తన సోదరి దుస్తులను చూసి గుర్తుపట్టాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘాతుకానికి పాల్పడ్డ రామ్నివాస్, ప్రీతి, ఆమె తల్లి ఊర్మిళలపై కేసు నమోదు చేశారు. రామ్నివాస్, ప్రీతిలను అరెస్టు చేశారు. పరారైన ఊర్మిళ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇది కూడా చదవండి: ఆ హ్యాండ్సమ్ సీరియల్ కిల్లర్పై అమ్మాయిల మోజు.. -
పైసల కోసం... ‘పాపం చేస్తున్నారు
ఆడపిల్లంటే ‘ఆడ’ పిల్లని, మగపిల్లాడంటే ‘మన’ పిల్లాడనే భావన ఉన్నంత వరకు ఈ సమాజంలో ఆడ పిల్లలకు స్థానం లేదుకావొ చ్చేమో.. ప్రాణం పోయాల్సిన వైద్యులే కడుపులోనే చంపేస్తున్నారు. కాసులకు కక్కుర్తి పడి లింగనిర్ధారణ పరీక్షలు చేసి ఆడపిల్లని తెలిస్తే గర్భవిచిత్తి చేస్తున్నారు. – సాక్షి, వరంగల్ గర్భస్త లింగ నిర్ధారణ నేరం... అంటూ ఆస్పత్రుల్లో పెద్దపెద్ద బోర్డులు పెడుతున్న వైద్యులే... పైసల కోసం ‘పాప’ం చేస్తున్నారు. గతంలో గర్భవిచిత్తి ఉదంతాలు వెలుగులోకి వచ్చినా... కొందరు వైద్యుల తీరు ఏమాత్రం మారడం లేదు. వరంగల్ నగరంతో పాటు నర్సంపేట పట్టణం, నెక్కొండ ఇలా చాలా ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా అమ్మ కడుపులోని పాపలను భ్రూణహత్యలు చేస్తున్న ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి. గర్భంలో ఉన్న శిశువు ఆడనా, మగనా అని తెలుసుకునేందుకు లింగ నిర్ధారణ పరీక్షలు చేయడంతో పాటు ఆడపిల్ల అయితే గర్భవిచిత్తి చేస్తున్న కేసుల్లో సంబంధమున్న 18 మంది నిందితులను వరంగల్ కమిషనరేట్ పోలీసులు అరెస్టు చేయడంతో ఈ చట్టవిరుద్ధ కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. ఒక్కో గర్భస్రావానికి రూ.20వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నారని తెలిసింది. హనుమకొండలోని లోటస్, గాయత్రి ఆస్పత్రులతో పా టు నర్సంపేటలోని బాలాజీ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి, నెక్కొండలోని ఉపేందర్ క్లినిక్లు వీటిలో భాగస్వామ్యం అయ్యాయని వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ వెల్లడించడంతో వరంగల్ సిటీతో పాటు జిల్లాలోని ఆస్పత్రుల వ్యవహార శైలిపై అనుమానాలు వస్తున్నాయి. పోలీసులు ఇంకా లోతైన విచారణ చేస్తే మరిన్ని ఆస్పత్రులు, క్లినిక్లపై క్రిమినల్ కేసులు నమోదవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఆడపిల్ల అని తెలుసుకోవడానికి వచ్చినా, అబార్షన్ చేయాలన్న వైద్యులు నిరాకరించాల్సి ఉన్నా కాసుల కక్కుర్తి కోసం ప్రోత్సహిస్తుండడం గమనార్హం. అయినా.. మారలే.. ► నెక్కొండ మండలం బొల్లికొండ గ్రామ శివారు మాలోతు నంద్యానాయక్తండాలోని ప్రశాంత్.. పార్థు నర్సింగ్ హోంలో తన భార్యకు జన్మించిన ఆడ శిశువును రూ.25వేలకు ఆస్పత్రి సిబ్బంది సహకారంతో హనుమకొండలోని విజయ్కుమార్, రజనీ దంపతులకు విక్రయించారు. ఈ విషయం బాలల సంరక్షణ విభాగాధికారుల దృష్టికి వెళ్లగా.. 2020 ఏప్రిల్ 25న నెక్కొండ ఠాణాలో ఫిర్యాదు చేశారు. దీంతో డాక్టర్ పార్థు, డాక్టర్ ఉపేందర్, స్టాఫ్ నర్సు పద్మ, శిశువు తండ్రి ప్రశాంత్, నాయనమ్మ నర్సమ్మలపై కేసు నమోదు చేశారు. ఎట్టకేలకు 2020 మే 5న పాప జాడ దొరికింది. అంతకుముందు 2011జూలై 22న కవల పిల్లల విక్రయాల కేసులోనూ ఈ ఆస్పత్రి వివాదానికి కేరాఫ్గా నిలిచింది. ఈ రెండు ఘటనల తర్వాత పార్థు నర్సింగ్ హోం పేరును ఉపేందర్ క్లినిక్గా మార్చుకొని కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఈసారి లింగనిర్ధారణ పరీక్షలు చేసి గర్భవిచిత్తు చేస్తున్నారని ఉపేందర్ క్లినిక్లోని రెండు స్కానింగ్ మెషీన్లను ఇప్పటికే వైద్యారోగ్యవిభాగాధికారులు సీజ్ చేశారు. ఇవి రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో ఎక్కడి నుంచి తెప్పించారనే దిశగా విచారణ చేస్తున్నారు. అయితే సీపీ రంగనాథ్ ఆదేశాల మేరకు కమలాపురం సీఐ సంజీవ్, నెక్కొండ ఎస్సై జానీ పాషా, గ్రామ కార్యదర్శి సదానందం, రెవెన్యూ సిబ్బందితో కలిసి తనిఖీ చేసి రికార్డులు, గదులను పరిశీలించారు. ఇప్పటికే డాక్టర్ బాల్నె పార్థు, పార్థు భార్య ఆశలత, కాంపౌండర్ కీర్తి మోహన్ను పోలీసులు అరెస్టు చేశారు. ► దాదాపు ఏడాది క్రితం ప్రారంభమైన నర్సంపేటలోని బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లోనూ లింగ నిర్ధారణ పరీక్షలతో పాటు గర్భ విచిత్తి జరుగుతున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నెల 13న అక్కడి స్కానింగ్ మెషీన్ను వైద్యారోగ్యవిభాగాధికారులు సీజ్ చేశారు. ఇవన్నీ పకడ్బందీగా చేస్తేనే... ► గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గర్భం దాల్చిన వారి వివరాలను వైద్యారోగ్య శాఖ సిబ్బంది సమగ్రంగా సేకరించాలి. గుర్తించిన గర్భిణుల సంఖ్యను... ప్రసవాలతో పోలిస్తే గర్భస్రావాలు...గర్భవిచిత్తి ఉదంతాలు బయటపడే అవకాశముంది. ఈ దిశగా యంత్రాంగం దృష్టి సారించాలి. ► ప్రైవేట్ స్కానింగ్ కేంద్రాలకు వస్తున్న గర్భిణుల వివరాలు నమోదు చేయించి. ఆ వివరాలను ప్రసవాల సంఖ్యతో సరిపోల్చడం ద్వారా ఎక్కడైనా అక్రమాలు జరిగితే గుర్తించవచ్చు. ► వైద్యారోగ్యశాఖ అధికారులు స్కానింగ్ కేంద్రాలు తరచుగా తనిఖీ చేయకపోవడంతో రహస్యంగా లింగనిర్ధారణ, భ్రూణహత్యలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ► జిల్లా పరిధిలో కలెక్టర్ అధ్యక్షతన లింగ నిర్ధారణ నిరోధక కమిటీ ఏర్పాటై ఉంటుంది. పోలీసు కమిషనర్, న్యాయమూర్తి, డీఎంహెచ్ఓ, స్వ చ్ఛంద సంస్థ ప్రతినిధి సభ్యులుగా ఉంటారు. కనీసం ఆరునెలలకోమారు ఈ కమిటీ సమావేశం జరగాలి. తీసుకుంటున్న చర్యలపై సమీ క్షించాలి. ఆ దిశగా కసరత్తు జరగాలి. -
అక్షర స్వరం
‘రచన చేయడం అంటే తెలుసుకోవడం కూడా’ అనే మాట ‘రైజింగ్ ఫ్రమ్ ది యాషెస్’ పుస్తక రచన కోసం కలం పట్టినప్పుడు కృతిక పాండేకు అనుభవంలోకి వచ్చింది. ఈ పుస్తకం మనల్ని బాధితుల ప్రపంచంలోకి తీసుకువెళుతుంది. ఈ పుస్తక ప్రయాణం సానుభూతి కోసం కాదు. ‘మనలో వారి పట్ల చిన్న చూపు ఉంటే మార్చుకుందాం’ అని చెప్పడం. ‘వారితో కలిసి నడవండి’ అని చెప్పడం. ‘విజేతలకు కష్టాలు అడ్డు కాదు’ అనే సత్యాన్ని గుర్తు చేయడం... అవమానాలు, అనుమానాలు, లింగవివక్ష, వేధింపులు, గృహహింసలు... స్త్రీలు ఎదుర్కొనే సకల సమస్యలకు సమాధానం చెబుతుంది ‘రైజింగ్ ఫ్రమ్ ది యాషెస్: ఎ జర్నీ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్’ పుస్తకం. ఇది కాల్పనిక ఊహల సమాహారం కాదు. నిజజీవితానికి చెందిన కథ. నిమృత్కు చిన్నప్పటి నుంచి మూర్ఛ సమస్య ఉంది. ఆ సమస్య తనను నీడలా వెంటాడింది. ‘ఈ సమస్యతో స్కూల్కు ఎలా పంపుతాం?’ ‘ఫ్రెండ్స్తో సినిమాకు వెళతావా? అక్కడ పడిపోతే ఎవరు చూస్తారు?’ పెళ్లి వయసులోనూ ఆ సమస్య ముందుకు వచ్చింది. ‘మీ అమ్మాయికి మూర్ఛ సమస్య ఉందా? ముందే చెప్పి బతికించారు’ అని వెనక్కి తిరిగి వెళ్లిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. నిమృత్కు పెళ్లి జరగడం అనేది అతి కష్టం అనుకునే సందర్భంలో తన సమస్య తెలిసి కూడా ఒక కుటుంబం పెళ్లికి ఒప్పుకుంది. ‘మూర్ఛ’ కారణంగా సంసార జీవితంలో ఒడిదొడుకులు మొదలయ్యాయి. అయితే ముందు కనిపిస్తున్న ముండ్లబాటను చూసి భయపడలేదు నిమృత్. అక్కడే ఆగిపోయి ఉంటే, వెనుతిరిగి ఉంటే ఆమె జీవితం ఈ పుస్తకంలోకి వచ్చేది కాదు. సమస్యను సవాలు చేసి ముందుకువెళ్లింది. కష్టాలను తట్టుకొని నిలబడింది. ప్రపంచం గుర్తుంచుకోదగిన అసాధారణ విజయలేమీ ఆమె సాధించకపోవచ్చు. అయితే తన జీవితాన్ని జయించింది. కష్టాల్లో ఉన్నవారికి స్ఫూర్తిని ఇచ్చింది. తనలాంటి వారెందరికో ధైర్యాన్ని ఇస్తోంది. ‘ఆరోగ్య స్థితిని బట్టి ఎవరూ నిర్లక్ష్యానికి గురి కావద్దు. వారికి సహాయంగా నిలవండి. వారి అడుగులు ముందుకు పడడానికి సహకరించండి’ అని ఈ పుస్తకం సందేశం ఇస్తుంది. కృతిక పాండే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగం హెడ్గా పనిచేస్తోంది. బెంగళూరులో గ్రాడ్యుయేషన్ చేసిన కృతిక దిల్లీలో డిజిటల్ మార్కెటింగ్ కోర్సు చేసింది. డెహ్రడూన్కు చెందిన కృతిక ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాలు, స్త్రీ సాధికారతకు సంబంధించిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది. ఈ పుస్తకం అమ్మకాల ద్వారా వచ్చిన మొత్తాన్ని దివ్యాంగుల సంక్షేమం కోసం పనిచేస్తున్న బెంగళూరులోని ‘మిత్ర జ్యోతి ట్రస్ట్’కు ఇవ్వనుంది కృతిక. -
ఆ వివాహాలు నేరం కాదు.. అవసరం: వివేక్ అగ్నిహోత్రి ట్వీట్
ది కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్వలింగ వివాహం నేరం కాదని ఆయన ట్వీట్ చేశారు. ఇది వారి హక్కు అంటూ తన మద్దతు ప్రకటించారు. ఇండియా లాంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో ఇలాంటివి సాధారణమైన విషయమని అన్నారు. ఈ సందర్భంగా స్వలింగ వివాహంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. వివేక్ తన ట్వీట్లో రాస్తూ.. 'స్వలింగ వివాహం అనేది 'అర్బన్ ఎలిటిస్ట్' అన్న భావన కరెక్ట్ కాదు. ఇది మానవ అవసరం. చిన్న పట్టణాలు, గ్రామాలలో ఎప్పుడూ ప్రయాణించని కొంతమంది వ్యక్తులే దీన్ని ప్రశ్నిస్తున్నారు. మొదట స్వలింగ వివాహం అనేది ఒక కాన్సెప్ట్ కాదు. అది ఒక అవసరం మాత్రమే. అలాగే ఇది ఒక హక్కు కూడా. భారతదేశం వంటి ప్రగతిశీల దేశంలో స్వలింగ వివాహం సాధారణమైన విషయమే. ఎలాంటి నేరం కాదు.' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. స్వలింగ వివాహం అనేది పట్టణ ఉన్నత వర్గాల భావన అని కేంద్రం సుప్రీంకోర్టుకు చెప్పింది. ఇది దేశంలోని సామాజిక తత్వానికి దూరంగా ఉందని తెలిపింది. స్వలింగ వివాహాన్ని ప్రోత్సహించడం కొత్త సమస్యలు సృష్టిస్తుందని కేంద్రం పేర్కొంది. దీన్ని ఉద్దేశిస్తూ ఆయన ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. కాగా.. వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించి ది కశ్మీర్ ఫైల్స్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, పల్లవి జోషి ప్రధాన పాత్రల్లో నటించారు. (ఇది చదవండి: షూటింగ్లో ప్రమాదం.. ది కశ్మీర్ ఫైల్స్ నటికి తీవ్రగాయాలు) NO. Same sex marriage is not an ‘urban elitist’ concept. It’s a human need. Maybe some sarkari elites drafted it who have never travelled in small towns & villages. Or Mumbai locals. First, same sex marriage is not a concept. It’s a need. It’s a right. And in a progressive,… https://t.co/M4S3o5InXI — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) April 18, 2023 -
‘సాగు’లో లింగవివక్ష మూల్యం 81.84 లక్షల కోట్లు!
మహిళలపట్ల వివక్ష వల్ల సామాజికంగా వాటిల్లే నష్టానికి వెలకట్టలేం. అయితే వ్యవసాయం, ఆహార శుద్ధి, నిల్వ, పంపిణీ (అగ్రి ఫుడ్ సిస్టమ్స్) రంగాల్లో లింగవివక్ష వల్ల ఎంత నష్టం వాటిల్లుతున్నదో తెలుసుకొనేందుకు ఐక్యరాజ్య సమితి (ఐరాస)కి చెందిన ఆహార–వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) ఇటీవల అధ్యయనం చేసింది. లింగవివక్ష కారణంగా ఏటా లక్ష కోట్ల డాలర్ల (రూ. 81,84,550 కోట్లు) సంపదను ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోల్పోతున్నట్లు ఈ అధ్యయనంలో వెల్లడైంది. వ్యవసాయ రంగంలో మహిళల స్థితిగతులపై 2010 విరామం తర్వాత ఎఫ్ఏఓ వెలువరించిన తొలి అధ్యయన నివేదిక ఇదే. వ్యవసాయంతోపాటు ఈసారి ఆహార శుద్ధి, రవాణా, నిల్వ, పంపిణీ రంగాల్లో రైతులుగా, కూలీలుగా, ఉద్యోగినులుగా, వ్యాపారవేత్తలుగా, చిరు వ్యాపారులుగా పనిచేసే మహిళల స్థితిగతులపై సమగ్రంగా అధ్యయనం చేసి నివేదిక విడుదల చేయటం గమనార్హం. వివక్షను రూపుమాపితే రైతుల ఆదాయం పెరుగుతుంది వ్యవసాయ, ఆహార వ్యవస్థల్లో మహిళలపట్ల లింగ వివక్షను నిర్మూలిస్తే ఆహారోత్పత్తి పెరిగి ఏటా లక్ష కోట్ల డాలర్ల మేరకు ఆదాయం సమకూరుతుంది. పేదరికం, ఆకలి తగ్గుతుంది. 4.5 కోట్ల మంది నిరుపేదలకు అదనంగా ఆహార భద్రత కలుగుతుంది. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని ఎఫ్ఏఓ తేలి్చచెప్పింది. అంతేకాదు.. వాతావరణ మార్పులు, కోవిడ్ మహమ్మారి వంటి విపత్కర పరిస్థితులను దీటుగా తట్టుకోవాలన్నా లింగవివక్షను రూపుమాపాల్సిన అవసరం ఉందని ఎఫ్ఏఓ నివేదిక స్పష్టం చేసింది. లింగ వివక్షను తగ్గించి మహిళా సాధికారతను పెంచే పథకాల వల్ల సగానికి సగం చిన్న రైతులకు మేలు జరుగుతుంది. 5.8 కోట్ల మంది ఆదాయం పెరుగుతుంది. మరో 23.5 కోట్ల మందికి విపత్తులను తట్టుకొనే శక్తి పెరుగుతుందన్నది తమ అంచనా అని ఎఫ్ఏఓ డైరెక్టర్ జనరల్ క్యు డోంగ్యు తెలిపారు. ఏ ముప్పు అయినా మహిళలనే ముందు దెబ్బతీస్తుంది. కోవిడ్ మహమ్మారి వచి్చన మొదటి ఏడాదిలో ఆహార శుద్ధి, పంపిణీ రంగంలో 22% మహిళల ఉద్యోగాలు పోతే, 2% పురుషుల ఉద్యోగాలు పోయాయి. కరువు కాటకాలు, ఉష్ణోగ్రతలు పెచ్చుమీరిన సంక్షోభ కాలాల్లో వ్యవసాయ–ఆహార రంగాల్లో పనిచేసే మహిళల బిడ్డల పోషణ, ఇంటి పనికి అదనంగా దూరం వెళ్లి నీళ్లు తెచ్చే భారం పెరిగిపోతోంది. అల్ప, మధ్య తరహా ఆదాయ దేశాల్లో మొబైల్ ఇంటర్నెట్ సదుపాయం విషయంలో లింగ వివక్ష 25% నుంచి 16 శాతానికి తగ్గినట్లు గుర్తించారు. గత పదేళ్లుగా అనేక దేశాల్లో మహిళలకు అనుకూల విధానాలు వస్తున్నప్పటికీ వ్యవసాయం–ఆహార రంగాల్లో పెద్ద మార్పు కనిపించట్లేదు. 68 దేశాల్లో వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి సంబంధించిన 75% విధానాల్లో మహిళల ప్రాధాన్యతను గుర్తించినప్పటికీ లింగవివక్షను తగ్గించే ప్రయత్నాలు 19% విధానాల్లోనే కనిపించింది. విధాన నిర్ణేతలు క్షేత్రస్థాయిలో లింగవివక్షను తగ్గించేందుకు మహిళా సాధికారతకు పెద్దపీట వేయాలని ఎఫ్ఏఓ సూచించింది. గొడ్డు చాకిరీ.. 18% తక్కువ ఆదాయం ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ, ఆహార వ్యవస్థలపై ఆధారపడి జీవిస్తున్న వారి సంఖ్య 400 కోట్లు. ఏటా 1,100 కోట్ల టన్నుల ఆహారోత్పత్తి జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా సగటున 36% మంది మహిళలకు, 38% మంది పురుషులకు ఉపాధి కల్పిస్తున్న రంగం ఇది. అయితే ఆఫ్రికా దేశాల్లో 66% మంది మహిళలకు వ్యవసాయమే ఉపాధి. చిన్న, సన్నకారు రైతులకు నిలయమైన భారత్ తదితర దక్షిణాసియా దేశాల్లో ఇది మరీ ఎక్కువ. ఈ దేశాల్లో 71% మంది మహిళలు (మహిళా రైతులు, కూలీలు, ఉద్యోగినులు) వ్యవసాయ–ఆహార వ్యవస్థల్లో ఉపాధి పొందుతున్నారు. అలాగే పురుషులు 47% మంది ఉపాధి పొందుతున్నారు. అయితే కూలికి వెళ్లే వారిలో పురుషులకన్నా మహిళల సంఖ్యే తక్కువ. గత పదేళ్లలో పొలం పనులపై ఆధారపడే వారి సంఖ్య 10% తగ్గినట్లు ఎఫ్ఏఓ.నివేదిక చెబుతోంది. వ్యవసాయ–ఆహార వ్యవస్థల్లో ఉపాధి పొందుతున్న మహిళల పని పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. గొడ్డు చాకిరీ చేసినా పని భద్రత లేదు. పార్ట్టైమ్ పనులు, కొన్నాళ్లు మాత్రమే ఉండే పనులు, తక్కువ నైపుణ్యం అవసరమైన పనులే మహిళలకు ఇస్తున్నారు. అందువల్ల పురుషులకన్నా 18% తక్కువగా వారి ఆదాయం ఉంటోంది. కౌలు రైతులకు మరీ కష్టం.. భూమిని కౌలుకు తీసుకున్న మహిళా రైతులు తీవ్ర అభద్రతకు గురవుతున్నారని ఎఫ్ఏఓ పేర్కొంది. 46 దేశాల్లో గణాంకాలను పరిశీలిస్తే 40 దేశాల్లో పురుష రైతులకు ఎక్కువ భూమి హక్కులు ఉన్నాయి. అదేవిధంగా కౌలు నిబంధనలు కూడా వారికి అనుకూలంగా ఉన్నాయి. మరోవైపు మహిళా రైతులకు రుణ సంస్థల నుంచి పరపతి అందట్లేదు. శిక్షణా అవకాశాలు మహిళలకు అంతగా అందుబాటులో ఉండట్లేదు. అన్నిటికన్నా మించి పురుషులను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన సాంకేతికతలు, యంత్రాలనే మహిళలు ఉపయోగించాల్సి వస్తోంది. ఈ అసమానతల వల్ల సమాన విస్తీర్ణంలో పంటలు సాగు చేసిన పురుషులకన్నా మహిళలు సాగు చేసిన పొలాల్లో ఉత్పాదకత 24% తక్కువగా వస్తున్నట్లు ఎఫ్ఏఓ నివేదిక తెలిపింది. ఇప్పుడు మహిళల కోసం వ్యవస్థలు పనిచేయాలి వ్యవసాయ, ఆహార రంగాల్లో లింగ అసమానతలను స్థానికంగా ఎక్కడికక్కడ పరిష్కరించి మ హిళలకు సాధికారత కలి్పస్తే పేదరికాన్ని అంతం చేయడం, ఆకలి కేకలులేని ప్రపంచాన్ని సృష్టించ డం వంటి లక్ష్యాల సాధన కృషిలో ప్రపంచం ముందుకు దూసుకుపోతుంది. వ్యవసాయ, ఆహార వ్యవస్థల్లో మహిళలు అనాదిగా పనిచేస్తున్నారు. వారి కోసం ఈ వ్యవస్థలు పని చేయాల్సిన సమయం ఆసన్నమైంది. – డా. క్యూ డోంగ్యు, డైరెక్టర్ జనరల్, ఆహార–వ్యవసాయ సంస్థ(ఎఫ్ఏఓ) చదవండి: కృత్రిమ మేధను తలచుకొంటే నిద్రలేని రాత్రులే -
లింగ సమానత్వానికి మరో 300 ఏళ్లు పడుతుంది: గుటేరస్
న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న లింగ అసమానతలపై ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఆవేదన వ్యక్తం చేశారు. లింగ సమానత్వం మన కళ్ల ముందే కనుమరుగు అవుతోందని పేర్కొన్నారు. మహిళలు, పురుషుల మధ్య అంతరాలు తగ్గడానికి ఇంకో 300 ఏళ్లు పడుతుందని, ఇది బాధాకరం అన్నారు. మహిళల హోదా విషయంపై ఐరాస సెషన్లో సోమవారం మాట్లాడుతూ గుటేరస్ ఈ వ్యాఖ్యలు చేశారు. మహిళల హక్కులను అవహేళన చేస్తూ, ప్రమాదంలోకి నెడుతూ, ఉల్లంఘిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. లింగసమానత్వంపై సాధించిన దశాబ్దాల పురోగతి మన కళ్ల ముందే కనుమరుగు కావడం ఆలోచించాల్సిన విషయమన్నారు. అఫ్గానిస్తాన్లో మహిళల హక్కులను తాలిబన్ ప్రభుత్వం కాలరాస్తున్న విషయాన్ని కూడా గుటెరస్ ప్రస్తావించారు. సాధారణ ప్రజా జీవితానికి వాళ్లను దూరం చేశారని చెప్పారు. చాలా దేశాల్లో మహిళల లైంగిక, పునరుత్పత్తి హక్కులను కూడా హరించివేస్తున్నారని తెలిపారు. కొన్ని దేశాల్లో పాఠాశాలకు వెళ్లే చిన్నారులను కిడ్నాప్ చేసి దాడులు చేస్తున్నారని, మరికొన్ని దేశాల్లో మహిళలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే వాళ్లపై దారుణాలకు పాల్పడుతున్నారని వివరించారు. లింగ సమానత్వ అంతరం రోజురోజుకు మరింత పెరుగుతోందన్నారు. చదవండి: అంటార్కిటికా కరిగిపోతోంది! -
క్షణ క్షణం వివక్షను ఎదుర్కొంటున్న మహిళ: గవర్నర్ తమిళిసై
సాక్షి, హైదరాబాద్: కంపెనీల ప్రకటనలు మొదలు కొని సినిమాల వరకూ మహిళను వివక్షతో చిత్రీకరించడాన్ని ప్రజలు ఎప్పటికప్పుడు నిరసించాలని, అలాంటి ప్రకటనలు, సినిమాలను తిరస్కరించడం, తమ అభ్యంతరాలను స్పష్టంగా చెప్పడం అవసరమని తెలంగాణ గవర్నర్, పుదుచ్చెరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఈ ధోరణి కనిపిస్తున్నా.. విస్తృత స్థాయిలో సమాజంలో మాత్రం వివక్ష కొనసాగుతూనే ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రింట్, వీడియో, సినిమాల్లో లింగ వివక్ష, మహిళలను నిర్దిష్ట దృక్కోణం (స్టీరియో టైపింగ్)లో చూపడాన్ని నియంత్రించడం, రూపుమాపడం లక్ష్యంగా ఇండియన్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ (ఐఏఏ) శుక్రవారం హైదరాబాద్లో ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. ‘‘వాయిస్ ఆఫ్ ఛేంజ్’’ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. మహిళలు నిత్యం వివక్షకు గురవుతూనే ఉన్నారని, ప్రతిక్షణం మహిళను నిర్దిష్ట దృక్కోణంతో చూపుతున్నారని ఈ సందర్భంగా గవర్నర్ సోదాహరణంగా వివరించారు. మహిళలు గవర్నర్లు కారని.. వయసు మీరిన పురుషులే అవుతారన్నట్టుగా ఎనిమిదేళ్ల బాలిక చెప్పడాన్ని తాను ఒక విమానాశ్రయంలో విన్నానని తెలిపారు. ఆఖరుకు మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కొన్ని పోటీల్లో బహుమతులుగా వంట పాత్రలు ఇస్తున్నట్లు ప్రకటించారని.. వారి దృష్టిలో ఆడవారంటే వంటిల్లుకు మాత్రమే పరిమితం అని వ్యాఖ్యానించారు. దేశంలో ఇప్పుడు పురుషుల కంటే మహిళ పైలట్లే ఎక్కువగా ఉన్నారని విమానయాన శాఖ మంత్రి తనతో చెప్పినప్పుడు ఎంతో సంతోషించానని, దురదృష్టవశాత్తూ సమాజంలో చాలామంది పాత, మూస పద్ధతుల్లోనే మహిళలను చూస్తున్నారని అన్నారు. సమాజంలో పదిరెట్లు ఎక్కువ కష్టం మాది... ప్రకటనల్లో లింగ వివక్షను ప్రస్తావిస్తూ.. ‘‘ఒక దాంట్లో మహిళ ట్రాఫిక్ కానిస్టేబుల్ను చూపారు. ఫర్వాలేదని అనుకుంటూండగానే.. ఆమె ఓ పురుషుడి బనియన్ చూసి తన్మయంతో ఊగిపోతున్నట్లు చూపారు. ఆఖరుకు పురుషుడి లోదుస్తుల ప్రకటనకూ మహిళను స్టీరియోటైపింగ్ చేశారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. తంజావూర్ మెడికల్ కాలేజీలో గైనకాలజిస్టుగా ఉండగా... కవలల తల్లి మగబిడ్డకు చనుబాలు, ఆడబిడ్డకు పలచన చేసిన ఆవుపాలు ఇచ్చిన సంఘటన తాను గమనించానని అన్నారు. ఇలాంటి అంశాల విషయంలో సమాజం మైండ్సెట్ మారాలని.. ప్రకటనలు తయారు చేసే వారు కూడా ఈ మార్పునకు తమవంతు సాయం అందించాలని కోరారు. మీడియా, అడ్వర్టైజ్మెంట్ రంగాల వారు ఇలాంటి అంశంపై చర్చించడం ఆహ్వానించదగ్గ పరిణామమని ఐఏఏను ప్రశంసించారు. సమాజంలో మహిళలు అన్ని విషయాల్లోనూ పురుషుల కంటే పది రెట్లు ఎక్కువ కష్టపడాల్సి వస్తోందని ఈ పరిస్థితిలో మార్పు రావాలని, ఇకపై లింగ వివక్ష, స్టీరియోటైపింగ్ విషయాల్లో అందరూ తమ అభ్యంతరాలను స్పష్టంగా వ్యక్తం చేయడం ద్వారా మాత్రమే ఈ మార్పు సాధ్యమని వివరించారు. ‘నిర్భయ’ తరువాత కొంత మార్పు... ప్రకటనలు, సినిమాలు, ఇతర కంటెంట్లలో మహిళ వివక్ష, స్టీరియోటైపింగ్ నిర్భయ ఘటన మారిందని, బాధితుల పేర్లు ప్రస్తావించకపోవడం మొదలుకొని, వారినే దోషులుగా చూపడం వరకూ మీడియా సంయమనంతో వ్యవహరిస్తోందని పాపులేషన్ ఫస్ట్ డైరెక్టర్ డాక్టర్ ఏ.ఎల్.శారద తెలిపారు. డిజిటల్ మాధ్యమం కారణంగా మహిళల అంశాలపై వివరంగా చర్చించే అవకాశం లభిస్తోందని, ప్రకటనలు ఇతర కంటెంట్లలో మహిళలను కించపరచడం తగ్గిందని, యువతకు సంబంధించిన ప్రకటనలో అందరినీ కలుపుకుపోయేలా కంటెంట్ ఉంటోందని ఆమె వివరించారు. ఈ మార్పు భవిష్యత్తులోనూ కొనసాగుతుందన్న ఆశాభావాన్ని డాక్టర్ ఏఎల్ శారద వ్యక్తం చేశారు. అంతకుముందు యూనిసెఫ్ ఇండియా ప్రతినిధి, పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్స్ నిపుణులు గీతాంజలి మాస్టర్ మాట్లాడుతూ ప్రకటనల్లో లింగవివక్ష, స్టీరియోటైపింగ్లపై యునిసెఫ్ జరిపిన పరిశోధన వివరాలను వెల్లడించారు. సమావేశంలో యాక్సెంచర్ మేనేజింగ్ డైరెక్టర్ చారులత రవికుమార్ ‘రెస్పాన్సిబుల్ కమ్యూనికేషన్’ అన్న అంశంపై ప్రసంగిస్తూ కంటెంట్లో ఇప్పటికే సున్నితంగా.. పరోక్షంగా లింగవివక్ష కొనసాగుతోందని వివరించారు. ఐఏఏ ఇండియ ఛాప్టర్ అధ్యక్షులు అవినాశ్ పాండే, ఐఏఏ విమెన్స్ ఎంపవర్మెంట్ కమిటీ ఛైర్పర్సన్ నీనా ఎలవియా జైపూరియా, ‘సాక్షి’ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ రాణిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‘జెండర్ కాన్షస్ అండ్ పర్పస్ఫుల్ ఎంటర్టైన్మెంట్’ ‘జెండర్ కాన్షస్ క్రియేటివిటీ ఇన్ కమ్యూనికేషన్స్’, ‘కాన్షస్ క్రియేటివిటీ ఇన్ ఫిల్మ్స్, ఓటీటీ, అండ్ అడ్వర్టైజింగ్’ అంశాలపై ప్యానెల్ డిస్కషన్ నడిచింది. యాంకర్ స్వప్న సమన్వయకర్తగా వ్యవహరించగా సినీ నటుడు అవసరాల శ్రీనివాస్, దర్శకులు నందినీ రెడ్డి, వైల్యులు ప్రణతి రెడ్డి, ఐపీఎస్ అధికారిణి శిఖా గోయెల్ తదితరులు పాల్గొన్నారు. కాస్మోస్ మాయా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో మేఘ తాత ఒక ప్యానెల్ డిస్కషన్కు సమన్వయ కర్తగా వ్యవహరించారు. చదవండి: అసెంబ్లీలో కేటీఆర్, ఈటల మధ్య ఆసక్తికర సన్నివేశం.. -
లింగ పక్షపాతంపై ఐఏఏ సదస్సు.. ముఖ్య అతిథిగా గవర్నర్ తమిళిసై
హైదరాబాద్: ఇంటర్నేషనల్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ (ఐఏఏ), ఇండియా చాప్టర్ ఫిబ్రవరి 3న హైదరాబాద్లోని టీ-హబ్ వేదికగా 'జెండర్ సెన్సిటైజేషన్ ఇన్ మీడియా' అంశంపై సదస్సు నిర్వహిస్తోంది. 30 సెకన్ల TV ప్రకటన నుంచి నుంచి 3 గంటల సినిమాల్లో మహిళలకు ఎలాంటి ప్రాధాన్యం ఇస్తున్నారనే విషయంపై చర్చించనున్నారు. పరిశ్రమలో లింగ పక్షపతాన్ని విచ్ఛిన్నం చేయాల్సిన ఆవశ్యకతపై మాట్లాడనున్నారు. 'వాయిస్ ఆఫ్ ఛేంజ్' పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్తో పాటు ఇతర ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ ఈవెంట్కు ప్రిన్సిపల్ పార్ట్నర్గా సాక్షి మీడియా గ్రూప్, నాలెడ్జ్ పార్ట్నర్గా యూనిసెఫ్ వ్యవహరిస్తున్నాయి. ఇంటర్నేషనల్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ అనేది అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు, మీడియాకు ప్రాతినిధ్యం వహించే ఏకైక ఏకీకృత ప్రకటనల వాణిజ్య సంస్థ. ఇందులో కార్పొరేట్, విద్యా అనుబంధ సంస్థలు, టాప్-10 దేశాలతో పాటు ప్రపంచవ్యప్తంగా 76 దేశాలకు చెందిన యువ నిపుణులు సభ్యులుగా ఉన్నారు. 80 ఏళ్లుగా ఉన్న ఈ సంస్థ ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉంది. -
ప్రతిస్పందించే తీరులో మెదడుకూ ‘జెండర్’ భేదం.. ఆసక్తికర విషయాలు ఇవే..
విషయాలను అర్థం చేసుకోవడంతో పాటు వివిధ అంశాలపై ప్రతిస్పందించే తీరులో మెదడుకూ లింగ భేదం (బ్రెయిన్ జెండర్) ఉందని తేలింది. విభిన్న రంగాలను, విషయాలను అర్థం చేసుకునే విషయంలో ‘జెండర్’ ప్రధాన అంశంగా ఉన్నట్టుగానే.. తాజాగా జరిగిన మెదడు అధ్యయనంపై కూడా ‘జెండర్’ ప్రధాన భూమిక ΄పోషిస్తోందని తెలుస్తోంది. మెదడుకు సంబంధించిన పూర్తి విషయాలు ఇప్పటికీ తెలియనప్పటికీ ‘జెండర్’ కేంద్రంగా జరిగిన తాజా అధ్యయనాలు మాత్రం విచిత్రంగానూ, కొంచెం విభిన్నంగానూ ఉన్నాయి. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/ కేజీ రాఘవేంద్రారెడ్డి: మనిషి మెదడు.. ఓ అంతుచిక్కని వ్యవహారం. మనిషి మొత్తం బరువులో కేవలం 2 శాతం బరువు ఉండే మెదడు మనిషి ఉపయోగించే మొత్తం ఆక్సిజన్లో ఏకంగా 20 శాతం ఉపయోగించుకుంటుంది. అంటే ఏ స్థాయిలో మెదడు పనిచేస్తుందో ఇది తెలియజేస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అయితే, ఇప్పటికీ మెదడును ఏ మేరకు అర్థం చేసుకున్నామని అడిగితే.. ‘మనం ఇంకా క్రిమికీటకాల మెదడునే అర్థం చేసుకోలేదు’ అని అలెన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రెయిన్ సైన్సెస్ చీఫ్ సైంటిస్ట్ క్రిస్టోఫ్ కోచ్ చెబుతున్నారు. వాస్తవానికి మనిషి మెదడులో 86 బిలియన్ సెల్స్ ఉంటాయి. వీటికి 100 ట్రిలియన్ కనెక్షన్లు ఉంటాయని అంచనా. కానీ.. క్రిమికీటకాల మెదడులో కేవలం 302 సెల్స్ ఉంటాయి. అయినా పురుగు మెదడునే ఇంకా అధ్యయనం చేయలేక΄ోతున్నామని కోచ్ చెబుతున్నారంటే.. మనిషి మెదడును అధ్యయనం చేసేందుకు ఇంకా ఎంత సమయం పడుతుందో ఊహించడానికి కూడా కష్టమే. కాగా, ఇప్పటివరకు జరిగిన పరిశోధనల్లో తాజాగా నిర్వహించిన పరిశోధన కాస్త విభిన్నంగా సాగింది. ఇది మగ/ఆడ (జెండర్) మెదళ్ల మధ్య వ్యత్యాసాలను తేటతెల్లం చేసింది. భావోద్వేగ సంబంధాలకే ప్రాధాన్యం పురుషులతో పోలిస్తే మహిళలు భావోద్వేగ సంబంధాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారని మరికొందరు తమ అధ్యయనాల ద్వారా గుర్తించారు. ఇందుకోసం అప్పుడే పుట్టిన పిల్లలు తమ మొదటి 24 గంటల సమయాన్ని ఎవరు దేనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారో అధ్యయనం చేయడం ద్వారా నిర్ణయానికి వచ్చామని కేంబ్రిడ్జి శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఇందుకోసం మొబైల్ బొమ్మతో ΄పాటు కొద్దిమంది వ్యక్తులను ఎదురుగా ఉంచి.. అప్పుడే పుట్టిన 102 మంది పిల్లలపై కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన సైమన్ బారన్, కోహెన్ శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. పుట్టిన తర్వాత మొదటి 24 గంటల΄పాటు ఎంతసేపు మొబైల్ బొమ్మతోను, మనుషులతోను పిల్లలు సమయాన్ని వెచి్చస్తున్నారో తెలుసుకునేందుకు దీనిని చేపట్టారు. విచిత్రంగా మగపిల్లలు ఎక్కువగా మొబైల్ బొమ్మను చూడటంపైనే దృష్టి కేంద్రీకరించారు. ఆడ పిల్లలు మాత్రం ఎక్కువగా మనుషులవైపే తమ దృష్టిని ఎక్కువ సమయం కేంద్రీకరించడం గమనార్హం. అంటే పుట్టుకతోనే అబ్బాయిలకు వస్తువులపైన, అమ్మాయిలకు బంధాలపై ఎక్కువ అటెన్షన్ ఉంటుందని తేల్చారు. అయితే, కేవలం ఈ ఒక్క అంశం ద్వారానే తుది నిర్ణయానికి రాలేమని మరి కొద్దిమంది శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా జెండర్ అంశం కేంద్రంగా మెదడు అధ్యయనాలు జరగడం ద్వారా కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తుండటాన్ని మాత్రం లింగభేదంతో సంబంధం లేకుండా అందరూ ఆహా్వనించాల్సిందే. పురుషుల్లోనే భయం ఎక్కువ.. సహజంగా శారీరక దారుఢ్యం మహిళల కంటే పురుషులకే కాస్త ఎక్కువనేది తిరుగులేని వాస్తవం. ఇందుకు జన్యుపరమైన అంశాలతో ΄ాటు తరతరాలుగా జరిగిన పని విభజన కూడా ఒక కారణంగా చెబుతారు. కానీ.. మెదడు విషయానికి వస్తే శారీరక దారుఢ్యంతో΄ాటు మెదడు పరిమాణం కూడా స్త్రీలతో ΄ోలిస్తే మగవారిలో కొంచెం ఎక్కువగానే ఉన్నట్టు తేలింది. లైజ్ ఎలియట్, అతని టీం సభ్యులు చేసిన అధ్యయనాల ప్రకారం.. పురుషుల మెదడు స్త్రీల మెదడు కంటే పరిమాణంలో 15 శాతం పెద్దగా ఉంటుందని తేలింది. ఇందుకు అనుగుణంగా అమిగ్డాలా (మనిషి భావోద్వేగంతో ముడిపడిన మెదడులోని ఒక భాగం) కూడా పరిమాణంలో పురుషుల్లోనే ఎక్కువ. పురుషుల్లోని అమిగ్డాలాను స్త్రీలలోని అమిగ్డాలాతో ΄ోల్చి అధ్యయనం చేస్తే పురుషుల్లోనే ఎక్కువ భయం ఉంటుందని వీరి అధ్యయనాల్లో తేలింది. స్త్రీలలోనే భావోద్వేగాలు అధికం పురుషులు, మహిళల్లో ఎవరికి ఎక్కువ భావోద్వేగం ఉంటుందనే అంశంపైనా పరిశోధనలు జరిగాయి. జీవితంలో జరిగిన ఏదైనా ఘటన లేదా సామాజికంగా బాగా గుర్తుండి΄ోయేలా జరిగిన బాధాకరమైన ఘటనలను గుర్తుచేస్తే ఏం జరుగుతుందో పరిశీలించారు. పురుషుల కంటే ఎక్కువగా స్త్రీలకే అటువంటి భావోద్వేగ ఘటనలు గుర్తుకు వస్తున్నాయని తేలింది. పురుషులతో ΄ోలిస్తే ఆ సంఘటన తాలూకు వివరాలను స్త్రీలు వెంటనే గుర్తుతెచ్చుకోవడంతో ΄ాటు పురుషుల కంటే ఎక్కువగా ఆ ఘటనలకు సంబంధించిన విషయాలను కూడా పేర్కొనడాన్ని గమనించారు. మెదడుపై ‘జెండర్’ అధ్యయనాల్లో కొన్ని.. జెండర్ కేంద్రంగా ఇప్పటికే వివిధ పరిశోధనలు జరిగాయి. 1991లో మొదలైన ఈ అధ్యయనాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. - మొదటిసారిగా 1991లో అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేసిన డయాన్ హాల్పెర్న్ ‘సెక్స్ డిఫరెన్సెస్ ఇన్ కాగి్నటివ్ ఎబిలిటీస్’ అనే అంశంపై అధ్యయనం చేసి నివేదిక రూపొందించారు. - 1995లో స్టాండ్ఫర్డ్ ప్రొఫెసర్ నైరో షా... స్త్రీ, పురుషుల మెదళ్లపై అధ్యయనం చేశారు. - 2017లో జెండర్ కేంద్రంగా పలువురు రాసిన 70 ఆరి్టకల్స్తో కూడిన ‘జర్నల్ ఆఫ్ న్యూరోసైన్స్ రీసెర్చ్’ ప్రత్యేక సంచికను ్ర΄÷ఫెసర్ లారి కాహిల్ వెలువరించారు. - 2021లో బ్రిటన్లో 40 సంవత్సరాల వయసు పైబడిన 5 లక్షల మందికి చెందిన జెనటిక్, హెల్త్ డేటాపై ఆస్టన్ యూనివర్సిటీకి చెందిన గినా రిప్పన్ అనే న్యూరో బయాలజిస్టు అధ్యయనం చేశారు. -
ఆమె కోసం అతడుగా మారిన టీచర్!
ప్రేమ ఎంతపనైనా చేయిస్తుందనడంలో సందేహం లేదు. అందుకు సంబంధించిన పలు ఘటనలు ఎన్నో చూశాం. అచ్చం అలానే ఇక్కడొక మహిళ తాను ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకునేందుకు అతడిగా మారింది. వివరాల్లోకెళ్తే...రాజస్తాన్కి చెందిన కుంతల్ అనే పీటీ టీచర్ తన విద్యార్థి కల్పనా ఫౌజ్దార్తో ప్రేమలో పడింది. అదీగాక కల్పన రాష్ట్రస్థాయి కబడ్డీ ప్లేయర్. దీంతో వారి మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగి ప్రేమగా మారిందని చెబుతోంది ఆ జంట. అంతేకాదు ఆ మహిళ టీచర్ తను ప్రేమించిన అమ్మాయి కోసం అబ్బాయిగా మారాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. తాను మహిళాగా జన్మించినప్పటికీ తాను అబ్బాయిగానే భావించేదాన్ని అని చెబుతోంది కుంతల్. ఈ మేరకు సదరు టీచర్ 2019లో సర్జరీ చేయించుకుని అతడుగా మారింది. ఆ తర్వాత ఆ టీచర్ తన పేరుని ఆరవ్గా మార్చుకుంది. ఈ క్రమంలో ఆమె ప్రియురాలు కల్పన మాట్లాడుతూ.... తనకు మొదటి నుంచి ఆమె అంటే ఇష్టం అని సర్జరీ చేయించుకోకపోయినా ఆమెనే పెళ్లి చేసుకునే దాన్ని అని చెబుతోంది. భారతీయ సామాజిక నిబంధనలకు తమ విహహం విరుద్ధమైనా తమ తల్లిదండ్రులు అంగీకరించారని ఆ జంట ఆనందంగా చెబుతోంది. (చదవండి: తప్పతాగి మహిళ గదిలో నగ్నంగా.. ప్రముఖ కంపెనీ అధికారి నిర్వాకం వెలుగులోకి!) -
ఇంటర్వ్యూలో ఆమె వయసు అడిగినందుకు... పరిహారంగా రూ. 3 లక్షలు..
అమ్మాయి వయసు మగాడి జీతం అడగకూడదని పెద్దలు అంటుంటారు. బహుశా ఇందుకేనేమో పాపం ఆ కంపెనీ ఇంటర్వ్యూలో అమ్మాయి వయసు అడిగినందుకు పరిహారంగా ఏకంగా రూ. 3లక్షలు చెల్లించుకోవాల్సి వచ్చింది. అసలేం జరిగిందంటే...డోమినోస్ పిజ్జా డెలివరీ డ్రైవర్ ఉద్యోగ ఇంటర్వ్యూలో నార్తర్న్ ఐర్లాండ్లోని జానిస్ వాల్ష్ అనే మహిళ ఒక చేదు అనుభవాన్ని ఎదుర్కొంది. జానిస్ వాల్ష్ అనే మహిళ ఇంటర్వ్యూ సంభాషణలో ఆమె వయసు గురించి ప్రశ్నించారు. ఆ తర్వాత ఆమె దరఖాస్తు తిరస్కరణకు గురైంది. వాస్తవానికి వాల్ష్ ఈ ఇంటర్వ్యూలో ఎంపికైంది కానీ ఆమె వయసు కారణంగా తిరస్కరణకు గురైనట్లు తెలుసుకుని తీవ్ర ఆవేదనకు గురైంది. అదీగాక 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న యువకులనే తీసుకుంటారని తెలుసుకున్న తర్వాత తాను లింగ వివక్షతకు గురైనట్లు తెలుసుకుంది. దీంతో వాల్ష్ తాను ఇంటర్వ్యూలో వయసు వివక్షత కారణంగా ఉద్యోగాన్ని కోల్పోయానని వివరిస్తూ... డోమినోస్ స్టోర్ ఫేస్బుక్లో మెసేజ్ పెట్టింది. వెంటనే ఇంటర్వ్యూ చేసిన సదరు వ్యక్తి క్విర్క్ ఆమెకు క్షమాపణలు చెప్పడమే గాక వయసు గురించి అడగకూడదని తనకు తెలియదని వివరణ ఇచ్చాడు. కానీ ఆ కంపెనీ మాత్రం పిజ్జా డెలీవరీ జాబ్స్ ప్రకటనను ఇస్తూనే ఉండటంతో...వాల్ష్ మరింత దిగులు చెందింది. తనకు డ్రైవింగ్ వచ్చినప్పటికీ కేవలం మహిళను కావడం వల్లే ఈ ఉద్యోగం రాలేదని భావించి వాల్ష్ కోర్టు మెట్లెక్కింది. ఐతే ఆమెకు ఐర్లాండ్ ఈక్వాలిటీ కమీషన్ మద్దతు లభించింది. వ్యాపారాలు యువతకు ఉపాధిని కల్పించడం తోపాటు సమానత్వాన్ని పాటించాలని, అలా లేనప్పుడు ఉద్యోగులు హక్కులు ఎలా రక్షింపబడతాయని సదరు కంపెనీని కోర్టు ప్రశ్నించింది. వాల్ష్కు సదరు డోమినోస్ కంపెనీ దాదాపు రూ. 3.7 లక్షలు పరిహారం చెల్లించాలని కోర్టు స్పష్టం చేసింది. (చదవండి: వెరైటీ వెడ్డింగ్ కార్డు! హర్ష గోయెంకా మనసును దోచింది!) -
లింగ సమానత్వం.. 146 దేశాల సూచికలో భారత్ ర్యాంక్ 135!
న్యూఢిల్లీ: లింగ సమానత్వం విషయంలో ఐస్లాండ్ ప్రపంచంలో తొలి స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో ఫిన్లాండ్, నార్వే, న్యూజిలాండ్, స్వీడన్ నిలిచాయి. మొత్తం 146 దేశాల సూచికలో భారత్ ర్యాంక్ 135! అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, కాంగో, ఇరాన్, చాద్ తదితర దేశాలు అట్టడుగులు స్థానాల్లో నిలిచాయి. జెనీవాలోని ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) ‘వార్షిక జెండర్ గ్యాప్ రిపోర్ట్–2022’ను బుధవారం చేసింది. లింగ సమానత్వంలో ప్రపంచ దేశాలకు ర్యాంక్లను కేటాయించింది. లింగ అంతరం పూర్తిగా సమసిపోవడానికి మరో 132 ఏళ్లు పడుతుందని అంచనా వేసింది. లింగ సమానత్వంలో భారత్ వెనుకంజలో ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవహారాలు, ఉద్యోగ–ఉపాధి అవకాశాల్లో వారి భాగస్వామ్యం పెరుగుతుండడం సంతోషకరమని పేర్కొంది. మహిళా ప్రజాప్రతినిధులు తదితరుల సంఖ్యలో పెరుగుదల కన్పించింది. చదవండి: లంకాధ్యక్షుడి జంప్ జిలానీ.. గొటబయ గో! అంటే ముల్లేమూటా సర్దాల్సిందే! -
భారత్లో లింగ సమానత్వానికి ఎన్నేళ్లు పడుతుందో తెలుసా?
జెనీవా: భారత్ శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకెళ్తున్నా లింగ సమానత్వంలో మాత్రం వెకబడిపోయింది. జెనీవాలోని ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) 'వార్షిక లింగ అంతర నివేదిక 2022' ప్రకారం భారత్ 135వ స్థానంలో నిలిచింది. గతేడాదితో పోలిస్తే ఒక స్థానం మెరుగైనా.. ఇంకా అట్టడుగునే కొనసాగుతోంది. ఐలాండ్స్ మరోమారు లింగ సమానత్వంలో తన తొలిస్థానాన్ని నిలబెట్టుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో ఫిన్లాండ్, నార్వే, న్యూజీలాండ్, స్వీడన్లు ఉన్నాయి. మరో 132 ఏళ్లు.. మొత్తం 146 దేశాలకు ర్యాంకులు కేటాయించగా.. భారత్ అట్టడుగున 135వ స్థానంలో నిలవటంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత్ కన్నా అఫ్గానిస్థాన్, పాకిస్థాన్, ఇరాన్, ఛాడ్ వంటి 11 దేశాలు మాత్రమే వెనబడి ఉన్నాయి. జీవన వ్యయం పెరిగిపోతుంటటం వల్ల ప్రపంచవ్యాప్తంగా స్త్రీ, పురుషుల మధ్య అంతరం పెరిగిపోతోందని డబ్ల్యూఈఎఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. దాని ప్రకారం భారత్లో స్త్రీపురుషులు సమానంగా మారేందుకు మరో 132 ఏళ్లు(2021లోని 136వ ర్యాంకు ప్రకారం) పడుతుందని అంచనా వేసింది. కరోనా మహమ్మారి సైతం లింగ అంతరంలో ఓ తరం వెనక్కు వెళ్లేలా చేసిందని తెలిపింది. గడిచిన 16 ఏళ్లలో భారత ర్యాంకు 7 స్థానాలు ఎగబాకినా.. ఇంకా అట్టుడుగునే ఉందని ఆందోళన వ్యక్తం చేసింది డబ్ల్యూఈఎఫ్.' భారత్లోని సుమారు 662 మిలయన్ల మంది మహిళ జనాభాతో ప్రాంతీయ ర్యాంకులపై ప్రభావం పడుతోంది. 2021తో పోలిస్తే.. ఆర్థిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం, అవకాశాల్లో మెరుగైనప్పటికీ.. కార్మిక శక్తిలో మరింత కిందకు పడిపోయింది. శాసనకర్తలు, ఉన్నతాధికారులు, మేనేజర్స్ విభాగాల్లో మహిళలు 14.6 శాతం నుంచి 17.6 శాతానికి చేరుకున్నారు. సాంకేతిక, వృత్తి నిపుణుల్లో మహిళలు 29.2 నుంచి 32.9 శాతానికి చేరారు. వారి ఆదాయం పెరిగింది. అయితే.. మగవారితో పోలిస్తే వారికి అందే గౌరవంలో మాత్రం అంకా వెనకబడే ఉన్నారు. కొన్ని సందర్భాల్లో మగవారి కోసం వారిని తిరస్కరిస్తున్నారు.' అని పేర్కొంది నివేదిక. ఆ విభాగంలో ఊరట.. మహిళల రాజకీయ సాధికారతలో భారత్ 48వ స్థానంలో నిలిచింది. గత యాభై ఏళ్లుగా మహిళలకు రాజకీయాల్లో దక్కుతున్న స్థానం చాలా తక్కువ. దాంతో ఈ ర్యాంకు మరింత పడిపోయినట్లు డబ్ల్యూఈఎఫ్ తెలిపింది. మరోవైపు.. ఆరోగ్యం, జీవన విధానంలో భారత్ 146వ స్థానానికి పరిమితమైంది. లింగ అంతరం 5 శాతానికిపైగా ఉన్న ఐదు దేశాల్లో ఒకటిగా నిలిచింది. అయితే.. భారత్కు ఊరట కలిగించే విషయం ఏంటంటే ప్రాథమిక పాఠశాలల నమోదులో లింగ సమానత్వంలో టాప్లో నిలిచింది. ఇదీ చూడండి: ప్లాస్టిక్ను తినేసే 'రోబో ఫిష్'.. సముద్రాల స్వచ్ఛతలో కీలక అడుగు! -
పురుషులకు అండగా స్త్రీ గొంతుక
ఏ చిన్న ఆరోపణ వచ్చినా మహిళలపై ఉన్న సానుభూతితో పురుషుణ్ణి దోషిగా నిర్ధారించి, వెనకా ముందు చూడకుండా శిక్ష విధిస్తారు. పురుషులు కూడా ఒకరికి తండ్రి, మరొకరికి భర్త, ఇంకొకరికి అన్నయ్య లేదా తమ్ముడు అయ్యుంటారు. వారికి సరైన న్యాయం అందాలి అని అంటున్నది మరో పురుషుడు కాదు స్త్రీమూర్తి. అవును మీరు చదివింది నిజమే. సమాజంలో చేయని నేరానికి అన్యాయంగా శిక్షను అనుభవిస్తోన్న ఎంతోమంది పురుషుల కోసం నడుం బిగించి పోరాడుతోంది బర్ఖా త్రెహాన్. సాటి మహిళలకు కాకుండా మగవారి తరపున పోరాడుతూ మీటూతోపాటు ‘మెన్టు’ కూడా ఉంది. దీనిని మనమంతా గుర్తించాల్సిన అవసరం చాలా ఉంది అని నొక్కి చెబుతోంది. ఒక స్త్రీగా సాటి మహిళలకు అండగా నిలవాల్సిందిపోయి మగవాళ్ల సాధక బాధలను అర్థం చేసుకుని వారితరపున పోరాడుతోన్న బర్ఖా త్రెహాన్ అల్లాహాబాద్లో పుట్టి పెరిగింది. చిన్నప్పటి నుంచి ఏ విషయంలోనైనా న్యాయం పక్కన నిలబడి గొంతువిప్పి మాట్లాడే స్వభావం తనది. పెళ్లి చేసుకుని ఢిల్లీకి వచ్చాక ఓ స్కూల్లో టీచర్గా పనిచేసేది. ఈ సమయంలో కూడా న్యాయం తరపున నిలబడేది. స్నేహితుడిపై వచ్చిన ఆరోపణతో... ఒకసారి బర్ఖా స్నేహితుడు ఓ అమ్మాయిని అత్యాచారం చేశాడన్న ఆరోపణతో చీకటి గదిలో పడేశారు. ఆవిషయం గురించి తెలుసుకున్న బర్ఖా లోతుగా విచారించగా.. అది అబద్ధపు ఆరోపణ అని తెలిసింది. ఆరోపణ చేసినవారు ఉద్దేశ్యపూర్వకంగా చేసారని నిరూపించడానికి ప్రయత్నించింది. ఈ కేసులో భాగంగా ఇలా ఎంతోమంది మగవాళ్లు అసత్య ఆరోపణలతో తీవ్రంగా బాధింపడుతున్నారని గ్రహించింది. అప్పటి నుంచి వారి తరపున నిలబడి పోరాడుతోంది. కమిషన్ ఉండాలి.. ఇండియాలో పక్షులు, జంతువులు, మొక్కల పరిరక్షణకు ఎన్నో చట్టాలు ఉన్నాయి. కానీ మగవాళ్ల గోడును వినే కమిషన్లు గానీ చట్టాలు కానీ ఏవీ లేవు. మహిళలకంటే పురుషులు ఎక్కువమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని తన పరిశీలనలో తెలుసుకున్న బర్ఖా..దీనిని సీరియస్గా తీసుకుని పురుషులకు న్యాయం చేయాలన్న లక్ష్యంతో ‘మెన్స్ కమిషన్ను ఏర్పాటు చేసింది. దీనిద్వారా తన దృష్టిలోకి వచ్చిన అనేకమంది సమస్యలను పరిష్కరిస్తోంది. భౌతిక దాడులకు గురైన భర్తలకు తగిన సహాయ సహకారాలు అందిస్తోంది. ఇలా తనకు చేతనైన రీతిలో న్యాయం చేస్తోన్న బర్ఖాను ఎంతోమంది ట్రోల్ చేయడం, చంపేస్తామని బెదిరింపులు వచ్చినప్పటికీ ఏమాత్రం వెనక్కు తగ్గకుండా తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు తీవ్రంగా కృషిచేస్తోంది. వారి వేదనను అర్థం చేసుకోవాలి ‘‘ఎన్ని సమస్యలు వచ్చినా నేను పోరాడతాను. ఎవరి బెదిరింపులకూ భయపడేది లేదు. చిన్నప్పటి నుంచి నాలో ఉన్న పోరాటాన్ని ఎవరూ ఆపలేరు. నేను సమాజంలో మార్పు కోరుతున్నాను. ప్రభుత్వాలు మగవాళ్లకు ప్రత్యేకంగా చట్టాలు ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలి. వారి మనో వేదనను కూడా అర్థం చేసుకోవాలి’’ అని బర్ఖా ప్రభుత్వాలను కోరుతోంది. -
నల్సార్ సాహసోపేతమైన నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ఎల్జీబీటీక్యూ+ (లెస్బియన్, గే, ద్విలింగ, ట్రాన్స్జెండర్, క్వీర్ ప్లస్ ) విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ఒకడుగు ముందుండే నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ (నల్సార్) మరో సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకుంది. లింగ గుర్తింపు లేనివారి కోసం హాస్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. లేడీస్ హాస్టల్–6లో ఏర్పాట్లు.. నల్సార్లో బాలికల హాస్టల్–6 భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ను పూర్తిగా లింగ గుర్తింపు లేని (జెండర్ న్యూట్రల్)వారికోసం కేటాయించారు. అకడమిక్ బ్లాక్లో గ్రౌండ్ ఫ్లోర్లో లింగ గుర్తింపు లేనివారి కోసం వాష్రూమ్స్ను ఏర్పాటు చేశామని నల్సార్ వైస్ చాన్స్లర్ ఫైజాన్ ముస్తఫా ఆదివారం ట్విట్టర్లో తెలిపారు. ఇక ‘జెండర్, సెక్సువల్ మైనారిటీ’అంశాలపై సమగ్ర విద్యా విధానం కోసం యూనివర్సిటీ ట్రాన్స్ పాలసీ కమిటీ ముసాయిదా విధానాన్ని త్వరలో అమలు చేయనుంది. 2015 జూన్లో నల్సార్లోని ఓ 22 ఏళ్ల బీఏ ఎల్ఎల్బీ విద్యార్థి తన గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లో జెండర్ గుర్తింపు వద్దని వర్సిటీ ప్రతినిధులను అభ్యర్థించగా.. ఆ అభ్యర్థనను ఆమోదించి.. సదరు స్టూడెంట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లో జెండర్ కాలమ్లో మిస్టర్, మిస్కి బదులుగా ‘ఎంఎక్స్’గా పేర్కొంటూ సర్టిఫికెట్ను జారీ చేసింది. నల్సార్ వర్సిటీకి రూ.1.50 కోట్ల విరాళం శామీర్పేట్: నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆండ్ బిజినెస్ లా(జేఆర్సీఐటీబీఎల్) అంతర్జాతీయ వాణిజ్య, వ్యాపార న్యాయ కేంద్రం ఏర్పాటుకు దాత జస్టిస్ బీపీ. జీవన్రెడ్డి రూ. కోటి 50 లక్షల చెక్కును నగరంలోని ఆయన నివాసంలో ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... అంతర్జాతీయ వాణిజ్య, వ్యాపారకేంద్రం ఏర్పాటుతో చట్టాల్లో సమకాలిన సమస్యలకు సంబంధించిన బోధన, పరిశోధన చేపట్టే లక్ష్యాలు అయిన సెమినార్లు, ఉపన్యాసాలు, స్వల్పకాలిక శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. నల్సార్ అండర్ గ్రాడ్యూయేట్, పోస్ట్ గ్రాడ్యూయేట్, డాక్టోరల్ స్థాయిలో కోర్సులను ప్రారంభించడం, బలోపేతం చేయడం, పరిశోధన, ప్రచురించడానికి విధాన రూపకర్తలతో సహకరించడానికి ఐఎంఎఫ్, ఐబీఆర్వో, డబ్ల్యూటీవీ. సీఐఐ, ఎఫ్ఐసీసీఐ మొదలైన వివిధ అంతర్జాతీయ, జాతీయ సంస్థలతో ఇంటర్నషిప్లను పొందడంలో సహాయం చేయడానికి అధ్యాపక బృందం కృషిచేసిందన్నారు. సుప్రీంకోర్డు మాజీ న్యాయమూర్తి పివి రెడ్డి, జస్టిస్ ఎస్ఎస్ఎం కాద్రీ, జస్టిస్ బి. సుదర్శన్రెడ్డి, సుప్రీకోర్డు న్యాయమూర్తి సుభాష్రెడ్డి, పాట్నా హై కోర్డు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎల్. నర్సింహారెడ్డి, తెంలగాణ హై కోర్డు న్యాయమూర్తులు ఉజ్వల్భూయాన్, రాజశేఖర్రెడ్డి, పి.నవీన్రావు, బార్ కౌన్సిల్ చైర్మెన్ జస్టిస్ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నాకంటూ ఓ గది, ఓ బాత్రూమ్ ప్రత్యేకంగా ఉండాలి: స్టార్ హీరోయిన్
Konkona Sen Sharma Says She Does Not See Herself As Woman: బాలీవుడ్ బ్యూటీ కొంకణ సేన్ శర్మ పేజ్ 3, ఓంకార, లక్ బై ఛాన్స్, తల్వార్ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో జెండర్ ఈక్వాలిటీపై తనకున్న భావాన్ని పంచుకుంది. తాను లింగ సమానత్వంలో న్యూట్రల్గా ఉంటానని పేర్కొంది. ఈ ఇంటర్వ్యూలో 'నేను ఒక చిత్రంలో ఫెమినిస్ట్గా నటించాల్సి వస్తే స్త్రీవాది గురించి తెలుసుకోవాలి. ఆ పాత్రకు తగినట్లుగా ఏదైనా నేర్చుకోవాలి. స్త్రీ అయినా, పురుషుడైనా, మరేవరైనా కచ్చితంగా న్యూట్రల్గానే ఆలోచించాలని నేను భావిస్తున్నా. అప్పుడే అందరికీ సమన్యాయం చేయగలుగుతామన్నదే నా అభిప్రాయం. అందుకో నన్ను నేను ఎప్పుడూ ఒక మహిళగా భావించుకోను.' అని చెప్పుకొచ్చింది. ఈ బ్యూటీ 2010లో యాక్టర్ రణ్వీర్ షోరేని వివాహం చేసుకుంది. పెళ్లైన ఐదేళ్లకు భర్తతో విడిపోయి 2020లో అధికారికంగా విడాకులు తీసుకుంది. ఈ జంటకు 11 ఏళ్ల కుమారుడు హరూన్ షోరే ఉన్నాడు. తన కొడుకును ఎప్పుడూ స్వేచ్ఛగా ఆలోచించమని చెబుతానని కొంకణ సేన్ తెలిపింది. అలాగే తన మాజీ భర్త గురించి చెబుతూ 'సమాజంలో ఉన్నప్పుడు కొన్నింటి గురించి నేర్చుకోవాలి. కొన్ని నియమాలు పాటించాలి. కానీ ఆయనకు సంబంధించి ఆయన ఏమైనా, ఎలాగైనా అనుకోవచ్చని భావిస్తాడు. జనాల కోసం అన్నింటిని భరిస్తూ ఉండటం నా వల్ల కాదు. నాకంటూ ఓ గది, ఓ బాత్రూమ్, ఏసీ వంటి మరికొన్ని సౌకర్యాలు ప్రత్యేకంగా ఉంటాలి. కొన్నిసార్లు ఎవరి అనుమతి లేకుండా నాకు నచ్చిన పనులు చేసేలా ఉండాలి.' అని కొంకణ సేన్ శర్మ తెలిపింది. -
‘ధరణి’ ప్రశ్నలకు జవాబేది.. రైల్వే ఆడా, మగా?
సాక్షి, హైదరాబాద్: దక్షిణమధ్య రైల్వేకు తండ్రి పేరు ఏం రాయాలి? పుట్టిన తేదీ కాలమ్లో ఏం నింపాలి? ఇంతకీ ఆడా, మగా అనే చోట ఏం రాయమంటారు?..కాజీపేట రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ భూమి యాజమాన్య మార్పిడి కోసం రెవెన్యూ సిబ్బంది అడిగిన ప్రశ్నలివి. వీటికి ఎలాంటి సమాధానం లేదు. ఆ వివరాలను నమోదు చేయకుండా లావా దేవీ నిలిచిపోయింది. దీనికి కారణం ‘ధరణి’ పోర్టల్లోని ఓ గందరగోళం. వినడానికి చిత్రంగా కనిపిస్తున్న ఈ సమస్యతో.. తెలంగాణలో కీలక రైల్వే ప్రాజెక్టు జాప్యం అవుతోంది. వాస్తవానికి అంతా సవ్యంగా జరిగి ఉంటే.. వచ్చేనెలలో పార్లమెంటులో ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్లో కాజీపేట రైల్వే ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు జరిగి ఉండే దని అధికారవర్గాలే చెప్తున్నాయి. భూమికి సంబంధించిన కోర్టు కేసులతో దాదాపు 13 ఏళ్లుగా జరుగుతున్న జాప్యం.. ఇప్పుడు ధరణి వల్ల మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. సమస్య ఎక్కడుంది?: దాదాపు 13 ఏళ్ల కింద కాజీపేటకు రైల్వే వ్యాగన్ వీల్ ఫ్యాక్టరీ మంజూరైంది. కాజీపేట సమీపంలోని మడి కొండలో ఉన్న సీతారామస్వామి దేవాల యానికి చెందిన 150 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. దానిపై కొందరు కోర్టుకు వెళ్లడంతో ఏళ్లకేళ్లు జాప్యం జరిగింది. ఈ లోగా రైల్వేశాఖ ఆ ప్రాజెక్టును వేరే రాష్ట్రానికి మార్చింది. తర్వాత దానిస్థానంలో రూ.383.05 కోట్ల వ్యయ అంచనాతో వ్యాగన్ ఓవర్హాలింగ్ వర్క్షాపును 2016లో మంజూరు చేసింది. రైల్వే బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం రైల్వేకు భూమిని కేటాయించకపోవడంతో ఆ నిధులు విడుదల కాలేదు. ఇన్నేళ్ల తర్వాత గత ఏడాది కోర్టుకేసు పరిష్కారమై.. రైల్వేకు భూమిని అప్పగించేందుకు మార్గం సుగమమైంది. నిబంధనల ప్రకారం.. ఆ భూమి పూర్తిగా రైల్వే పేరిట ట్రాన్స్ఫర్ కావాలి, ఆ తర్వాతే ఫ్యాక్టరీ పనులు చేపడతారు. రైల్వే అధికారులు ఈ విషయాన్ని రాష్ట్ర అధికారులకు చెప్పారు కూడా. కానీ ధరణిలో గందరగోళంతో సమస్య వచ్చి పడింది. సంస్థల పేరిట నమోదుకు చాన్స్ లేక.. ధరణిలో వ్యక్తుల వివరాలు నమోదు చేసే వెసులుబాటు ఉందేతప్ప.. సంస్థల పేరిట నమోదు చేసే అవకాశం లేదు. పేరు, తండ్రిపేరు, ఆడా/మగ, పుట్టిన తేదీ, వాటి తాలూకు ఆధారాలు వంటి వివరాలను సంస్థలకు అన్వయించడం కుదరదు. దీనివల్ల రైల్వేకు కేటాయించిన భూముల వివరాలు ధరణిలో చేరడం లేదు. ఇప్పటికే దాదాపు ఎనిమిది నెలల సమయం గడిచిపోయినా.. అధికారులు చిక్కు ముడిని విప్పలేకపోయారు. ప్రస్తుతం కేంద్ర బడ్జెట్ దగ్గరపడింది. ప్రాజెక్టు భూమి రైల్వే పేరిట ట్రాన్స్ఫర్ కాకపోవడంతో ఈసారి కూడా నిధులు కేటాయించే అవకాశం లేనట్టేనని, మరో ఏడాది వృధా అవుతుందని రైల్వే అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే రెవెన్యూ అధికారులు త్వరగా సమస్యను కొలిక్కి తెచ్చి.. భూమిని రైల్వే పేరిట మార్చితే కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు. ఇక మరో 11 ఎకరాల భూమికి సంబంధించి కూడా కొంత సమస్య నెలకొంది. అందులో పదెకరాలు పరిష్కారమైందని, ఇంకో ఎకరం కేటాయింపు త్వరలో అవుతుందని రెవెన్యూ అధికారులు వివరిస్తున్నారు. అయితే అంతా కలిపి ఇస్తేనే లెక్కగా ఉంటుందని, అసలు భూమి రానప్పుడు ప్రాజెక్టులో కదలికకు అవకాశం ఉండదని రైల్వే అధికారులు తేల్చి చెప్తున్నారు. ఏమిటీ ప్రాజెక్టు? రైల్వేలో వినియోగిస్తున్న గూడ్స్ వ్యాగన్లను నిర్ణీత సమయంలోగానీ, మరమ్మతులు వచ్చినప్పుడుగానీ సరిచేసి.. పూర్తిస్థాయిలో సిద్ధం చేయడం ఓవర్హాలింగ్ వర్క్షాపు పని. కాజీపేటలో చేపట్టదలచిన ఈ వర్క్షాప్లో నెలకు వంద గూడ్సు వ్యాగన్లను ఓవర్ హాలింగ్ చేసే సామర్థ్యంతో ఏర్పాటు చేయనున్నారు. దీనితో ప్రత్యక్షంగా 500 మందికి, పరోక్షంగా మరో వెయ్యి మందికి ఉపాధి దక్కుతుందని అంచనా. -
ఒళ్లంతా కనిపించేలా ఏంటా పచ్చబొట్లు ! ఇది కరెక్టేనా?
అన్ని రంగాల్లో మగవాళ్లతో సమానంగా మహిళలు రాణిస్తున్నా.. పూర్తి సమానత్వం ఇంకా రాలేదు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం ఇప్పటికీ కొన్ని విషయాల్లో పాత పద్దతులు పాటించడాన్నే సమర్థిస్తున్నారు. కొత్తగా ఎవరైనా ప్రయత్నిస్తే విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. ఇలాంటి విమర్శలు, సూటిపోటీ మాటలతో ఇబ్బంది పడుతున్న ఓ బిజినెస్ విమన్ ఇటీవల వాటి నుంచి విముక్తి పొందింది. తన జీవితంలో ఎదురైన అనుభవాలను ఇటీవల ఆమె తన లింక్డ్ఇన్లో పంచుకుంది. ఆమెకు ఎదురైన అనుభవాలు, వర్క్ప్లేస్లో కల్చర్ తదితర అంశాలు ఇప్పుడు బిజినెస్ వరల్డ్లో చర్చనీయాంశంగా మారాయి. అమెరికాలోని ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ మేనేజింగ్ కంపెనీల్లో ఒకటైన ఎవల్యూషన్ క్యాపిటల్ పార్టనర్ సంస్థలో జెస్సికా హాంజీ లియోనార్డ్ అనే మహిళ ఇటీవల భాగస్వామిగా చేరింది. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన వివరాలను ఆ సంస్థ వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి వచ్చింది. దీంతో ఎంతో బెరుకుగా ఆమె వాళ్ల బాస్ రూమ్లోకి అడుగు పెట్టింది. టాటాల చుట్టే విమర్శలు జెస్సికా హాంజీ లియోనార్డ్కి పచ్చబొట్లు (టాటూస్) అంటే ఇష్టం. మణికట్టు నుంచి భుజాలు, మెడ వరకు అనేక డిజైన్లలో పచ్చబొట్లు వేయించుకుంది. అయితే బిజినెస్ ఎగ్జిక్యూటివ్ హోదాలో అలా పచ్చబొట్లు పొడిపించుకున్నందుకు ఆమెకు తోటి ఉద్యోగుల నుంచి ఛీత్కారాలు ఎదురయ్యాయి. ముఖ్యంగా మహిళా ఉద్యోగులే ఆమె పట్ల కఠినమైన వ్యాఖ్యలు చేసేవారు. దీంతో ఆ పచ్చబొట్లు కనిపించకుండా ఆమె పొడుగు చేతులు ఉండే దుస్తులు ధరించాల్సి వచ్చేది. మెడ, చెవుల భాగంలో టాటూలు కనిపించకుండా హెయిర్స్టైల్ను మార్చుకునేది. ఇలాంటి చర్యలతో రణంగా సమ్మర్లో చాలా ఇబ్బందులు పడేది జెస్సికా. ఇంకా దాచలేను టాటూలు ఆమె పాలిట శత్రువులు కావడంతో అనేక కంపెనీలు మారుతూ వచ్చింది. తాజాగా ఎవల్యూషన్ క్యాపిటల్లో చేరింది. దీంతో వెబ్సైట్లో ఆమె ఫోటో, ఇతర వివరాలు వెల్లడించాల్సిన అవసరం వచ్చింది. కొత్త ఆఫీసులో టాటూలతో ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడాలని నిర్ణయించుకుంది. అందుకే బాస్ గదిలోకి అడుగు పెట్టిన జెస్సికా.. భయంభయంగానే తన ఒంటిపై ఉన్న టాటూల సంగతి చెప్పింది. ఇంకా వాటిని దాచి పెడుతూ ఉండలేనంది. ఆఫిషియల్ వెబ్సైట్లో జాకెట్(కోట్)తో కూడిన ఫోటోను అప్లోడ్ చేస్తానని, తన పర్సనల్ లింక్డ్ఇన్లో స్లీవ్లెస్ డ్రెస్తో టాటూలు కనిపించేలా ఉన్న ఫోటో అప్లోడ్ చేస్తానంటూ రిక్వెస్ట్ చేసింది. బాస్ ఎలా రియాక్ట్ అవుతాడో అనే టెన్షన్తో ఆమెలో పెరిగిపోతోంది. లౌడ్ అండ్ ప్రౌడ్ జెస్సికా రిక్వెస్ట్ని విన్న వాళ్ల బాస్ సానుకూలంగా స్పందించారు. ఒక్క లింక్డ్ఇన్లోనే ఎందుకు తమ సంస్థకు సంబంధించిన అఫిషీయల్ వెబ్సైట్లో కూడా టాటూ కనిపించేలా ఉన్న ఫోటోనే అప్లోడ్ చేసుకోమన్నారు. ఈ విషయంలో గోప్యత అనవసరమని.. రెండు చోట్ల స్లీవ్లెస్తో టాటూలు కనిపించేలా ఫోటోలు అప్లోడ్ చేయ్ విత్ లౌడ్ అండ్ ప్రౌడ్ అంటూ పర్మిషన్ ఇచ్చాడు. పెర్ఫార్మెన్స్ ముఖ్యం నేను కోటు ధరించానా ? స్లీవ్లెస్లో ఉన్నానా ? నా ఒంటిపై టాటూలు ఉన్నాయా? అనేవి అప్రాధాన్య విషయాలు. నేను ఎలా పని చేస్తున్నాను. నా పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది. వృత్తి పట్ల అంకితభావంతో ఉన్నానా లేనా అనేవే పరిగణలోకి తీసుకోవాలి. కానీ ఇంత కాలం అలా జరగలేదు. నా వృత్తిగత జీవితంలో నా పెర్ఫార్మెన్స్ కంటే టాటూల మీదే ఎక్కువ చర్చ జరిగింది. దీంతో నాకెంతో ఇష్టమైన టాటూలు అంటేనే భయం వేసే పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడు నేను ఫ్రీ అయ్యాను. నా మీద ఉన్న ఒత్తిడి తొలగిపోయింది. ఇప్పుడు నేను రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తాను అంటూ జెస్సికా లింక్డ్ఇన్లో రాసుకొచ్చింది. చదవండి: దేశంలో మహిళలకు ఎక్కువ ఉద్యోగాలు ఇస్తున్న సంస్థలు ఇవే -
వేతనాల్లో మహిళలపై వివక్ష ! ఏడీపీ రీసెర్చ్ వెల్లడి
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సమయంలో స్త్రీ, పురుషుల మధ్య వేతన చెల్లింపుల పరంగా అసమానత పెరిగినట్టు ఏడీపీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ అధ్యయనంలో వెల్లడైంది. వేతన పెంపులు, బోనస్ల పరంగా చూస్తే పురుషల కంటే మహిళలు వెనుకనే ఉన్నట్టు పేర్కొంది. ‘పీపుల్ ఎట్ వర్క్ 2021: ఏ గ్లోబల్ వర్క్ఫోర్స్ వ్యూ’ పేరుతో ఏడీపీ అధ్యయనం నిర్వహించింది. పురుష ఉద్యోగుల్లో 70 శాతం మందికి వేతనాల పెంపు, బోనస్ను సంస్థలు ప్రకటించగా.. మహిళల్లో అధిక బాధ్యతలు మోస్తున్నా కానీ 65 శాతం మందికే ఈ భాగ్యం దక్కినట్టు తెలిపింది. కరోనా వల్ల తమ సంస్థలపై అదనపు బాధ్యతలు పడగా.. పురుషులతో సమానంగా మహిళలూ ఈ బాధ్యతలను స్వీకరించారని వివరించింది. ఈ సర్వేలో భాగంగా 17 దేశాల్లో మొత్తం 32,471 మంది ఉద్యోగుల అభిప్రాయాలను ఏడీపీ సేకరించింది. 2020 నవంబర్, డిసెంబర్ నెలల్లో ఉద్యోగుల నుంచి వివరాలు సమీకరించింది. వాటన్నింటీని క్రోడీకరించిన ఏడీపీ.. ఈ వివరాలను తాజాగా విడుదల చేసింది. -
Viral: షేర్వాణీ ధరించి పెళ్లి కూతురు గుర్రపు స్వారీ!
పెళ్లి వేడకలు ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా జరుగుతుంటాయి. సంప్రదాయం ఏదైనా వివాహ వేడుకను ఘనంగా నిర్వహిస్తారు. అయితే కొన్ని ప్రాంతాల్లో వరుడు షేర్వాణీ ధరించి గుర్రం మీద పెళ్లికూతురు ఇంటి వద్ద ఏర్పాటు చేసిన వివాహ వేడుకకు వస్తాడు. అయితే వరుడు వచ్చినట్లుగానే వధువు.. షేర్వాణీ ధరించి గుర్రం మీద తన ప్రీ-వెడ్డింగ్ కార్యక్రమంలో పాల్గొంటుంది. రాజస్థాన్లోని సికర్ జిల్లాలో రనోలి గ్రామానికి చెందిన వధువు కార్తిక గుర్రంపై వచ్చి.. ప్రీ-వెడ్డింగ్ ‘బండోరి’ వేడుకల్లో అందరినీ దృష్టిని ఆకర్షించింది. తాము జెండర్ ఇక్వాలిటీ పాటిస్తామని కొడుకు అయినా కూతురైనా ఒకేలా చూస్తామని ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. అందుకోసమే కార్తిక వివాహం సందర్భంగా ఇలా ప్లాన్ చేసినట్లు పేర్కొన్నారు. ఆమె వివాహం సోమవారం జరగాల్సి ఉంది. ‘బండోరి’ వేడుక కోసం కార్తిక స్వయంగా షేర్వాణీ తయారు చేయటం విశేషం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ‘గుర్రంపై వరుడి కంటే వధువు వస్తేనే బాగుంటుంది’.. ‘జెండర్ ఇక్వాలిటీకి ఇది ఓ ముందడుగు’ అని ఈ వీడియోను చూసిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. -
పురుషుడిగా మారేందుకు మహిళా కానిస్టేబుల్కు అనుమతి
భోపాల్: మధ్యప్రదేశ్ ప్రభుత్వం మహిళా కానిస్టేబుల్కు తీపి కబురు అందించింది. మహిళ విన్నపం మేరకు.. లింగ మార్పిడి శస్త్ర చికిత్స చేసుకోవడానికి అనుమతినిచ్చింది. ఆమెకు ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో చికిత్స జరుగుతుందని తెలిపారు. ఆమెకు.. చిన్న తనం నుంచి పురుషులలో ఉన్నట్లు కొన్ని లక్షణాలు, హర్మోన్లు ఉన్నట్లు ఆమె గుర్తించింది. దీంతో ఆమె.. 2019లో లింగమార్పిడి శస్త్ర చికిత్సకోసం దరఖాస్తు చేసుకున్నారు. కాగా, గ్వాలియర్, ఢిల్లీలోని వైద్యుల సూచనమేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కానిస్టేబుల్ తెలిపారు. దీనిపై మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా స్పందించారు.‘లింగమార్పిడి అనేది వ్యక్తి హక్కు..’ అని అన్నారు. అందుకే మహిళా కానిస్టేబుల్కు అనుమతి తెలుపుతూ ఉత్తర్వులు జారీచేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సర్జరీకి ఆమె కుటుంబంవారు అంగీకరించలేదని తెలుస్తోంది. కానీ.. మహిళా లింగ మార్పిడి చేసుకోవడానికి మొగ్గుచూపుతుంది. దీనికోసం తాను.. దాచుకున్న డబ్బులతో సర్జరీ చేయించుకోవడానికి సిద్ధపడినట్లు కానిస్టెబుల్ తెలిపారు. కాగా, 2018లో మహరాష్ట్రకు చెందిన లలితా సాల్వె అనే మహిళా కానిస్టేబుల్ కూడా ఇదేవిధంగా శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆమెకు సెయింట్ జార్జ్ ఆస్పత్రి వైద్యులు లింగమార్పిడి చికిత్సను నిర్వహించారు. -
ఆ స్కూల్లో బాలబాలికలకు యూనిఫామ్ ఒకటే!
సాధారణంగా పాఠశాలల్లో బాలురు, బాలికలకు వేర్వేరుగా యూనిఫామ్స్ ఉంటాయి. కానీ ఆ స్కూల్లో మాత్రం బాలురు, బాలికలకు ఒకేరకమైన యూనిఫామ్ ఉంటుంది. ఈ పాఠశాల మన దేశంలోనే ఉందంటే ఆశ్చర్యం కలగక మానదు. లింగ సమానత్వాన్ని ప్రబోధించేందుకే బాల బాలికలకు ఒకే రకమైన ఏకరూప దుస్తుల ధరించేలా చేస్తున్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికుల సహకారంతో ఈ నిశ్శబ్ద విప్లవానికి తొలి అడుగుపడింది. విద్యార్జనలో అగ్రస్థానాన ఉన్న కేరళలోనే ఈ అద్భుతం ఆవిష్కృతమైంది. ఎర్నాకులం జిల్లాలో వలయన్చిరంగార ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిశ్శబ్ద విప్లవానికి అంకుర్పారణ జరిగింది. లింగ భేదం లేకుండా ఇక్కడ విద్యార్థులందరూ ఒకే రకమైన యూనిఫామ్ ధరిస్తారు. చొక్కాలు, త్రిబైఫోర్త్ షార్ట్స్ వేసుకుని చదువులమ్మ ఒడిలో ఒదిగిపోతున్నారు. బాలికలు ఎటువంటి సంకోచం లేకుండా స్వేచ్ఛగా ఆటపాటలతో చదువుకుంటున్నారు. (ఆడపిల్లంటే ఇలా ఉండాలి.. సమాజం అంత అందమైనదేం కాదు!!) వలయన్చిరంగార ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రీ-ప్రైమరీ, లోయర్ ప్రైమరీ విభాగాలు ఉన్నాయి. రెండు విభాగాల్లో మొత్తం 746 మంది విద్యార్థులు ఉన్నారు. లింగ సమానత్వ యూనిఫామ్ మొదట 2017లో ప్రీ-ప్రైమరీ విద్యార్థుల కోసం ప్రవేశపెట్టారు. ఇది ఇప్పుడు 1 నుంచి 4 తరగతులకు విస్తరించారు. లింగ సమానత్వ యూనిఫామ్ ప్రవేశపెట్టడానికి ముందు బాలికలు ఆటలు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంకోచించే వారని.. ఇప్పుడు వారిలో ఎటువంటి సంకోచం లేదని ఉపాధ్యాయురాలు సి.రాజీ తెలిపారు. తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి చర్చించిన తర్వాత జెండర్ న్యూట్రల్ యూనిఫామ్ అమలు చేశామన్నారు. ‘బాలికలకు ఇబ్బందిగా ఉన్న డ్రెస్ కోడ్ మార్చాల్సిందేనని విద్యార్థినుల తల్లులు బలంగా విశ్వసించారు. తమ కుమార్తెలు తాము ధరించే యూనిఫామ్లో సురక్షితంగా ఉండాలని వారు కోరుకున్నారు. కొత్త యూనిఫామ్ అదనపు ఖర్చును భరించడానికి వారు ముందుకు వచ్చార’ని రాజీ వెల్లడించారు. ‘లింగ సమానత్వ ఏకరూప దుస్తులు ప్రవేశపెట్టడం వల్ల అమ్మాయిల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఎక్కువ మంది బాలికలు క్రీడల్లో పాల్గొనేందుకు ముందుకు వస్తుండటం ఇందుకు నిదర్శనం. కొత్త డ్రెస్ కోడ్ వారికి గొప్ప స్వేచ్ఛను అందించింది. మా పాఠశాలలో 378 మంది బాలికలు ఉన్నారు. వీరిలో అత్యధికులు పేదవారే. కానీ తల్లిదండ్రులు కొత్త యూనిఫామ్ కోసం అదనంగా డబ్బులు చెల్లించడానికి అంగీకరించారు. అమ్మాయిలు చాలా హ్యాపీగా ఉన్నార’ని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కేపీ సుమ అన్నారు. 2019లోనే జెండర్ న్యూట్రల్ యూనిఫామ్ ప్రవేశపెట్టాలని అనుకున్నప్పటికీ కరోనా కారణంగా కాస్త ఆలస్యమైందని తెలిపారు. కొత్త డ్రెస్ కోడ్ ప్రవేశపెట్టడంతోనే ఆగిపోలేదు.. విద్యార్థుల కోసం జెండర్-సెన్సిటివ్ పాఠాలను కూడా సిద్ధం చేశారు ఉపాధ్యాయులు. బాలురు, బాలికలు ఇద్దరూ సమానమే అని చెప్పేవిధంగా పాఠాలు బోధిస్తున్నట్టు అకడమిక్ కమిటీ చైర్మన్ డాక్టర్ బినోయ్ పీటర్ చెప్పారు. లింగ సమానత్వ మాడ్యూల్ను ప్రోత్సహించేందుకు తాము ప్రయత్నం చేస్తున్నామన్నారు. కాగా, వలయన్చిరంగార పాఠశాల చేపట్టిన ఈ ప్రయత్నాన్ని కేరళ విద్యా మంత్రి ఆర్ బిందు, సినీ నటి మంజు వారియర్, ఒలింపియన్ అంజు బాబీ జార్జ్ సహా పలువురు ప్రముఖులు ప్రశంసించారు. -
ఈ రంగాలపై మక్కువ చూపుతున్న మగువలు
న్యూఢిల్లీ: ఇంజినీరింగ్, తయారీ, ఆపరేషన్స్ తదితర విభాగాల్లో మరిన్ని బాధ్యతలు తీసుకోవాలని, కీలక విధులు నిర్వహించాలని మహిళలు భావిస్తున్నారు. అదే సమయంలో మహిళా సిబ్బంది సంఖ్య పెరగడం వల్ల ఆయా రంగాలు గణనీయంగా ప్రయోజనం పొందగలవని పురుషులు కూడా అభిప్రాయపడుతుండటం గమనార్హం. జీఈ, అవతార్ రీసెర్చ్ నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ మధ్యలో జీఈ కోసం అవతార్ ఈ సర్వే నిర్వహించింది. 500 మంది ప్రొఫెషనల్స్ (మహిళలు, పురుషులు) ఇంజినీరింగ్ విద్యార్థినులు, ఆపరేషన్స్.. తయారీ.. ఇంజినీరింగ్ సర్వీసుల సంస్థల్లో బిజినెస్, మానవ వనరుల విభాగాల అధిపతులు ఇందులో పాల్గొన్నారు. పురోగతికి సామర్థ్యాలపై అపోహలే అడ్డంకి.. సర్వే ప్రకారం ఇంజినీరింగ్ సర్వీసులు, ఆపరేషన్స్, తయారీ వంటి రంగాల్లో ప్రస్తుతం 12 శాతం మందే మహిళలు ఉన్నారు. సామర్థ్యాలపై గల అపోహలే ఈ రంగాల్లో తమ కెరియర్ పురోగతికి అవరోధాలుగా ఉంటున్నాయని 63 శాతం మంది మహిళలు అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల సామర్థ్యాల మదింపు ప్రక్రియలో పక్షపాత ధోరణులు కూడా కారణమని మరికొందరు పేర్కొన్నారు. మరోవైపు, ప్రభుత్వ నియంత్రణలే ఆయా విభాగాల్లో మహిళల వృద్ధికి ఆటంకాలుగా ఉన్నాయని 54 శాతం మంది పురుషులు, సూపర్వైజర్ల నుంచి మద్దతు లేకపోవడం కారణమని 51 శాతం మంది పురుషులు అభిప్రాయపడ్డారు. లింగవివక్ష వివిధ విభాగాల్లో లింగ వివక్షకు తావులేకుండా పరిస్థితి మెరుగుపర్చాల్సిన అవసరాన్ని ఈ సర్వే తెలియజేస్తోందని జీఈ దక్షిణాసియా ఐఅండ్డీ కౌన్సిల్ లీడర్ శుక్ల చంద్రా తెలిపారు. అటు, పెద్ద సంస్థలు ఈ దిశగా చర్యలు తీసుకుంటే మరింత మంది మహిళలు సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి విభాగాలను ఎంచుకునేందుకు, తయారీ.. ఇంజినీరింగ్ రంగాల్లో కెరియర్ ఏర్పర్చుకునేందుకు ప్రోత్సాహం లభించగలదని అవతార్ వ్యవస్థాపక ప్రెసిడెంట్ సౌందర్య రాజేశ్ తెలిపారు. చదవండి:అబల కాదు.. ఐరన్ లేడీ! ఆమె చేతిలో పడితే చిత్తు చిత్తే!! -
దుస్తులకు లింగ భేదం ఏంటీ..! స్కూల్కి స్కర్టులతోనే వస్తాం!!
ఈ మధ్య స్పెయిన్లో ఓ ఉద్యమం ఊపందుకుంటోంది. ఓ స్కూల్ విద్యార్ధులు, ఉపాధ్యాయులు లింగ సమానత్వం పేరుతో ఓ వినూత్న సందేశాన్ని ప్రచారం చేస్తున్నారు. అది ఓ ఉద్యమంగా అక్కడ కొనసాగుతోంది. Wear a Skirt to School campaign: యూకే మిర్రర్ నివేదిక ప్రకారం.. కొన్ని నెలల ముందు ఎడన్బర్గ్లోని కాసిల్వ్యూ ప్రైమరీ స్కూల్కి చెందిన 15 ఏళ్ల మైకెల్ గొమెజ్ అనే విద్యార్థి స్కర్టు ధరించి పాఠశాలకు వచ్చినందుకు స్కూల్ యాజమాన్యం బయటికి వెళ్లగొట్టింది. దీంతో ధరించే దుస్తులకు లింగ భేదం ఉండదనే స్లోగన్తో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్ధులు అందరూ స్కూలుకు స్కర్టులతో రావడం ప్రారంభించారట. ఇదంతా సదరు విద్యార్ధికి మద్ధతు తెల్పాలనే ఉద్దేశ్యంతో ‘వేర్ ఎ స్కర్ట్ టు స్కూల్’ను ఉద్యమంగా చేపట్టారు. మూస పద్ధతులను బద్ధలు కొట్టాలనే నెపంతో ఈ చర్యకు పూనుకున్నట్లు అక్కడి ఉపాధ్యాయులు చెబుతున్నారు. బలవంతంగా స్కర్టులు ధరించమని ఎవ్వరికీ చెప్పం. అది పూర్తిగా విద్యార్ధుల ఇష్టానికే వదిలివేశామని అంటున్నారు. ఐతే ఈ వింత పోకడను కొందరు తల్లిదండ్రులు ప్రశంసిస్తుంటే, మరికొందరేమో బుగ్గలు నొక్కుకుంటున్నారు. చదవండి: 1.5 లీటర్ల కోల్డ్ డ్రింక్ పది నిముషాల్లో తాగేశాడు.. 18 గంటల్లోనే.. -
అమెరికాలో తొలి ‘ఎక్స్’ జెండర్ పాస్పోర్టు
డెన్వర్: అగ్రరాజ్యం అమెరికాలో పురుషులు, మహిళలు కాని ఎల్జీబీటీ(లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్జెండర్) వర్గం పౌరుల హక్కులను గుర్తించే ప్రక్రియలో కీలకమైన అడుగు పడింది. అమెరికా ప్రభుత్వం ‘ఎక్స్’ జెండర్ హోదా కలిగిన తొలి పాస్పోర్టు జారీ చేసింది. ఇది చరిత్రాత్మక పరిణామం, పండుగ చేసుకోవాల్సిన సందర్భం అని ఎల్జీబీటీ హక్కుల కార్యకర్త జెస్సికా స్టెర్స్ వ్యాఖ్యానించారు. అయితే, ‘ఎక్స్’ జెండర్ పాస్పోర్టును ఎవరికి జారీ చేశారన్న వివరాలను ప్రభుత్వం బయటపెట్టలేదు. గోప్యతను కాపాడాలన్న సంకల్పంతో పోస్పోర్టు దరఖాస్తుదారుల సమాచారాన్ని బహిర్గతం చేయబోమని అధికారులు చెప్పారు. కొలరాడోలో నివసించే డానా జిమ్ అనే వ్యక్తి ‘ఎక్స్’ జెండర్ పాస్పోర్టు కోసం 2015 నుంచి అమెరికా ప్రభుత్వంతో పొరాడుతున్నారు. పురుషుడిగా జన్మించి డానా జిమ్ కొంతకాలం అమెరికాలో సైన్యంలో పనిచేశారు. లింగ మార్పిడి చేయించుకొని మహిళగా మారారు. తనలాంటి వారి హక్కుల కోసం ఉద్యమిస్తున్నారు. తొలి ‘ఎక్స్’ జెండర్ పాస్పోర్టును డానా జిమ్కే జారీ చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
Mann Deshi: ఇప్పుడు ప్రపంచం నా దగ్గరే ఉంది!
అనారోగ్యంతో పట్టణంలో ఉన్న ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు లత భర్త. ఊళ్లో ఉన్న భార్య ఆరోగ్యం అంతంతమాత్రంగానే ఉంది. భర్త గురించే ఆమె ఆలోచనలన్నీ... ఎలా ఉన్నాడో ఏమో! భర్త దగ్గర మాత్రమే సెల్ఫోన్ ఉంది. లత దగ్గర లేదు. తనకు అవసరం అని కూడా ఎప్పుడూ అనుకోలేదు. ఎప్పుడైనా ఎవరితోనైనా మాట్లాడాల్సి వస్తే భర్త తన ఫోన్ ఇచ్చేవాడు. అలాంటి లత చేతిలోకి ఇప్పుడు సెల్ఫోన్ వచ్చింది. దాంతో గతంలో మాదిరిగా ఆమె ఇతరుల మీద ఆధారపడడం లేదు. తానే భర్తకు ఫోన్ చేసే మాట్లాడుతుంది. వీడియో కాల్స్ మాట్లాడడం కూడా నేర్చుకుంది. లతది మహారాష్ట్రలోని నింబోర గ్రామం. ఇప్పుడు అదే మహారాష్ట్రలో భానుపూరి గ్రామానికి వెళదాం...జ్యోతి దేవ్కర్ చిన్నపాటి కిరాణా దుకాణం నడుపుతుంది. తాను కూడా ఎవరితోనైనా మాట్లాడాల్సి వస్తే భర్త ఫోన్పైనే ఆధారపడేది. ఇప్పుడు తన దగ్గర కొత్త ఫోన్ ఉంది. మాట్లాడడమే కాదు మార్కెట్లోకి కొత్తగా వచ్చిన వస్తువుల గురించి తెలుసుకోవడం నుంచి ఆన్లైన్ పేమెంట్స్ వరకు ఎన్నో విషయాలు నేర్చుకుంది. ఇదే గ్రామానికి చెందిన పూర్ణ కూలి పనులు చేసుకుంటుంది. అంతో ఇంతో చదువువచ్చు. ఒకప్పుడు సెల్ఫోన్లో ఎవరితోనైనా మాట్లాడాల్సి వస్తే...ఎవరినో ఒకరిని బతిమిలాడాల్సి వచ్చేది. ఇప్పుడు ఆమె చేతిలో కొత్త ఫోన్. ‘మాట్లాడడం మాత్రమే కాదు, ప్రపంచంలో ఏంజరుగుతుందో తెలుసుకో గలుగుతున్నాను’ అంటుంది పూర్ణ. ఉన్నట్టుండి వీరి చేతిలోకి ఫోన్లు ఎలా వచ్చాయి? సతార జిల్లా (మహారాష్ట్ర) కేంద్రంగా పనిచేసే ‘మన్దేశీ’ అనే స్వచ్ఛంద సంస్థ వీరికి మాత్రమే కాదు ఎంతోమంది పేద మహిళలకు సెల్ఫోన్లను ఉచితంగా ఇచ్చింది. ఇవ్వడమే కాదు ఫోన్ ఎలా ఆపరేట్ చేయాలో కూడా నేర్పించింది. ‘నాకంటూ సెల్ఫోన్లేదు..అని ఈరోజుల్లో ఎవరూ అనరు’ అనుకుంటాంగానీ గ్రామీణ ప్రాంతాల్లోకి వెళితే సెల్ఫోన్లేని పేద మహిళలు, వాటి గురించి ఏమీ తెలియని మహిళలు ఎంతోమంది ఉన్నారు. మన దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ‘డిజిటల్ జెండర్ గ్యాప్’ ఎక్కువగా ఉందని రకరకాల రిపోర్ట్లు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గ్రామీణ ప్రాంతాల్లోని పేదమహిళలకు ఉచితంగా సెల్ఫోన్లు ఇచ్చింది మన్దేశీ. విచిత్రమేమిటంటే ఉచితంగా ఇచ్చినా ‘ఈ ఫోన్లతో మేమేం చేసుకోవాలమ్మా’ అనేంత అమాయకులు కూడా ఉన్నారు. అలాంటి వారికి సెల్ఫోన్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో, సులభంగా ఎలా ఆపరేట్ చేయాలో నేర్పించారు. ‘తీసుకోవాలా వద్దా? అని మా భర్తను అడిగి చెబుతాను’ అనే మాట చాలామంది నోటి నుంచి వినిపిస్తుంది. మహారాష్ట్ర, బిహార్, రాజస్థాన్...మొదలైన రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలలో మహిళలు సెల్ఫోన్ వాడడంపై అప్రకటిత నిషేధం ఉంది. కొన్ని గ్రామీణప్రాంతాల్లో ‘మహిళలు వాడకూడదు’ అంటూ సెల్ఫోన్లపై నిషేధాలు కూడా ఉన్నాయి. ఈ కారణం వల్లే కావచ్చు...ఫోన్ కొనగలిగే స్థాయి ఉండికూడా కొనలేకపోవడం. దీనికితోడు వారెవ్వరికీ దానిని ఆపరేట్ చేయడం కూడా రాదు. బిహార్లోని కిషన్గంజ్ జిల్లాలో ఉన్న సుందర్బడి గ్రామంలో పెళ్లికాని అమ్మాయిలు సెల్ఫోన్ వాడితే రెండు వేలు, పెళ్లయిన మహిళలు వాడితే పదివేల రూపాయల జరిమానా విధిస్తారట! అందుకే...సెల్ఫోన్ ఇవ్వడం మాత్రమే కాదు, దాని చుట్టూ ఉన్న అపోహలను తొలగించే కాన్యాచరణ కూడా చేపట్టింది మన్దేశీ. ఫలితంగా ఎంతో మందిలో మార్పు వచ్చింది. ఈ పరిస్థితిలో మార్పు తీసుకుచ్చి ప్రపంచంతో అనుసంధానం కావడానికి సెల్ఫోన్ ఎలా ఉపయోగపడుతుంది అనేదానిపై విస్తృత ప్రచారం చేస్తుంది మన్దేశీ. చదవండి: Social Star: పైజమా పాప్స్టార్ శిర్లే సెటియా.. ఆర్జే నుంచి సింగర్గా.. -
క్రికెట్ రూల్స్లో కీలక మార్పు.. ఇకపై వారిని అలా పిలువరాదు
లండన్: క్రికెట్లో లింగభేదానికి తావు లేకుండా మెరిల్బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు పురుష క్రికెటర్లను మాత్రమే సంబోధించే బ్యాట్స్మన్ అన్న పదాన్ని తొలగించి మహిళలు, పురుషులకు కామన్గా వర్తించేలా బ్యాటర్ అన్న పదాన్ని తక్షణమే అమల్లోకి తేవాలని బుధవారం ప్రకటించింది. గత కొంత కాలంగా ఈ ప్రతిపాదన ఎంసీసీ పరిశీలనలో ఉండగా.. తాజాగా ఆమోదించబడింది. లింగభేదం లేని పదాన్ని ఉపయోగించడం వల్ల క్రికెట్ అందరి క్రీడ అని మరోసారి నిరూపించబడుతుందని ఎంసీసీ విశ్వసిస్తోంది. లింగభేదం లేని పదాలు వాడటం వల్ల మరింత మంది మహిళలు క్రికెట్ పట్ల ఆకర్షితులవుతారని అభిప్రాయపడింది. ఇదిలా ఉంటే, క్రికెట్కు సంబంధించి లింగభేదానికి ఆస్కారముండే థర్డ్ మ్యాన్, నైట్ వాచ్మన్, జెంటిల్మెన్ వంటి పదాలపై ఎంసీసీ ఎలాంటి కామెంట్లు చేయకపోవడం విశేషం. చదవండి: కెప్టెన్సీ విషయంలో వారిద్దరికీ పట్టిన గతే కోహ్లికి కూడా పట్టవచ్చు..! -
ఎన్డీఏ ప్రవేశ పరీక్షలో మహిళలకూ అవకాశం
న్యూఢిల్లీ: లింగ వివక్షను రూపుమాపడంతోపాటు మహిళా సాధికారత దిశగా సుప్రీంకోర్టు కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. సెప్టెంబర్ 5న జరుగబోయే నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్డీఏ) ప్రవేశ పరీక్ష రాసేందుకు మహిళకు సైతం అవకాశం కల్పించాలని యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్(యూపీఎస్సీ)ను బుధవారం ఆదేశించింది. ఈ ప్రవేశ పరీక్ష ఫలితాలను తుది తీర్పును బట్టి విడుదల చేయొచ్చని పేర్కొంది. ఎన్డీఏతోపాటు నావల్ అకాడమీ ప్రవేశ పరీక్షలను రాసే అవకాశాన్ని మహిళలకు సైతం కల్పించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలివ్వాలని కోరుతూ కుశ్ కాల్రా గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ సంజయ్కిషన్ కౌల్, జస్టిస్ హృషికేశ్ రాయ్తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం దీనిపై విచారణ చేపట్టింది. ఎన్డీఏలో మహిళలకు ప్రవేశం కల్పించాలన్న పిటిషనర్ వినతి పట్ల ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వు జారీ చేసింది. మహిళలకు ఎన్డీఏ అడ్మిషన్ టెస్టు రాసేందుకు అవకాశం ఇవ్వాలని, అందుకు అనుగుణంగా నోటిఫికేషన్ జారీ చేయాలని, దీని గురించి ప్రజలకు తెలిసేలా చర్యలు తీసుకోవాలని యూపీఎస్సీని ఆదేశించింది. సైన్యం, నావికా దళంలో మహిళల కోసం శాశ్వత కమిషన్ ఏర్పాటు చేయాలని తాము గతంలో తీర్పులిచ్చామని, అయినా ప్రభుత్వ ఎందుకు స్పందించడం లేదని అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటీని ధర్మాసనం ప్రశ్నించింది. మహిళలు సైన్యంలోకి అడుగు పెట్టేందుకు ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, ఇండియన్ మిలటరీ అకాడమీ వంటి మార్గాలు ఉన్నాయని ఐశ్వర్య భాటీ చెప్పారు. మరి ఎన్డీఏ ద్వారా మహిళలు సైన్యంలోకి ఎందుకు ప్రవేశించవద్దు, కో–ఎడ్యుకేషన్ ఏమైనా సమస్యా? అని ధర్మాసనం నిలదీసింది. ఎన్డీఏలోకి మహిళలను అనుమతించకూడదు అనేది ప్రభుత్వ విధాన నిర్ణయమని భాటీ బదులిచ్చారు. -
335 మందితో డేటింగ్.. మరో 30 మంది కోసం వెయిటింగ్
సాక్షి, వెబ్డెస్క్: డేటింగ్ అనగానే మనం ఏదోదే ఊహించుకుంటాం.. పైగా పాశ్చత్య సంస్కృతి కావడంతో చాలా మంది దాన్ని తప్పుగా చూస్తారు. అయితే అన్ని డేట్లు ఒకేలా ఉండవు. ఇదే విషయాన్ని నిరూపిస్తున్నారు తమిళ నటుడు, ప్రొఫెషనల్ డ్యాన్సర్, ఫోటోగ్రాఫర్ సుందర్ రాము. గత కొన్నేళ్లుగా ఆయన 335 మంది మహిళలతో డేటింగ్ చేశారు. ఆయన లక్ష్యం 365 మందితో డేటింగ్ చేయడం. దానికి ఇంక 30 మంది దూరంలో ఉన్నారు. అసలు ఇంత మందితో డేటింగ్ చేయడం ఏంటి.. ఈ టార్గెట్ ఏంటి వంటి తదితర వివరాలు తెలియాలంటే.. సుందర్ రాము గురించి పూర్తిగా తెలియాలి. ఆయన వివరాలు.. తమిళనాడు, చెన్నైకి చెందిన సుందర్ రాము సినిమాల్లోకి రావడానికి ముందు నాటకాల్లో నటించారు. ఆ తర్వాత ఆయన తమిళ, మలయాళ చిత్రాల్లో నటించారు. పైగా ప్రొఫెషనల్ డ్యాన్సర్ కూడా. అప్పటి వరకు సాధారణ జీవితం గడిపిన సుందర్ రాముని 2012లో జరిగిన నిర్భయ ఘటన బాగా కలచి వేసింది. చాలా రోజులు ఆ బాధలోనే ఉండి పోయారు. విదేశాలకు వెళ్లినప్పుడు ఆయనకు తరచుగా వినిపించే ప్రశ్న.. ‘‘మీ దేశంలో ఎందుకు మహిళలను అంత దారుణంగా హింసిస్తారు’’ అని. ఇవన్ని ఆయనపై తీవ్ర ప్రభావం చూపాయి. ఈ క్రమంలో ఆయనభారతదేశ మహిళలకు వారి హక్కుల గురించి తెలియజేయాలనుకున్నారు. అందుకు ఆయన ఎన్నుకున్న మార్గమే ఈ 365 డేటింగ్. దీని గురించి సుందర్ రాము మాట్లాడుతూ.. ‘‘నేను స్త్రీలను బాగా చూసుకునే, గౌరవించే కుటుంబంలో పెరిగాను. లింగ వివక్ష లేని పాఠశాలలో చదువుకున్నాను. అబ్బాయిలు, అమ్మాయిలను వేరుగా చూడలేదు. కానీ, స్కూల్ నుంచి బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టాక, సమాజంలో వేళ్లూనుకున్న లింగవివక్షను గమనించాను. అలాంటి సంస్కృతిని చూసి షాక్కు గురయ్యాను. 2012 డిసెంబర్లో జరిగిన ఢిల్లీ సామూహిక అత్యాచార ఘటన నన్ను కుదిపివేసింది. చాలా రాత్రులు నిద్రపోలేకపోయాను'' అని తెలిపారు. ‘‘ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకురావడం కోసం నేను చేసిన ఆలోచన 365 డేట్స్ ప్రణాళిక. దీని గురించి 2014, డిసెంబర్ 31న ఫేస్బుక్లో ప్రకటించాను. ప్రారంభంలోనే నాకు తెలిసిన 10 మంది నుంచి కాల్ వచ్చింది. మే ఒకరి గురించి ఒకరం తెలుసుకున్న తర్వాత డేట్కి వెళ్లేవాళ్లం. 2015లో తమిళనాడులో వరదల వల్ల ఈ కార్యక్రమం వాయిదా పడింది. మరుసటి ఏడాది తిరిగి ప్రారంభించాను. ఇప్పటి వరకు మన దేశంలోనే కాక విదేశాల్లో కూడా పలువురు మహిళలతో డేట్కి వెళ్లాను. వీరిలో మా నానమ్మతో పాటు చెత్త ఎత్తే మహిళలు, పళ్లు అమ్ముకునే మహిళ, 90 ఏళ్ల ఐరిష్ సన్యాసిని, నటి, మోడల్స్, యోగా టీచర్, యాక్టివిస్టులు, రాజకీయాల్లో ఉన్నవారు ఇలా ఎంతోమంది ఉన్నారు. అయితే మా నానమ్మతో వెళ్లిన డేట్ మాత్రం చాలా ప్రత్యేకం’’ అన్నారు సుందర్ రాము. ‘‘ఇక నేను విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్నాను. నేను వెళ్లే డేట్స్ అన్ని శృంగారభరితమైనవి కావు. నా లక్ష్యం కేవలం ప్రేమ మాత్రమే. నేను ప్రతిరోజు ప్రేమను అన్వేషిస్తాను. డేట్ అనగానే ఏదో ఊహించుకోవడం కాదు. అలానే మహిళ అనగానే కేవలం ఆమె ఒంపుసొంపులు మాత్రమే కాదు. అంతకుమించి ఆలోచించగలగాలి. వారి స్థానంలోకి వెళ్లి.. ఆడవారు ఎదుర్కొనే సమస్యలు తెలుసుకుంటే.. అప్పుడు వారి గురించి మనకు ఎక్కువ అర్థం అవుతుంది. వారి మీద మరింత గౌరవం పెరుగుతుంది. నా 365 డేట్ ఉద్దేశం కూడా ఇదే’’ అన్నారు సుందర్ రాము. -
Tokyo Olympics: ఒలింపిక్స్ చరిత్రలోనే తొలిసారి..
అంతర్జాతీయ క్రీడా వేడుకల వేదిక ఒలింపిక్స్కు ఓ చరిత్ర ఉంది. అయితే ఆ చరిత్రలో వివాదాలు, విమర్శలకు సైతం చోటు దక్కింది. ముఖ్యంగా ఆటల్లో లింగ వివక్ష గురించి ఎప్పటికప్పుడు చర్చ నడుస్తూనే వస్తోంది. ఈ తరుణంలో టోక్యో ఒలింపిక్స్ తొలిసారి ఓ అర్హత సాధించింది. ఇప్పటివరకు రికార్డుకానీ రీతిలో ఫిమేల్ అథ్లెట్లతో సందడి చేయబోతోంది ఈ మెగా స్పోర్ట్స్ ఈవెంట్. సాక్షి, వెబ్డెస్క్: ‘లింగ సమతుల్యపు ఒలింపిక్స్’గా టోక్యో ఒలింపిక్స్కి ఓ అరుదైన ఘనత దక్కబోతోంది. విశేషం ఏంటంటే.. ఐదు అగ్ర దేశాలు పురుషుల కంటే మహిళా అథ్లెట్లు పంపించడం. బ్రిటన్, యూఎస్, చైనా, ఆస్ట్రేలియా, కెనెడాలు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చాయి. ఇక రష్యా కూడా ఇదే బాటను అనుసరించింది. చైనా 298 మహిళలు..133 పురుషులు, అమెరికా 329 మహిళలు.. 284 పురుషులు, యూకే నుంచి 376 మంది బరిలోకి దిగుతుండగా అందులో 201 మంది మహిళలే ఉన్నారు. ఇక కెనడా అయితే 225 మంది మహిళలను.. 145 మంది పురుష అథ్లెట్లను బరిలోకి దింపింది. ఆస్ట్రేలియా నుంచి 471 మంది ఒలింపిక్స్లో పోటీపడుతుండగా.. 252 మంది మహిళలు, 219 మంది పురుషులు ఉన్నారు. రష్యా నుంచి మొత్తం 329లో 183 మంది మహిళలు, 146 మంది పురుషులు పాల్గొంటున్నారు. అధికారికంగా ప్రకటన ఇక ఈ ఏడాది మహిళా దినోత్సవం సందర్భంగా ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ(ఐవోసీ)అధికారికంగానే టోక్యో ఒలింపిక్స్ను జెండర్ బ్యాలెన్స్డ్ ఒలింపిక్స్గా ప్రకటించింది. అంతేకాదు ఆరంభ వేడుకల్లో జెండా మోయడం దగ్గరి నుంచి అది ప్రారంభం కావాలని అభిప్రాయపడింది. లింగ సమానత్వం లక్క్ష్యంగా ముందుకు వెళ్తామని పేర్కొంది. ఇక ఈ దఫా 49 శాతం మహిళలు, 51 శాతం పురుషులు ఇందులో పాల్గొంటున్నారని ప్రకటించింది. భారత్ నుంచి 127 మంది అథ్లెట్లు పాల్గొంటుండగా, 56 మంది మహిళలే ఉన్నారు. ఆతిథ్య జపాన్ మాత్రం 259 మహిళలు, 293 పురుషులతో అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. అయితే.. మొత్తం ఈసారి 48.8 శాతం మహిళా పోటీదారులు పాల్గొనబోతున్నారు. అంటే.. అది 50 శాతం కంటే తక్కువగా ఉందన్నమాట. ఆ లెక్కన ఐవోసీ లక్క్ష్యం సాధనకు మరింత సమయం పట్టేలా కనిపిస్తోంది. ఒలింపిక్స్ చరిత్రను పరిశీలిస్తే.. ఆధునిక మొదటి ఏథెన్స్ ఒలింపిక్స్(1896)లో మహిళలను పాల్గొనకుండా నిషేధించారు. అయితే 1900 ప్యారిస్ ఒలింపిక్స్ నుంచి మహిళా అథ్లెట్లను అనుమతిస్తున్నారు. అందులో మొత్తం 997 మంది పోటీదారుల్లో 22 మంది మాత్రమే మహిళలు(ఐదు ఈవెంట్స్) ఉన్నారు. *2012 లండన్ ఒలింపిక్స్లో పాల్గొన్న మహిళా అథ్లెట్ల శాతం 44.2 *2016 రియో ఒలింపిక్స్ పాల్గొన్న వాళ్ల శాతం 45 (టోక్యో వరకు మెరుగైన ఫలితమే కనిపిస్తోంది) *రియో పారాఒలింపిక్స్లో పాల్గొన్న మహిళల శాతం 38.6 *టోక్యో పారాఒలింపిక్స్లో అది 40.5 శాతంగా ఉండబోతోంది. -
ఆడా-మగా జననాంగాలు.. 25 ఏళ్ల తర్వాత వివాదాస్పదం
వైద్య శాస్త్రంలో ఓ అరుదైన కేసు.. సుమారు పాతికేళ్ల తర్వాత వివాదాస్పదంగా మారింది. ఆడ-మగ జననాంగాలతో(ఇంటర్సెక్స్ జెండర్) కలగలిసి పుట్టిన ఓ బిడ్డను.. సర్జరీలతో పూర్తి మగాడిలా మార్చేశారు వైద్యులు. అయితే ఆ నిర్ణయంపై అతడుగా ఉన్న ఆమె ఇన్నేళ్ల తర్వాత పోరాటానికి దిగింది. తన అనుమతి లేకుండా క్రూరంగా వ్యవహరించిన డాక్టర్ల తీరును తప్పుబడుతూ.. తనును మళ్లీ యథాస్థితికి మార్చేయాలని కోరుతోంది. హవాయి స్టేట్ పూనాకి చెందిన 24 ఏళ్ల యోగా ఎక్స్పర్ట్ లూనా అనిమిషా.. తనను మహిళగా మార్చేయాలని పోరాడుతోంది. పుట్టినప్పుడు డాక్టర్లు ఆమె జననాంగాన్ని కుట్టేయడంతో పాటు, సర్జరీ ద్వారా గర్భసంచిని తొలగించారు. దీంతో లూనా.. ఇన్నేళ్లూ మగవాడిలానే పెరుగుతూ వస్తోంది. అయితే తనలో ‘ఆమె’ను ఎంతో కాలం అణుచుకోలేకపోయింది లూనా. అయితే తనని ఓ జంతువులా భావించి కర్కశంగా వ్యవహరించిన డాక్టర్ల తీరును తప్పుబడుతూ.. తిరిగి సర్జరీలకు ఆమె సిద్ధమైంది. ‘‘తప్పు నా తల్లిదండ్రులదా? ఆ డాక్టర్లదా? అనే ప్రసక్తి కాదు. అంతిమంగా ఇబ్బంది పడుతోంది నేను. నాకు మగాడిగా కంటే ఆడదానిగా బతకడమే ఇష్టంగా అనిపిస్తోంది. 14 ఏళ్ల వయసులో తొలిసారి నా శరీరానికి కలిగిన గాయమేంటో నేను అర్థం చేసుకోగలిగాను. ఇన్నేళ్లలో ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాను. అవమానాల్ని భరించాను. అసలు నా గుర్తింపు కోసం మానసిక క్షోభను అనుభవించాను. ఎవరితోనూ కలవలేకపోయాను. బొమ్మలతో ఆడుకోవాలని, గౌన్లు వేసుకోవాలనే కోరికల్ని అణచివేసుకున్నా. ఒకానొక టైంలో ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నా. కానీ, ఇప్పుడు పోరాడే వయసు, శక్తి రెండూ నాకు వచ్చాయి’’ అని నవ్వుతూ చెప్తోందామె. మగాడి గుర్తింపును వద్దనుకుంటున్న లూనా.. సర్జరీలకు అవసరమయ్యే డబ్బు కోసం ‘గో ఫండ్ మీ’ వెళ్లింది. లక్షా యాభై వేల డాలర్లు సేకరించి.. తన కోరికను నెరవేర్చుకోవాలని అనుకుంటోంది. 2019లో క్లీవ్లాండ్కు చెందిన ఓ మహిళకు చనిపోయిన మహిళ గర్భసంచిని మార్పిడి ద్వారా ఎక్కించారు. అలా ఆ మహిళ తల్లి కాగలిగింది కూడా. ఆ కేసును రిఫరెన్స్గా తీసుకుని లూనా.. తనకు న్యాయం జరుగుతుందనే ఆశతో ఎదురుచూస్తోంది. అంతేకాదు సొసైటీలో అవమానాలు, ఛీత్కారాలు ఎదుర్కొంటున్న ఇంటర్సెక్స్, ట్రాన్స్జెండర్ బాధితుల కోసం లూనా పోరాడుతోంది కూడా. చదవండి: ‘అవును.. నేరాలు చేశా, ఘోరాలకు పాల్పడ్డా’ -
టీమిండియా మహిళా క్రికెటర్లపై బీసీసీఐ వివక్ష!
ముంబై: క్రికెట్ చరిత్రలో తొలిసారి టీమిండియా పురుషుల, మహిళా క్రికెటర్లు కలిసి ఒకే ఫ్లైట్లో ప్రయాణం చేయనున్నట్లు సోమవారం వచ్చిన వార్తల్లో నిజం లేదని సమాచారం. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా కోహ్లి సేన, మిథాలీ సేన జూన్ 2న ముంబై నుంచి లండన్కు బయలుదేరుతాయనేది నిజమే అయినా.. ఇరు జట్లు ఒక ఫ్లైట్లో మాత్రం వెళ్లవట. టీమిండియా పురుషుల జట్టుకోసం ప్రత్యేక చార్టడ్ విమానం ఏర్పాటు చేసిన బీసీసీఐ మహిళా జట్టును మాత్రం కమర్షియల్ ప్లైట్లో పంపనున్నట్లు సమాచారం. దీంతో బీసీసీఐ టీమిండియా మహిళా క్రికెట్పై వివక్ష చూపింస్తుదంటూ వార్తలు వస్తున్నాయి. కాగా బీసీసీఐ కూడా ఇంతవరకు పురుషులు, మహిళల జట్లు ఒకే విమానంలో వెళుతున్నట్లు అఫిషీయల్గా ఎక్కడా అనౌన్స్ చేయకపోవడంతో ఈ వార్తలు నిజమేనని పలువురు భావిస్తున్నారు. అంతేగాక జూన్ 2న లండన్కు వెళ్లనున్న టీమిండియా పురుషుల జట్టును ఈ బుధవారం క్వారంటైన్లోకి పంపించనున్నట్లు తెలిసింది. అయితే ఇదే సమయంలో మహిళా క్రికెటర్లకు మాత్రం ఎలాంటి సూచనలు ఇవ్వలేదని తెలిసింది. బీసీసీఐ ఇలా టీమిండియా మహిళల జట్టుపై వివక్ష చూపడం ఇది తొలిసారి కాదని.. గతేడాది యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 13వ సీజన్ సమయంలోనే టీ20 వుమెన్స్ చాలెంజ్ నిర్వహించాలని భావించారు. అయితే మొదట నాలుగు టీమ్లతో నిర్వహించాలని భావించినా చివరకు ఏదో మొక్కుబడిగా మూడు జట్లను ఏర్పాటు చేసి లీగ్ను పూర్తి చేశారు. ఇక 2020 ఏడాదిలో కరోనా సమయంలో మొదట టీమిండియా మహిళల జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళుతుందని బీసీసీఐ ప్రకటించింది. అయితే చివరి నిమిషంలో ఈసీబీ బయెబబూల్లో నిర్వహించడానికి సిద్ధంగా లేదనే కారణం చెప్పి ఆ టోర్నీని రద్దు చేసింది. ఇంకా విచిత్రమేంటంటే.. తాజాగా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనున్న పురుషుల జట్టులోని సభ్యులందరికి ఇంటివద్దే కరోనా పరీక్షలు జరిగేలా ఏర్పాటు చేస్తామని పేర్కొన్న బీసీసీఐ మహిళా క్రికెటర్ల విషయంలో మాత్రం మీ టెస్టులు మీరే చేసుకోవాలంటూ పేర్కొన్నట్లు సమాచారం. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తుంది. టీమిండియా పురుషుల జట్టుకు ఇస్తున్న గౌరవం మహిళల జట్టుకు బీసీసీఐ ఎందుకు ఇవ్వలేకపోతుంది.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్ పర్యటనలో భారత పురుషుల జట్టు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్తో పాటు ఐదు మ్యాచ్ల టెస్టుల సిరీస్ ఆడనుంది. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే డబ్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జూన్ 18న సౌతాంప్టన్ వేదికగా జరుగనుంది. ఆ తర్వాత ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14 మధ్యలో ఇంగ్లండ్తో 5 టెస్టుల సిరీస్లో తలపడనుంది. మరోవైపు భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జూన్ 16 నుంచి ప్రారంభంకానున్న మహిళల క్రికెట్ సమరంలో టీమిండియా ఒక టెస్టు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్లు ఆడనుంది. చదవండి: భారత క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా జరుగనుంది.. -
గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్: భారత్ 28 స్థానాలు ఢమాల్
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయంగా మహిళల పట్ల వివక్ష మరింతగా పెరుగుతోంది. వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) లింగ అసమానతల సూచీలో భారత్ 28 స్థానాలు దిగజారడం ఇందుకు నిదర్శనం. 2021కి సంబంధించి 156 దేశాల జాబితాలో భారత్ 140వ స్థానంలో నిల్చింది. 2020లో భారత్ ర్యాంకు 112గా ఉంది. తాజా నివేదిక ప్రకారం రాజకీయ, ఆర్థిక తదితర రంగాల్లో మహిళల పట్ల వివక్ష కొనసాగుతోంది. రాజకీయ సాధికారతకు సంబంధించిన అంతర్గత సూచీలో భారత్ 13.5 శాతం మేర క్షీణించింది. మహిళా మంత్రుల సంఖ్య 2019లో 23.1 శాతంగా ఉండగా 2021లో 9.1 శాతానికి పడిపోవడం ఇందుకు కారణం. ప్రొఫెషనల్, టెక్నికల్ ఉద్యోగాల్లోనూ మహిళల వాటా 29.2 శాతానికి తగ్గింది. ఇక ఆర్థికాంశాలపరంగా చూస్తే మహిళలు ఆర్జించే ఆదాయం.. పురుషుల ఆదాయంలో అయిదో వంతే ఉంటోంది. దక్షిణ ఆసియాలో బంగ్లాదేశ్ , నేపాల్ కంటే వెనుకబడి ఉంది. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ జాబితాలో ఐస్లాండ్ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తరువాతి స్థానాల్లో ఫిన్లాండ్ నార్వే ఉన్నాయి. కాగా ఆఫ్ఘనిస్తాన్ 156 చివరి స్థానంలో ఉంది. -
లింగ వివక్ష చూపే ఆర్టీసీ సర్క్యులర్ రద్దు
సాక్షి, అమరావతి: రాజ్యాంగం ప్రకారం చట్టం ముందు అందరూ సమానులేనని, కుల, మత, జాతి, లింగ, ప్రాంతీయ బేధాలు చూపడానికి వీల్లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. మహిళల పట్ల వివక్ష చూపేలా, రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నందున.. ఆర్టీసీ ఎండీ 2003లో జారీచేసిన సర్క్యులర్ను రద్దుచేస్తున్నట్లు ప్రకటించింది. కారుణ్య నియామకం కోసం మహిళ చేసుకున్న దరఖాస్తును పరిగణనలోకి తీసుకుని శ్రామిక్ లేదా ఆమెకు తగిన పోస్టు ఇచ్చే విషయంలో ఆరు వారాల్లోపు నిర్ణయం తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఇటీవల కీలక తీర్పు వెలువరించారు. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండలం తుమ్మపాళేనికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ నేనావత్ శ్రీనివాస్ 2007 ఫిబ్రవరి 16న మరణించారు. కారుణ్య నియామకం కింద తనకు కండక్టర్, అటెండర్, శ్రామిక్ లేదా ఇతర ఏదైనా పోస్టు ఇవ్వాలంటూ 2007 ఆగస్టులో శ్రీనివాస్ భార్య లక్ష్మి ఆర్టీసీ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. 2003లో ఆర్టీసీ ఎండీ ఇచ్చిన సర్క్యులర్ ప్రకారం మహిళలు శ్రామిక్ పోస్టుకు అర్హులు కాదని అధికారులు తెలిపారు. మూడు సెంటీమీటర్ల ఎత్తుకు సంబంధించి మినహాయింపు ఇచ్చేందుకు అధికారులు తిరస్కరించడంతో ఆమెను కండక్టర్ పోస్టుకు పరిగణనలోకి తీసుకోలేదు. ఇదే సమయంలో కొందరికి క్లీనర్లుగా పోస్టులు ఇచ్చారు. దీనిపై లక్ష్మి 2013లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఇటీవల తుది విచారణ జరిపి తీర్పు చెప్పారు. ఓ ఉద్యోగి మృతి చెందితే అతడి కుటుంబసభ్యులు కారుణ్య నియామకం కోసం పెట్టుకునే దరఖాస్తులను మొదట్లో గ్రేడ్ 2 డ్రైవర్, గ్రేడ్ 2 కండక్టర్, క్లీనర్ (శ్రామిక్) పోస్టులకు పరిగణనలోకి తీసుకునే వారని న్యాయమూర్తి తెలిపారు. శ్రామిక్, మెకానిక్, చార్జ్మెన్ పోస్టులను పురుషులకే పరిమితం చేస్తూ 2003 మే 26న ఆర్టీసీ ఎండీ ఇచ్చిన సర్క్యులర్ మహిళల పట్ల వివక్ష చూపడమేనని, అందువల్ల దాన్ని రద్దుచేస్తున్నామని చెప్పారు. కారుణ్య నియామకం కోసం లక్ష్మి పెట్టుకున్న దరఖాస్తును పరిగణనలోకి తీసుకుని, శ్రామిక్ లేదా ఆమెకు తగిన పోస్టు ఇచ్చే విషయంలో ఆరు వారాల్లోపు నిర్ణయం తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. -
వ్వాట్! ఏమన్నారూ.. అనేముందు ఆలోచించాలి
‘బర్గర్ కింగ్’ సేల్స్ నిన్న, మొన్న కొద్దిగా డౌన్ అయ్యాయి! బహుశా ఇది తాత్కాలికమే కావచ్చు. సేల్స్ పడిపోడానికి బర్గర్ ల రుచి తగ్గడం కారణం కాదు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఈ మల్టీ నేషనల్ ఫుడ్ జెయింట్ సదుద్దేశంతో మహిళల కోసం చేసిన ఒక కెరీర్ ఆపర్చునిటీ ప్రకటన రుచించక, విషయం అపాలజీ వరకు వచ్చింది. ‘న్యూయార్క్ టైమ్స్’ దినపత్రికలో ఫుల్ పేజీ గా వచ్చిన ఆ ప్రకటనకు బర్గర్ కింగ్ 'Women belong in the Kitchen' అనే హెడ్డింగ్ పెట్టడం మహిళలకు ఆగ్రహం కలిగించింది. ‘వంటపని ఆడవాళ్లదే’ అని ఆ మాటకు అర్థం. మహిళలకు ఓటు హక్కు రాని వందేళ్ల క్రితం నాటి యూసేజ్ అది. ‘వాళ్లకేం తెలుసు వంటింటి కుందేళ్లు’ అని నలుగురు మగవాళ్లు కలసిన వేళల్లో నవ్వుకుంటూ అనుకునే మాట! బర్గర్ కింగ్ ఆ మాటనే యూజ్ చేస్తూ.. ‘లేడీస్, చెఫ్ లుగా మీరెందుకు రాణించకూడదు?! అక్కడా మగవాళ్ల డామినేషనేనా! రండి. మీకు మేము ట్రైనింగ్ ఇస్తాం. స్కాలర్ షిప్ ను ఇస్తాం. మిమ్మల్ని రెస్టారెంట్ ఇండస్ట్రీకి మహారాణులను చేస్తాం..’ అని ఆహ్వానించింది. ఇదంతా లోపల ఉన్నా.. పైకి కనిపించేదే కదా ఎవరైనా చూస్తారు! మహరాణుల ఆగ్రహంలో తప్పేమీ లేదు. మహారాజులే మాటను ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి. ‘‘అవును. అయితే ఏంటి?!’’ అనే మాటను ఎప్పుడు అంటాం?! ఒక నిందో, అబద్ధపు ఆరోపణో, విమర్శో వచ్చి మీద పడినప్పుడు; మన నిజాయితీని అంగీకరించడానికి అవతలివారు సిద్ధంగా లేనప్పుడు; వివరించీ, వాదించీ ప్రయోజనం లేదనుకున్నప్పుడు.. తలనొప్పి వదిలించుకోడానికి ‘అవును. అయితే ఏంటి?’ అనేసి, పక్కకు వచ్చేస్తాం. ఎవరికి వారు.. ‘అవును. అయితే ఏంటి?’ అనేస్తే గొడవే లేదు. ఇంకెవరి తరఫునో.. ‘అవును. ఆమె అంతే. అయితే ఏంటి?’ అంటేనే వాగ్వాదాలు, యుద్ధాలు మొదలవుతాయి. ‘బర్గర్ కింగ్’ పేరు వినే ఉంటారు. బర్గర్ల విక్రయాలకు ప్రపంచ ప్రసిద్ధి చెందిన మల్టీనేషనల్ రెస్టారెంట్ల అమెరికన్ కంపెనీ. చాలాచోట్ల దుకాణాలు ఉన్నాయి. ఉమెన్స్ డే రోజు ఆ కంపెనీ యూ.కె. సంస్థ ఇంచుమించు ఇలాంటి ఒక వివాదంలోనే చిక్కుకుంది. మహిళల తరఫున మాట్లాడబోయి, కొంచెం క్రియేటివ్గా మాట్లాడి మహిళల ఆగ్రహానికి గురైంది. పాపం బర్గర్ కింగ్ ఉద్దేశం మంచిదే. పెద్ద పెద్ద రెస్టారెంట్లో ఎందుకనో ఎక్కువగా పురుష చెఫ్లే కనిపిస్తారు. మహిళా చెఫ్లు కేవలం 20 శాతం మంది మాత్రమే. ఆ విషయాన్నే చెబుతూ.. ‘‘అన్ని రంగాల్లో ముందున్న మహిళలు చెఫ్లుగా మాత్రం వెనకబడి ఉండటం ఏంటి? మీకు ఆసక్తి ఉంటే చెప్పండి, మీకు స్కాలర్షిప్ ఇచ్చి, ట్రైనింగ్ ఇప్పించి, రెస్టారెంట్ల మహా సామ్రాజ్యాలకు మిమ్మల్ని మహరాణుల్ని చేస్తాం’’ అని బర్గర్ కింగ్.. ‘న్యూయార్క్ టైమ్స్’ దినపత్రికలో ఒక ఫుల్ పేజీ ప్రకటన ఇచ్చింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఆ ప్రకటన వచ్చింది కనుక బర్గర్ కింగ్ ఉద్దేశాన్ని శంకించే పనే లేదు. అయితే ఉద్దేశాలు మంచివే అయి ఉండవచ్చు కానీ కొన్నిసార్లు చిన్న చిన్న పొరపాట్ల వల్ల అవి అపార్థాలకు కారణమై ప్రతిష్టను దెబ్బతీస్తాయి. ఈ ప్రకటనలోని పొరపాటు బర్గర్ కింగ్ తన పికప్ లైన్గా (లోపలికి లాగేసే ప్రారంభ వాక్యం) ‘ఉమెన్ బిలాంగ్ ఇన్ ది కిచెన్’ అనే మాటను వాడటం. ఆ మాటకు అర్థం ‘వంటపని ఆడవాళ్లదే’ అని. ఆ మాటలోని అంతరార్థం.. ‘అవును. అయితే ఏంటి? వాళ్లను అననివ్వండి. చెఫ్గా రాణించండి’ అని! బర్గర్ కింగ్ మహిళల వైపు మాట్లాడేందుకు, ఇలా మహిళలకు నచ్చని మాటను హెడ్డింగ్గా పెట్టడమే వివాదం అయింది. ఆ ఫుడ్ జెయింట్.. పేపర్లో మాత్రమే ఈ యాడ్ ఇచ్చి ఊరుకోలేదు. ట్విట్టర్లో కూడా పోస్ట్ చేసింది. ఆ పోస్టుకు రివర్స్ ట్వీట్లు వచ్చాయి. ‘ఏం మాటలివి బర్గర్ కింగ్. మహిళల్ని కించపరుస్తావా? నువ్వు తయారు చేసే బర్గర్లు రుచిగా ఉంటే సరిపోతుందా.. మాట శుచిగా ఉండొద్దా’ అని ట్విటిజెన్లు కామెంట్లు పెట్టారు. బర్గర్ కింగ్ సాయంత్రానికల్లా ఆ ట్వీట్ను తొలగించింది. పేపర్నైతే డిలీట్ కొట్టలేదు కదా. నష్టం జరిగిపోయింది. ఒడ్డున పడే మార్గంగా మహిళలకు క్షమాపణలు చెప్పింది. వాస్తవానికి ఆ ప్రకటన ఇప్పటికే బర్గర్ కింగ్లో పనిచేస్తున్న మహిళా సిబ్బందిని ఉద్దేశించి ఇచ్చింది! అయితే యావత్ మహిళావనికి అది స్ఫూర్తిని, ప్రేరణను కలిగిస్తుందన్న ఆలోచనతో అలా బహిరంగ ప్రకటన ఇచ్చింది బర్గర్ కింగ్. ‘ఎక్కడైనా ప్రొఫెషనల్ కిచెన్ ఉందీ అంటే అక్కడ మహిళా చెఫ్ ఉన్నారనే’ అనే క్రియేటివ్ భావనకు వచ్చిన తిప్పలే ఇవి. రీడర్స్కి, నెటిజెన్లకు సరిగా అర్థం కాలేదు. ఎదురొచ్చి తగిలింది. ‘బర్గర్ కింగ్లోని మహిళా సిబ్బంది తమ కిచెన్ కలల్ని నిజం చేసుకోడానికి మేమొక స్కాలర్షిప్ ప్రోగ్రామ్ని ఈ మహిళా దినోత్సవం రోజున సగర్వంగా ప్రకటిస్తున్నాం’ అని కూడా ప్రకటనలో ఉంది. అది మాత్రమే ఉండి ఉంటే సరిపోయేది. వందేళ్ల నాటి మగాళ్ల మాట.. ‘ఉమెన్ బిలాంగ్ ఇన్ ది కిచెన్’ ను పట్టుకొచ్చి, శీర్షికగా పెట్టి, పర్యవసానంగా తలపట్టుకుంది బర్గర్ కింగ్. అంతర్జాతీయ మహిళాదినోత్సవం రోజు ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రికలో వచ్చిన బర్గర్ కింగ్ ఫుల్ పేజీ ప్రకటన. మహిళల ఆగ్రహానికి కారణం అయింది ఈ ప్రకటనలోని శీర్షికే అవును. ఇది వందేళ్లనాటి మాటే. ఇప్పుడు వాడటం మహిళల్ని కించపరచడమే. అమెరికాలో వందేళ్ల క్రితం మహిళలకింకా ఓటు హక్కు రాని కాలంలో మగాళ్లు మాత్రమే మనుషులు అన్నట్లు ఉండేది! నలుగురు మగాళ్లు ఒక చోట చేరినప్పుడు వాళ్ల నవ్వులాటలో.. స్త్రీల గురించి.. ‘వాళ్లకేం తెలుసు. వంటింటి కుందేళ్లు’ అనే మాట వాడుకలో ఉండేది. ఆడవాళ్లు ఇంటికీ, వంటకీ పరిమితం అనీ, బయటికి వెళ్లి వాళ్లే పనీ చెయ్యలేరని మగవాళ్లు బలంగా నమ్మిన కాలం నాటి రోజువారీ మాట ఈ ‘ఉమెన్ బిలాంగ్ ఇన్ ది కిచెన్’. కాలక్రమంలో మహిళలకు ఓటు హక్కు వచ్చింది. ఓటర్లుగా మాత్రమే కాదు, పోటీ చేసేవాళ్లుగా కూడా మహిళలు తామేంటో నిరూపించుకున్నారు. విజేతలుగా నిలిచారు. దేశాలను ఏలుతున్నారు. పురుష దేశాధినేతల కంటే కూడా సమర్థంగా పరిపాలిస్తున్నారు. ‘వంట పని ఆడవాళ్లదే’ అనే ఆ మాట దాదాపుగా భూస్థాపితం కూడా అయిపోయింది. ఇప్పుడు ఆ భూతాన్ని బర్గర్ కింగ్ వాళ్లు లేపి, మెడకు తగిలించుకున్నారు. మహిళల నుంచి అభ్యంతరం వ్యక్తం అవడంతో చెంపలు వేసుకున్నారు. చదవండి: బర్గర్ కింగ్కు భారీ ఎదురుదెబ్బ -
బర్గర్ కింగ్కు భారీ ఎదురుదెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ: ఫాస్ట్ఫుడ్ బిజినెస్ కింగ్ బర్గర్ కింగ్ (యూకే)కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. జెండర్పరంగా మహిళలపై వివక్షపూరితంగా ట్వీట్ చేసి ఇబ్బందుల్లో పడింది. అందులోనూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలనుద్దేశించి వ్యాఖ్యానిస్తూ తన పురుషాధిక్య ధోరణిని చాటుకోవడం వివాదానికి తెరతీసింది. దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో తప్పయిందంటూ లెంప లేసుకుంది. అయితే ఆ ట్వీట్ను తొలగించిన సంస్థ క్షమాపణ చెబుతూ మరో ట్వీట్ చేసింది. ఈ సమయంలో కూడా బర్గర్ కింగ్ తీవ్ర విమర్శల పాలైంది. స్వచ్ఛందంగా తప్పును ఒప్పుకోవాల్సిన సంస్థ తీవ్రమైన ట్రోలింగ్, అబ్యూసివ్ కమెంట్స్ కారణంగా ఈ ట్వీట్ను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. అంతే.. నెటిజన్లు బర్గర్ కింగ్పై అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఫాస్ట్ ఫుడ్ దిగ్గజం స్కాలర్షిప్ కార్యక్రమాన్ని ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా విమెన్ బిలాంగ్ ఇన్ ది కిచెన్ (మహిళలు వంట ఇంటికి చెందినవారు) అంటూ ట్వీట్ చేసింది. ట్వీట్తో పాటు న్యూయార్క్ టైమ్స్ ప్రింట్ ఎడిషన్లో పూర్తి పేజీ ప్రకటనను ప్రచురించినట్లు వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. "మహిళలు వంటగదిలో ఉన్నారంటూ పెద్ద యాడ్ ఇచ్చింది. ఇది చూసిన నెటిజన్లు బర్గర్కింగ్పై ఫైర్ అయ్యారు. దీనికి తోడు బర్గర్ కింగ్ సమాధానంతో మరింత మండిపడ్డారు.నెటిజన్లు ట్వీట్ల పరంపర సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. (Women's Day: ఎస్బీఐ బంపర్ ఆఫర్లు) How stupid can you be? Especially on International Women’s Day... #smh https://t.co/FvEeHQh9am pic.twitter.com/LgkrKo5NZC — Alex Chin (@chinstachinsta) March 9, 2021 “Sorry our sexist bait tweet brought in sexists”🙃🙃 https://t.co/a9zTX2B2dx — _kairy_draws_ (@_kairy_draws_) March 9, 2021 Wait so you only deleted because of that but not because what you tweeted was distasteful? That's a pitiful non apology. https://t.co/Ch7y9NuD2y — Pat Orr (@Powerage1986) March 9, 2021 Wait so you only deleted because of that but not because what you tweeted was distasteful? That's a pitiful non apology. https://t.co/Ch7y9NuD2y — Pat Orr (@Powerage1986) March 9, 2021 -
ప్రాణమిచ్చారు... బడ్జెట్ను ఇవ్వలేమా!
చంకలో బిడ్డ. తలపై తట్ట. ఎండలో నడక. తల్లి కష్టపడుతోంది. అలసి ఒగురుస్తోంది. బిడ్డనో, తట్టనో.. ఒక భారం అందుకోమెందుకు? ఎవరైనా వచ్చి చెప్పాలి! ఆలోచన ఇవ్వాలి!! పళ్లెం నిండా పరమాన్నాలు. పక్కనే పండ్లూ ఫలహారాలు.ఎదురుగా ఆకలిగొన్నమ్మ.పేగుల అరుపులపై కొంగు కప్పుకున్నమ్మ. ‘నువ్వు కూర్చోలేదేమిటి!’ అని అడగమెందుకని!‘పిల్లని తినమని అనవేమిరా..’ అని.. ఇంట్లో పెద్దవాళ్లొచ్చి చెప్పాలి. ఆలోచన కలిగించాలి!బడ్జెట్ కూడా ఏళ్లుగా తట్టనీ అందు కోలేదు.. ‘నువ్వు కూడా వచ్చి తినూ..’ అనలేదు. స్త్రీ అనే ప్రాణి ఉందనే ఆలోచనే బడ్టెట్లో లేదు! అప్పుడొచ్చి ఆర్థికవేత్తలెవరో ఇచ్చిన ఆలోచనే..‘జెండర్ రెస్పాన్సివ్ బడ్జెటింగ్’.అంటే.. మహిళల్ని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ వెయ్యడం. ఈసారి బడ్జెట్ మహిళల్ని ఎంతవరకు దృష్టిలో పెట్టుకోబోతోంది?! ఫిబ్రవరి 1 న బడ్జెట్. ఇప్పటికే రెడీ అయిపోయి ఉంటుంది. అందులో మహిళలకు ఎంతిచ్చారో, ఏమిచ్చారో రెండు రోజుల్లో తెలుస్తుంది! ఎప్పట్లా అయితే ఈసారి బడ్జెట్ ఉండేందుకు లేదు. ఉండటం అన్యాయం అవుతుంది. మహిళలకు మరింతగా ప్రాధాన్యం ఇవ్వాలి. ఏ ప్రణాళికలూ, ప్రభుత్వ విధానాలూ కాపాడలేని విధంగా మహిళలు ఈ ఏడాది కరోనా నుంచి ప్రపంచాన్ని కాపాడారు. తమ ప్రాణాలను పణం గా పెట్టారు. ఆ ‘రుణం’ తీర్చుకునే విధంగా బడ్జెట్ ఉండాలి. దేశ జనాభాలో మహిళ లు 48 మంది ఉన్నా, ‘జాతీయ స్థూల ఉత్పత్తి’ శ్రమలో మహిళల రెక్కల కష్టం 17 శాతం వరకు ఉన్నా.. గత 2020–21 బడ్జెట్లో మహిళల కోసం కేటాయించింది 5 శాతం కన్నా తక్కువే! ఇంట్లో మహిళల శ్రమ, చాకిరి ఎలాగూ ‘ఎకానమీ’ లెక్కల్లోకి రావు. ఆ పదిహేడు శాతానికైనా తిరుగు ప్రతిఫలం ఉండాలి. అది ఈ బడ్జెట్లో ఉండబోతోందా? ఉండబోవడం కాదు. ‘ఉండాలి’ అనే నిబంధన ఉంది. ‘జెండర్–రెస్పాన్సివ్ బడ్జెటింగ్ (జి.ఆర్.బి) ఆ నిబంధన. 2001 నుంచి ఆలోచించి, 2006లో ఈ జి.ఆర్.బి.ని బడ్జెట్లో తప్పనిసరి చేసింది ప్రభుత్వం. ‘బడ్జెట్ ఎలాగైనా ఉండొచ్చు. మహిళలకు ప్రాధాన్యం లేకుండా మాత్రం ఉండకూడదు’ అని నాడు స్త్రీ శిశు సంక్షేమ శాఖ చేసిన సిఫారసును ఆర్థికశాఖ పరిగణనలోకి తీసుకోవలసిందే. స్త్రీ పురుష అసమానతలు, మహిళలపై హింస, లైంగిక వేధింపులు, వేతనాల్లోని వ్యత్యాసాలను తొలగించడానికి ప్రభుత్వం అనుసరించ వలసిన విధానాలలో ఒకటిగా ‘జెండర్–రెస్పాన్సివ్ బడ్జెటింగ్’ ఒక శక్తిమంతమైన సాధనం అయింది. బడ్జెట్ను ఎలా రూపొందిస్తారో తెలిసిందే. వచ్చేదింత, పోయేదింత అనే అంచనాలు ఉంటాయి. జెండర్ బడ్జెట్ అందుకు భిన్నమైనది. ఇందులో పార్ట్–ఎ, పార్ట్–బి అని ఉంటాయి. పార్ట్ ఎ లో ప్రత్యేకంగా మహిళలు, బాలికల అభివృద్ధి కోసమే దోహదపడే పథకాలకు, కార్యక్రమాలకు ప్రాధాన్యాలు ఉంటాయి. పార్ట్ బి లో మహిళలు, బాలికల సంక్షేమం కోసం ప్రత్యేకించిన కేటాయింపులు ఉంటాయి. పార్ట్ బికి ఎక్కువ వాటా ఉంటుంది. గత ఏడాది బడ్జెట్లో పార్ట్ ఎ, పార్ట్ బి కి కలిపి 1,43,461 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా పెట్టి, అందులో పార్ట్ ఎ కి 28, 568 కోట్లు, పార్ట్ బి కి 1,14, 893 కోట్ల రూపాయలు కేటాయించారు. జెండర్ బడ్జెట్ ప్రధాన ఉద్దేశం మహిళా సాధికారత. లైంగిక సమానత్వ సాధన. ఇవన్నీ కూడా విద్య, ఉపాధి, ఆరోగ్యంతో సమకూరుతాయి కనుక కరోనా పెంచిన అంతరాన్ని సరి చేసేందుకు కూడా ఈ ఏడాది బడ్జెట్లో ఈ మూడింటికి ఎక్కువ నిధులు కేటాయించి ఉంటే సబబుగా ఉంటుంది. మరీ ముఖ్యంగా.. జెండర్ బడ్జెట్ను ఒక ప్రభుత్వ విధానంగా కాక, ప్రభుత్వ నిర్ణయాలలో మహిళలకు భాగస్వామ్యం కల్పించే వినూత్న ప్రణాళికలతో రూపొందించవలసిన అవసరం ఉందన్నది ఆర్థికవేత్తల సూచన. చూడాలి, ఈ ఏడాదిని మనం ‘జెండర్ బడ్జెట్’ కన్నా ఎక్కువదైన ‘ఉమన్ బడ్టెట్’గా చూడబోతున్నామేమో. అదే నిజమైతే అది వండర్ బడ్జెట్టే అవుతుంది. -
జాతీయ కుటుంబ సర్వేలో ఆసక్తికర అంశాలు
సాక్షి, సంగారెడ్డి : జిల్లాలో లింగ సమానత్వంపై కొన్ని దశాబ్దాలుగా చేస్తున్న పోరాటాలు, ఉద్యమాలు, చైతన్యపూరిత కార్యక్రమాలు సత్ఫలితాలిచాయి. గతంతో పోలిస్తే ఈ సంఖ్య గణనీయంగా పెరిగినట్లు ప్రభుత్వ సర్వే వెల్లడించింది. రాష్ట్ర సంగటు కంటే జిల్లాలోనే మహిళ సంఖ్య అధికంగా ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. ఐదేళ్ల క్రితం ప్రతి వేయి మంది పురుషులకు జిల్లాలో 1,007 మంది మహిళలు ఉంటే.. ప్రస్తుతం ఏకంగా ఆ సంఖ్య 1,053కు పెరిగింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–5 నివేదికలో ఈ విషయాలను కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమశాఖ స్పష్టంచేసింది. 2019 జూన్ 30 నుంచి కేంద్ర కుటుంబ నవంబరు 14 వరకు 892 కుటుంబాల్లోని 911 మంది మహిళలు, 119 మంది పురుషులతో సర్వే నిర్వహించినట్లు ఆరోగ్య సంక్షేమశాఖ తెలియజేసింది. చదవండి: ఆ రాష్ట్రాల్లో రోజుకు రూ.3,500 కోట్లు నష్టం తగ్గిన సిజేరియన్లు.. జిల్లాలో ప్రసవాలను పరిశీలిస్తే గతంలో కంటే సిజేరియన్ ప్రసవాలు తగ్గినట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడించింది. 2015–16లో నిర్వహించిన సర్వేలో సిజేరియన్ ప్రసవాలు 46.9 శాతంగా నమోదైతే.. ఐదేళ్ల తర్వాత అంటే 2019–20లో 43.2 శాతానికి తగ్గింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ సిజేరియన్ ప్రసవాలు ఐదేళ్ల క్రితం 65.1 శాతంగా ఉండగా...2019–20లో 71.6 శాతానికి పెరగడం గమనార్హం. నవజాత శిశు మరణాలు నాలుగేళ్లలో 1000 మందికి 20 నుంచి 16.8 కి తగ్గాయి. నాలుగేళ్లలోపు వయసున్న శిశు మరణాలు 31.7 నుంచి 29.4కు తగ్గాయి. నాలుగేళ్లలోపు చిన్నారులకు సరైన పోషకాహారం లభించక ఎత్తు, వయసుకు తగిన బరువు ఉండటం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరునెలల నుంచి నాలుగేళ్లలోపు చిన్నారుల్లో రక్తహీనత ఎక్కువగా ఉందని సర్వే వెల్లడించింది. తగ్గని మధుమేహం.. జిల్లాలో పురుషులు, మహిళల్లో మధుమేహం (డయాబిటీస్) ఎక్కువగా ఉన్నట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే బయటపెట్టింది. 141–160 ఎంజీ/డీఎల్ ఉన్నవారిలో మహిళలు 4.4 శాతం మంది, పురుషులు 6.3 శాతం మంది ఉన్నారు. 160 కన్నా ఎక్కువ ఉన్న మహిళలు 5.3, పురుషులు 8.7 శాతం మంది ఉన్నారు. మాత్రలు వేసుకున్నా 140 కన్నా ఎక్కువ ఉన్న మహిళలు 11.3 శాతం, పురుషులు 16.3 శాతం మంది ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. మరింత పెరిగే అవకాశం.. ఆడపిల్లల పట్ల తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. ఆడపిల్లలు, మహిళల భవిష్యత్పై ప్రభుత్వం అవగాహనా, చైతన్య కార్యక్రమాలు చేయడమే కాకుండా ప్రోత్సాహకాలు కూడా ఇస్తున్నారు. ప్రభుత్వ పథకాలలో, విద్య, ఉద్యోగాలలో కూడా ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యమిస్తున్నది. గర్భిణులుగా ఉన్నప్పుడు స్కానింగ్ లాంటి చర్యల పట్ల కఠినంగా వ్యవరిస్తున్నారు. వైద్యులు కూడా అబార్షన్లు చేయడంలేదు. ఐసీడీఎస్ ద్వారా ఆడపిల్లలను రక్షించాలనే నినాదంతో పలు కార్యక్రమాలను చేపడుతున్నాం. మున్ముందు బాలికల శాతం మరింత పెరిగే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ‘బేఠీ బచావో–బేఠీ పడావో’ నినాదం కూడా బాలికల శాతం పెరగడానికి దోహదపడింది. – పద్మావతి, ఐసీడీఎస్ పీడీ జిల్లా వివరాలు 2015–16(శాతం) 2019–20(శాతం) ఆరేళ్లు, ఆపై వయస్సు గల వారు పాఠశాలకు వెళ్తున్న వారు 57 60.2 15 ఏళ్లలోపు చిన్నారుల జనాభా 26.1 24.1 మహిళల్లో అక్షరాస్యత 57 63.6 20 ఏళ్లలోపు బాలికల వివాహాలు 36.3 30.6 -
క్రీడల్లో లింగ వివక్షపై ఐఓఏ ముందడుగు
న్యూఢిల్లీ: క్రీడా పరిపాలన వ్యవహారాల్లో లింగ వివక్షను రూపుమాపి, పురుషులతో సమానంగా మహిళలకు సమాన అవకాశాలిచ్చేందుకు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ముందడుగు వేసింది. ఈ మేరకు జాతీయ క్రీడా సమాఖ్యల జనరల్ అసెంబ్లీలో మూడింట ఒక వంతు మహిళలు ఉండేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఐఓఏ కార్యదర్శి రాజీవ్ మెహతా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ను కోరారు. అన్ని జాతీయ ఒలింపిక్ కమిటీలు లింగ సమానత్వాన్ని ప్రోత్సహించాలని ఇటీవల అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సూచించింది. -
మొన్న ఆడ, నిన్న మగ.. నేడు ఏదీ కాదు..
లండన్: హర్ట్ఫోర్డ్షైర్లో పుట్టి పెరిగిన కైరా బెల్ జన్మతా ఆడపిల్ల. రింగు రింగుల జుట్టుతో చిన్నప్పుడు అచ్చం ఆడ పిల్లలాగే ఉన్నా మగపిల్లల్లా గదమ మీద, చేతుల మీద వెంట్రుకలు వచ్చేవి. వాటిని రేజర్తో షేవ్ చేసుకోవాల్సి వచ్చేది. గొంతు కూడా ఆడ పిల్లలాగ కాకుండా పీల గొంతు ఉండేది. ఈ లక్షణాలకు తగినట్లుగానే ఆమెకు చిన్నప్పటి నుంచి మగవాళ్ల దుస్తులే ధరించేది టామ్బాయ్ (మగ దుస్తులు ధరించే ఆడపిల్ల)లాగా. ఆడ పిల్లల దుస్తులు «ధరించాల్సిందిగా తల్లి ఎంత మొత్తుకున్న వినేది కాదు. భర్త నుంచి విడిపోయి ఒంటరిగా ఉంటున్న తల్లితోనే ఆమె ఉండేది. రానురాను కైరా బెల్ శరీరంలో మగ లక్షణాలతోపాటు ఆలోచనల్లో కూడా మగ లక్షణాలే పెరగడంతో సెక్స్ మార్పిడి ఆపరేషన్ చేయించుకోవాలనుకుంది. 16వ ఏటా బ్రిటన్ నేషనల్ హెల్త్ స్కీమ్ ఆధ్వర్యంలో నడుస్తున్న లండన్లోని ‘ది టావిస్టాక్ సెంటర్’ చికిత్సా కేంద్రాన్ని సందర్శించింది. మూడున్నర గంటల కౌన్సిలింగ్ ద్వారా ఆమెకు సెక్స్ మార్పిడి చేయాలని వైద్యులు నిర్ణయించారు. ముందుగా ఆడ లక్షణాలకు సంబంధించిన హార్మోన్స్ను అడ్డుకునే మందులు ఇచ్చారు. ఆ తర్వాత సెక్స్ మార్పిడి ఆపరేషన్ చేశారు. ఆమెలో మహిళా హార్మోన్లు నశించడంతోపాటు పీరియడ్స్ ఆగిపోయాయి. లైంగిక కోరిక చచ్చిపోయింది. ఈ దశంలో ఆమెకు ‘టెస్టాస్టెరోన్’ హార్మోన్ల ఇంజెక్షన్లు ఇచ్చారు. అప్పుడు గడ్డం, మీసాలు బాగానే పెరిగాయి. ఆడ పిల్లల్లాగా బ్రెస్ట్ కూడా పెరుగుతూ వచ్చింది. దాంతో ఆమె తన 20వ ఏట ఆపరేషన్ ద్వారా బ్రెస్ట్ తీసేయించుకున్నారు. మళ్లీ పెరగకుండా ‘ప్రెసింగ్’ ట్రీట్మెంట్ తీసుకుందిజ ఈ క్రమంలో ఆమె ఎంతో బాధను అనుభవించింది. బర్త్ సర్టిఫికేట్, విద్యార్హతల్లో జెండర్ను ఆడ నుంచి మగగా మార్చుకోవడానికి కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఎంత కష్టపడ్డా పూర్తి మగ లక్షణాలు రాలేదు. దాంతో ఆమె పునరాలోచనలో పడింది. టెస్టోస్టెరోన్ ఇంజెక్షన్లు తీసుకోవడం మానేసింది. దాంతో ఆమెకు తిరిగి పీరియడ్స్ మొదలయ్యాయి. గడ్డం, మీసాలు పెరగడం తగ్గాయి. లైంగిక కోరికలు కలగడం కూడా మొదలయింది. తిరిగి ఆడపిల్ల కావాలనుకుంది. ఇక్కడే ఆమె జీవితం కొత్త మలుపు తిరిగింది. ‘ది టావిస్టాక్ సెంటర్’ 18 ఏళ్లు నిండని మైనర్లకు సెక్స్ మార్పిడి ఆపరేషన్లు చేయడం చట్టవిరుద్ధమంటూ దాఖలైన కేసులో ప్రత్యక్ష సాక్షిగా కైరా బెల్ను పేర్కొన్నారు. అందుకని ఆమె సెక్స్ మార్పిడికి ‘ది టావిస్టాక్’గానీ, ప్రాసిక్యూటర్లుగానీ అనుమతించడం లేదు. ఈ కేసు హైకోర్టులో తేలదని, బ్రిటన్ సుప్రీం కోర్టు వరకు వెళ్లాల్సి ఉంటుందని న్యాయనిపుణులు చెబుతున్నారు. సుప్రీంలో కేసు తేలడానికి కొన్నేళ్లు పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. అప్పటి వరకు కైరా నిరీక్షించాల్సిందే. ‘నాది ఆడ లేదా మగ కాని బతుకైనది. రెండింటి మధ్య నలిగి పోతున్నాను. సెక్స్ మార్పిడి కోరుకునే వారికి నా అనుభవాలు ఓ గుణపాఠం కావాలి’ అని కైరా సమాజానికి సందేశం ఇస్తున్నారు. ఇంతకుముందు బ్రిటన్ చార్లీ ఎవాన్స్ ముందు ఆడ పిల్ల, సెక్స్ మార్పిడి ద్వారా పురుషుడయ్యారు. మళ్లీ ఆపరేషన్ ద్వారా ఆడపిల్లగా మారారు. ఇలాంటి అనుభవాలు ఉన్నప్పటికీ బ్రిటన్లో లింగ మార్పిడికి 13,500 మంది నిరీక్షణ జాబితాలో ఉన్నారు. 2009–10 సంవత్సరంలో 18 ఏళ్లలోపు ఆడపిల్లలు 40 మంది లింగ మార్పిడి ఆపరేషన్ చేసుకోగా వారి సంఖ్య 2017–2018 సంవత్సరానికి 1806కు చేరుకుంది. ఇక మగవారి సంఖ్య 57 నుంచి 753కు చేరుకుంది. -
లింగ సున్నితత్వ విద్య అవసరం
బాలికలపై, మహిళలపై మగవారు అత్యాచారాలు, దురాగతాలకు ఎందుకు పాల్పడతారు? వారికి ‘అలా ప్రవర్తించకూడదు’ అని బాల్యంలో బలంగా మనసులో నాటుకోవడంలేదు. దానికి భిన్నమైన భావనలు నాటుతున్నారు. దీనికి దీర్ఘకాలిక పరిష్కారం చూడాలి. అది బడి లోనే సాధ్యం. విద్యా కాలం దాటేలోపుగానే వారిలో లింగ సున్నితత్వం ఏర్పరచాలి. ఇందుకు ఒక చిన్న పుస్తకం కావాలి. ప్రాథమిక తరగతులకు ఇరవై పేజీలు ఉంటే సరిపోతుంది. ఆరో తరగతి నుంచీ అటూఇటుగా ముప్పై, నలభై పేజీలు చాలు. ఈ పుస్తకాన్ని మొదటి సబ్జెక్టుగా పెట్టాలి. అన్ని పరీక్షలకన్నా ముందు ఒక ఇరవై మార్కులకి ఈ పరీక్ష జరగాలి. ఈ పరీక్ష ఉత్తీర్ణత ప్రధానమైనదిగా కాక, భాగస్వామ్య ప్రధానంగా సాగాలి. పుస్తకంలో పేజీలు ఒకటి బాలుర కోసం, పక్కనే ఇంకొకటి బాలికల కోసం వుండాలి. అంటే, ఒక పేజీ సమాజంలో ఎదిగే బాలుడిని లక్ష్యంగా చేసుకుని తయారు చేయాలి, ఒక పేజీ బాలికల గురించి. ఉదాహరణకి, ఆరో తరగతిలో ఒక పేజీలో, ‘ఒసే, ఏమే, అది, ఇది అని నీ తరగతిలో బాలికలను పిలవకూడదు. వారి పేర్లతోనే వారిని పిల వాలి’ అని రెండు వాక్యాలు ఇవ్వాలి. దాని గురించి చిన్న చర్చ. ‘అది’ ‘ఇది’ అని తరగతిలో వేటిని పిలుస్తాము? బాలికలకీ ఆ వస్తువులకీ తేడాలు ఏమిటి? బాలిక వస్తువు కాదు, ఒక మనిషి అని చెప్పాలి. అక్కడే ఒక బొమ్మ, వస్తువులకీ; ప్రాణం, అనుభూతులు గల బాలికకూ తేడా చూపేవిధంగా పెట్టాలి. పేజీ చివర, చిన్న ఖాళీ పంక్తులలో, వారు పేరు పెట్టి పిలిచే వ్యక్తులు ఎవరు? పై సంబోధనలు చేసేది ఎవరిని? ఎందుకు? ఈ అలవాటు ఎందుకు మానెయ్యాలి? అని స్పందన పత్రం రాయాలి. ఇలాగే, ఎనిమిదో తరగతి పిల్లవాడికి, ‘మగ పిల్లలకి మీసాలు రావడం సహజం. వాటిని మెలి తిప్పడంలో ఏవిధమైన ప్రత్యేకతా లేదు. అలాగే, తొడ కొట్టడం వల్ల కొత్త బలం రాదు. బల ప్రదర్శనా పోటీలో కూడా, విజేత హుందాగా గెలవాలి. పురుషత్వం ఒక సహజమైన అంశం. అది గొప్పా కాదు, తక్కువా కాదు’ అని రాయాలి. ఇంకా, నీ చెల్లీ/అక్కా, నువ్వూ ఒక్కసారే భోజనం చేస్తు న్నారా? మీ అమ్మా నాన్నా ఒకే విధంగా ఆహారం తీసుకుంటున్నారా? ముందు ఎవరు తింటున్నారు? ఎందుకు? ఎలా వుంటే బావుంటుంది? అని ప్రశ్నించవచ్చు. అదే పుస్తకంలో బాలికలకు కూడా వాళ్లకి నేర్పవలసిన సంగతులు వుండాలి. ఉదాహరణకు ఒరే, పోరోయ్ అని కాకుండా బాలురని పేరుతో పిలవాలి. ఇంటి విషయాల్లో బాలికలు అన్ని రకాలుగా సమాన భాగస్వాములు. తల్లి, తండ్రి, రోజంతా పని చేసిన తరువాత; పిల్లలు బడి సమయం పూర్తి అయిన తరువాత, విశ్రాంతి కోసం చేరే స్థలాన్ని ‘ఇల్లు’ అంటాము. మీ ఇల్లు మీ కుటుంబం మొత్తానిది. దాని బాధ్యతలు కూడా అందరివీ. ఒక పేజీలో వంట ఇంట్లో పని చేస్తున్న మొత్తం కుటుంబ సభ్యుల చక్కని పెయింటింగ్/ఫొటో ప్రచురించాలి. ఇల్లు భవిష్యత్తులో నేను ‘పూర్తి’ సమయం ఉండవలసిన స్థలం అనే భావన నుంచి బాలికలు బైటికి రావాలి. బాలురు కూడా, ఇల్లు స్త్రీకి చెందినది అనే భావన నుంచి బైటికి రావాలి. ఇలా ఒక పుస్తకం చేసి, దాన్నొక వేడుకగా పిల్లలకి ఇద్దాం. పెద్ద ఖర్చు కూడా కాదు. వచ్చే విద్యా సంవత్సరంనుంచీ ప్రభుత్వం విద్యా రంగంలో మార్పులు తేబోతోంది కాబట్టి, లింగ సున్నితత్వం విద్యా ప్రణాళికలో చేర్చడానికి ఇదే సరైన సమయం. ఈ పుస్తకాన్ని పిల్లలకు వారి వారి సొంత భాషలోనే అందించాలి. ఇక్కడ నేను వ్యక్తీకరించినవి ప్రాథ మిక భావనలు. వీటిని మరింత మెరుగు చేసుకుని ఒక చక్కని సమాజాన్ని నిర్మించుకోవడానికి పిల్లలకోసం కొన్ని రంగు బొమ్మల పేజీలు ముద్రించగలం కదా. ఎమ్మెస్కే. కృష్ణ జ్యోతి వ్యాసకర్త అసిస్టెంట్ ప్రొఫెసర్ మొబైల్: 91107 28070 -
గుట్టుగా లింగనిర్ధారణ పరీక్షలు
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో కొన్ని స్కానింగ్ సెంటర్లు గుట్టుగా లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నాయి. పీసీపీఎన్డీటీ జాతీయ తనిఖీ బృందం గత రెండు రోజులుగా హైదరాబాద్ సహా రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో తనిఖీలు నిర్వహించగా ఈ విషయం మరోసారి బయటపడింది. మూడు జిల్లాల్లోనూ పది సెంటర్లను తనిఖీ చేయగా వీటిలో ఐదు సెంటర్లు నిబంధనలు పాటించడం లేదని గుర్తించారు. ఆయా సెంటర్లకు నోటీసులు జారీ చేసి, చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు ఆదేశాలు జారీ చేసింది. వీటిలో ఒక కార్పొరేట్ ఆస్పత్రి సహా శివారులోని పలు స్కానింగ్ సెంటర్లు ఉన్నట్లు తేలింది. హైదరాబాద్ జిల్లా పరిధిలో 800పైగా స్కానింగ్ సెంటర్లు ఉండగా, రంగారెడ్డి జిల్లాల్లో 522, మేడ్చల్ జిల్లాలో 600పైగా స్కానింగ్ సెంటర్లు ఉన్నాయి. అధికారులు ఇప్పటికే వీటిల్లో తనిఖీలు నిర్వహించి, లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్న వైద్యులతో పాటు రేడియాలజిస్టులు లేని, రికార్డులు సరిగా నిర్వహించని స్కానింగ్ సెంటర్లను గుర్తించి కేసులు నమోదు చేశారు. గతంలో 30పైగా సెంటర్లను సీజ్ చేసిన అధికారులు తాజాగా మరో ఐదు సెంటర్లపై చర్యలకు ఆదేశాలు జారీ చేయడం విశేషం. ఎప్పటికప్పుడు ఆయా కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించాల్సిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మొద్దు నిద్రవీడక పోవడం వల్లే జాతీయస్థాయి బృందాలు రంగంలోకి దిగాల్సి వస్తోంది. ఈ దాడుల్లో లింగనిర్ధారణ పరీక్షలు చేస్తూపలు కేంద్రాలు అడ్డంగా దొరికిపోతున్నాయి. -
అతడామె! జెస్ట్ చేంజ్!
పురుషుడు లింగమార్పిడితో మహిళగా మారడం ఇప్పుడు అంత కష్టం కాదు. కానీ సమాజం ఆమోదించడమే అరుదైన విషయం. జెండర్ మారిన విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించుకోవడం అంత సులభం కాదు. కావాలంటే సోనియా పాండే అనే ఈ యువతిని అడగండి. కొద్ది రోజుల క్రితం వరకు రాజేశ్ అనే యువకుడిగా ఉండేవాడు. ఇప్పుడు సోనియాగా మారిపోయాడు. ఎందుకిలా మారిపోయావని అడిగితే ఆత్మ తనదికాని శరీరంలో ప్రవేశపెట్టినంత ఇబ్బందిగా ఉండటంతో ‘చేంజ్’ కోరుకున్నానని జవాబిస్తాడు. మనది కాని శరీరంలో ఆత్మ ఉండటం ఎంత కష్టమో అనుభవించానని ఇకనైనా సోనియా పాండేగా తనను గుర్తించమని అడుగుతోంది. కాదు పోరాడుతోంది. ఎందుకంటే ఆమె పనిచేస్తున్న ఇండియన్ రైల్వే సోనియాను అతడిగానే కొనసాగి(చూ)స్తోంది. ఆమెగా మార్చమన్న అభ్యర్థనను ఆమోదించకుండా నిబంధనల పేరుతో మోకాలడ్డుతోంది. అధికారిక పత్రాల్లో తనపేరు, జెండర్ మార్చాలని గోరఖ్పూర్లోని నార్త్ ఈస్ట్రన్ రైల్వే(ఎన్ఈఆర్) జీఎం కార్యాలయం చుట్టూ సోనియా తిరుగుతోంది. రైల్వే చరిత్రలో ఇలాంటి అభ్యర్థన ఎప్పుడూ రాకపోవడంతో ఏం చేయాలో తోచక ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లాలకు చెందిన 35 ఏళ్ల సోనియా పాండే ముందుగా ఇజ్జత్నగర్ రైల్వే వర్క్షాప్ జనరల్ మేనేజర్కు తన అభ్యర్థనను విన్నవించుకుంది. తన సమస్యకు అక్కడ పరిష్కారం దొరక్కపోవడంతో ఎన్ఈఆర్ జీఎం వరకు వెళ్లాల్సివచ్చింది. గోరఖ్పూర్లో కూడా ఆమెకు నిరుత్సాహపూరితమైన సమాధానమే వచ్చింది. అధికారులు దాటవేట ధోరణి ప్రదర్శించారు. ఇది చాలా సంక్లిష్టమైన అంశమని, చట్టపరంగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకుని దీన్ని పరిష్కరించాల్సి ఉందంటూ ఎన్ఈఆర్ ప్రజాసంబంధాల అధికారి సీపీ చౌహాన్ లౌక్యం చూపారు తప్పా సోనియాకు స్పష్టమైన హామీయివ్వలేదు. సోనియా పాండే వీడిన చిక్కు‘ముడి’ నలుగురు అక్కాచెల్లెళ్ల నడుమ అల్లారుముద్దుగా పెరిగిన రాజేశ్ పాండే 2003లో తండ్రి చనిపోవడంతో డిపెండెంట్ ఉద్యోగం దక్కడంతో ఇజ్జత్నగర్ రైల్వే వర్క్షాప్లో గ్రేడ్–1 టెక్నీషియన్గా ఉద్యోగ జీవితం ప్రారంభించాడు. చిన్నతనం నుంచే అమ్మాయిగా మారాలన్న కోరికతో పెరిగిన రాజేశ్ 2017లో లింగమార్పిడి చేయించుకుని సోనియా పాండేగా రూపాంతరం చెందాడు. ఆపరేషన్ చేయించుకోవడానికి ముందే స్థానిక యువతితో అతడికి వివాహం జరిగింది. ‘అసలు సంగతి’ బయట పడటంతో వీరి వివాహ బంధం అట్టే కాలం నిలవలేదు. మగాడి దేహంలో ఇమడలేక సతమతం అవుతున్నానని, మగడిగా ఉండటం తనకు ఇష్టం లేదని భార్య దగ్గర రాజేశ్ ఓపెన్ అయ్యాడు. భర్త బాధను అర్థం చేసుకున్న ఆమె విడాకులు తీసుకుని మౌనంగా అతడి జీవితం నుంచి నిష్క్రమించింది. చిక్కు‘ముడి’ విడిపోవడంతో లింగమార్పిడి చేయించుకుని ఆమెగా అవతరించాడు. మహిళగా మారిన తర్వాత తనకు నచ్చిన జీవితం గడుపుతూ ‘గుర్తింపు’ కోరుకుంటున్నాడు. చీకటిలో కాంతి కిరణం అందరి మహిళల్లానే సోనియా పాండే బాగా ముస్తాబవుతుంది. చక్కగా చీర కట్టుకుని, ఫుల్ మేకప్తో ఆఫీసుకు వెళ్లే సోనియాను చూసి, అంతకుముందు ఆమె కాదు అతడంటే నమ్మడం ఎవరికైనా కష్టమే. అయితే అతడు ఆమెగా మారడం అంత సులువుగా ఏం జరగలేదు. ‘‘వయసు పెరుగుతున్న కొద్ది నాకు ఏం కావాలో తెలిసొచ్చింది. నా ఆత్మను పొరపాటున మగాడి శరీరంలో ప్రవేశపెట్టినట్టుగా అనిపించింది. అమ్మాయిలా ఆలోచించేవాడిని. అద్దం ముందు నిలబడి అమ్మాయిలా ప్రవర్తించేవాడిని. ఆడవాళ్లలా ముస్తాబు కావడానికి ఇష్టపడేవాడిని. కుటుంబ సభ్యులు ఒత్తిడి చేసి బలవంతంగా పెళ్లి చేశారు. కానీ నా భార్యకు నిజం చెప్పడంతో ఎవరి దారి వారు చూసుకోవడానికి అంగీకరించింది. మగాడిగా ఉండటం ఇష్టం లేక కుంగుబాటుకు గురయ్యాను. ఆత్మహత్య చేసుకోవాలని చేసుకోవాలని కూడా అనుకున్నాను. ఇంత నరకం అనుభవించే కంటే లింగమార్పిడి చేయించుకోవచ్చు కదా అని ఎవరో ఇచ్చిన సలహా చీకటిలో కాంతి కిరణంలా నాకు కనబడింది. మా అమ్మ, అక్కాచెల్లెళ్లు నా నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. నేను సంతోషంగా ఉండాలంటే అమ్మాయిగా మారడమే మంచిదని నా నిర్ణయానికే కట్టుబడ్డాను. లింగమార్పిడి చేయించుకుని రెండేళ్లయింది. ఇప్పుడంతా నార్మల్గా ఉంది’’ అని సోనియా వివరించింది. పోరాటానికి సిద్ధం సోని(న)యా రూపాన్ని కుటుంబ సభ్యులే కాదు ఆమె ఉద్యోగం చేస్తున్న రైల్వే బోర్డు కూడా గుర్తించ నిరాకరిస్తోంది. ఆమెగా గుర్తించాలని సోనియా అభ్యర్థనను అలకించడం లేదు. ‘‘న్యూ జెండర్ ఐడెంటిటీని గుర్తించకపోవడం చాలా బాధగా ఉంది. ఐడీ కార్డు, ఇతర పత్రాల్లో ఇంకా రాజేశ్గా కొనసాగించడాన్ని జీర్ణించుకోలేపోతున్నాను. లింగ మార్పిడి, పేరు మార్పిడితో నన్ను గుర్తించాలని రైల్వే అధికారులను వేడుకుంటున్నాను. అధికారిక పత్రాల్లో ఆమెగా నమోదు చేయాలని కోరుకుంటున్నాను. కొత్త రూపంతో నన్ను గుర్తించేందుకు అవసరమైతే రైల్వే బోర్డుతో పోరాటానికి వెనుకాడబోను’’ అని సోనియా స్పష్టం చేసింది. లింగమార్పిడి చేయించుకున్న కొత్తలో చుట్టుపక్కల వారు, సహోద్యోగులు వింతగా చూశారని సోనియా గుర్తు చేసుకుంది. ఇప్పడు అందరూ తనతో బాగానే మాట్లాడుతున్నారని, మామూలుగానే ఉంటున్నారని వెల్లడించింది. తనలాగే చాలా మంది లింగమార్పిడి చేయించుకుని మనసుకు నచ్చినట్టుగా బతుకుతున్నారన్న ధైర్యమే తనకు కొండంత విశ్వాసాన్ని ఇస్తోందని సంతోషం వ్యక్తం చేసింది. దేశ రాజధాని ఢిల్లీ, వాణిజ్య నగరం ముంబై, ఇతర మహానగరాలతో పాటు ప్రపంచంలోని చాలా చోట్ల తనలాంటి వారు ఉన్నారని సంతృప్తి చెందుతోంది. తమది కాని దేహంలో ఇమడలేక తన లాగే ఎంతో మంది లింగమార్పిడి చేయించుకుంటున్నారని సోనియా చెప్పింది. అవును ఇంతకీ ‘ఆమె’గా సోనియాను అధికారులు ఎప్పుడు గుర్తిస్తారు? – పోడూరి నాగ శ్రీనివాసరావు సాక్షి వెబ్డెస్క్ -
అదంతే..అనాదిగా ఇంతే!
బొమ్మలతో ఆడుకోవడమంటే చిన్న పిల్లలకు సరదా.. వాటిని చూడగానే ఎంత మారాం చేసే వారైనా నిమిషంలో అట్టే సైలెంట్ అయిపోతారు. సంవత్సరం లోపు వయసున్న పిల్లలకు దాదాపు గిలక్కాయ వంటి చప్పుడు చేసే వస్తువులు ఇస్తుంటాం. ఆ వస్తువుల్లో పెద్ద తేడా ఉండదు. కానీ వాళ్లు పెరుగుతున్న కొద్దీ వారు ఆడుకునే బొమ్మల్లో తేడా వస్తుంటుంది. ఆడ పిల్లలైతే బార్బీ బొమ్మలు, టెడ్డీ బేర్, కిచెన్ సెట్లు, పెళ్లి కూతురు బొమ్మలను ‘ఇస్తుంటాం’. అదే మగ పిల్లలయితే కార్లు, బైకులు, ట్రక్కులను ‘ఇస్తుంటాం’.. అంతేనా..? మనమే ఇస్తుంటామా.. లేదా వారే అలా కోరుకుంటారా..? ఇలా బొమ్మలను ఎంచుకోవడం, ఆడ, మగ పిల్లలు వేర్వేరుగా పెరగడంలో సమాజం పాత్ర ఏమైనా ఉందా.. లేదా సహజంగానే ఆ ఎంపిక జరుగుతోందా..? ఇదే విషయాన్ని తెలుసుకునేందుకు కొన్ని జంతువులపై బీబీసీ ప్రయోగం జరిపింది. ఎంపికలో తేడా అనాదిగానే ఉందని, మనుషుల్లోనే కాదు జంతువుల్లో కూడా ఇలాంటి ప్రవర్తనే ఉంటుందని ఈ పరిశోధనల్లో తేలింది. జెండర్ న్యూట్రల్ బొమ్మలు లింగ వివక్ష చూపుతూ బొమ్మలు తయారు చేస్తున్నారంటూ ప్రపంచవ్యాప్తంగా అభ్యంతరాలు వస్తున్నాయి. ‘కిండర్ జాయ్’కూడా మగ పిల్లలకు, ఆడ పిల్లలకు వేర్వేరు బొమ్మలు తయారు చేస్తుండటంపై ఈ మధ్య వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. లింగ వివక్షచూపే బొమ్మలు ఉండొద్దని.. అందరు పిల్లలకూ ఒకే రకమైన బొమ్మలు తయారు చేయాలని (జెండర్ న్యూట్రల్ టాయ్స్) ప్రపంచవ్యాప్తంగా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఆటలోనూ ఆడ, మగ జంతువులు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో బార్బీ బొమ్మలు, టెడ్డీ బేర్స్, కార్లు, బైకులు, ట్రక్కులు ఇలా చాలా బొమ్మలను పరిశోధకులు ఉంచారు. బబూన్ కోతి పిల్లలను పరిశీలించినప్పుడు ఆడ కోతి పిల్లలేమో టెడ్డీబేర్ వంటి బొమ్మలతో ఆడుకున్నట్లు, మగ కోతి పిల్ల లేమో కార్లు, ట్రక్కులతో ఆడుకున్నట్లు గమనించారు. మిగతా జంతువుల్లో కూడా దాదాపు ఇలాంటి ప్రవర్తనే గుర్తించారు. ‘జంతువులు ఇలా చేస్తున్నాయంటే వాటికి ఎవరైనా నేర్పుతున్నారా? కాదుకదా సహజంగానే అవి ఎంచుకుంటున్నాయి. ఇలాంటి ప్రవర్తనే మానవు ల్లో కూడా అనాదిగా ఉంది. ఎవరూ నేర్పించట్లేదు. ఇది సహజమైన ప్రక్రియే’అని జీవ పరిణామ శాస్త్రవేత్త ప్రొ.బెన్ గారడ్ పేర్కొన్నారు. -
అమ్మో ఎంత ధైర్యం ఈ పిల్లకి..!
లైంగిక వివక్షపై ఒక యువతి నెట్లో విసిరిన వ్యంగ్యాస్త్రం నవ్వుల పువ్వుల్ని పూయించడమే కాదు.. సమాజంలోని అసమానతలపై ఆలోచననూ రేకెత్తిస్తోంది. ‘‘అమ్మో ఎంత ధైర్యం ఈ పిల్లకి! పెళ్లయిన కొత్తలోనే భర్తను కొంగుకు ముడేసుకుందే. ఓ ఆడపిల్ల మాట్లాడాల్సిన మాటలేనా ఇవి. అయ్యో అయ్యో భర్తకే ముసుగేస్తుందా! పాకిస్తాన్లో ఉండి కూడా పితృస్వామ్య వ్యవస్థ గురించి ఇలాంటి వెటకారాలు చేస్తుందా. ఈ అమ్మాయికి బుద్ధి చెప్పాల్సిందే’’.. అంటూ కొంతమంది సంప్రదాయ వాదులు బుగ్గలు నొక్కుకున్నా పర్లేదు నా తీరు మార్చుకోను అంటున్నారు ఈ ఫొటోలో కన్పిస్తున్న ఈ వివాహిత! పైగా ‘‘మీలాంటి వాళ్ల కోసమే.. ఇలాంటి పోస్టు పెట్టాను. ఇప్పటికైనా ఆడ, మగ అంతా సమానమని గుర్తిస్తే ఇలాంటి సన్నాయినొక్కులు నొక్కాల్సిన అవసరం రాదంటూ’’ ఘాటుగా కౌంటర్ కూడా ఇచ్చారు. విమర్శలు లెక్కచేయక తన కొత్త జీవితానికి సంబంధించిన విశేషాలను జోడిస్తూ ‘న్యూలీవెడ్స్’ అనే ఇన్స్టా అకౌంట్లో తన భర్తతో కలిసి దిగిన ఈ ఫొటోను పోస్ట్ చేసి అనాదిగా కొనసాగుతున్న లింగ వివక్షను ఇన్డైరెక్టుగా ఎత్తిచూపారు. ‘‘ఈయనే అందమైన నా శ్రీవారు. కానీ మా ఆయన అందమైన ముఖాన్ని మీరు చూడలేరు. నా కోసం ఆయన తన అందాన్ని ఇలా దాచుకుంటారు. ఎందుకంటే ఆయన అందం, సాధించిన విజయాలు, కలలు ఇలా ఒక్కటేమిటి తన జీవితానికి సంబంధించిన ప్రతీ విషయానికి నేనే హక్కుదారును కదా. తనకు దిష్టి తగలకూడదనే ఈ పాడు ప్రపంచానికి దూరంగా.. తననెప్పుడూ ఇంట్లోనే ఉండమంటాను. అయితే నాతో పాటు అప్పుడప్పుడూ బయటికి తీసుకువెళ్తా. నిన్న రాత్రి తనను డిన్నర్కు తీసుకువెళ్లాను. అక్కడ స్టెరాయిడ్ ఫ్రీ చికెన్ మాత్రమే ఆర్డర్ చేశాం. ఎందుకంటే తన ఆరోగ్యం గురించి నాకు శ్రద్ధ ఉంది. ఒకవేళ ఇలాంటి ఆహారం తినడం వల్ల సంతాన భాగ్యానికి భంగం కలిగితే ఎలా? అసలు ఆయన ఉన్నదే నన్ను తల్లిని చేయడానికి. పిల్లల్ని కనివ్వడానికి. అందుకే ఏం తినాలో ఏం తినకూడదో నేనే నిర్ణయిస్తా. తనను బయటికి తీసుకువెళ్లినపుడు ఇలా దాచేస్తా (ముసుగు వెనుక). ఒకవేళ ఆయన అందానికి ముగ్ధులై ఎవరైనా వేధిస్తే? వేధించారే అనుకోండి అప్పుడు వాళ్లను ఎవరో శిక్షిస్తారని సరిపెట్టుకుంటా’ అంటూ ఓ పాకిస్తానీ వివాహిత ఇన్స్ట్రాగామ్లో షేర్ చేసిన స్టోరీ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. తన భర్తకు బుర్ఖా వేసి.. అతడితో దిగిన సెల్ఫీని పోస్ట్ చేసిన ఈ మహిళ లింగ వివక్ష, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతా నా ఇష్టం ‘‘వేరే వాళ్లకే నేను నియమాలు విధిస్తా. నేను మాత్రం నా ఇష్టం వచ్చినట్లుగా ఉంటా. ఎలాంటి దుస్తులైనా సరే వేసుకుని తిరుగుతా. ఎందుకుంటే నేను ఆడదాన్ని. ఇతర ఆడవాళ్ల గురించి పట్టించుకోను. ఒకవేళ నాపై ఎవరైనా దాడి చేసినా, ఏమైనా అన్నా తిరిగి మాట్లాడను. అలా చేస్తే నేను పిరికిదాన్నని ఈ లోకం భావిస్తుంది. ఆడవాళ్లు బలహీనంగా ఉండకూడదు కదా. నేను మరీ అంత లింగ వివక్ష చూపనులెండి. మా ఆయన డ్రైవింగ్ చేసేందుకు అనుమతిస్తా. ఉద్యోగానికి పంపిస్తా. అయితే అక్కడ ఆయన ఎవరితోనైనా మాట్లాడటం పూర్తిగా నిషిద్ధం. నా భర్తను కాపాడుకోవాలంటే కేవలం ఇలా చేస్తే చాలు’’ అంటూ సదరు వివాహిత పితృస్వామ్య వ్యవస్థ తీరును ఎండగట్టారు. సెటైర్లు.. సెల్యూట్లు ‘‘మీ భర్త ఉద్యోగం చేయడానికి అనుమతించకండి. ఇలా చెప్పడం వెనుక ఏ లాజిక్ లేదు. కానీ మీరు మగవారిని అలా ఒంటరిగా బయటకు పంపకండి. ఇంకో విషయం మీ భర్త ముఖం ముసుగులోంచి నుంచి కూడా కనిపిస్తోంది. సరిగ్గా కవర్ చేసుకోమని చెప్పండి’ అంటూ కొంతమంది ఆమెకు మద్దతుగా నిలుస్తుండగా మరికొంత మంది నెటిజన్లు మాత్రం ‘ఇదేం విడ్డూరం’ అంటూ వెటకారపు కామెంట్లు చేస్తున్నారు. ‘అయినా ఒక భర్త తన భార్యను ఏవిధంగా ‘ఉండాలని’ భావిస్తాడో అదే విధంగా భార్య కూడా భావించడంలో తప్పేం ఉంది. ఆడ, మగ ఇద్దరూ మనుషులే కదా. మీరు చెప్పింది 100 శాతం నిజం. సెల్యూట్ మేడమ్’ అని అని మరికొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. -సుష్మారెడ్డి యాళ్ల, సాక్షి వెబ్ డెస్క్ -
కత్తిరిస్తే ఖతమే..
సాక్షి, వరంగల్ రూరల్ :ఆడపిల్ల అని తెలియగానే గర్భంలోనే తుంచేసే ఘటనలు కోకొల్లలు. ఇక నుంచి అబార్షన్ చేయించుకునే వారికి, చేసేవారికి ఇక చెక్ పడనుంది. ఆడపిల్లను రక్షించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. స్కాన్ చేసి నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది. అసలు కడుపులో పుట్టబోయే బిడ్డ ఆరోగ్య పరిస్థితులను తెలుసుకునేందుకు డాక్టర్లు స్కానింగ్ చేస్తారు. దీనిని ఆసరా చేసుకుని కొందరు దంపతులు పుట్టబోయే బిడ్డ ఆడ, మగ పిల్లా అని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దానికగుణంగానే స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు కొందరు పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని లింగనిర్ధారణ చేస్తున్నారు. ఆడ పిల్ల అయితే శుక్రవారం అని, మగ అయితే సోమవారం అని కోడ్ భాషలతో దంపతులకు, తీసుకువచ్చిన ఆర్ఎంపీ డాక్టర్లకు చెబుతున్నారు. ఆన్లైన్లో.. పుట్టబోయే పిల్లల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి స్కానింగ్ చేసే కేంద్రాలు వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం జిల్లాలో 46 ఉన్నాయి. ఇప్పటివరకు ఈ కేంద్రాల్లో కేవలం సమాచారాన్ని సంబంధిత వైద్యులు ఇస్తున్నారు. ఇక నుంచి ఈ విధానంలో పూర్తి మార్పులు రానున్నాయి. లింగ నిర్ధారణ చేసే వారిపై కఠినంగా వ్యవహరించాలని, ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయంతీసుకుంది. ప్రతీ కేంద్రంలో రోజూ నమోదవుతున్న కేసుల సంఖ్య వివరాలు జాతీయ, రాష్ట్ర కుటుంబ సంక్షేమం, జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు తెలుపాలి. ఆన్లైన్లో వివరాలు సంబంధిత నిర్థారణ కేంద్రాల వారు ఎప్పటికప్పుడు వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఇందుకు వారికి తగిన శిక్షణ ఇచ్చారు. ఈ వివరాలు నమోదు చేయని వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఆస్పత్రుల్లో ప్రసవించే వారి వివరాలతో పాటు వైద్య ఆరోగ్య శాఖకు పంపించాల్సి ఉంటుంది. ఈ వివరాల ద్వారా ఆడ, మగ జననాలు తెలుసుకుని ఏదైనా ఆస్పత్రుల్లో మగపిల్లల జననాలు ఎక్కువగా ఉంటే అక్కడ తనిఖీలు నిర్వహించి కారణాలు తెలుసుకుంటారు. ఇప్పటికీ మొక్కుబడి చర్యలే.. లింగనిర్ధారణతో పాటు అబార్షన్ చేయించేందుకు జిల్లాలో కొంత మంది ఏజెంట్లు పని చేస్తున్నారు. జిల్లాలోని నెక్కొండలో ఓ ప్రైవేట్ క్లీనిక్లో అనుమతి లేకుండా లింగనిర్థారణ పరీక్షలు చేసి అబార్షన్ చేసినట్లు సమాచారం రావడంతో ఇటీవల వైద్య ఆరోగ్య శాఖ తనిఖీ చేసే సమయానికి అన్ని సర్దుకుని పేషెంట్లు లేకుండా చేశారు. అలాగే క్లీనిక్లో ఎలాంటి ఆనావాళ్లు లేకుండా యజమాన్యం జాగ్రత్త పడింది. మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఓ వైద్యుడు మొబైల్ స్కానింగ్ సెంటర్ను నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. ఆ డాక్టర్ సూట్ కేసులో పెట్టుకుని వచ్చి ప్రైవేట్ ఆస్పత్రుల్లో స్కానింగ్ చేసి వెళుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుపేద కుటుంబాల్లోని వారికి ఆడపిల్ల అని తెలిస్తే కొందరు దళారులు వారి వద్ద డబ్బులు తీసుకుని అబార్షన్లు చేస్తున్నారు. ఈ విషయాల్లో వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కొత్త నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి. చర్యలు ఇలా .. ♦ లింగనిర్ధారణ ద్వారా కడుపులో పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిపిన వారిపై రూ10వేల జరిమానా, మొదటిసారి మూడు సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది. ♦ రెండోసారి అదే తప్పు చేసినట్లయితే రూ.50వేల జరిమానాతో పాటు ఐదు సంవత్సరాల జైలు శిక్ష , సంబంధిత కేంద్రాన్ని తొలగిస్తారు. వైద్యుడి గుర్తింపు పట్టా రద్దు చేస్తారు. ♦ ఆడపిల్ల అని తెలిపి అబార్షన్ చేస్తే సంబంధిత ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలతో పాటు మద్యవర్తులపై చట్టపరంగా చర్యలు, జైలు శిక్ష ఉంటుంది. ఆన్లైన్లో నమోదు చేయాలి స్కానింగ్ సెంటర్లపై ప్రత్యేక నిఘ పెట్టాం. స్కానింగ్కు వచ్చే వారి వివరాలు ప్రతి రోజు ఆన్లైన్లో నమోదు చేయాలి. ఆన్లైన్లో నమోదు చేసినవి స్కానింగ్ చేసిన వాటిని మ్యానువల్గా చెక్ చేస్తాం. స్కానింగ్ సెంటర్లలో లింగనిర్థారణ పరీక్షలు చేయడం చట్ట రీత్యా నేరం. అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.– డాక్టర్ మధుసూదన్,జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి -
‘నా భర్త ఉన్నది కేవలం అందుకే.. కాబట్టి’
‘అమ్మో ఎంత ధైర్యం ఈ పిల్లకి. పెళ్లైన కొత్తలోనే భర్తను కొంగుకు ముడేసుకుందే. ఓ ఆడపిల్ల మాట్లాడాల్సిన మాటలేనా ఇవి. అయ్యో అయ్యో భర్తకే ముసుగేస్తుందా. పాకిస్తాన్లో ఉండి కూడా పితృస్వామ్య వ్యవస్థ గురించి ఇలాంటి వెటకారాలు చేస్తుందా. ఈ అమ్మాయికి బుద్ధి చెప్పాల్సిందే’ అంటూ కొంతమంది సంప్రదాయ వాదులు బుగ్గలు నొక్కుకున్నా పర్లేదు నా తీరు మార్చుకోను అంటున్నారు ఫొటోలో కన్పిస్తున్న ఈ వివాహిత. పైగా మీలాంటి వాళ్ల కోసమే.. ఇలాంటి పోస్టు పెట్టాను. ఇప్పటికైనా ఆడ, మగ అంతా సమానమని గుర్తిస్తే ఇలాంటి సన్నాయినొక్కులు నొక్కాల్సిన అవసరం రాదంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. విమర్శలు లెక్కచేయక తన కొత్త జీవితానికి సంబంధించిన విశేషాలను జోడిస్తూ ‘న్యూలీవెడ్స్’ అనే ఇన్స్టా అకౌంట్లో తన భర్తతో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేసి అనాదిగా కొనసాగుతున్న లింగ వివక్షను ఎత్తిచూపారు. ‘ఈయనే అందమైన నా శ్రీవారు. మా ఆయన అందమైన ముఖాన్ని మీరు చూడలేరు. నా కోసం ఆయన తన అందాన్ని ఇలా దాచుకుంటారు. ఎందుకంటే ఆయన అందం, సాధించిన విజయాలు, కలలు ఇలా ఒక్కటేమిటి తన జీవితానికి సంబంధించిన ప్రతీ విషయానికి నేనే హక్కుదారును కదా. తనకు దిష్టి తగలకూడదనే ఈ పాడు ప్రపంచానికి దూరంగా.. తననెప్పుడూ ఇంట్లోనే ఉండమంటాను. అయితే నాతో పాటు అప్పుడప్పుడూ బయటికి తీసుకువెళ్తా. నిన్న రాత్రి తనను డిన్నర్కు తీసుకువెళ్లాను. అక్కడ స్టెరాయిడ్ ఫ్రీ చికెన్ మాత్రమే ఆర్డర్ చేశాం. ఎందుకంటే తన ఆరోగ్యం గురించి నాకు శ్రద్ధ ఉంది. ఒకవేళ ఇలాంటి ఆహారం తినడం వల్ల సంతాన భాగ్యానికి భంగం కలిగితే ఎలా. అసలు ఆయన ఉన్నదే నన్ను తల్లిని చేయడానికి. పిల్లల్ని కనివ్వడానికి. అందుకే ఏం తినాలో ఏం తినకూడదో నేనే నిర్ణయిస్తా. తనను బయటికి తీసుకువెళ్లినపుడు ఇలా దాచేస్తా(బుర్ఖా వెనుక). ఒకవేళ తన అందానికి ముగ్ధులై ఎవరైనా వేధిస్తే. వేధించారే అనుకోండి అప్పుడు వాళ్లను ఎవరో శిక్షిస్తారని సరిపెట్టుకుంటా’ అంటూ ఓ పాకిస్తానీ వివాహిత ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన స్టోరీ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. తన భర్తకు బుర్ఖా వేసి.. అతడితో దిగిన సెల్ఫీని పోస్ట్ చేసిన సదరు మహిళ లింగ వివక్ష, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నా ఇష్టం వచ్చినట్లు తిరుగుతా.. ‘ వేరే వాళ్లకే నేను నియమాలు విధిస్తా. నేను మాత్రం ఇష్టం వచ్చినట్లుగా ఉంటా. ఎలాంటి దుస్తులైనా సరే వేసుకుని తిరుగుతా. ఎందుకుంటే నేను ఆడదాన్ని. ఇతర ఆడవాళ్ల గురించి పట్టించుకోను. ఒకవేళ నాపై ఎవరైనా దాడి చేసినా, ఏమైనా అన్నా తిరిగి మాట్లాడను. అలా చేస్తే నేను పిరికిదాన్నని ఈ లోకం భావిస్తుంది. ఆడవాళ్లు బలహీనంగా ఉండకూడదు కదా. నేను మరీ అంత లింగ వివక్ష చూపనులెండి. మా ఆయన డ్రైవింగ్ చేసేందుకు అనుమతిస్తా. ఉద్యోగానికి పంపిస్తా. అయితే అక్కడ ఆయన ఎవరితోనైనా మాట్లాడటం పూర్తిగా నిషిద్ధం. నా భర్తను కాపాడుకోవాలంటే కేవలం ఇలా చేస్తే చాలు. లేకపోతే నాకు ‘స్వర్గసుఖాలు’ ఎలా లభిస్తాయి’ అంటూ సదరు వివాహిత పితృస్వామ్య వ్యవస్థ తీరును ఎండగట్టారు. ఈ క్రమంలో... ‘ మీ భర్త ఉద్యోగం చేయడానికి అనుమతించకండి. ఇలా చెప్పడం వెనుక ఏ లాజిక్ లేదు. కానీ మీరు మగవారిని అలా ఒంటరిగా బయటకు పంపకండి. ఇంకో విషయం మీ భర్త ముఖం బుర్ఖాలో నుంచి కూడా కనిపిస్తోంది. సరిగ్గా కవర్ చేసుకోమని చెప్పండి’ అంటూ కొంతమంది ఆమెకు మద్దుతుగా నిలుస్తుండగా మరికొంత మంది నెటిజన్లు మాత్రం ‘ఇదేం విడ్డూరం’ అంటూ వెటకారపు కామెంట్లు చేస్తున్నారు. ‘అయినా ఒక భర్త తన భార్యను ఏవిధంగా ‘ఉండాలని’ భావిస్తాడో అదే విధంగా భార్య కూడా భావించడంలో తప్పేం ఉంది. ఆడ, మగ ఇద్దరూ మనుషులే కదా. మీరు చెప్పింది 100 శాతం. సెల్యూట్ మేడమ్’ అని అని మరికొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. View this post on Instagram This is my beautiful husband. Of course, you can't see how beautiful he is because I make sure he keeps his beauty (read: identity) hidden as I am the only true haqdaar of it. Everything he is, all his achievements, dreams, all of his fkn life, he owes it to me. Any namehram's nazar is haraam on him, so I prefer he stay at home as the world is a bad place. However, it is ok when he goes out with me. I took him to dinner at @madroostapk last night. We only go there because they use steroid free chicken and we are very health conscious, especially after knowing how growth hormone injected chicken can affect fertility. I don't want his fertility to be affected because his major purpose of existing is to give me children and make me a mother. So no matter what, I only bring him to eat out here. I Iove how he modestly hides himself while going out, as he is khuli tijori and I wouldn't want him to get molested. Even then if he gets molested, we will accept that as qismah and hope that the abuser will be punished in akhirah. I on the other hand can roam around and loiter on my own, in my chadda banyaan, in my tank top in my spaghetti strap top or even shirtless, because I am a woman. I am not scared of other women. They will not assault me. And even if they do, I will not talk about it because it will prove me weak and defenceless in front of the whole wide world. A woman is not supposed to be weak, you know, we were created to be strong and macho. Also, I let him go out to work and drive cuz I am a strong believer in equality. However, looking at na-mehrams and interacting with them in any way is strictly prohibited. It is my duty to ensure these practices as a pious husband is my key to jannah, how will I get to sleep with 70 virgins in the afterlife warna? Also photography and all is also haraam but we had to do this since in attempt to educate you all and save you from qabar ke saanp and jahannum ki aag. Where's my medal? . . . #genderroles #smashingpatriarchy #dawn #nomeansno #consent #endrapeculture #metoo A post shared by The Mewly Weds (@themewlyweds) on Apr 6, 2019 at 5:57am PDT -
జెండర్ను మార్చుకునే కొత్త చట్టం
టాస్మానియా దేశం లింగ వివక్షను రూపుమాపడానికి కొత్త చట్టం తెస్తోంది. ఇకపై ఆ దేశంలో పదహారు సంవత్సరాలు దాటిన ట్రాన్స్జెండర్లు ఎవ్వరి అనుమతి లేకుండా తమ జెండర్ను మార్చుకోవచ్చు. అలాగే జనన ధృవీకరణ పత్రాలపై, వివాహం చేసుకునేటప్పుడు, చివరికి డెత్ సర్టిఫికెట్లో కూడా తమ జెండర్ను చట్టబద్దంగా నమోదు చేసుకునే సౌలభ్యం అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ముర్కిసన్ స్వతంత్ర ఎమ్మెల్సీ రూత్ ఫారెస్ట్ ప్రవేశ పెట్టిన బిల్లును ఎగువ సభ ఆమోదించగా, వచ్చేవారం నుంచి అధికారికంగా అమలు కాబోతోంది. ఒకవేళ పదహారు సంవత్సరాల కన్నా వయసు తక్కువగా ఉండి జెండర్ను మార్చాలనుకుంటే అందుకు వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకుల అనుమతి అవసరం. ఇందుకు వారు కౌన్సిలింగ్కు హాజరు కావాల్సి ఉంటుంది. అలాగే జీవిత భాగస్వాములుగా మారిన ఇద్దరు ట్రాన్స్జెండర్ల మధ్య విడాకులు తీసుకోవడానికి ముందు తమ తమ బర్త్ సర్టిఫికేట్లపై లింగ మార్పిడికి వీలుండదు. అంతేకాకుండా ఈ బిల్లు ద్వారా లింగ వివక్ష, హోమోసెక్సువల్ గురించిన అసభ్యకర భాషను కూడా నిషేధించారు. ‘ఈ చట్టం వల్ల మా దేశంలో ఎలాంటి లింగ వివక్ష లేకుండా అందరూ సమానమే’నన్న భావన పెరుగుతుందని ఈ బిల్లు పెట్టిన రూత్ ఫారెస్ట్ అన్నారు. -
పనీపాటా లేని కుర్రకారు ఇక్కడే ఎక్కువ
న్యూఢిల్లీ: యువత ఎలాంటి పనీ లేకుండా ఖాళీగా ఉండటం భారత్లోనే అధికమని ఐఎమ్ఎఫ్ సీనియర్ ఆర్థిక వేత్త జాన్ బ్లూడోర్న్ పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలతో పోలిస్తే భారత్లోనే అధిక యువ జనం పనీపాటా లేకుండా ఉంటారని, ఏ పనీ లేకుండా ఖాళీగా ఉండే వారి సంఖ్య ఇక్కడ 30 శాతంగా ఉందని వివరించారు. బ్రూకింగ్స్ ఇండియా నిర్వహించిన సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని లేబర్ మార్కెట్లలో లింగ అసమానత్వం, టెక్నాలజీల మార్పు, ఉద్యోగ నాణ్యత అధ్వానంగా ఉండటం వంటి సమస్యలు ఉన్నట్లు చెప్పారాయన. టెక్నాలజీ మార్పులు, ఆటోమేషన్ సమస్యల ప్రభావం అభివృద్ధి చెందుతున్న దేశాల కంటే అభివృద్ధి చెందిన దేశాలపైనే అధికమన్నారు. కాగా భారత్లో గత నెలలో నిరుద్యోగం 7.2 శాతానికి పెరిగిందని ముంబైకి చెందిన సీఎమ్ఐఈ ఇటీవలే వెల్లడించింది. 2017లో భారత్లో నిరుద్యోగం 45 ఏళ్ల గరిష్ట స్థాయి, 6.1 శాతానికి చేరిందని ఎన్ఎస్ఎస్ఓ ముసాయిదా నివేదిక పేర్కొంది. -
ల్యాప్టాప్
‘నేను మగ’ అని హెల్ప్ చెయ్యకపోవడం కాదు. ‘ఆమె ఆడ’ అని హెల్ప్ చెయ్యడం కాదు. ఇంట్లో పనిని మగవాళ్లు పని అనుకోవడం, అనుకోకపోవడాన్ని బట్టే.. ఇంట్లో ఆడవాళ్లకు సహాయం అందడం, అందకపోవడం ఉంటుంది! కెవ్వుమంది ఆమె! ‘ఏంటీ?!’ అని పైకి లేచాడతను. ‘బ..బ.. బల్లి’ అంది. ‘ఎక్కడ?’. ‘బాత్రూమ్’లో. చిరాకుపడ్డాడు. బల్లికి భయపడ్డం ఏంటి! నేరుగా బాత్రూమ్లోకి వెళ్లాడు. కిటికీలో బల్లి ఇంకా అక్కడే ఉంది. అతడి వెనుక నుంచి ఆమె ఇంకా భయంగానే బల్లివైపు చూస్తోంది. ‘మీవారిని తీసుకొచ్చావా?’ అని ఆ బల్లి తననే చూస్తున్నట్లు అనిపించింది ఆమెకు. బల్లి దగ్గరకు వెళ్లాడు అతను. అదిలించాడు. కదిలించాడు. ఎగిరి కిందపడింది. మళ్లీ కెవ్వుమంది ఆమె. ఆమె చేతిలోని చీపురును తను తీసుకుని బల్లిని తరిమేశాడు.కయ్యిమన్నాడు అతడు! ‘ఏంటీ!’ అని పరుగెత్తుకొచ్చింది ఆమె. ‘బూజు’ అన్నాడు. ‘ఎక్కడ?’ అంది. ‘అదేమిటి?’ అన్నాడు. తలెత్తి చూసింది. గదికి పైన ఓ మూల ఉంది. బూజుకర్ర తెచ్చింది. ‘నిన్ను పంపించారా మీవారు, తను చెయ్యనని’ అని ఆ బూజు తనను అడిగినట్లుగా ఆమెకేమీ అనిపించలేదు. తనకు అందకపోతే కదా భర్తనే వెళ్లమనడం. కర్రను రెండు చుట్లు చుట్టి శుభ్రం చేసి వెళ్లిందామె. ఈలోపు, నోటికి తీసుకోబోతూ పక్కన పెట్టేసిన టీ కొంచెం చల్లారిపోయింది. నష్టమేం లేదు. మళ్లీ వేడి చేసుకుంటుంది. తాగబోతుండగా మళ్లీ కయ్యిమని పిలుపొచ్చినా మళ్లీ టీని అక్కడ పెట్టేసి వెళుతుంది. ఆమెకు మూమూలే.. రోజుకి రెండు మూడు ‘కయ్’లన్నా వినడం. ఆమెకు కోపం రాదు. ఆమె కెవ్వుమన్నందుకు అతడికి చిరాగ్గా అనిపించవచ్చు కానీ, అతను కయ్మన్నందుకు ఆమెకు కోపం రాదు! బల్లినంటే ఆమె తరమలేకపోయింది కానీ, బూజును అతడు తుడిచేయొచ్చు. బూజేమీ బల్లిలా ఒళ్లు తిప్పుకుంటూ వెళ్లదు. కళ్లు మిటకరిస్తూ చూడదు. తోకను కదల్చదు. అదో టైపులో కటకటమని అరవదు. ఇవన్నీ కాదు, బల్లి అంటే ఆమెకు ఉన్నట్లుగా, బూజు అంటే అతడికి భయం లేదు. మరి తనే బూజుకర్ర తీసుకొచ్చి ఆమె చుట్టినట్లు రెండు చుట్లు చుట్టి బూజును తీసేయొచ్చు కదా! తీసేయొచ్చు కానీ, ఆమేం పుట్టింట్లో లేదు కదా.. వచ్చేందుకు టైమ్ పడుతుంది, ఈలోపు బూజు ఎగిరొచ్చి తన నెత్తి మీదో, భుజం మీదో పడుతుంది.. అనుకుని బూజుకర్ర అందుకోవడానికి!తప్పేం లేదు. సరిగ్గానే ఉన్నాడతడు. ఇల్లు దులపడం ఆడ పని, మగ పని అని అనుకునేంత దూరంగా కూడా ఏమీ వెళ్లిపోలేదు. తను పనిలో ఉన్నట్లుగానే, తనలా ఇంట్లో ఉన్న మరో మనిషి కూడా ఏదో పనిలో ఉంటుందన్న ఆలోచనైతే రావాలి. రాలేదు. బూజు కనిపించింది.. కయ్యిమన్నాడు. అది కూడా కాదు. బూజు దులపడాన్ని అసలతడు పనే అనుకోలేదు. దాన్ని పని అనుకుని ఉంటే, లోపల మనిషి చేస్తున్నదీ పనే అనుకునేవాడు. పనిలో ఉన్న మనిషిని పిలిచి మళ్లీ ఒక పని చెప్పేవాడు కాదు. లేచి తనే చేసేవాడు. లేదంటే, ఆమె తన పని పూర్తి చేసుకుని అటుగా వచ్చినప్పుడు.. పని గురించి వినే తీరికలో, వినే ఓపికలో ఆమె ఉందా అని గమనించి చెప్పేవాడు. ఆ చెప్పడం కూడా.. ‘ఓ సెలవు రోజు ఇద్దరం కలిసి ఇంటిని శుభ్రం చేయాలి’ అని సీలింగ్ వైపు చూస్తూ చెప్పేవాడు. ఆ తర్వాత ఆమెకు కుదిరినప్పుడు ఆమె, అతడికి కుదిరితే అతడు, ఇద్దరికీ కుదిరితే ఇద్దరూ కలిసి చేసుకునేవాళ్లు. ఇంటి పనుల్లో మగవాళ్లు హెల్ప్ చెయ్యకపోవడానికి కనిపించే సాధారణ కారణం.. ‘ఎవరి పని వారు’ చెయ్యాలనే ఒక ఆలోచన వారిలో ఇన్బిల్ట్గా ఉండిపోవడం అనుకుంటాం. ఆలోచన కాదు, ‘అనాలోచన’ ఇన్బిల్ట్గా ఉండిపోవడం అసలు కారణం. టమాటాలు తరగడం పనిలా కనిపించనప్పుడు.. టమాటాలు తరిగే మనిషి కూడా పని చేస్తున్నట్లుగా కనిపించదు. పని చేస్తున్నట్లు కనిపించనప్పుడు పనిగట్టుకుని వెళ్లి హెల్ప్ చేయడం ఏమంటుందనే ఆ అనాలోచన.. సెన్సిటివిటీ లేకపోవడమే కానీ, జెండర్ సెన్సిటివిటీ లేకపోవడం కాదు. ఇంటపనుల్లో చక్కగా హెల్ప్ చేస్తుండే మగవాళ్లు కూడా.. ‘అయ్యో పాపం.. ఆడ మనిషి’ అని హెల్ప్ చెయ్యడం కాదు. స్త్రీ పురుష సమానత్వం అనుకుని టమాటాల్ని, కత్తిపీటను ఆమె నుంచి లాక్కోవడం కాదు. హెల్ప్ చెయ్యాలని అనిపించడం కాదు. హెల్ప్ చేస్తున్నామని అనుకోవడమూ కాదు. ఎదురుగా ఒక మనిషికి ఏకకాలంలో రెండు మూడు పనులున్నాయి కనుక సాటి మనిషిగా వాటిల్లో ఒక పనిని చేతికి అందుకోవడం. అది కూడా సెన్సిటివిటీ తప్ప జెండర్ సెన్సిటివిటీ కాదు. ఇంట్లో పనిని మగవాళ్లు పని అనుకోవడం, అనుకోకపోవడాన్ని బట్టే ఇంట్లో ఆడవాళ్లకు సహాయం అందడం, అందకపోవడం తప్ప.. ఇది మగ పని, ఇది ఆడ పని అని జనరల్గా అక్కడ పురాతత్వ పని విభజన నియమాలేవీ అప్లయ్ అవ్వవు. కొందరికి పేస్ట్ అందించాలి. బ్రష్ అందించాలి. బ్రష్లో పేస్ట్ వేసి కూడా అందించాలి. తమ పళ్లు, తమ పని అనుకోరు. మీరు తినడానికే మేము పళ్లు తోముకుంటున్నాం అన్నట్లుంటారు. ఇలాంటి వాళ్లను సెన్సిటైజ్ చెయ్యడానికి తప్ప, మహిళలూ పెద్దగా ఉద్యమాలేం చెయ్యరు కూడా. ‘ఇల్లు క్లీన్ చెయ్యడం ఆడవాళ్ల పని, ల్యాప్టాప్ ఒళ్లో పెట్టుకుని కూర్చోవడం మగవాళ్ల పని అనుకోకండి. మనుషులకు తప్ప, పనులకు జెండర్ లేదు’ అని చెప్పడానికి మాత్రమే వాళ్ల ప్రయత్నమంతా. మొన్న చూడండి. వాలంటైన్స్ డేకి హాంకాంగ్, లండన్లలో హెచ్.ఎస్.బి.సి. సిబ్బందికి ఓ పెద్ద కంపెనీ బంపర్ డిస్కౌంట్ ఆఫర్ ఇచ్చింది. ఆఫర్ చార్ట్లో ‘ఫర్ హిమ్’ సెక్షన్ కింద ల్యాప్టాప్ కంప్యూటర్లు, గోప్రో కెమెరాలు, వైర్లెస్ హెడ్ఫోన్లు ఉన్నాయి. ‘ఫర్ హర్’ సెక్షన్ కింద వ్యాక్యూమ్ క్లీనర్లు, ఆహార పదార్థాల్ని కలియదిప్పే బ్లెండర్లు, కిచెన్ వాటర్ ట్యాప్లు ఉన్నాయి! ఈ లైంగిక వివక్ష ఉమెన్ స్టాఫ్కి ఆగ్రహం తెప్పించింది. ఆఫీస్ల నుంచి వాకవుట్ చేశారు. ఇలాంటి సందర్భాల్లో మళ్లీ అనిపిస్తుంది. ఇంట్లో మగాళ్లు హెల్ప్ చెయ్యకపోవడం అనాలోచన వల్ల కాదేమో, ఆడా మగా అనే ఆలోచన వల్లనేనేమో అని! ఒక్క యుగంలో లోకం ఏమీ మారిపోదేమో. యుగాలుగా లోకం మగాళ్లదే కనుక. బల్లిని చూసి ఆమె భయపడినప్పుడు అతడు వెళ్లి తరిమేశాడు. కొన్నిసార్లు ఇంటి పని కూడా బల్లిలా ఆమెను భయపెడుతుంది. అప్పుడు బల్లిని తరమాల్సింది బల్లి అంటే భయం లేనివాళ్లే. అతడెళ్లి పని అందుకోవాలి. చిన్న పనులు కూడా ఒక్కోసారి ఆమెకు చేయలేని పనులవుతాయి. ఆ గమనింపు ఉంటే చాలు. పని చేయకున్నా పని అందుకున్నట్లే. మరి బూజు? బూజు అయినా, ల్యాప్టాప్ అయినా.. మేడమ్ వచ్చి తుడిస్తేనే నేను క్లీన్ అవుతానని, సారొచ్చి ఒడిలో పెట్టుకుంటేనే నేను ఆన్ అవుతాయని అంటాయా?! - మాధవ్ శింగరాజు -
ఆడ నా? మగ నా? పోలీసుల పరేషాన్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కుషాయిగూడ కార్ల చీటింగ్ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. హైదరాబాద్ పోలీసులకు ఈ కేసు ముచ్చెమటలు పట్టిస్తున్నది. ఈ కేసులో ఎలా ముందుకు పోవాలో అర్థం కాక పోలీసులు లబోదిబోమంటున్నారు. మాకు క్లారిటీ ఇవ్వండి మొర్రో అంటూ ఫొరెన్సిక్ డాక్టర్లను పోలీసులు వేడుకుంటున్నారు. కీలక మలుపులు తిరుగుతున్న కుషాయిగూడ కార్ల చీటింగ్ కేసు వివరాల్లోకి వెళ్తే.. ఈ కేసులో ఈ నెల 3వ తేదీన పోతులయ్య, సయ్యద్ సిరాజ్ హుస్సేన్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో అరెస్టయిన సయ్యద్ సిరాజ్ హుస్సేన్ అడ నా లేదంటే మగ నా అనే విషయం తెలియక పోలీసులు గందరగోళంలో పడ్డారు. కేసు విచారణలో సిరాజ్ హుస్సేన్ను మగ మనిషిగా భావించిన పోలీసులు ఆ మేరకు విచారణ చేపట్టారు. కానీ, కేసుకు సంబంధించి డైరీ నమోదు సమయంలో జెండర్ కాలమ్ నింపే టైంలో తాను అడ్డ పిల్ల అని సిరాజ్ హుస్సేన్ చెప్పడంతో పోలీసులు కంగు తిన్నారు. మూడు ఏళ్ల కిందట ముంబైలో లింగ మార్పిడి చేయించుకున్నట్లు సిరాజ్ చెప్పడంతో పోలీసులు మరింత డైలమాలో పడ్డారు. తన పేరు సయ్యద్ సిరాజ్ హుస్సేన్ కాదని, షాభిన అస్మి అని వెల్లడించారు. తను కరీంనగర్ జిల్లా ఫతేపూర్ గ్రామానికి చెందిన అమ్మాయినని కూడా పేర్కొన్నారు. దీంతో తలపట్టుకోవడం కుషాయిగూడ పోలీసుల వంతైంది. తాము అరెస్ట్ చేసిన వ్యక్తి ఆడ నా లేక మగ నా తేలిన తర్వాతే ఈ కేసులో తదుపరి విచారణ చేపట్టాలని పోలీసులు భావిస్తున్నారు. అందుకోసం ఆ వ్యక్తికి లింగ నిర్ధారణ పరీక్షలు చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా గాంధీ ఆసుపత్రిలోని ఫొరెన్సిక్ విభాగానికి పోలీసులు లేఖ రాశారు. వైద్యుల నివేదిక ఆధారంగా సదరు నిందిత వ్యక్తి ఆడ నా లేదా మగ అన్నది తేల్చుకుని.. జెండర్ కాలమ్ నింపి కేసులో ముందుకు వెళ్తామని పోలీసులు చెబుతున్నారు. కాగా, నేరస్తులను, నిందితులను చెడుగుడు ఆడుకునే పోలీసులకు ఈ వ్యక్తి చుక్కలు చూపిస్తున్నాడని టాక్ మొదలైంది. -
అంతులేని అంతరం
ప్రపంచవ్యాప్తంగా స్త్రీ, పురుష అంతరాలకు అద్దంపట్టే ‘గ్లోబల్ ర్యాంకింగ్’లో భారత పరిస్థితి ఏ మాత్రం మారలేదు. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) 149 దేశాలపై వెలువరించిన జెండర్ గ్యాప్ రిపోర్టు, 2018 ప్రకారం భారత్ ర్యాంకు 108. గత సంవత్సరంలోనూ భారత్ ఇదే ర్యాంకుతో సరిపెట్టుకుంది. ఆర్థిక భాగస్వామ్యం– అవకాశాలు, విద్య, ఆరోగ్యం– మనుగడ, రాజకీయ సాధికారత అంశాల (సబ్ ఇండెక్స్) ఆధారంగా డబ్ల్యూఈఎఫ్ఈ ర్యాంకులిచ్చింది. నివేదిక ప్రకారం భారత్ వేతన వ్యత్యాసాలను తగ్గించడంలో కొంత ప్రగతి సాధించింది. విద్యా రంగంలో 114వ స్థానంతో మెరుగైన పనితీరు కొనసాగించింది. స్త్రీలను ఆర్థికవ్యవహారాల్లో భాగస్వామిగా చేయడం, అవకాశాలు కల్పించడంలో వెనకబడింది. ఈ విభాగంలో భారత్ 142వ ర్యాంక్తో సరిపెట్టుకుంది. రాజకీయ సాధికారత విషయంలో గత ఏడాది 15వ ర్యాంక్రాగా, ఈసారి 19కి పడిపోయింది. స్త్రీల ‘ఆరోగ్యం– మనుగడ’ సూచీలో అట్టడుగుకు చేరింది. గత సంవత్సరం 141 స్థానంలో వుండగా ఈ యేడాది 147 స్థానానికి దిగజారింది. ఆర్మీనియా (148), చైనా (149) చివరి రెండు స్థానాల్లో వున్నాయి. ఈ విభాగంలో ఒకటో స్థానానికి చేరిన దేశాల్లో శ్రీలంక కూడా వుండటం విశేషం. ర్యాంకింగ్పరంగా తొలి 8 స్థానాల్లోని దేశాలు తమ దేశాల్లో 80 శాతం వరకు అసమానతలను రూపు మాపాయని నివేదిక తెలిపింది. ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే స్త్రీ పురుష అంతరాలను పూడ్చే దిశగా దక్షిణాసియాలో మెరుగైన కృషి జరిగిందని నివేదిక పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా సగటు తీసుకుంటే రాజకీయ సాధికారత విషయంలో ఎక్కువ అంతరం (77.1శాతం)ఉంది. ఆర్థిక భాగస్వామ్యం– అవకాశాల విషయంలోనూ (41.9శాతం) అంతరం ఎక్కువగా వుంది. విద్య (4.4శాతం),ఆరోగ్యం– మనుగడ (4.6శాతం) అంశాల్లో వ్యత్యాసాలను బాగా తగ్గించగలిగారు. మార్పు ఇలా మందగమనంతో సాగితే స్త్రీ పురుషుల మధ్య అంతరాలను మొత్తంగా రూపు మాపాలంటే మరో 108 ఏళ్లు పడుతుందని నివేదిక పేర్కొంది. 48వ ర్యాంకు సాధించిన బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ దక్షిణాసియా విభాగంలో టాప్ ర్యాంకు (48) సాధించింది. రాజకీయ సాధికారత విషయంలో ముందడుగేసి బంగ్లాదేశ్ మెరుగైన ర్యాంక్ పొందింది. అంతర్జాతీయంగా 8వ ర్యాంకు సాధించిన ఫిలిప్పీన్స్.. ఆసియాలో ర్యాంకింగ్ పరంగా తొలి స్థానంలో వుంది. చైనా 100 నుంచి 103కి దిగజారింది. పాకిస్తాన్ చివరి నుంచి రెండో స్థానంలో వుండగా, యుద్ధంతో సతమతమవుతున్న యెమెన్ చివరి స్థానంలో వుంది. అగ్రస్థానాన ఐస్ల్యాండ్ ఐరోపాలోని ఐస్ల్యాండ్, నార్వే, స్వీడన్ వరసగా మొదటి మూడు ర్యాంకులు సాధించాయి. ఫిన్లాండ్, నికరాగువా, రువాండా, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్ ఆ తర్వాత స్థానాల్లో వున్నాయి. బ్రిటన్ 15, కెనడా 16, అమెరికా 51, ఆస్ట్రేలియా 53వ ర్యాంకులు సొంతం చేసుకున్నాయి. -
రివ్యూ పిటిషన్లను జనవరి 22న విచారిస్తాం
-
శబరిమల తీర్పుపై స్టే ఇవ్వం
న్యూఢిల్లీ: శబరిమల ఆలయంలోకి అన్ని వయ సుల మహిళలను అనుమతించాలన్న తీర్పుపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్లపై వచ్చే జనవరి 22న ఓపెన్ కోర్టులో విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. సెప్టెంబర్ 23వ తేదీ నాటి తీర్పును సమీక్షించాలంటూ దాఖలైన 48 పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్ర చూడ్, జస్టిస్ ఇందూ మల్హోత్రాల ధర్మాసనం మంగళవారం సుప్రీంకోర్టు చాంబర్లో విచారణ చేపట్టింది. న్యాయవాదులెవరూ లేకుండా కేవలం న్యాయమూర్తులు మాత్రమే పిటిషన్లను పరిశీలించారు. అనంతరం వెలువరించిన ఆదేశాల్లో... ‘ఈ అంశంపై పెండింగ్లో ఉన్న దరఖాస్తులు, దాఖలైన రివ్యూ పిటిషన్లు అన్నిటిపైనా జనవరి 22న తగు ధర్మాసనం విచారణ చేపడుతుంది. ‘ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్, ఇతరులు వర్సెస్ కేరళ ప్రభుత్వం, ఇతరులు’ కేసులో సెప్టెంబర్ 28న వెలువరించిన తీర్పుపై స్టే ఉండబోదని స్పష్టం చేస్తున్నాం’ అని ధర్మాసనం పేర్కొంది. అంతకుముందు.. ఇదే అంశంలో సుప్రీం తీర్పును సవాల్ చేస్తూ జి.విజయ్కుమార్, ఎస్.జయ రాజ్కుమార్, శైలజా విజయన్ అనే వారు దాఖలు చేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాస నం..‘సెప్టెంబర్ 23నాటి తీర్పును సమీక్షించా లని నిర్ణయించినట్లయితే, తాజా పిటిషన్లను రివ్యూ పిటిషన్లతో పాటు కలిపి విచారిస్తాం. ఒకవేళ రివ్యూ పిటిషన్లను కోర్టు తిరస్కరిస్తే, కొత్త పిటిషన్లపై ప్రాధాన్యతా క్రమంలో వేరుగా విచారణ చేపడతాం’ అని పేర్కొంది. రిట్ పిటిషన్లలో ఏముంది? శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అడ్డుకోవడం లింగ వివక్షేనంటూ సెప్టెంబర్ 28న అప్పటి సీజేఐ జస్టిస్ దీపక్మిశ్రా ఆధ్వర్యంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై అయ్యప్ప భక్తుల జాతీయ సంఘం (నాడా), నాయిర్ సేవా సంఘం (ఎన్ఎస్ఎస్) తదితర సంఘాలు, వ్యక్తులు రివ్యూ పిటిషన్లు వేశాయి. ‘రుతు స్రావం మహిళలను ఆలయం లోకి అనుమతించాలన్న తీర్పు విప్లవాత్మకం, ఈ తీర్పుతో రుతుస్రావం మలినం, అశుద్ధం అనే దురభిప్రాయం తొలగి పోతుందనే భావన తప్పు. వార్తల్లోకి రావాలనే తలంపుతో ఉన్న దొంగభక్తులు మాత్రమే సుప్రీం తీర్పును స్వాగతించారు. వాస్తవాల ఆధారంగా ఈ కేసును పరిశీలించినట్లయితే ఈ తీర్పు అహేతు కం, అసమర్థనీయం’ అని నాడా పేర్కొంది. ‘అయ్యప్ప స్వామి ‘నైష్టిక బ్రహ్మచారి’ అయి నందున 10 ఏళ్ల లోపు 50 ఏళ్లు పైబడిన మహిళలు మాత్రమే పూజలు చేయడానికి అరు ్హలు. అంతేకానీ, మహిళలు అయ్యప్పను పూజిం చరాదన్న నియమమేమీ లేదు. చట్టంలో లోపా లతో ఈ కేసు విచారణ 40 ఏళ్లు పట్టింది. అయితే, ఆలయంలోకి మహిళలకు అవకాశం కల్పించడంఆలస్యమైందంటూ ఇలాంటి తీర్పు ఇవ్వడం సరికాదు’ అని ఎన్ఎస్ఎస్ పేర్కొంది. -
తొలిసారిగా జెండర్ న్యూట్రల్ పాస్పోర్ట్
ఆమ్స్టర్డ్యామ్: నెదర్లాండ్ ప్రభుత్వం చారిత్రత్మక నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే తొలిసారిగా జెండర్ న్యూట్రల్ పాస్పోర్ట్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. మాములుగా నెదర్లాండ్ పాస్పోర్ట్లలో మగవారికి (మనెట్జె-m) అని, ఆడవారికి(వ్రువు-v) అని సూచిస్తారు. కానీ ఇకపై జెండర్ న్యూట్రల్ పాస్పోర్ట్లలో వాటి స్థానంలో ’x’ గుర్తును ఉంచనున్నారు. ఈ రకానికి చెందిన తొలి పాస్పోర్ట్ను 57ఏళ్ల లియోనే జేగేర్స్కు అందజేశారు. చిన్నతనం నుంచి బాలుడిగా పెరిగిన లియోనే జేగేర్స్ తనకు యుక్తవయస్సు వచ్చే సరికి తనలో స్త్రీ భావాలు ఉన్నట్టు గుర్తించారు. ఆ తర్వాత 2001లో లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకున్నారు. గతంలో క్రీడల్లో రాణించిన లియోనే.. ప్రస్తుతం నర్సుగా పనిచేస్తున్నారు. కాగా, ఇటీవల తన ఆస్థిత్వం విషయంలో లియోనే కోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం.. జెండర్ న్యూట్రల్గా రిజస్టర్ చేసకోవడాన్ని నివారించడం ద్వారా.. వ్యక్తిగత స్వేచ్ఛకు, ఆత్మ అభిమానానికి భంగం కలిగేలా చేయడమేనని తీర్పు వెలువరించింది. ఆడ, మగ కానీ వారిని థర్డ్ జెండర్గా పేర్కొనాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో నెదర్లాండ్ విదేశాంగ శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కాగా, ఆస్ట్రేలియా, భారత్, కెనడా, పాకిస్తాన్, డెన్మార్క్, న్యూజిలాండ్, మల్టాలు పాస్పోర్ట్ అప్లికేషన్లో జెండర్ న్యూట్రల్ అప్షన్ను ఎంచుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. -
చట్టాల ముసుగులో భ్రూణహత్యలు
‘కేవలం 500 ఈరోజు వెచ్చించండి, లక్షలు కట్నంగా ఇవ్వక్కరలేకుండా చూసుకోండి’ అని ఎక్కడ పడితే అక్కడ గోడలపై, బస్సుల మీద పోస్టర్లు వెలి శాయి. పంజాబ్లో అమృత్సర్ స్వర్ణాలయం సాక్షిగా ఓ డాక్టర్ దంపతులు క్లినిక్ ఆరంభించి గర్భవతుల కడుపులో ఉన్న పిండం మగా లేక ఆడా అనే నిర్ధారణ చేసే పరీక్షలు నిర్వహిం చడం మొదలెట్టారు. అనాదిగా సమాజంలో ఆడపిల్ల అంటే గుండెల మీద కుంపటి అనే ధోరణి ఉండేది. ఉత్తర భారత దేశంలో పల్లెలు, పట్టణాలు, అక్షరా స్యులు, నిరక్షరాస్యులు అన్న తారతమ్యాలు లేకుండా ఆడపిల్లంటే చిన్న చూపు, ఏవగింపు. అలాంటి తరు ణంలో లింగ నిర్ధారణ పరీక్షలు అందుబాటులో ఉన్నాయంటే ఎగిరి గంతేయరూ? పురుషులు భార్య లను ఈ తరహా క్లినిక్లలో లింగ నిర్ధారణ చేయించి మగ అయితే ఉంచడం ఆడ అయితే తుంచేయడం మొదలెట్టారు. అప్పట్లో ఐరోపా దేశాల్లో ప్రాచుర్యం పొందిన అమ్నియోసెంటెసిస్ అనే లింగ నిర్ధారణ పరీక్ష అమృత్సర్ నుంచి ఉత్తర భారతదేశంలో మిగి లిన రాష్ట్రాలకి పాకి ఎన్నో క్లినిక్లు పుట్టగొడుగుల్లా లేచాయి. ఇంజెక్షన్ సాయంతో పిండం నుంచి అమ్నియో టిక్ ద్రవం తీసి దాన్లో క్రోమోజోముల నమూనాను విశ్లేషించడమే ఈ అమ్నియోసెంటెసిస్ పరీక్ష. మాన వుల్లో 46 క్రోమోజోములుండగా చివరి రెండు క్రోమోజోములు ఎక్స్, వై లు. ఈ పరీక్ష ద్వారా చివరి రెండు క్రోమోజోములు ఎక్స్ ఎక్స్, లేదా ఎక్స్ వై ఉందా అని తెలుసుకొని ఎక్స్ వై అయితే వెలిగి పోతున్న మొహంతో ‘అభినందనలు అబ్బాయే పుడ తాడు’, ఒక వేళ ఎక్స్ ఎక్స్ ఉంటే ‘లాభం లేదు, అబార్షన్ చేసి తీసేయాలి’ అని 3 అబార్షన్లు, 6 టెస్టులతో దినదినాభివృద్ధి చెందిందీ వ్యాపారం. అమ్నియోసెంటెసిస్ వ్యవహారంపై ఆందోళన చెందిన స్త్రీవాద సంస్థలు గళమెత్తి ఈ పరీక్షలపై నిషేధం విధించాలని దేశ వ్యాప్తంగా పట్టుబట్టారు. గర్భంలో ఉన్న పిండం ఆరోగ్యం తెలుసుకునే నిమిత్తం 1974లో న్యూఢిల్లీ ఆల్ ఇండియా ఇన్స్టి ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో మొట్ట మొదట అమినోసెన్సేసిస్ పరీక్షలు చేసే విభాగాన్ని నెలకొల్పారు. స్త్రీవాద సంస్థల పోరాటం నడుమ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ రీసర్చ్ అనే సంస్థ ఈ లింగ నిర్ధారణ పరీక్షలు నిలిపివేయవల్సిందిగా ఎయిమ్స్ని కోరడంతో 1975 నుంచి ఎయిమ్స్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం మానేశారు. అప్పుడు మనుగడలో ఉన్న ద మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నన్సీ యాక్ట్లో లొసుగుల వల్ల భ్రూణ హత్యకు అడ్డూ అదుపు లేక పోయింది. అలా ఈ భ్రూణ హత్యలు, శిశుహత్యల కారణంగానే భారతదేశంలో లింగ నిష్పత్తి క్షీణిం చింది. 1951 లో పిల్లల లింగ నిష్పత్తి 983 ఉండగా, 1981 నాటికి 962 పడిపోయింది. 1994–2017 మధ్య ప్రీ–కన్సెప్షన్ అండ్ ప్రి– నాటల్ డయాగ్నస్టిక్ టెక్నిక్స్ యాక్ట్ కింద లింగ నిర్ధారణ జరిగిన నేరంపై కేవలం 2350 కేసులు దాఖలయ్యాయి అంటే మన చట్టాలు ఎంత పదునై నవో, కఠినమైనవో వ్యక్తమవుతోంది. ఈ కేసుల్లో కూడా సింహ వాటా మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో జరిగినవే. భ్రూణ హత్యలు భార తదేశాన్నే కాక ఎన్నో పేద, సంపన్న అన్న తేడా లేకుండా అగ్ర దేశాల నుంచి అభివృద్ధి చెందుతున్న దేశాలనన్నిటినీ పట్టి పీడిస్తున్న రోగం. పాపులేషన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం, భారతదేశంలో సగటున రోజువారీ 2,330 లింగ నిర్ధారిత గర్భస్రావాలు జరుగుతున్నాయి. ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా ఇరవై ఏళ్లలో దాదాపు 11.8 కోట్ల ఆడపిల్లలు గర్భంలో ఉండగా లేదా పుట్టేక మొదటి వారంలోనే భ్రూణ హత్యకు గురయ్యారు. 1991 మరియు 2011 మధ్య సగటున ప్రతి ఏటా 13 లక్షల మంది ఆడ శిశువులను నవజాత శిశు హత్య ద్వారా మట్టుబెట్టారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని అక్టోబర్ 11న ‘అంతర్జాతీయ బాలికల దినోత్సవం’గా ఐక్యరాజ్య సమితి ప్రక టించి 2012 నుంచి జరుపుతోంది. దీని ముఖ్య ఉద్దేశ్యం ప్రపంచవ్యాప్తంగా బాలికలు ఎదుర్కొనే సవాళ్లను వెలుగులోకి తెచ్చి పరిష్కరించడం, మహి ళల మానవ హక్కుల అవసరాలు వాటి నెరవేర్పు లపై దృష్టి కేంద్రీకరించేలా చేయడం. లింగ నిష్పత్తి అసమానంగా పెరుగుతున్న కొలది మహిళలపై నేరాలు, ఘోరాలు పెరుగుతూనే ఉంటాయి. భారత పౌరులు అనుమతి లేకుండా ఏ దేశంలోనూ గర్భస్రావం చేసుకోకుండా ఉండేటట్లు, గర్భం దాల్చిన వెంటనే గర్భవతుల రికార్డుల నమోదు, పర్యవేక్షణ వంటి కొత్త నిబంధనల చట్టం తీసుకురావడం అవసరం. పరిస్థితులు ఇలానే కొన సాగితే 2050 నాటికి బహుభార్యత్వం లాగ ఒకే భార్యని బహు భర్తలు పంచుకోవాల్సిన గడ్డు రోజులు దాపురిస్తాయనడం అతిశయోక్తి కాదేమో! సునీల్ ధవళ వ్యాసకర్త సీఈఓ, ద థర్డ్ అంపైర్ మీడియా మొబైల్ : 97417 47700 -
స్త్రీలోక సంచారం
చట్ట విరుద్ధంగా గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న ఉప్పల్లోని శ్రీకృష్ణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్య దంపతులు డాక్టర్ సిగిరెడ్డి ఉమామహేశ్వరి, డాక్టర్ ఎ.చంద్రశేఖర్లను వలపన్ని (డీకాయ్ ఆపరేషన్) పోలీసులు అరెస్టు చేసి, వారి దగ్గర్నుంచి ఒక ప్రింటర్, స్కానర్, రెండు సెల్ఫోన్లు, లింగ నిర్ధారణ పరీక్ష ఫీజుగా వారే ఇచ్చిన 7,500 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. గర్భిణి అయిన ఒక లేడీ కానిస్టేబుల్ను వెంటబెట్టుకుని మఫ్టీలో వెళ్లి, ఫీజు కట్టి, లింగనిర్ధారణ పరీక్ష చేయించి, రిపోర్ట్స్ తమ చేతికి అందిన వెంటనే డాక్టర్ దంపతులైన గైనకాలజిస్టు, జనరల్ సర్జన్లను అరెస్టు చేసిన పోలీసులు.. 2000 సంవత్సరంలో ప్రారంభం అయిన ఈ ఆసుపత్రి ఏడాది నుంచీ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తోందని తెలిపారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ యోగితా రాణా.. ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టరుగా ప్రస్తుతం పూర్తిస్థాయి అదనపు బాధ్యలు నిర్వహిస్తున్న వాకాటి కరుణ స్థానంలోకి బదిలీ అవగా, వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి స్థానంలోకి కుమురంభీం అసిఫాబాద్ జిల్లా కలెక్టర్ పాటిల్ ప్రశాంత్ జీవన్ బదలీ అయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ముందస్తు ఎన్నికలకు మొగ్గుచూపుతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా జరిగిన 11 మంది జిల్లా కలెక్టర్ల బదిలీలో భాగంగా ఆమ్రపాలిని కూడా బదిలీ చేసిన ప్రభుత్వం ఆమెకు ఎక్కడికి బదిలీ చేస్తున్నది మాత్రం వెంటనే వెల్లడించలేదు! క్టోబర్లో పంపిణీ కోసం ప్రభుత్వం సిద్ధం చేస్తున్న బతుకమ్మ చీరలను భద్రపరిచేందుకు గోదాములను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.. జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. తెల్లకార్డులలో ఉన్న వివరాలను బట్టి రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన మహిళలు కోటీ 8 లక్షల మంది ఉండగా వారందరికీ 280 రూపాయల ఖరీదైన చీరను బతుకమ్మ కానుకగా ఇచ్చేందుకు ప్రభుత్వం కొన్ని నెలలుగా భారీ ఎత్తున చీరలు నేయిస్తోంది. రెండు ప్రపంచ యుద్ధాలను, బొలీవియా విప్లవాలను, 3,000 మంది మాత్రమే ఉండే తన సకాబా గ్రామ జనాభా 1,75,000 అవడాన్ని కళ్లారా చూసి, ఈ ఏడాది అక్టోబర్ 26వ తేదీకి 118 ఏళ్లను పూర్తి చేసుకోబోతున్న జూలియా ఫ్లోర్స్ కోల్కే తన దేశమైన బొలీవియాలోనే, బహుశా ప్రపంచంలోనే అతి వృద్ధురాలైన మహిళగా రికార్డు నెలకొల్పబోతున్నారు. అయితే ఆమె తరఫున రికార్డు కోసం తమకు దరఖాస్తు వంటిదేదీ అందలేదని గిని ్నస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అంటుండగా.. అలాంటి బుక్ ఒకటి ఉందా అని కోల్కే బోసినవ్వులు నవ్వుతున్నారు. బిహార్లోని ముజఫర్పూర్లో ఇటీవల బాలల సంరక్షణాలయాలలో జరిగిన లైంగిక అకృత్యాలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగడంతో, ఆ సంరక్షణాలయాల తీరుతెన్నులపై అధ్యయనం జరిపి ‘నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్.సి.పి.సి.ఆర్) ఇచ్చిన తాత్కాలిక నివేదిక వెల్లడించిన విషయాలపై సుప్రీంకోర్టు దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 2,874 చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూట్లను (సి.సి.ఐ.లు) తనిఖీ చేయగా వాటిలో కేవలం 54 మాత్రమే చట్టబద్ధంగా నడుస్తున్నట్లు ఎన్.సి.పి.సి.ఆర్. కోర్టుకు అందించిన తన నివేదికలో తెలిపింది! తాగి డ్రైవ్ చేస్తున్నాడని ఒక యువతి తన బాయ్ఫ్రెండ్పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ అనంతరం కోర్టు అతడికి జరిమానా విధించడంతో పాటు, 17 నెలలు డ్రైవింగ్ చెయ్యకుండా నిషేధించింది. బ్రిటన్లో ఉంటున్న కమల్జీత్ సాగూ అనే ఒక ప్రవాస భారతీయుడు తన 44వ పుట్టినరోజు సందర్భంగా గత జూన్ 18న గర్ల్ ఫ్రెండ్ను కారులో ఎక్కించుకుని తిప్పుతూ ఉన్నప్పుడు ఇద్దరి మధ్యా గొడవ మొదలై, అతడు కారు దిగి సిగరెట్ కోసం ఓ షాపు దగ్గరికి వెళ్లినప్పుడు ఆ గర్ల్ఫ్రెండ్ ఉత్తిపుణ్యానికి పోలీసులకు ఫోన్ చేసి ‘తన బాయ్ఫ్రెండ్ తాగి డ్రైవ్ చేస్తున్నాడని’ చెప్పడంతో ఇన్నాళ్లూ నడిచిన ఆ కేసులో ఇప్పుడు తీర్పు వచ్చింది. ఏషియన్ గేమ్స్తో దేశానికి తొలిసారి రజత పతకం సాధించుకు వచ్చిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి. సింధుపై ఒక వైపు ప్రశంసల జల్లు కురుస్తుండగా, మరోవైపు.. ఆమె ఏ ఫైనల్స్లోనూ స్వర్ణపతకం సాధించలేకపోతోందనీ, ఫైనల్స్లో ఆడేందుకు ఆమె భయపడుతోందని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి! దీనిపై సింధు తండ్రి రమణ స్పందిస్తూ, ‘‘ఇప్పటి వరకు ఎంతో మంది బ్యాడ్మింటన్ ప్లేయర్లు ఇండియా తరఫున ఆడారు. వారిలో ఎంతమంది ఒలింపిక్స్ ఫైనల్కు వెళ్లారు? ఎంతమంది అంతర్జాతీయ పతకాలు గెలుచుకొచ్చారు?’’ అని ప్రశ్నించారు. 918లో సరిగ్గా ఇదే రోజున ఫ్యానీ కప్లాన్ అనే 28 ఏళ్ల రష్యన్ యువతి, ‘సోషలిస్ట్ రివల్యూషనరీ పార్టీ’ సభ్యురాలు.. ‘బోల్షెవిక్’ పార్టీ నేత వ్లాదిమిర్ లెనిన్పై హత్యాయత్నం చేశారు. రివల్యూషనరీ పార్టీని రద్దు చేసిన లెనిల్.. విప్లవ ద్రోహి అంటూ.. ఆగస్టు 30న మాస్కో ఫ్యాక్టరీ నుంచి బయటికి వస్తున్న లెనిన్పై కప్లాన్ అతి సమీపం నుంచి జరిపిన మూడు రౌండ్ల కాల్పులలో లెనిన్ చావు తప్పి, తీవ్రమైన గాయాలతో బయటపడగా.. ఆ తర్వాత మూడు రోజులకే పోలీసులు హడావుడిగా విచారణ జరిపించి సెప్టెంబర్ 3న ఆమె మెడ వెనుకభాగంలో తుపాకీ పెట్టి కాల్చి చంపేశారు. -
లింగ నిర్ధారణ చేస్తున్న వైద్యుల అరెస్ట్
ఉప్పల్: ఉప్పల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో లింగ నిర్ధారణ చేస్తూ అడ్డంగా షీ టీమ్కు దొరికారు. ఉప్పల్ సరస్వతి కాలనీకి చెందిన డాక్టర్లు సింగిరెడ్డి ఉమామహేశ్వరి, డాక్టర్చంద్రశేఖర్ శ్రీకృష్ణ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి నిర్వహిస్తున్నారు. ఆస్పత్రిలో లింగ నిర్ధారణతో పాటు ఆడ పిల్లని తేలితే ఆపరేషన్లు చేస్తున్నారని సమాచారం అందుకున్న షీ టీమ్స్ పోలీసులు రంగంలోకి దిగారు. సైబరాబాద్ షీ టీమ్స్ అడిషనల్ డీసీపీ సలీమా, ఉప్పల్ వైద్యాధికారి డాక్టర్ పల్లవి ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. ఇందుకు గర్భిణి మహిళా కానిస్టేబుల్తో కలిసి మధ్యవర్తి ద్వారా ఉప్పల్ సరస్వతి కాలనీలోని శ్రీకృష్ణ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిలోకి వెళ్లి లింగ నిర్ధారణ చేయాలని ఆస్పత్రి యాజమాన్యాన్ని కోరారు. ఇందుకు అంగీకరించిన డాక్టర్లు ఉమామహేశ్వరీ, చంద్రశేఖర్రావులు గర్భిణీ వద్ద రూ.7500 తీసుకొని లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి మగ పిల్లాడనే సర్టిఫికేట్ను అందజేశారు. అప్పటికే సమీపంలో మాటేసిన షీ టీమ్స్ అధికారులు, వైద్యాధికారులు, ఉప్పల్ పోలీసులు రంగంలోకి దిగి లింగ నిర్ధారణ యంత్రంతో పాటు వారు ఉపయోగించిన సెల్ఫోన్లు, రూ.7500 సీజ్ చేశారు. డాక్టర్ ఉమామహేశ్వరీ, డాక్టర్ చంద్రశేఖర్లను అదుపులోకి తీసు కొ న్నారు. కొంతకాలంగా ఈ ఆస్పత్రిలో లింగ నిర్ధారణ చేస్తున్నట్లు పోలీస్ విచారణలో తేలింది. ఉప్పల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఎవరైనా అడిగితే నేరుగా నాకే ఫోన్ చేయండి
సాక్షి, సిటీబ్యూరో : లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే కేంద్రాల సమాచారం అందించే వారికి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ యోగితా రాణా బంపర్ ఆఫర్ ప్రకటించారు. తనకు నేరుగా ఎస్ఎంఎస్, ఫోన్ ద్వారా సమాచారాన్ని తెలియజేస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచడంతోపాటు ప్రోత్సాహాకాలు అందిస్తామని వెల్లడించారు. వివరాలు తెలిసిన వారు 9491033000 నెంబరుకు సమాచారమివ్వవచ్చన్నారు. బుధవారం కలెక్టరేట్లో బేటీ బచావో–బేటీ పడావో కార్యక్రమం అమలులో భాగంగా ఎస్పీహెచ్ఓలు, మెడికల్ ఆఫీసర్లు, ఎఎన్ఎంలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పీసీపీఎన్డీటీ, కేసీఆర్ కిట్, ఇమ్యూనైజేషన్, డీవార్మింగ్, పోషకాహారలోపం తదితర అంశాల గురించి వివరించారు. గర్భస్థ శిశు లింగ నిర్థారణ పరీక్షలు నిర్వహించడం, బహిరంగ పర్చడం చట్ట విరుద్ధమే కాక, ఆనైతికమైనదని కలెక్టర్ పేర్కొన్నారు.లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహంచే స్కానింగ్ సెంటర్లతో పాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించినా, పాల్గొన్న ప్రతి ఒక్కరు శిక్షార్హలేనని స్పష్టం చేశారు. కుటుంబంలో ఆడ, మగ అనే తేడాలు ఉండరాదని, లింగ వివక్ష వలన జరిగే నష్టాల గురించి కుటుంబ పెద్దలకు అవగాహన కల్పించాలని చెప్పారు. భ్రూణ హత్యల వలన సామాజిక సమస్యలు ఎదురవుతున్నట్లు చెప్పారు. తల్లీ బిడ్డలకు మూడు నెలలు ఉపయోగపడే 16 రకాల వస్తువులను కేసీఆర్ కిట్ ద్వారా ప్రభుత్వం ఇస్తుందన్నారు. -
సెక్స్ ఫర్ సెలక్షన్.. పెను కలకలం
‘జట్టులో చోటు దక్కాలంటే అమ్మాయిలను ఫైవ్స్టార్ హోటళ్లకు పంపాల్సిందే... అలా అయితేనే టీమ్లో నువ్వు ఉంటావ్... లేకపోతే ఈ జన్మలో టీమ్ తరపున ఆడలేవ్’.. ఇది సెక్స్ ఫర్ సెలక్షన్ స్టింగ్ ఆపరేషన్లో వెలుగు చూసిన విషయం. ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (యూపీసీఏ)లో వెలుగు చూసిన ఈ స్కాండల్తో క్రీడా రంగం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ మహమ్మద్ అక్రమ్ సైఫీ ఇందులో భాగస్వామి కావటంతో.. ఈ అంశం మరింత చర్చనీయాంశంగా మారింది. సాక్షి, ముంబై/న్యూఢిల్లీ: రాష్ట్ర స్థాయి క్రికెట్ జట్టులోకి ఎంపిక చేయాలంటే తనకు అందమైన అమ్మాయిలను సరఫరా చేయాలని అక్రమ్ సైఫీ డిమాండ్ చేసినట్లు యూపీ యువ క్రికెటర్ రాహుల్ శర్మ ఆరోపణలు చేశాడు. ఈ మేరకు ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ సాయంతో స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి వ్యవహారం మొత్తం వెలుగులోకి తెచ్చాడు. ఈ మేరకు అక్రమ్, శర్మ మధ్య జరిగిన ఫోన్ సంప్రదింపుల ఆడియో టేప్ను కూడా ఆ న్యూస్ ఛానెల్ ప్రసారం చేసింది. స్టింగ్ ఆపరేషన్... ‘ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (యూపీసీఏ)లో చాలా మంది పెద్దలున్నారు. వాళ్లందరినీ ఒప్పించాలంటే న్యూఢిల్లీలోని ఫైవ్ స్టార్ హోటల్కి అమ్మాయిలను పంపించాలి’ అని శర్మను అక్రమ్ అడిగినట్లు ఆడియో టేప్లో తెలుస్తోంది. జట్టులో తనకు కచ్చితంగా స్థానం కల్పిస్తానని శర్మకు అక్రమ్ చెప్పడం మరో ఫోన్ సంభాషణలో స్పష్టమైంది. జట్టులోకి ఎంపిక చేయాలంటే డబ్బుకు బదులు తనకు అమ్మాయిలను సరఫరా చేయాలని అక్రమ్ అడిగినట్లు ఉత్తర ప్రదేశ్ క్రికెటర్ రాహుల్ శర్మ ఆరోపించాడు. అంతేకాకుండా చాలా మంది ఆటగాళ్లకు ఆయన నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి బీసీసీఐ టోర్నమెంట్లలో పాల్గొనేందుకు సహాయపడుతున్నాడని శర్మ ఆరోపించాడు. శర్మతో పాటు మరికొంత మంది ఆటగాళ్లు అక్రమ్పై ఆరోపణలు చేశారు. అయితే వారు తమ పేర్లను బయటపెట్టడానికి ఇష్టపడలేదు. యూపీ క్రికెట్ అసోసియేషన్లో అక్రమ్కు ఎలాంటి పదవి లేకపోయినప్పటికీ.. ఈ వ్యవహారాలను అతనే దగ్గరుండి నడిపిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రాజీనామా.. తొలుత ఆరోపణలుగా ఖండిచిన సైఫీ.. విమర్శలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో గురువారం తన పదవికి రాజీనామా చేశాడు. మరోవైపు అనుచరుడి రాజీనామాను శుక్లా వెంటనే ఆమోదించినట్లు తెలుస్తోంది. అయితే శుక్లా లాంటి పెద్దల అండ ఉన్న తనపై.. కావాలనే కుట్ర పన్నుతున్నారని అక్రమ్ చెబుతున్నారు. బీసీసీఐ దర్యాప్తులో అసలు వాస్తవాలు వెల్లడౌతాయన్న ఆశాభావం సైఫీ వ్యక్తం చేస్తున్నాడు. దిగ్భ్రాంతి... కాగా, ఈ వ్యవహారంపై పలువురు ఆటగాళ్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆర్పీ సింగ్, మహమ్మద్ కైఫ్ తదితరులు ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఈ విషయంలో శుక్లా పారదర్శకంగా వ్యవహరించి.. యంగ్ టాలెంట్కు న్యాయం చేస్తారని భావిస్తున్నట్లు ట్వీట్లు చేశారు. -
వీడియో కాలింగ్లో వేధింపులు: సీఐ సస్పెన్షన్
సాక్షి, చెన్నై: మహిళను లైంగిక వేధింపులకు గురి చేసిన ఇన్స్పెక్టర్ను అధికారులు సస్పెండ్ చేశారు. ఇన్స్పెక్టర్ కన్యాకుమారి జిల్లా కుళచ్చల్ పరిధిలో గల పోలీసుస్టేషన్లో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ ఒకరు ఒక మహిళతో వీడియో కాలింగ్లో మాట్లాడుతుండగా అసభ్యమైన పదజాలంతో వేధింపులు గురి చేయడం ఇటీవల వాట్సాప్లో వైరల్ అయ్యింది. ఈ వీడియోలలో ఒక వీడియోలో ఇన్స్పెక్టర్ యూనిఫాంలో ఉంటూ మహిళతో అసభ్యకరంగా మాట్లాడుతూ వచ్చారు. మరో వీడియోలో అతను బెడ్పై అర్ధనగ్నంగా పడుకుని అసభ్యచేష్టలు చేస్తూ కనిపించాడు. ఈ వీడియోను తిలకించిన పోలీసు అధికారులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఇన్స్పెక్టర్ లీలలను వీడియో కాలింగ్ ద్వారా నమోదు చేసి విడుదల చేసిన మహిళ నాగర్కోవిల్ ప్రాంతానికి చెందినట్లు తెలిసింది. విచారణ కోసం వెళ్లిన సమయంలో సదరు మహిళను చూసి ఆకర్షితుడైన ఇన్స్పెక్టర్ ఆమె నంబరు తీసుకుని తరచూ మాట్లాడేవారు. ఆ తరువాత క్రమక్రమంగా అసభ్యకరంగా మాట్లాడుతుండడంతో మహిళ ఆవేదనకు గురైంది. దీంతో ఈ వ్యవహారాన్ని ఆమె వాట్సాప్ ద్వారా విడుదల చేసినట్లు సమాచారం. ఈ వీడియో వ్యవహారం గురించి ఎస్పీ శ్రీనాథ్ విచారణకు ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో దీనిపై విచారణ ముగించి విచారణ నివేదికను నెల్లై డీఐజీకి పంపారు. దీంతో ఇన్స్పెక్టర్ను అధికారులు సస్పెండ్ చేశారు. -
హలో అమ్మాయి కావాలా.?
‘హలో.. అమ్మాయి కావాలా. రూ.30 వేల నుంచి రూ.3 లక్షల వరకు రేటు.. ఫలానా నటికైతే రూ.40 లక్షలు’. చెన్నైలో శుక్రవారం పోలీసులకు చిక్కిన సెక్స్ రాకెటర్ల దందా ఇది. ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా సాగుతున్న బాగోతంపై ఒక తమిళనటి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో బట్టబయలైంది. సాక్షి, చెన్నై: చెన్నై అన్నానగర్లో నివసించే నటి జయలక్ష్మి నేపాలి చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. సుమారు 30కి పైగా తమిళ సినిమాల్లో నటించారు. టీవీ సీరియళ్లలో కూడా పలు పాత్రలు పోషించారు. కాగా ఆమె సెల్ఫోన్కు కొన్నిరోజులుగా ‘రిలేషన్షిప్ డేటింగ్ సర్వీస్’పేరుతో రెండు ఫోన్ నంబర్ల నుంచి సందేశాలు వస్తున్నాయి. ‘మీరు డేటింగ్ చేయడానికి ఇష్టపడుతున్నారా.. మీతో రావడానికి ఎందరో వీఐపీలు వేచిచూస్తున్నారు. రూ.30 వేలు మొదలుకుని.. రూ.3 లక్షల వరకు చెల్లించేందుకు వారు సిద్ధంగా ఉన్నారు.. వంటి సందేశాలతో వ్యభిచారానికి ఆహ్వానిస్తున్నట్లుగా ఉంటున్నాయి. ఈ మెసేజ్లతో బిత్తరపోయిన నటి చెన్నై పోలీస్ కమిషనర్ను ఇటీవల నేరుగా వెళ్లి ఫిర్యాదు చేశారు. కమిషనర్ ఆదేశాలతో వ్యభిచార నిరోధక విభాగం పోలీసులు విచారణ చేపట్టారు. చెన్నై విరుగంబాక్కంలో నివసించే మురుగ పెరుమాన్, కవియరసన్ నటి జయలక్ష్మికి వాట్సాప్ సందేశాలు పంపినట్లు తెలుసుకున్నారు. విటుల మాదిరిగా నటిస్తూ వారికోసం వలవిసిరారు. అన్నానగర్కు రావాల్సిందిగా కబురు పంపి ఇద్దరినీ అరెస్ట్ చేశారు. వీరిని శుక్రవారం కోర్టులో ప్రవేశపెట్టి జైలుకు పంపారు. ఇలా ముగ్గులోకి దించుతారు.. ‘రిలేషన్షిప్ డేటింగ్ సర్వీస్’అనే పేరుతో స్నేహితుల్లా పరిచయం పెంచుకుంటారు. ప్రముఖ నటీమణులు, సహాయ నటీమణులు, అందమైన అమ్మాయిల ఫోటోలను పంపుతూ ముగ్గులోకి దించుతున్నారు. అరెస్ట్ అయిన ఇద్దరు యువకుల సెల్ఫోన్లను పోలీసులు పరిశీలించి అందులోని ఫోటోలను చూసి ఖంగుతిన్నారు. ప్రముఖ నటీమణుల ఫోటోలు, ఎవరి రేటు ఎంత అని స్పష్టంగా ఉంది. ముఖ్యంగా తమిళ సినిమారంగంలో పేరొందిన ఒక ప్రముఖ యువ నటి పేరును విటులకు పంపుతున్నారు. ఈ నటితో జల్సాకు రూ.40 లక్షలు చెల్లించాలని సందేశం కూడా పంపారు. ఈ సందేశానికి బదులు సందేశాన్ని పంపిన విటుడు ‘రేటు మరీ ఎక్కువ, రూ.1 లక్ష కావాలంటే ఇస్తాను’అని పేర్కొన్నాడు. ఇలా సుమారు 70 మంది యువతులకు ఒక రేట్ను ఫిక్స్ చేసి ఫోటోలను పంపారు. ఎందరో రాజకీయ ప్రముఖులు మీతో గడిపేందుకు తహతహలాడుతున్నారు. మీరు మనసు పెడితే లక్షల్లో సంపాదించవచ్చు అనే ఆశలు కల్పిస్తూ పలువురికి సందేశాలు పంపారు. ఈ వాట్సాప్ చాటింగ్ను పోలీసులు సేకరించారు. ఈ యువకుల పరిధిలో పనిచేస్తున్న నటీమణులు ఎవరు, వీరి సేవలు అందుకున్న రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు ఎవరని పోలీసులు విచారణ చేస్తున్నారు. నటి జయలక్ష్మికి అసభ్య సందేశాలు పంపిన ఇద్దరు యువకులు పోలీసులకు ఒక ప్రముఖ నటి పేరు చెప్పి, ఆమెతో హాయిగా గడపవచ్చన్నట్లు సమాచారం. నటీమణులంటే చులకన కాకూడదు: జయలక్ష్మి నటి జయలక్ష్మి దీనిపై అవేశంగా మీడియాతో మాట్లాడారు. ‘రెండువారాల క్రితం నా సెల్ఫోన్ వాట్సాప్నకు రెండు నంబర్ల ద్వారా వెంట వెంటనే రెండు మెసేజ్లు వచ్చాయి. ‘మీరు సరేనంటే డేటింగ్ కోసం బైటకు వెళదాం.. మా వద్ద చాలా వీఐపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలున్నారని ఉంది. దీని ద్వారా రూ.30 వేల నుంచి రూ.3 లక్షల వరకు సంపాదించవచ్చని వచ్చింది. డీల్కు అంగీకరిస్తే కింద ఉన్న నంబరుకు ఫోన్ చేయండి అని ఉందని అన్నారు. ఈ విషయాన్ని నా స్నేహితులకు తెలియజేయడంతో వారు విటుల్లా వారితో సంభాషించగా వెండితెర, బుల్లితెర నటీమణుల ఫోటోలు, వారి రేట్లు పంపారు. ఆ ఫోటోలు, వివరాలు చూసి దిగ్భ్రాంతికి లోనయ్యా. తరువాత స్నేహితుల సలహామేరకు ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేశా. పోలీసులు సైతం వెంటనే రంగంలోకి దిగి నిందితులను అరెస్ట్ చేశారు. ఇలాంటి పరిస్థితులను మహిళలు ధైర్యంగా ఎదుర్కొవాలి. సినీ నటి అయినంత మాత్రాన ఇలానే ఉంటారని భావించడం సరికాదు. ఇతర మహిళల్లానే మేమూ.. మాకూ కుటుంబం ఉంటుంది’ అని ఆమె అన్నారు. -
క్యాస్టింగ్ కౌచ్పై స్పందించిన రెజీనా
సాక్షి, సినిమా : ప్రస్తుతం సినీ పరిశ్రమని క్యాస్టింగ్ కౌచ్, అమెరికాలో అమ్మాయిల వ్యభిచారం సంఘటన(చికాగో సెక్స్ రాకెట్)లు కుదిపేస్తున్నాయి. దీనిపై వర్ధమాన నటీమణులకు నటి రెజీనా ఓ సలహా ఇచ్చారు. చాలా మంది క్యాస్టింగ్ కౌచ్ బాధితులేనని ఒక్కొక్కరూ ఇప్పుడిప్పుడే బయట పడుతున్నారు. దీని గురించి నటి రెజీనా ఏమన్నారో చూద్దాం.. ‘క్యాస్టింగ్ కౌచ్, అమెరికాలో అమ్మాయిల వ్యభిచారం సంఘటనలపై గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. ఇలాంటి వార్తలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండటమే మంచిదని నేను భావిస్తున్నాను. నిజంగా అలాంటి ప్రచారంలో వాస్తవాలు ఉంటే ఏదో ఒక రోజున చర్యలు తీసుకోవలసిందే. దీని గురించి నేనేమైనా స్పందిస్తే దాన్ని వేరేగా చిత్రీకరిస్తారు. ఇలాంటి వాటి వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. తమకు ఇష్టం వచ్చిన విధంగా కొందరు మాట్లాడుతుంటారు. అలాంటి వాటిలో ఏది నిజం అన్నది మీడియా నిర్ధారించుకుని ప్రసారం చేయాలి. ఎందుకంటే మీడియా ప్రసారాలను నమ్మేవారు చాలా మంది ఉంటారు. అందుకే ఇలాంటి వ్యవహారాల గురించి ప్రసారం చేసే ముందు వాస్తవాలను తెలుసుకోవాలి. ఇలాంటి సంఘటనల నుంచి వర్ధమాన తారలు పాఠం నేర్చుకుని వాటికి దూరంగా ఉండాలన్నదే నా సలహా’ అని రెజీనా చెప్పారు. -
నిద్ర పోతున్న బాలికను లాక్కెళ్లి..
భోపాల్ : ఇంట్లో నిద్ర పోతున్న బాలికను టెర్రస్ పైకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు కొందరు వ్యక్తులు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఛాతార్పూర్ జిల్లా ఖజురహో పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన 14ఏళ్ల బాలిక స్వగృహంలో నిద్రపోతుండగా.. అదే ప్రాంతానికి చెందిన ముగ్గురు వ్యక్తులు బాలికను టెర్రస్ పైకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. అయితే అఘాయిత్యానికి పాల్పడుతున్న సమయంలో ఎవరూ గమనించకపోవటంతో వారు అక్కడి నుంచి పరారయ్యారు. మరుసటి రోజు బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. లైంగిక దాడికి పాల్పడిన వారిని బాలిక బంధువులుగా పోలీసులు గుర్తించారు. నిందితులపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఛాతార్పూర్ జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
సంజుపై సెక్స్ వర్కర్ల ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ: సెక్స్ వర్కర్ల మనోభావాలను దెబ్బతీశారంటూ బాలీవుడ్ చిత్రం సంజుపై జాతీయ మహిళా కమిషన్లో ఫిర్యాదు నమోదు అయ్యింది. చిత్ర ట్రైలర్లో ఓ డైలాగ్పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వారు ఎన్సీడబ్య్లూలో ఫిర్యాదు చేశారు. ‘మీ భార్యతో కాకుండా ఎంత మందితో పడుకున్నారంటూ అనుష్క పాత్ర రణ్ బీర్ ను అడుగుతుంది. దానికి స్పందిస్తూ.. వేశ్యలతో కలుపుకుని చెప్పాలా? లేక.. అంటే వారిని మినహాయించి చెప్పాలంటే 308 మందితో... అంటూ సమాధానం ఇస్తాడు. ఈ డైలాగ్ తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ సెక్స్ వర్కర్ల కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉద్యమకారుడు, న్యాయవాది గౌరవ్ గులాటి సెక్స్ వర్కర్ల తరపున ఎన్సీడబ్యూలో ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని చైర్పర్సన్ రేఖా శర్మ బుధవారం మీడియాతో ధృవీకరించారు. ‘చిత్రంలో ఓ డైలాగ్పై అభ్యంతరం వ్యక్తం అయ్యింది. ఎలక్ట్రానిక్ మీడియా మానిటరింగ్ సెంటర్కు ఈ ఫిర్యాదును పంపించాం. వారిచ్చే నివేదిక మీదే చర్యలు ఆధారపడి ఉంటాయి’ అని ఆమె చెప్పారు. కాగా, రణ్బీర్ కపూర్, పరేష్ రావెల్, మనీషా కోయిరాలా, సోనమ్ కపూర్ కీలక పాత్రల్లో నటించిన సంజు రేపు అంటే జూన్ 29న విడుదల కానుంది. -
షికాగో సెక్స్ రాకెట్ కేసుతో తానాలో కలకలం
-
వీడియో ఒకరిది.. చావు మరొకరిది..
న్యూయార్క్ : ఓ యువకుడికి సంబంధించిన వ్యక్తిగత వీడియో మరో యువకుడి ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఉదంతం న్యూయార్క్ సిటీలోని బ్రాంక్స్లో ఆలస్యంగా వెలుగు చూసింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. న్యూయార్క్లోని బ్రాంక్స్కు చెందిన లెసాండ్రో గజ్మన్ ఫెలిజ్(15)ను గత గురువారం రాత్రి 11 గంటల సమయంలో కొంత మంది యువకులు కత్తులతో వెంబడించారు. అతడు ప్రాణభయంతో దగ్గరలోని ఓ దుకాణంలోకి పరుగులు తీసినా విడిచి పెట్టలేదు. దుకాణం లోపల దాక్కున్న అతన్ని బయటకు లాగి కత్తులతో విచక్షణా రహితంగా పొడిచి అక్కడి నుంచి పరారయ్యారు. కత్తి పోట్లతో ఉన్న గజ్మన్ దగ్గరలోని ఆస్పత్రికి వెళ్లాలని ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కొద్ది దూరం పరుగులు తీసిన వెంటనే అతను ఓ చోట కుప్పకూలిపోయాడు. రక్తపు మడుగులో ఉన్న అతన్ని గుర్తించిన కొందరు దగ్గరలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గజ్మన్ మృతి చెందాడు. అతని సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆదివారం కేసుతో సంబంధం ఉన్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపెట్టారు. ఓ యువకుడు తన మిత్రుడి సోదరితో కలిసి ఉన్న వ్యక్తిగత వీడియోను సోషల్ మీడియాలో ఉంచాడని, ఆ యువకుడిని చంపాలనుకుని పొరపాటున అదే పోలికలతో ఉన్న గజ్మన్ను చంపామని వారు తెలిపారు. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
స్త్రీలోక సంచారం
జార్ఖండ్లోని కుంతీ జిల్లాలో ఈ నెల 19న ఐదుగురు సామాజిక మహిళా కార్యకర్తలపై జరిగిన సామూహిక లైంగిక దాడి కేసును విచారించేందుకు ముగ్గురు జాతీయ మహిళా సంఘం సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటైంది. ఉపాధి వలసలు, మానవ అక్రమ రవాణాల పై సామాజంలో అవగాహన కల్పించడం కోసం కుంతీలో ఉన్న ఓ ఎన్జీవో మహిళా కార్యకర్తలు కొచాంగ్ గ్రామంలో వీధి నాటకాలు ప్రదర్శిస్తున్నప్పుడు మోటార్బైక్ల మీద వచ్చిన ఐదుగురు యువకులు వారిని అపహరించి, వారిపై లైంగిక దాడి చేయడమే కాకుండా వీడియో తీసి.. పోలీసులకు చెబితే ఆ వీడియోను సోషల్ మీడియాలో పెడతామని బ్లాక్మెయిల్ చేశారు ::: రాజకీయ సమావేశాల కోసం చైనా బయల్దేరిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ఆ సమావేశాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయన్న సమాచారం చివరి నిముషం వరకు రాకపోవడంతో తన పర్యటను రద్దు చేసుకున్నారు. మమతతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక మంత్రి, ఇతర విభాగాలకు చెందిన అధికారులు మొత్తం 50 మంది జూన్ 22న చైనా వెళ్లవలసి ఉండగా ప్రయాణ సమయం దగ్గరపడుతున్నప్పటికీ కోల్కతాలోని చైనీస్ కాన్సులేట్ జనరల్ నుంచి వారికి ఎటువంటి సమాచారమూ అందలేదు ::: అమెరికా నావికాదళం చరిత్రలోనే అతిపెద్ద ‘లంచం’ కేసులో ప్రమేయం ఉందన్న ఆరోపణలు నిర్ధారణ కావడంతో çశరణ్ రేచల్ గురుశరణ్ కౌర్ (52) అనే ప్రవాస భారతీయురాలికి మూడేళ్ల జైలు శిక్ష పడింది. ‘ఫ్యాట్ లియోనార్డ్’ కుంభకోణంగా పేరు మోసిన ఈ వ్యవహారంలో శరణ్తో పాటు మరి కొంత మంది అధికారులకు కూడా కోర్టు శిక్ష విధించింది ::: ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న వలసల సమస్యను ఒక్క సమావేశంతో తేల్చేయడం ‘ఐరోపా సమాఖ్య’కు సాధ్యం కాదని జర్మనీ చాన్స్లర్ ఏంజెలా మెర్కల్ అన్నారు. ఇందుకోసం ద్వైపాక్షిక, త్రైపాక్షిక, అవసరమైతే బహుపాక్షిక సంప్రదింపులు, సమావేశాలు, సదస్సులు అనేకసార్లు జరగవలసి ఉందని.. 28 దేశాల ఐరోపా సమాఖ్యలో ఒక సభ్యురాలిగా ఉన్న జర్మనీకి ప్రతినిధిగా మెర్కెల్ ఈ ప్రకటన చేశారు ::: ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలను కవర్ చేయడానికి వచ్చిన కొలంబియా మహిళా జర్నలిస్టు జూలియత్ గోన్జలెజ్ థెరాన్ను ఒళ్లు తెలియని ఉత్సాహంలో ముద్దు పెట్టుకున్న రష్యన్ క్రీడాభిమాని ఆమెకు క్షమాపణ చెబుతూ ఒక వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. జర్మనీ టీవీకి కరస్పాండెంట్గా పని చేస్తున్న ఆ యువతి ఈ వీడియోపై స్పందించి తనను క్షమించిందనీ, ఇక ఈ విషయాన్ని మర్చిపొమ్మని కూడా చెప్పిందని నెట్లో అతడు ఇంకో పోస్ట్ కూడా పెట్టాడు. ప్రపంచంలో ఇంత వరకు మహిళా డ్రైవర్లను అనుమతించని ఏకైక దేశం సౌదీ అరేబియా ఆదివారం నుంచి ఆంక్షలను ఎత్తివేసింది. దీంతో మొదటి రోజు సౌదీ నగరంలోని ప్రధాన రహదారులపై మహిళలు తమ డ్రైవింగ్తో వాహనాలను స్వేచ్ఛా విహంగాలుగా మార్చేశారు ::: టెక్సాస్లోని నిర్బంధ గృహాల్లో ఉన్న బాలల్ని పరామర్శించి, అక్కడి పరిస్థితులను గమనించేందుకు వెళుతూ అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్.. ‘ఐ రియల్లీ డోన్ట్ కేర్, డు యు?’ అనే అక్షరాలున్న జాకెట్ను «ధరించడంపై ప్రపంచవ్యాప్తంగా అనేక అర్థాలు, విపరీతార్థాలు, విమర్శలు, విశ్లేషణలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ వరుసలోనే.. రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్న ఆరు నెలల గర్భిణి మీరా రాజ్పుట్ (బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ భార్య) మెలానియా జాకెట్ పైన ఉన్న అక్షరాలను ఉద్దేశిస్తూ, ‘నిజంగానా!’ అని తన ఇన్స్టాగ్రామ్లో వ్యంగ్యంగా కామెంట్ పోస్ట్ చేశారు ::: ఎంటీవీ రియాలిటీ షో ‘స్పి›్లట్స్విల్లా’ షూటింగ్ కోసం ఉత్తరాఖండ్లో ఉన్న బాలీవుడ్ నటి సన్నీ లియోన్ అస్వస్థతకు గురి కావడంతో ఉధమ్సింగ్ నగర్ జిల్లా కాశీపూర్లోని ‘బ్రిజేష్ ఆసుపత్రి’లో చేర్చారు. కొద్దిపాటి జ్వరం, కడుపునొప్పితో బాధపడుతున్న లియోన్కు గ్యాస్ట్రోఎంటరైటిస్ సమస్యకు చికిత్స చేస్తున్నట్లు ఆసుపత్రిలో ఆమె కేసును ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్న డాక్టర్ మయాంక్ అగర్వాల్ మీడియాకు వెల్లడించారు ::: -
సమతూకం తప్పుతోంది!
మన దేశంలోని మొత్తం 29 రాష్ట్రాల్లో ఐదేళ్లలోపు బాలికల మరణాలు అధికంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ ప్రతి రెండు జిల్లాల్లో ఒక జిల్లాలో శిశు మరణాలు అత్యధికంగా ఉన్నట్టు ఈ పరిశోధనలో తేలింది. భారతదేశంలో ప్రతి యేడాది దాదాపు 2,39,000 మంది ఆడపిల్లలు లింగ వివక్ష కారణంగా మృత్యువు దరికి చేరుతున్నారంటే మన అభివృద్ధి అంకెలకూ దీనికీ లింకెక్కడా అనిపిస్తోంది! కారణాలేవైనా ఐదేళ్లు నిండకుండానే మన దేశంలో దాదాపు రెండున్నర లక్షల మంది ఆడపిల్లలు ‘అదృశ్యమై’పోతున్నారు. మగపిల్లవాడు కావాలనే కోరిక, ఆడపిల్ల పెంపకం ఉన్న భయ భావం, పురుషాధిపత్య భావజాలం.. పసిబిడ్డలను మొగ్గలోనే చిదిమేస్తోంది. ఆడపిల్లల భ్రూణ హత్యలు.. మళ్లీ వేరు లెక్కలవి. పుట్టిన తర్వాత కూడా! ఇప్పటివరకూ అంతా అనుకుంటున్నట్టు ‘‘లింగ వివక్ష ఆడపిల్లల పుట్టుకను నివారించే అబార్షన్లకు, ఆడపిల్లల భ్రూణ హత్యలకు మాత్రమే పరిమితం కాలేదనీ, ఆడపిల్ల పుట్టుక అనంతరం కూడా వారిని చంపేసే హేయమైన చర్యలు మన భారత దేశంలో కోకొల్లలని’’ ఈ పరిశోధనకు సహ అధ్యయనవేత్తగా ఉన్న పారిస్ డెస్కరేట్స్ యూనివర్సిటీ కి చెందిన గుయిల్మోటో అభిప్రాయపడ్డారు. ‘‘స్త్రీపురుష సమానత్వం కేవలం విద్యాహక్కు కోసమో, లేక సమాన ఉపాధి అవకాశాల కోసమో, లేదంటే రాజకీయ ప్రాతినిధ్యం కోసమో మాత్రమే కాదు, ఇది పిల్లల సంరక్షణకు, వాక్సినేషన్కీ, పౌష్టికాహారానికీ, మొత్తంగా వారి ఆరోగ్యానికి, చివరగా వారి ప్రాణాల పరిరక్షణకు సంబంధించిన విషయం’’ అని అంటారాయన.’’ మనం మరీ హీనం దేశంలోని ఐదేళ్లలోపు ఆడపిల్లల మరణాలను నివారించగలిగే 640 జిల్లాల్లో కేంద్రీకరించి చేసిన ఇలాంటి పరిశోధన గతంలో ఎప్పుడూ జరగలేదు. ఇదే తొలిసారి. ప్రపంచవ్యాప్తంగా లింగ వివక్ష పాటించని దేశాల పరిస్థితులతో భారతదేశంలో కొనసాగుతోన్న ఐదేళ్లలోపు బాలికల మరణాలను పోల్చి చూశారు పరిశోధకులు. ఇందుకు గాను యునైటెడ్ నేషన్స్లోని 46 రాష్ట్రాలకు సంబంధించిన గణాంకాలను తీసుకొని భారతదేశ వాస్తవ పరిస్థితులను పోల్చి చూశారు. ఆయాదేశాలతో మన దేశంలోని ఐదేళ్ల లోపు బాలికల మరణాలను పోల్చి చూడగా ఎన్నో కఠోర వాస్తవాలు బయటపడ్డాయి. పేరుకే పెద్ద రాష్ట్రాలు మన దేశంలోని మొత్తం 29 రాష్ట్రాల్లో ఐదేళ్లలోపు బాలికల మరణాలు అధికంగా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ ప్రతి రెండు జిల్లాల్లో ఒక జిల్లాలో శిశు మరణాలు అత్యధికంగా ఉన్నట్టు ఈ పరిశోధనలో తేలింది. 2000–2005 మధ్యకాలంలో 0–4 వయస్సు పిల్లల సగటు మరణాలు ప్రతి వెయ్యి మంది పిల్లల జననాలకీ 18.5 శాతంగా ఉంది. ఇది దాదాపు ప్రతి యేడాది మరణిస్తున్న పది లక్షలమందిలో పావు భాగం. దేశంలోని అతిపెద్ద రాష్ట్రాలున్న ఉత్తరాదిలో బాలికల మరణాలు ఎక్కువగా నమోదౌతున్నాయి. ఐదేళ్లలోపు బాలికల మరణాల్లో మూడింట రెండొంతుల మంది ఉత్తర భారతంలోనే మరణిస్తున్నారు. పెద్ద రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్తాన్, మ«ధ్యప్రదేశ్ రాష్ట్రాలు చిన్నారి బాలికల మరణాల్లో అగ్రభాగాన్ని ఆక్రమిస్తున్నాయి. గ్రామీణ ప్రాంత ప్రజల్లో తక్కువ అక్షరాస్యత, అత్యధిక జనాభా, అధిక జననాలు ఈ లింగ వివక్షకి కారణంగా ఈ పరిశోధనలో తేలింది. సంపన్నులలోనూ వివక్ష ఈ సమస్య కేవలం పేద, నిరక్షరాస్యులైన ప్రజల్లోనే లేదు. మధ్య తరగతి, ఎగువ మధ్యతరగతి వారిలోనూ, చదువుకున్న వారిలో సైతం ఈ జాడ్యం వ్యాపిస్తోంది. మగపిల్లలే ఇంటి బాధ్యతను నెత్తిన మోస్తారనీ, ఆస్తికి వారసులనే తప్పుడు అభిప్రాయం కూడా దీనికి మరొక కారణం. నిజానికి ఉత్తర భారత దేశంలోని సంపన్న రాష్ట్రాలుగా భావిస్తోన్న పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఆరేళ్ల వయస్సులోపు 1200 మంది బాలురకి 1000 మంది బాలికలే ఉంటున్నారు. మొత్తంగా ఈ పరిశోధనలో తేలిందేమిటంటే ప్రపంచంలోనే భారతదేశంలో సెక్స్ రేషియో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నదని. ‘నేరానికి’.. ప్రాధాన్యం ఈ యేడాది జనవరిలో భారత ప్రభుత్వం ప్రకటించిన వివరాల ప్రకారమే ఆడపిల్లల భ్రూణహత్యలు, వ్యాధులు, నిర్లక్ష్యం, వివక్ష కారణంగా మన దేశంలో దాదాపు 63 మిలియన్ల మంది మహిళలు అదృశ్యమైపోయారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రతి యేడాదీ 20 లక్షల మంది ఆడపిల్లలు మిస్ అవుతున్నారని ఈ యేడాది జనవరిలో భారత ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే 2 కోట్ల 10 లక్షల మంది ‘అవాంఛిత’ బాలికలున్నట్టు భారత ప్రభుత్వం వెల్లడించింది. భారతదేశంలో నేరప్రవృత్తి పెరగడానికి మగపిల్లల ప్రాధాన్యత పెరగడం కూడా కారణమని భావిస్తున్నారు. మగపిల్లలు పుట్టే వరకూ కంటూనే ఉండడం కూడా దేశంలో ఓ దురాచారంలా మారిపోతోంది. ఇదే ఇప్పుడు ఈ దేశంలో సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లో అభివృద్ధికి ఆటంకంగా తయారయ్యింది. – అరుణ -
‘మమ్మల్ని వేధింపులకు గురి చేశారు’
విజయవాడ: ఏపీ కబడ్డీ సంఘంలో లైంగిక ఆరోపణల ఎపిసోడ్పై ఇంకా రచ్చ కొనసాగుతూనే ఉంది. తమను ఏపీ కబడ్డీ సంఘం కార్యదర్శి కార్యదర్శి వీరలంకయ్య వేధిస్తున్నాడని, సర్టిఫికేట్లు అమ్ముకున్నాడని పలువురు మహిళా క్రీడాకారిణులు మీడియా ముందుకొచ్చారు. కృష్ణా జిల్లా కబడ్డీ సంఘం మాజీ కార్యదర్శి శ్రీకాంత్తో కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా ఏపీ కబడ్డీ అసోసియేషన్ అవతవకలపై చర్యలు తీసుకోవాలన్నారు. తమను వేధించిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ కబడ్డీ అసోసియేషన్పై ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటే, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎందుకు తీసుకోవడం లేదని శ్రీకాంత్ నిలదీశారు. వీరలంకయ్యకు ఏపీ కబడ్డీ సంఘం అధ్యక్షుడు కేఈ ప్రభాకర్ సపోర్టు ఉందని అన్నారు. తాను క్షమాపణ కోరుతూ లెటర్ రాశానని ప్రభాకర్ చెబుతున్న విషయం కూడా అబద్ధమని పేర్కొన్న శ్రీకాంత్.. అది ఫోర్జరీ చేసిన లెటర్ అని తెలిపారు. దీనిపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. తాను ఎటువంటి అవినీతికి పాల్పడలేదని ఈ సందర్బంగా పేర్కొన్నారు. మరొకవైపు వీరలంకయ్యపై చర్యలు తీసుకోవాలని పలువురు మహిళా క్రీడాకారిణులు కోరుతున్నారు. మహిళా క్రీడాకారిణులను వీర లంకయ్య వేధించకపోతే ఆయన్ని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. ఆయన్ని వెంటనే అసోసియేషన్ నుంచి తొలగించడంతో పాటు, దొంగ సర్టిఫికేట్ పై ఏసీబీ విచారణ జరిపించాలన్నారు. ఒక్కొక్క సర్టిఫికేట్ను ఏడున్నర లక్షలకు అమ్ముకున్నారని ఆరోపించారు. కృష్ణా జిల్లా కబడ్డీ అసోసియేషన్ను రద్దు చేసే అధికారం స్టేట్ బాడీకు లేదన్నారు. -
షికాగో దెబ్బ అమెరికా వీసాల తిరస్కరణ
-
షికాగో సెక్స్ రాకెట్ దెబ్బ : వీసాల తిరస్కరణ
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్ : మేక మహేందర్రెడ్డి, హైదరాబాద్కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఉత్తర అమెరికా తెలంగాణ తెలుగు మహాసభలకు ఆహ్వానం అందడంతో ఇటీవల యూఎస్ కాన్సులేట్లో బీ1బీ2 వీసా ఇంటర్వ్యూకు హాజరయ్యారు. అమెరికా ఎందుకు వెళుతున్నారని అడిగితే.. ఉత్తర అమెరికా తెలుగుసభల కోసమని సమాధానమిచ్చారు.. ఆ మరుక్షణమే ఆయన చేతికి వీసా తిరస్కరణ పత్రం అందింది. సురేఖరాణి, డ్యాన్సర్, టీవీ ఆర్టిస్టు. అమెరికా తెలుగు అసోసియేషన్ సదస్సులో పాల్గొనడానికి ఆహ్వానం అందడంతో బీ1బీ2(పర్యాటక వీసా) కోసం దరఖాస్తు చేశారు. ఈ నెల 22న వీసా ఇంటర్వ్యూకు వెళ్లారు. ఆమెకు ఎదురైన ప్రశ్న కూడా ఎందుకు వెళుతున్నారనేదే.. ఆటా సదస్సులో పాల్గొనడానికని సమాధానం చెప్పడంతో ఆమె దరఖాస్తు తిరస్కరణకు గురైంది. అమెరికాలో తెలుగు సదస్సులకు అధికారిక బృందాలు వెళుతుంటాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి 24 మందితో కూడిన బృందం అమెరికా తెలంగాణ సదస్సుకు వెళ్లడానికి వీసా ఇవ్వాలని అభ్యర్థిస్తూ లేఖ రాసింది. ఆ దరఖాస్తులను పరిశీలించిన కాన్సులేట్ ప్రతినిధి నలుగురికే వీసా ఇస్తామని ముందస్తు సమాచారం ఇచ్చి మిగిలిన దరఖాస్తులన్నీ తిరస్కరించింది. ..ఇలా అమెరికా వీసాలను తిరస్కరించడం గతంలో ఎన్నడూలేదు. తానా, ఆటా, నాటా ఇలా ఏ సదస్సుకు హాజరవుతామని దరఖాస్తు చేసినా 60 శాతం నుంచి 75 శాతం మందికి వారి ఆర్థిక పరిస్థితిని బట్టి వీసాలు ఇచ్చేవారు. ఇప్పుడు ఆ సదస్సులకు వెళతామని అంటున్న వారికి ఏ ప్రశ్నలూ లేకుండానే వీసా తిరస్కరిస్తున్నారు. గత 15 రోజుల్లో ఇలా వెళ్లిన వారిలో 90 శాతం మందికి వీసా ఇవ్వడానికి యూఎస్ కాన్సులేట్ తిరస్కరించింది. సెక్స్ రాకెట్ వెలుగు చూడటంతోనే.. షికాగోలో సెక్స్ రాకెట్ వెలుగు చూడటం, ఆ మొత్తం వ్యవహారంలో తెలుగు అసోసియేషన్ అఫ్ నార్త్ అమెరికా(తానా) ప్రతినిధుల ప్రమేయం ఉంటడమే దీనికి కారణం. షికాగోలోని ఓ తెలుగు చిత్రాల సహా నిర్మాత సినిమా అవకాశాలు లేని హీరోయిన్లను వ్యభిచారానికి ప్రోత్సహించిన ఘటన సంచలనం సృష్టించింది. తానా పేరుతో అమెరికాకు రప్పించి వ్యభిచారం చేయిస్తున్నట్లు వెల్లడి కావడం, దాని వెనుక తానా ప్రతినిధులు కొందరు ఉన్నారని తేలడంతో తెలుగు సదస్సులకు వెళ్లేవారి దరఖాస్తులను కాన్సులేట్ కుణ్ణంగా పరిశీలిస్తోంది. ఏ మాత్రం అనుమానం వచ్చినా రెడ్ మార్క్ పెడుతోంది. వీసా కోసం ఆన్లైన్లో డీఎస్ 160 ఫామ్ సమర్పించాలి. ఆ ఫామ్లో పేర్కొన్న వివరాల ఆధారంగా వీసా ఇవ్వాలా? లేదా? అన్న నిర్ణయానికి వస్తారు. అందులో దరఖాస్తుదారుడి ఆర్థిక పరిస్థితి.. ఆస్తులు తదితర వివరాలు చూస్తారు. తిరిగి వస్తాడా? లేదా? అన్నదానికే పరిమితమవుతారు. కానీ షికాగో ఘటన తర్వాత తెలుగు సదస్సులకు వెళ్లే 90 శాతం మంది వీసా దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. మే–జూన్కు ఎంత తేడా.. మే నెలలో యూఎస్ వీసా కోసం వచ్చిన (బీ1బీ2) దరఖాస్తుల్లో 65 శాతం మందికి వీసాలు మంజూరయ్యాయి. అదే జూన్ మధ్యకు వచ్చేసరికి వీసా తిరస్కరణలు 70 శాతానికి పెరిగాయి. మే 12వ తేదీ–28వ తేదీ మధ్య మూడు వేల మంది వీసా ఇంటర్వ్యూకు హాజరైతే.. 1,950 మందికి(65 శాతం) వీసా మంజూరైంది. అదే మే 29వ తేదీ–జూన్ 22వ తేదీ వరకూ సుమారు 4 వేల మంది వీసా ఇంటర్వ్యూకు హాజరైతే 1,350 మందికే వీసాలు దక్కాయి(కన్సల్టెన్సీ సంస్థల లెక్కల ఆధారంగా). తెలుగు సదస్సు పేరుతో అమెరికా వెళుతున్న వారు అక్కడకు వెళ్లి ఆరు నెలలు ఉండటం, కొంత మంది మరో మూడు మాసాలు పొడిగించాలని దరఖాస్తు చేయడం వంటివి లెక్కకు మించి ఉంటున్నాయి. షికాగోలో సెక్స్ రాకెట్ వెలుగు చూడటంతో యూఎస్ ఇమ్మిగ్రేషన్ విభాగం అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని కట్టడి చేయాలని ఆదేశించినట్లు సమాచారం. ‘వీసా ఇవ్వాలా? లేదా? అన్న అధికారం కాన్సులేట్ అధికారికి ఉంటుంది. ఇందులో ఎలాంటి మతులబూ ఉండదు’అని యూఎస్ కాన్సులేట్ అధికారి ఒకరు పేర్కొన్నారు. తల్లిదండ్రులకూ తప్పని తిప్పలు.. అమెరికా విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్న తమ పిల్లల గ్రాడ్యుయేషన్కు వెళ్లేందుకు వీసా కోసం దరఖాస్తు చేసిన తల్లిదండ్రులకూ తిప్పలు తప్పడం లేదు. గ్రాడ్యుయేషన్ కోసం వెళతామన్న తల్లిదండ్రులు, బంధువుల్లో 90 శాతం మందికి వీసాలు మంజూరవుతాయి. కానీ, ఇటీవల ఆ దరఖాస్తులనూ క్షుణ్ణంగా పరిశీలించి నో చెబుతున్నారు. రెవెన్యూ శాఖలో డిప్యూటీ తహశీల్దార్గా పనిచేస్తున్న అధికారి, అతని భార్యకు వీసా ఇవ్వడానికి యూఎస్ కాన్సులేట్ నిరాకరించింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హెచ్పీసీఎల్ సీనియర్ అధికారి కుమారుడి గ్రాడ్యుయేషన్కు వెళ్లడానికి వీసా చేసుకున్న దరఖాస్తునూ కాన్సులేట్ అధికారి గత గురువారం తిరస్కరించారు. గతంలో ఇలా లేదు.. గతంలో దరఖాస్తు చేసిన వారిలో 90 శాతం మందికి వీసాలు వచ్చేవి. ఈ పదిహేను రోజుల్లో మంజూరైన వీసాల సంఖ్య 35 నుంచి 40 శాతానికి పడిపోయింది. గత 15 రోజుల్లో మా సంస్థ 220 దరఖాస్తులను ఫార్వర్డ్ చేయగా 34 మందికే వీసాలు వచ్చాయి. గతంలో మా సంస్థ ద్వారా వెళ్లిన 90 శాతం మందికి వీసాలు వచ్చేవి. ఇప్పుడు పరిస్థితి మారింది. – ఓ కన్సల్టెన్సీ ప్రతినిధి -
కోరిక తీరిస్తే రుణం ఇస్తా..
బుల్దానా: రుణం మంజూరు కావాలంటే తన కోరిక తీర్చాలంటూ ఓ మహిళారైతును బ్యాంక్ మేనేజర్ కోరారు. ఈ ఫోన్ సంభాషణను రికార్డు చేసిన ఆ మహిళ, భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహారాష్ట్రలోని దతాలా గ్రామానికి చెందిన ఓ మహిళా రైతు పంట రుణం కోసం ఈ నెల 18వ తేదీన స్థానిక సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ మేనేజర్ రాజేశ్ హివాసేను సంప్రదించారు. ఆమె దరఖాస్తును పరిశీలించిన మేనేజర్, ఫోన్ నంబర్ను అడిగి తీసుకుని తనతో ‘టచ్’లో ఉండాల్సిందిగా కోరారు. అనంతరం ఆమెకు ఫోన్ చేసి అభ్యంతరకరంగా మాట్లాడారు. 22వ తేదీన బ్యాంక్ ప్యూన్ మనోజ్ చవాన్ ఆమెకు ఫోన్ చేసి.. మేనేజర్ కోరిక తీరిస్తే రుణం ఎక్కువ మంజూరవుతుందంటూ మాట్లాడాడు. అయితే, ఆ మహిళ వీరిద్దరి ఫోన్ సంభాషణలను రికార్డు చేశారు. ఈ సంభాషణలతో కలిపి ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు బ్యాంకుకు వెళ్లగా మేనేజర్తోపాటు ప్యూను వారిని చూసి పరారయ్యారు. అయితే, ఈ విషయం తెలిసిన గ్రామస్తులు వందలాది మంది బ్యాంకుకు చేరుకుని ఆందోళన చేపట్టారు. బ్యాంక్ మేనేజర్ కనిపిస్తే చంపేస్తామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, బ్యాంక్ మేనేజర్తోపాటు ప్యూన్పై పోలీసులు కేసులు నమోదు చేశారు. పరారీలో ఉన్న మేనేజర్ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ కేసును జిల్లా కలెక్టర్ నిరుపమా దాంగే ప్రత్యేకంగా పర్యవేక్షిస్తారని ప్రభుత్వం తెలిపింది. -
పిండి కొద్దీ రొట్టె
ఇండస్ట్రీలో మేల్ యాక్టర్స్తో పోలిస్తే మాకు తగినంత పారితోషికం ఇవ్వట్లేదంటూ ఇటీవల బాలీవుడ్లో పలువురు భామలు వాపోయారు. సినిమాలో కీలక పాత్రలు ఉన్నప్పటికీ పారితోషికంలో వ్యత్యాసం ఉంటుందని పేర్కొన్నారు. పారితోషికాల విషయంలో స్త్రీ, పురుషులు అనే వ్యత్యాసం ఉందా? అని రణ్బీర్ కపూర్ని అడగ్గా –‘‘పిండి కొద్దీ రొట్టె. జెండర్ని బట్టి పారితోషికం నిర్ణయిస్తారనుకోవటం పొరపాటు. ఎవరి మార్కెట్ ఎంతో అందరికీ ఒక అవగాహన ఉంటుంది. దాన్ని బట్టి పే ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే.. సినిమాలు బాగా ఆడితేనే ఇస్తారు. లేదంటే లేదు. ఒకవేళ నెక్ట్స్ నేను దీపికా పదుకోన్తో యాక్ట్ చేస్తే తనకి, నాకు సమానంగా ఇవ్వొచ్చు లేదా తనకే ఇంకా ఎక్కువ ఇవ్వొచు’’ అని చెప్పుకొచ్చారు రణ్బీర్. -
‘ప్లీజ్.. నా కోరిక తీర్చు’
నిస్సహాయ స్థితిలో పంట రుణం కోసం వచ్చిన మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడో కామాంధుడు. కోరికలు తీర్చాలంటూ బ్యాంక్ మేనేజర్ వేధించాడు. ఏకంగా ఇంటికే రాయబారం పంపటంతో సహనం నశించిన ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో విషయం వెలుగు చూసింది. సాక్షి, ముంబై: బుల్దానా జిల్లా మల్కాపూర్ మండలంలో నివసిస్తున్న రైతు దంపతులు.. లోన్ కోసం జిల్లా కేంద్రంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఆశ్రయించారు. అయితే బ్యాంక్ మేనేజర్ రాజేష్ హివాసె సదరు మహిళపై కన్నేశాడు. లోన్ దరఖాస్తులోని ఆమె ఫోన్ నంబర్కు ఫోన్కాల్ చేసి ‘కోరిక తీర్చాలంటూ’ వేధించాడు. అయితే లోన్ జారీఅయ్యే సమయంలో గొడవ కావటం ఇష్టం లేని ఆమె విషయాన్ని భర్తకు చెప్పలేదు. ఈ దశలో లోన్ను హోల్డ్లో పెట్టిన రాజేష్.. తన అటెండర్ను సదరు మహిళ ఇంటికి పంపి రాయబారం నడపాలని యత్నించాడు. రుణంతోపాటు అదనంగా లాభాలు, కొంత ప్యాకేజీ కూడా మేనేజర్ ద్వారా ఇప్పిస్తానని సదరు ప్యూన్ ఆమెతో చెప్పాడు. అతని మాటలు వినగానే ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. వెంటబడి రోకలిబండతో అతన్ని తరిమి కొట్టింది. స్థానికులు గుమిగూడటంతో ఆ అటెండర్ అక్కడి నుంచి దౌడుతీశాడు. రాజేష్ కాల్ రికార్డింగ్స్తోసహా పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. బాధిత మహిళ దళితురాలు కావటంతో అట్రాసిటీ కేసు, లైంగిక వేధింపుల కేసులు నమోదు చేసుకున్న పోలీసులు, పరారీలో ఉన్న మేనేజర్ రాజేశ్, అటెండర్ల కోసం గాలింపు చేపట్టారు. -
లైంగిక దాడి.. మేడపై నుంచి తోసి
ముంబై : యువతిపై లైంగిక దాడికి పాల్పడిన ఓ యువకుడు అనంతరం ఆమెను రెండో అంతస్తుపై నుంచి కిందకు తోసేశాడు. ఈ సంఘటన గురువారం ముంబైలోని ఎమ్ఐడీసీ ఏరియాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ముంబైలోని ఎమ్ఐడీసీకి చెందిన 17 ఏళ్ల యువతి అత్తమామలతో కలిసి ఓ అపార్ట్మెంట్లోని మూడవ అంతస్తులో నివాసముంటోంది. అదే అపార్ట్మెంట్లోని రెండో అంతస్తులో నివాసముంటున్న 21 ఏళ్ల యువకుడు ఆ యువతి పని మీద బయటకు వెళుతున్న సమయంలో ఇంటిలోపలికి లాక్కెల్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతి చాలా సేపటినుంచి కనిపించకపోవటంతో ఆమె మామ వెతకటం మొదలుపెట్టాడు. యువతిని రెండో ఫ్లోర్లోని యువకుడు ఇంటి లోపలికి లాక్కెళ్లాడన్న విషయం తెలుసుకుని అతడి ఇంటి తలుపు తట్టాడు. దీంతో భయాందోళనకు గురైన యువకుడు ఆమెను రెండో అంతస్తులోని ఇంటి కిటికీ నుంచి కిందకు తోసేసి అక్కడి నుంచి పరారయ్యాడు. రెండో అంతస్తు మీద నుంచి కిందపడ్డ యువతి తీవ్ర గాయాలపాలైంది. ఇది గమనించిన కొంతమంది ఆమె మామకు సమాచారమివ్వటంతో ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
సెక్స్రాకెట్.. సీఎం సన్నిహితుడి విచారణ!
సాక్షి, అమరావతి: సాంస్కృతిక కార్యక్రమాల పేరుతో అమెరికాకు సినీతారలను తరలించి వ్యభిచారం ఊబిలోకి దింపిన వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. ఈ కేసును అమెరికాలోని చికాగో పోలీసులు సీరియస్గా తీసుకోవడంతో తీగ లాగితే డొంక కదులుతోంది. తొలుత ఇది కేవలం సినీతారలకు సంబంధించిన అంశంగానే భావించినప్పటికీ ఈ రాకెట్లో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖుల పేర్లు కూడా ఉన్నట్టు చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్కు అత్యంత సన్నిహితుడైన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రస్తుత అధ్యక్షుడు సతీష్ వేమనను అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) తాజాగా విచారించడం కలకలం రేపుతోంది. తానా నుంచి సినీతారలకు ఆహ్వానాలు, మెయిల్స్ పంపడంతోపాటు సతీష్ వేమన బ్యాంకు ఖాతా నుంచి సినీతారలకు పెద్ద మొత్తంలో డబ్బులు మళ్లాయని ఎఫ్బీఐ సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన్ను విచారించినట్టు తెలిసింది. టీడీపీలో సతీష్ చురుకైన పాత్ర తొలుత ఎఫ్బీఐ విచారణకు హాజరైన సతీష్ వేమన తరువాత ఫోన్ స్విచాఫ్ చేసినట్లు తెలిసింది. అయితే తానా ప్రతినిధులపై పోలీసులు ఒత్తిడి తేవడంతో సతీష్ విచారణకు హాజరై సహకరించారని చెబుతున్నారు. సినీతారల సెక్స్ రాకెట్కు సంబంధించి సతీష్ వేమన ప్రమేయంపై ఈ సందర్భంగా ఎఫ్బీఐ ఆరా తీసినట్టు సమాచారం. టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరించే సతీష్ గతంలో తెలుగు రాష్ట్రాల నుంచి కొందరు హీరోయిన్లను అమెరికా తీసుకెళ్లి పలు కార్యక్రమాలు నిర్వహించారు. అయితే సెక్స్ రాకెట్లో తన ప్రమేయం లేదని సతీష్ వేమన ముందు జాగ్రత్తగా కొన్ని మీడియా సంస్థలకు వివరణ ఇచ్చుకోవడంపై తానా ప్రతినిధుల్లో భిన్న వాదనలు వ్యక్తమైనట్టు తెలిసింది. తప్పు చేయనప్పుడు మీడియాకు ముందే వివరణ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని పలువురు సహచరులు ఆయన్ను ప్రశ్నించినట్టు తెలిసింది. చికాగో కోర్టుకు ‘సెక్స్ రాకెట్’ దంపతులు... సినీతారల సెక్స్ రాకెట్ కేసులో మోదుగుమూడి కిషన్, చంద్రకళ దంపతులను ఎఫ్బీఐ గురువారం ఇల్లినాయిస్ కోర్టులో హాజరు పరిచింది. గురువారం నుంచి ఈ కేసు విచారణ ప్రారంభం అయినందున కిషన్ దంపతులు అప్రూవర్గా మారి నోరు విప్పితే పలువురు ప్రముఖుల గుట్టు రట్టు అవుతుందని భావిస్తున్నారు. కిషన్ దంపతులకు రెండేళ్ల క్రితమే వీసా గడువు ముగిసినా అక్కడే ఉంటూ సినీతారలు, ప్రముఖులను తరలించి సెక్స్ రాకెట్ నడపటాన్ని అమెరికా పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారం నాలుగేళ్ల నుంచి జరుగుతున్నట్లు భావించినా పదేళ్ల నుంచి కొనసాగుతున్నట్టు ఎఫ్బీఐ దర్యాప్తులో తేలిందని విశ్వసనీయ సమాచారం. అమెరికాకు సినీతారలు, ప్రముఖులు ఎవరెవరిని ఎప్పుడెప్పుడు తీసుకొచ్చారు, ఎవరెవరికి ఎంత మొత్తం చెల్లించారు తదితర వివరాలు చంద్రకళ డైరీలో రాసి ఉన్నట్టు చెబుతున్నారు. ఆ డైరీ ఇప్పుడు ఎఫ్బీఐ చేతికి చిక్కడంతో ఎవరి జాతకాలు బయటపడతాయోననే కలవరం మొదలైంది. తీవ్ర నేరంగా పరిగణిస్తున్న ఎఫ్బీఐ దాదాపు ఆరు నెలల క్రితం దొరికిన ఒక కాగితం ఆధారంగా దర్యాప్తు చేపట్టిన ఎఫ్బీఐ పలు కీలక ఆధారాలు సేకరించి సెక్స్ రాకెట్లో పాత్రధారులైన మోదుగుమూడి కిషన్, చంద్రకళ దంపతులను అదుపులోకి తీసుకుంది. వీరిపై కేసు నమోదు చేసిన చికాగో పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా దర్యాప్తు చేపట్టి దీని వెనుక కీలక వ్యక్తులు ఉన్నట్లు గుర్తించారు. సాంస్కృతిక ప్రదర్శనల పేరుతో వ్యభిచారం చేయడం తీవ్రమైన నేరంగా ఎఫ్బీఐ పేర్కొంటోంది. అమెరికాలో ఇష్టపూర్వకంగా జరిగే వ్యభిచారంపై పెద్దగా ఆంక్షలు లేనప్పటికీ మారుపేర్లతో విదేశీయులను తరలించి వ్యభిచారంలోకి దించడాన్ని తీవ్ర నేరంగా పరిగణించినట్టు తెలుస్తోంది. ఈ సెక్స్ రాకెట్లో దాదాపు రూ.40 కోట్ల మేర చేతులు మారినట్టు చెబుతున్నారు. -
సెక్స్ రాకెట్ కేసు.. ఏమంటారు చంద్రబాబు?
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన షికాగో సెక్స్ రాకెట్ కేసు వెనుక పలువురు పెద్దల హస్తం ఉందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(తానా) ప్రెసిడెంట్ సతీష్ వేమన.. చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్కు సన్నిహితుడైనందున ఏపీ ముఖ్యమంత్రి దీనిపై సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇక్కడి పార్టీ ప్రధాన కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడుతూ వాసిరెడ్డి పద్మ షికాగో సెక్స్ రాకెట్ కేసు గురించి పలు వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి విషయాలతో అమెరికాలో ఉంటున్న తెలుగువారి పరువు తీశారంటూ ఆమె మండిపడ్డారు. గతంలో ఏపీలో కలకలం రేపిన కాల్మనీ సెక్స్ రాకెట్పై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రశ్నిస్తే, ఆమెను ఏడాదిపాటు సస్పెండ్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. కాల్మనీ సెక్స్ రాకెట్ కేసులో టీడీపీ నేతలు ఉండటంతో ఆ కేసును ఏపీ ప్రభుత్వం నీరుగార్చిందని విమర్శించారు. ఇప్పుడు రాష్ట్రంలోని ప్రతి మహిళ కాల్మనీ సీఎం అనే పరిస్థితిని తీసుకొచ్చారని వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. చంద్రబాబు, లోకేష్కు సన్నిహితుడైన తానా అధ్యక్షుడు వేమన సతీష్ను అమెరికా పోలీసులు పలుమార్లు విచారించారు. కాగా, టీడీపీలో కూడా సతీష్ క్రియాశీలకంగానే ఉంటారన్న విషయం తెలిసిందే. షికాగో సెక్స్ రాకెట్ కేసులో తానాకు చెందిన పలువురు ప్రముఖుల పేర్లతో పాటు ఇటీవల వెలుగుచూసిన డైరీలో ఓ ఏపీ మంత్రి, ఎంపీ పేర్లు ఉన్నట్లు సమాచారం. అమెరికా పోలీసులు కోర్టులో దాఖలు చేసిన 40 పేజీల అఫిడవిట్ సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. బాధితుల జాబితాలో 10 మంది హీరోయిన్లు ఉన్నట్లు అమెరికా పోలీసులు అఫిడవిట్లో పేర్కొన్నారు. -
షికాగో సెక్స్రాకెట్ .. చంద్రబాబు సమాధానం చెప్పాలి
-
షికాగో సెక్స్రాకెట్ .. ఎవరీ ABCDE?
చికాగో : తెలుగు సినీ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టించిన షికాగో సెక్స్ రాకెట్ కేసు రోజుకో కొత్తమలుపు తిరుగుతోంది. అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యురిటీ సాగిస్తున్న దర్యాప్తులో అనేక కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో ప్రమేయం ఉన్న మరికొందరిని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి అమెరికా పోలీసులు స్థానిక కోర్టులో దాఖలు చేసిన 40 పేజీల అఫిడవిట్ వెలుగులోకి వచ్చింది. ఆ అఫిడవిట్ పరిశీలిస్తే కోసు దర్యాప్తు పురోగతి, ఏ కోణంలో సాగుతోందన్న విషయం అవగతమవుతోంది. ప్రస్తుతం ఆ అఫిడవిట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ హల్ చల్ చేస్తోంది. ఈ సెక్స్ రాకెట్ లో భాగమైన కొందరి పేర్లు సినీ పరిశ్రమను కుదిపేస్తోంది. ఆ అఫిడవిట్లో అమెరికా దర్యాప్తు అధికారులు పేర్కొన్న ఏ, బీ, సీ, డీ, ఈ ఎవరై ఉంటారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చజరుగుతోంది. వీరితో పాటూ మొత్తం బాధిత 10 మంది హీరోయిన్ల జాబితా కూడా వైరల్ అవుతోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్కు చెందిన పలువురు ప్రముఖుల పేర్లు కూడా ఈ రాకెట్తో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా పోలీసులు కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ సెక్స్ రాకెట్ డైరీలో ఏపీ మంత్రి ? ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్కు సన్నిహితుడు, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(తానా) ప్రెసిడెంట్ వేమన సతీష్ను అమెరికా పోలీసులు పలుమార్లు విచారించారు. వేమన సతీష్ తెలుగుదేశం పార్టీలో కూడా క్రియాశీలకంగానే ఉంటారు. ఈ విషయంలో తానాకు చెందిన పలువురు ప్రముఖుల పేర్లు కూడా వినిపించాయి. అంతేకాకుండా సెక్స్ రాకెట్కు సంబంధించి వెలుగు చూసిన డైరీలో ప్రస్తుతం ఏపీలో అత్యంత కీలక శాఖను నిర్వహిస్తున్న మంత్రి పేరు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. సీఎంకు అత్యంత సన్నిహితంగా ఉండే ఓ ఎంపీ పేరు కూడా అందులో ఉన్నట్టు సమాచారం. తీగలాగితే డొంకంత కదులుతున్నట్లు పలువురు రాజకీయ నాయకుల పేర్లు ఈ జాబితాలో ఉండటంతో అమెరికా తెలుగు సంఘాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. అసోసియేషన్ల పేరుతో వీసాలు.. డబ్బు ఎరగా చూపి సినీతారలతో వ్యభిచారం చేయిస్తున్న కిషన్ మోదుగుమూడి, చంద్రకళ అనే భారతీయ దంపతులను అక్కడి షికాగో ఫెడరల్ పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. సెక్స్ రాకెట్ వ్యవహారంలో ఇప్పటివరకూ పలువురు నటీమణుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. నిందితుల మొబైల్ ఫోన్ సంభాషణల విశ్లేషణ కొనసాగుతున్న నేపథ్యంలో మరింత మంది బాధితుల పేర్లు బయటపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. భారతీయ అసోసియేషన్ల కార్యాక్రమాల్లో పాల్గొనడానికంటూ సినీ తారలకు వీసాలు ఇప్పించి అమెరికాకు రప్పిస్తారని పోలీసుల విచారణలో తేలింది. విచారణ జరిగిందిలా.. గత ఏడాది నవంబర్ 20న ఓ హీరోయిన్ ఢిల్లీ నుంచి షికాగో వెళ్లింది. తెలుగు అసోసియేషన్ ఆఫ్ సౌత్ కాలిఫోర్నియా నవంబర్18న ఏర్పాటు చేసిన ఈవెంట్లో ఆమె పాల్గొనాలి. కానీ ఆమె రెండు రోజులు ఆసల్యంగా వచ్చి కాలిఫోర్నియా బదులు చికాగోకు వెళ్లింది. దీంతో అనుమానంతో వచ్చి అధికారులు విచారించారు. తను మరో కార్యక్రమానికి హాజరయ్యానని ఆమె బదులిచ్చారు. ఏ ఈవెంట్లో పాల్గొన్నారని ప్రశ్నించగా నార్త్ అమెరికా తెలుగు సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైనట్లు చెప్పుకొచ్చింది. కానీ పోలీసుల విచారణలో ఆమె సంబంధిత ఈవెంట్లో పాల్గొనలేదని తేలింది. దాంతో ఆ నటిని అమెరికాకు రప్పించిన వ్యక్తి గురించి ఆరా తీశారు. ఆ వ్యక్తి పేరు రాజు అని ఉంది. అతని గురించి విచారించగా కిషన్ అనే వ్యక్తే రాజు అనే మారుపేరుతో ఆమెను రప్పించాడని తేలింది. దీంతో ఆ నటి వీసాను రద్దు చేశారు. అలాగే మరో నలుగురి నటీమణులను కూడా విచారించారు. వివిధ తెలుగు సంఘాల ప్రతినిధులను విచారించిన అధికారులు గత కొన్ని సంవత్సరాలుగా ఆయా సంఘాల కార్యక్రమాలకు హాజరైన వారి వివరాలను మన దేశంలోని అమెరికా కాన్సులేట్ కార్యాలయాల నుంచి తెప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ఇద్దరు టాప్ హీరోయిన్లకు ఈ వ్యభిచార రాకెట్తో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. అరెస్టయిన కిషన్, ఆయన భార్య చంద్రకళ వద్ద ఈ హీరోయిన్లతో సంభాషణలు జరిపినట్లు ఆధారాలున్నాయని చెపుతున్నారు. విచారణకు సహకరిస్తాం : సతీష్ వేమన సినీతారల వ్యభిచారం కేసుకు అమెరికాలోని తెలుగు సంఘాల ఆర్గనైజర్లతో సంబంధాలున్నాయని వస్తున్న వార్తలపై తానా ప్రెసిడెంట్ సతీష్ వేమన స్పందించారు. నిందితులతో తానాకు ఎలాంటి సంబంధంలేదని ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కేసులో నిందితులు డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసి, నఖిలీ ఆహ్వాన పత్రికలు సృష్టించినట్టు తెలుస్తోందన్నారు. కొన్నింటిలో తానా పేరును వాడి, అక్రమ మార్గాల్లో అమెరికా వీసా పొందారన్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యురిటీ(డీహెచ్ఎస్) ఈ కేసు విచారణ ముమ్మరం చేసిందని, వారికి తానా పూర్తిగా సహకరిస్తున్నట్టు వెల్లడించారు. నిందితులు తానా పేరుతో ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించిన తీరును వారికి వివరించినట్టు తెలిపారు. -
తమ్మారెడ్డి రిక్వెస్ట్
సాక్షి, హైదరాబాద్: హాట్ టాపిక్గా మారిన చికాగో వ్యభిచార రాకెట్ వ్యవహారం.. అందులో టాలీవుడ్ నటీమణులు ఇన్వాల్వ్ అయి ఉన్నారన్న కథనాలు తెలుగు చలన చిత్రపరిశ్రమను కుదిపేస్తున్నాయి. ఈవెంట్ల పేరుతో నటీమణులను కిషన్-చంద్రకళ దంపతులు విదేశాలకు పిలిపించుకోవటం.. వారితో గుట్టుగా వ్యభిచారం నిర్వహించటం వెలుగుచూసింది. దీంతో కేసు నమోదు చేసిన అక్కడి పోలీసులు పక్కాగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మీడియాకు విజ్ఞప్తి చేస్తూ ఫేస్బుక్లో ఓ వీడియోను ఉంచారు. ‘కిషన్ గతంలో ఏవో సినిమాలు చేసి ఉండొచ్చు. కానీ, ఇపుడు అతడో విటుడిగా మారి ఈ రాకెట్ నడుపుతున్నాడు. అలాంటప్పుడు అతన్ని ఇంకా నిర్మాతగా చూపిస్తూ... తెలుగు చిత్ర పరిశ్రమతో సంబంధాలంటగట్టడం సరికాదు. కిషన్ - చంద్రకళలను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. దాంతోపాటే కొంత మంది బాధితులను కూడా కాపాడారు. ఇందులో కొంతమంది టాలీవుడ్ నటీమణులు పాల్గొని ఉండొచ్చు. అలాగనీ మొత్తం తెలుగు ఇండస్ట్రీకి ఆ రాకెట్తో లింకు పెట్టడం బాధాకరం. కిషన్ ఓ వ్యభిచార రాకెట్ ను నడిపిస్తున్నాడు. అతడి చేతిలో కొందరు చిక్కుకుంటే అతన్ని పింప్ అనకుండా... ఓ ప్రొడ్యూసర్ అని, సినిమావాడని సంబోధించడం సరికాదు. టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి మంచి చెడులు, రివ్యూలు రాస్తున్నారు. కానీ, ఇండస్ట్రీని డ్యామేజ్ చేసే కథనాలు మాత్రం రాయకండి’ అని తమ్మారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇక నటీమణులు కూడా భవిష్యత్తులో జరిగే ఈవెంట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ - ఫిల్మ్ చాంబర్లకు ఓ మాట చెప్పి విదేశీ ఈవెంట్లకు వెళితే మంచిదని సూచించారు. ‘ఈవెంట్ల పేరిట జరుగుతున్న ఈ చీకటి వ్యవహారాల్లో తెలిసో.. తెలీకో తెలుగు సంఘాలు కూడా ఇన్ వాల్వ్ అయ్యాయి. ఆ సంఘాల పేరుమీదే వీసాలు జారీ అవుతున్నాయి. ఇన్విటేషన్స్ పంపుతున్నారు. అలాంటప్పుడు వాటిని అడ్డుకోవాల్సిన బాధ్యత తెలుగు సంఘాలపై కూడా ఉంటుంది’ అని తమ్మారెడ్డి తెలిపారు. -
లైంగిక వేధింపుల కేసులో ప్రొఫెసర్ అరెస్ట్
నెల్లూరు(క్రైమ్): వైద్య విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ప్రొఫెసర్ చంద్రశేఖర్ను, ప్రొఫెసర్పై దాడి కేసులో ప్రజన్కుమార్ను ఆదివారం దర్గామిట్ట ఇన్స్పెక్టర్ వి.సుధాకర్రెడ్డి ఆదివారం అరెస్ట్ చేశారు. నగరానికి చెందిన ఓ యువతి ఏసీఎస్సార్ ప్రభు త్వ వైద్యకళాశాలలో నాల్గో సంవత్సరం వైద్యవిద్యను అభ్యసిస్తోంది. ఈ నెల 14న ఆమె జీజీహెచ్లోని జనరల్ సర్జరీ విభాగంలోని డెమో గదికి వెళ్లింది. ఈ క్రమంలో ప్రొఫెసర్ చంద్రశేఖర్ ఆమెను లైంగికంగా వేధించా డం టూ ఆరోపిస్తూ బాధిత విద్యార్థిని తన కుటుం బ సభ్యులకు తెలిపింది. దీంతో వారు ప్రభు త్వ వైద్యకళాశాలకు చేరుకున్నారు. ఈ క్రమంలో బాధిత విద్యార్థిని బంధువు ప్రజన్కుమార్ ప్రొఫెసర్పై దాడిచేసి గాయపరిచారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న దర్గామిట్ట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి ని అదుపులోకి తీసుకువచ్చారు. బాధిత విద్యార్థిని ఫిర్యాదు మేరకు ప్రొఫెసర్ డాక్టర్ చంద్రశేఖర్పై లైంగిక వేధింపుల కేసు, ప్రజన్కుమార్పై దాడికేసు నమోదుచేసిన విషయం విదితమే. -
వేధింపుల చట్టానికి ఎంపీ అడ్డుపుల్ల
మహిళలపై జరిగే లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా బోలెడన్ని ఉద్యమాలు జరిగాయి.(జరుగుతున్నాయి కూడా). ఈ క్రమంలో యూకేలో ఓ యువతి నిర్వహించిన ఉద్యమం పార్లమెంట్(హౌజ్ ఆఫ్ కామన్స్)ను కదిలించింది. అయితే కఠిన చట్టం దిశగా అడుగులు వేసిన క్రమంలో ఓ ఎంపీ వేసిన అడ్డుపుల్ల ప్రజల్లో ఆగ్రహజ్వాలలను రగిల్చింది. సున్నితమైన అంశం, పైగా అధికారపక్ష ఎంపీ కావటం ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. లండన్: గినా మార్టిన్(26) గతేడాది జూలైలో లండన్ హైడ్ పార్క్లో జరిగిన ఓ ఫెస్టివల్కు తన సోదరితో కలిసి హాజరయ్యింది. ఆ సమయంలో ఆమెను వెంబడించిన కొందరు యువకులు వేధింపులకు దిగారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఆమె స్కర్ట్ కింద నుంచి ఫోన్తో ఫోటోలు తీశాడు. అది గమనించి ఆమె వారితో వాగ్వాదానికి దిగింది. ఫోన్ లాక్కుని పరిగెత్తటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయటం, వారిని పోలీసులు ప్రశ్నించటం చకచకా జరిగిపోయాయి. అయితే ఆ వ్యవహారంలో ఆమెకు సరైన న్యాయం జరగలేదు. దీంతో స్టాప్స్కర్టింగ్ పేరిట ఆమె సోషల్ మీడియాలో ఉద్యమాన్ని మొదలుపెట్టింది. కఠిన చట్టం... మహిళల అనుమతి లేకుండా వారిని అభ్యంతకరంగా ఫోటోలు తీయటం నేరమనే ఉద్దేశంతో ఈ ఉద్యమం ఉవ్వెత్తున సాగింది. దీనికి సామాన్యులు, సెలబ్రిటీలు, మహిళా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో మద్ధతు ప్రకటించారు. దీంతో చివరకు ఈ వ్యవహారం హౌజ్ ఆఫ్ కామన్స్కు చేరింది. అందరి మద్ధతుతో కఠిన చట్టం రూపకల్పన చేయాలని నిర్ణయించారు. లిబరల్ డెమొక్రట్ ఎంపీ వెరా హోప్హౌజ్ ప్రతిపాదిత బిల్లును సభలో ప్రవేశపెట్టారు. దీని ప్రకారం అనుమతులు లేకుండా మహిళల ఫోటోలను తీయటం నిషేధం. అలా కాదని తీస్తే వేధింపుల కిందకే వస్తుంది. నేరం కింద రెండేళ్ల కఠిన కారాగార శిక్షను విధిస్తారు. అధికార ఎంపీ అడ్డుపుల్ల... అయితే బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో అనూహ్యంగా కన్సర్వేటివ్ ఎంపీ సర్ క్రిస్టోఫర్ చోప్(71) బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించి సభలో కలకలం రేపారు. ఆ వెంటనే సభలో ‘సిగ్గు చేటు’ అంటూ ఎంపీలంతా నినాదాలు చేశారు. బిల్లును తాను ఎందుకు వ్యతిరేకిస్తున్న అన్న అంశంపై మాత్రం చోప్ స్పష్టత ఇవ్వలేదు. తోటి ఎంపీలు ఆయన నిర్వాకంపై ఆగ్రహం వ్యక్తం చేయగా, సొంత పార్టీ ఎంపీ తీరుపై బ్రిటన్ ప్రధాని థెరిసా మే కూడా బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నా చోప్ మౌనంగా ఉండటంతో విమర్శలు తారా స్థాయికి చేరాయి. ఉద్యమకారిణి గినా మార్టిన్ కూడా చోప్ నిర్ణయంపై మండిపడుతున్నారు. ఏది ఏమైనా ఈ లైంగిక వేధింపుల వ్యతిరేక చట్టం కార్యరూపం దాల్చటం మాత్రం ఖాయమని అధికార పార్టీ ఎంపీలు చెబుతున్నారు. ఆయనంతే... క్రిస్టోఫర్ చోప్(71)కు వివాదాలు కొత్తేం కాదు. మానవ హక్కులకు సంబంధించిన చట్టం, సమాన వేతన చట్టం, స్వలింగ వివాహ చట్టం.. తదితరాలను వ్యతిరేకించి వార్తల్లో కెక్కారు. బహిరంగ ప్రదేశాల్లో బుర్ఖాలను నిషేధించాలని, కనీస వేతన చట్టాలను రద్దు చేయాలని, మరణ శిక్షను పునరుద్ధరించాలని, నిర్భంద సైనిక శిక్షణ అమలు చేయాలంటూ అభిప్రాయాలు వ్యక్తం చేసి దుమారం రేపారు. ఇవన్నీ ఒక్క ఎత్తయితే 2013లో హౌజ్ ఆఫ్ కామన్స్ సిబ్బందిని ‘పనివాళ్లుగా’ అభివర్ణిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. చోప్ క్షమాపణలు చెప్పాలంటూ పెద్ద ఎత్తున్న నిరసనలు వ్యక్తం అయ్యాయి. అయినప్పటికీ ఆ పెద్దాయన ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. -
ఇద్దరు యువకుల ఘాతుకం
సాక్షి, కోటవురట్ల(పాయకరావుపేట) : వావివరుసలు మరచి ఇద్దరు యువకులు చెల్లి వరుస అయిన బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడడమే కాకుండా ఉరివేసి హత్యచేసేందుకు యత్నించిన సంఘటన ఆలస్యంగా బీకే పల్లిలో వెలుగులోకి వచ్చింది. తీవ్రంగా గాయపడిన ఆమె కేజీహెచ్లో చికిత్స పొందుతోంది. బాలిక తల్లి లక్ష్మి వివరాలు ఇలా ఉన్నాయి. తమ పక్క ఇంటిలో ఉంటున్న పైల గోపి, పైల సునీల్ తన కుమార్తెకు అన్నదమ్ముల వరుస అవుతారని, దానిని మరిచి ఇద్దరూ ఆమెపై లైంగికదాడికి యత్నించి, ఆపై చంపడానికి ప్రయత్నించారని తెలిపింది. పథకం ప్రకారం ఆదివారం పాకలోకి పిలిచి లైంగికదాడికి యత్నించారని తెలిపింది. బాలిక అడ్డుకోవడంతో వెలుగులోకి వస్తే ప్రమాదమని భావించి ఉరి వేసి చంపేందుకు ప్రయత్నించారని ఆరోపించింది. చనిపోయిందనుకుని ఏమీ తెలియనట్టుగా తమ పెద్ద కూతురు ఉమాదేవి వద్దకు వచ్చి మీ చెల్లిపై సిమెంట్ బస్తాలు పడిపోయాయని గోపి చెప్పాడని, అక్కడకు వెళ్లేసరికి కొనఊపిరితో ఉన్న కుమార్తెను నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు. వైద్య సిబ్బంది కూడా జరిగిన సంఘటనపై అనుమానం వ్యక్తం చేశారని, సిమెంట్ బస్తాలు పడితే పెనుగులాడినట్టు తల, వీపుపై మట్టి ఎందుకు ఉంటుందని ప్రశ్నించారని తెలిపింది. పరిస్థితి ఆందోళనగా ఉండడంతో విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా మెడ నరాలు తెగిపోవడంతో పాటు చిన్న మెదడు దెబ్బతిన్నట్టు వైద్యులు తెలిపారన్నారు. జరిగిన అన్యాయంపై మంగళవారం కోటవురట్లలోని పోలీసుస్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేస్తే ఎస్ఐ స్పందించలేదని, కేసు పెడితే ఆ ఇద్దరు ఏమైనా చేసుకుంటే బాధ్యత మీదేనని నిందితుల తరఫున మాట్లాడుతూ బెదిరించారన్నారు. మొదటి నుంచి గోపి, సునీల్ తమ రెండో కుమార్తె పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఫొటోలను అసభ్యంగా తయారు చేసి వాట్సప్లో పెడతామని బెదిరించేవారని, ప్రతీసారీ రూ.1000, రూ.2 వేలు తెమ్మని డిమాండ్ చేసేవారని చెప్పింది. ఈ విషయం తమకు ఆలస్యంగా తెలిసిందని తెలిపింది. ఈ విషయాన్ని నిలదీసినందుకే తన మూడో కూతురుపై అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆరోపించింది. కఠినంగా శిక్షించాలి ఆ యువకులను తక్షణం అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్న ఎస్ఐ మధుసూదనరావును సస్పెండ్ చేయాలని ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు సూర్యప్రభ డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం చేయాలన్నారు. సమాచారం తెలుసుకున్న ఐద్వా సభ్యులు గురువారం విశాఖలో బాధితురాలిని పరామర్శించారు. శుక్రవారం బి.కె.పల్లి గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించి, వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు సూర్యప్రభ మాట్లాడుతూ ఇద్దరు ఆడపిల్లలను బ్లాక్మెయిల్ చేస్తూ వేధించిన పైల గోపి, పైల సునీల్లను తక్షణం అరెస్టు చేసి, విచారించాలన్నారు. హత్యచేసుందుకు యత్నించిడంతో బాధితురాలు కోలుకోలేని స్థితిలో కేజీహెచ్లో వైద్యం పొందుతోందని చెప్పారు. కేజీహెచ్లో వైద్యం చేస్తే ఆమె పూర్తిగా కోలుకోలేదని, అందువల్ల కార్పొరేట్ ఆస్పత్రిలో వైద్యం అందించాలన్నారు. వైద్యానికి రోజుకు రూ.45 వేలు వరకు ఖర్చు అవుతుందని, 90 రోజుల పాటు వైద్యం అందించాలని, ఇందుకు రూ.90 లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. నిరుపేద కుటుంబం కావడంతో ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరించాలని డిమాండ్ చేశారు. బాధితులకు మద్దతుగా జన విజ్ఞాన వేదిక నక్కపల్లి మండల కన్వీనర్ బి.రాము, సీపీఎం మండల కన్వీనర్ జి.డేవిడ్ నిలిచారు. గ్రామంలో సీపీఎం నాయకులు ఆందోళన చేశారు. దీనిపై ఎస్ఐ మధుసూదనరావును వివరణ కోరగా తాను ఇటీవల కోటవురట్ల ఎస్ఐగా బాధ్యతలు తీసుకున్నానని, మండలంపై తనకు పూర్తి అవగాహన లేదన్నారు. ఓ బాలికకు అన్యాయం జరిగితే నిందితులను కాపాడే నీచమైన వ్యక్తిత్వం తనది కాదన్నారు. బాధితురాలు నోరు విప్పితే అన్ని విషయాలు బయటకు వస్తాయని, నిందితులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తి లేదన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నామని, పైల గోపిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని తెలిపారు. బాధితురాలికి వైద్యం చేస్తున్న డాక్టర్లతో మాట్లాడినట్టు తెలిపారు. -
పని మనిషిపై కన్నేసి.. కత్తితో బెదిరించి
లక్నో : ఇంట్లో పని చేస్తున్న యువతిని కత్తితో బెదిరించి 41ఏళ్ల వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్లోని లక్నోలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. లక్నోలోని మహానగర్కు చెందిన లవ్ శర్మ విగ్యాణ్పురి రెసిడెన్సిలో తండ్రి ఆర్కే శర్మతో కలిసి నివాసముంటున్నాడు. తల్లి రెండేళ్ల క్రితం చనిపోవటంతో ఆ ఇంట్లో 24ఏళ్ల యువతి పని చేస్తోంది. లవ్ శర్మకు పెళ్లి కాకపోవటంతో యువతిని పెళ్లి చేసుకోవాలని అడిగేవాడు. కొన్నిసార్లు ఇంట్లో ఎవరూ లేని సమమంలో ఆమెతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. అతని ప్రవర్తన నచ్చని యువతి పెళ్లిచేసుకోవటానికి నిరాకరించింది. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్న అతడు ఎలాగైనా పగతీర్చుకోవాలని భావించాడు. బుధవారం తండ్రి ఆర్కే శర్మ ఏదో పని నిమిత్తం వేరే ఊరికి వెళ్లగా, లవ్ శర్మ ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. సాయంత్రం ఆ పని మనిషి వంట చేయడానికి వచ్చింది. అవకాశం కోసం ఎదురుచూస్తున్న లవ్ శర్మ ఇదే అదునుగా భావించాడు. ఒంటరిగా ఉన్న యువతిపై లైంగిక దాడికి యత్నించాడు. యువతి ప్రతిఘటించటంతో కత్తితో బెదిరించి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. గొంతుపై కత్తిపెట్టి బెదిరించి, పలుమార్లు ఆమెపై లైంగిక దాడి చేశాడు. గురువారం ఉదయం నిందితుడు గాఢనిద్రలో ఉండగా తప్పించుకున్న యువతి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. నేరం రుజువు కావటంతో లవ్ శర్మను జైలుకు తరలించారు. -
షికాగోలో సెక్స్ రాకెట్
సాక్షి, హైదరాబాద్ : ఆమె ఓ చిన్నస్థాయి సినీ నటి.. ఇటీవలే తాత్కాలిక వీసాపై అమెరికాలోని షికాగో విమానాశ్రయానికి చేరింది.. అక్కడి కస్టమ్స్ అధికారులు ప్రశ్నించగా.. ఓ భారత అసోసియేషన్ నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనేందుకు తన మేనేజర్ సాయంతో వచ్చానని, రెండు వారాలు ఉండి వెళ్లిపో తానని చెప్పింది.. కానీ ఆమెను రప్పించింది వ్యభి చారం చేయించడానికి.. ఏదో కార్యక్రమంలో పాల్గొనడానికంటూ టాలీవుడ్ నుంచి చిన్నస్థాయి సినీతారలను అమెరికాకు రప్పించి, భారీగా డబ్బు ఎరగా చూపి వ్యభిచారం చేయిస్తున్న కిషన్ మోదుగుమూడి, చంద్ర అనే భారతీయ దంపతులను అక్కడి షికాగో ఫెడరల్ పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. క్రిమినల్ కేసు నమోదు చేసి, అక్కడి జిల్లా కోర్టుకు 42 పేజీలతో కూడిన దర్యాప్తు నివేదికను సమర్పించారు. కిషన్ మోదుగుమూడి పలు తెలుగు చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరించడం గమనార్హం. ఈ వ్యవహారంపై అక్కడి ‘షికాగో ట్రిబ్యూన్’ మీడియా సంస్థ పూర్తి వివరాలతో కథనం ప్రచురించడం సంచలనం సృష్టిస్తోంది. షికాగో ట్రిబ్యూన్ కథనం ప్రకారం.. తాత్కాలిక వీసాలపై రప్పించి.. భారతీయ అసోసియేషన్ల కార్యక్రమాల్లో పాల్గొనడానికంటూ కిషన్ దంపతులు కొందరు చిన్నస్థాయి సినీ తారలను అమెరికాకు రప్పించి, వ్యభిచార రాకెట్ను నిర్వహిస్తున్నారు. అవకాశాలు పెద్దగా లేని, ద్వితీయస్థాయి నటీమణులకు భారీగా డబ్బు ఎరగా చూపి ఈ రొంపిలోకి దింపుతున్నారు. హీరోయిన్లు అనగానే అమెరికాలో ఉన్న భారతీయులకు ఉండే ‘మక్కువ’ను సొమ్ము చేసుకుంటున్నారు. ఇలాగే ఇటీవల ఓ నటిని అమెరికాకు రప్పించినప్పుడు సందేహం వచ్చిన ఫెడరల్ పోలీసులు కూపీ లాగారు. దీంతో షికాగో నగరంలో వెస్ట్బెల్డెన్ అవెన్యూ ప్రాంతంలోని 5700 నంబర్ అపార్ట్మెంట్లో కిషన్ దంపతులు నిర్వహిస్తున్న వ్యభిచార రాకెట్ గుట్టు రట్టయింది. దీనిపై దర్యాప్తు చేసిన ఫెడరల్ పోలీసులు.. వారిని అరెస్టు చేశారు. నటీమణులకు డబ్బులు ఎరవేసి ఆ అపార్ట్మెంట్లో హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్నారని.. ఈ వ్యవహారంలో బాలికలు, మహిళల అక్రమ రవాణా అంశాలూ ఇమిడి ఉన్నాయంటూ కోర్టులో అభియోగాలు దాఖలు చేశారు. చంపుతామని బెదిరించి.. అవకాశాలు రాని చిన్న నటీమణులు, హీరోయిన్లకు కిషన్ దంపతులు డబ్బు ఎరవేసి వ్యభిచారంలోకి దింపుతున్నారని... తర్వాత వారిని బెదిరిస్తున్నారని ఫెడరల్ పోలీసులు కోర్టుకిచ్చిన నివేదికలో పేర్కొన్నారు. ఈ విధంగా ఓ నటిని లోబర్చుకున్నారని, తమ గురించి బయటపెడితే కీడు తలపెడతామంటూ హెచ్చరించారని తెలిపారు. కిషన్ భార్య చంద్ర ఈ వ్యభిచార కార్యకలాపాల వివరాలను, ఎవరెవరితో ‘వ్యాపారం’చేశారు, ఎంత సొమ్ము వచ్చింది.. వంటివాటిని రాసిపెట్టుకుందని వెల్లడించారు. కిషన్ అపార్ట్మెంట్లో జరిపిన సోదాల్లో జిప్లాక్ కవర్లలో ఉంచిన 70కి పైగా కండోమ్లు లభించాయని వివరించారు. ఈ–మెయిళ్లు.. ఫోన్లలో బేరాలు కిషన్ దంపతులు అటు బాధితులు, ఇటు విటులతో ఈ–మెయిళ్లలో, ఫోన్లలో సంప్రదింపులు జరిపారని.. కిషన్ భార్య చంద్ర నేరుగా విటులతో ఫోన్లో మాట్లాడేదని ఫెడరల్ పోలీసులు పేర్కొన్నారు. ఆమె ఫోన్ను పరిశీలించిన విచారణ అధికారులు.. ఆమె విటులతో జరిపిన ఎస్సెమ్మెస్ సంప్రదింపులను గుర్తించారు. ‘ఏ నటి అందుబాటులో ఉంది, ఎంత చెల్లించాల్సి ఉంటుంది’వంటి వివరాలతోపాటు వ్యభిచారానికి సిద్ధంగా ఉన్న నటి ఫోటోలను కూడా పంపింది. ‘ఓ నటి ఫోటోను ఒక క్లయింట్కు పంపగా.. అతను నా కోసమేనా? అంటూ సంతోషం వ్యక్తం చేసినట్టు’గా 2016 డిసెంబర్లో పంపిన మెసేజ్లో ఉంది. ఇక ‘తాను ఇప్పుడే ఓ క్లయింట్తో వ్యభిచరించానని, అతను చాలా సంతృప్తిగా ఉన్నాడ’ని ఓ బాధితురాలు చంద్రకు పంపిన మెసేజీలు కూడా లభించాయని ఫెడరల్ పోలీసులు పేర్కొన్నారు. కిషన్ దంపతులు అమెరికాలోని భారతీయ సంఘాల సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాల వద్దకు వెళ్లి ఇలాంటి వ్యవహారాలపై ఆసక్తి ఉన్న వారి వివరాలను తెలుసుకునేవారని.. వ్యభిచారం కోసం ఒక్కో విటుడి నుంచి 3 వేల డాలర్ల వరకు వసూలు చేశారని తేలిందని నివేదికలో వెల్లడించారు. ‘ప్లీజ్.. నన్ను ఆ కూపంలోకి లాగొద్దు’ కిషన్ ఈ–మెయిళ్లను పరిశీలించిన షికాగో పోలీసులకు ఓ బాధిత మహిళ పంపిన ఈ–మెయిళ్లు లభించాయి. తనను బెదిరించవద్దని, వ్యభిచారం చేయాలని వేధించవద్దని ఆమె కిషన్కు మెయిళ్లు పంపింది. ‘నాకు ఇలాంటివి చేయాలనిపించడం లేదు. ఇప్పుడుగానీ, భవిష్యత్తులోగానీ నీతో కలసి నేను అలాంటి పనులు చేయలేను. ఇంకోసారి నాతో మాట్లాడాలని ప్రయత్నిస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తా..’’అని ఆమె ఆ మెయిళ్లలో హెచ్చరించింది. భార్యాభర్తలు అరెస్ట్.. రిమాండ్ డబ్బు ఎరవేసి వ్యభిచారం చేయించిన అంశంపై కిషన్ దంపతులను అమెరికా ఫెడరల్ పోలీసులు ఏప్రిల్ చివరి వారంలోనే అరెస్టు చేశారు. కోర్టు వారిని రిమాండ్కు పంపింది. అప్పటి నుంచి వారు జైల్లోనే ఉన్నారు. వారి ఇద్దరు పిల్లలను వర్జీనియాలోని శిశు సంక్షేమ అధికారుల సంరక్షణలో ఉంచారు. కిషన్ దంపతులకు బెయిల్ ఇచ్చేందుకు అమెరికా కోర్టు తిరస్కరించింది. వాస్తవానికి అమెరికాలో వ్యభిచారం చట్టవిరుద్ధమేమీ కాదని.. అయితే ఈ వ్యవహారంలో పిల్లలు ఉన్నా, మహిళల అక్రమ రవాణా వంటివి ఉన్నా సీరియస్గా పరిగణిస్తారని నిపుణులు చెబుతున్నారు. షికాగో పోలీసులు కిషన్ దంపతులపై తీవ్రమైన అభియోగాలే నమోదు చేశారని వెల్లడిస్తున్నారు. విచారణకు సహకరించని బాధితులు ఈ కేసు విచారణకు బాధితులు సహకరించడం లేదని అమెరికన్ పోలీసులు చెబుతున్నారు. ఓ బాధితురాలిని విచారించగా.. తాను వ్యభిచారం చేయలేదని, కొంతసేపు వారితో సరదాగా మాట్లాడానని, వారు తన ‘సాయం’కోరారని చెప్పింది. ఇక ఓ విటుడు తాను కిషన్ భార్య చంద్రతో మాట్లాడానని.. నటీమణులతో వ్యభిచరించేందుకు ఎంత ఖర్చవుతుందని మాత్రమే అడిగానని, అంతకుమించి ఏమీ లేదని పోలీసులకు వెల్లడించాడు. కానీ అతను షికాగో విమానాశ్రయంలోని ఓ సూట్లో చంద్రను కలసి, ఓ నటితో వ్యభిచరించేందుకు 1,110 డాలర్లు చెల్లించినట్టుగా తేలిందని ఫెడరల్ పోలీసులు కోర్టుకు ఇచ్చిన దర్యాప్తు నివేదికలో వెల్లడించారు. -
మెడికల్ విద్యార్థినికి ప్రొఫెసర్ లైంగిక వేధింపులు
-
విద్యార్థినికి ప్రొఫెసర్ లైంగిక వేధింపులు
సాక్షి, నెల్లూరు: నెల్లూరు మెడికల్ కాలేజీలో లైంగిక వేధింపుల ఉదంతం కలకలం సృష్టించింది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ప్రొఫెసర్ లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఓ విద్యార్థినిని కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న విద్యార్థిని బంధువులు అసభ్యకరరీతిలో ప్రవర్తించిన ప్రొఫెసర్ చంద్రశేఖర్పై గురువారం దాడిచేశారు. ఈ దాడిలో మరో ఇద్దరు లెక్చరర్లకు గాయాలయ్యాయి. సక్రమంగా కళాశాలకు రాకపోవడంతో మందలించినందుకే తనపై సదరు విద్యార్థిని ఆరోపణలు చేసిందని ప్రొఫెసర్ చంద్రశేఖర్ తెలిపారు. ఆయనపై దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టారు. -
యాక్షన్ స్టార్పై రేప్ కేసు..కోర్టు రివ్యూ
లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ యాక్షన్ సూపర్ స్టార్ సిల్వస్టర్ స్టాలోన్(71) పై నమోదైన లైంగిక దాడి కేసును జిల్లా లైంగిక నేరాల దర్యాప్తు బృందం తిరగదోడింది. ఈ మేరకు లాస్ ఏంజిల్స్ జిల్లా కోర్టు కేసును సమీక్షించనుందని కోర్టు ప్రతినిధి బుధవారం ప్రకటించారు. స్టాలోన్ తనపై 1990లో లైంగిక దాడికి పాల్పడ్డాడని ఓ మహిళ గత డిసెంబర్లో కేసు పెట్టింది. 27 ఏళ్ల క్రితం చోటుచేసుకున్న ఈ ఘటనపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. లైంగిక దాడి కేసును కోర్టు సమీక్షించనుందన్న వార్తలపై స్టాలోన్ తరపు ప్రతినిధులు ఇంకా స్పందించలేదు. ఆయన తరపు న్యాయవాది మార్టిన్ సింగర్ గతంలో మాట్లాడుతూ.. ‘డిసెంబరులో స్టాలోన్పై లైంగిక దాడిపై కేసు నమోదైంది. ఫిర్యాదుపై విచారణ చేపట్టామని సాంటా మోనికా పోలీసులు తెలిపారు. ఈ ఫిర్యాదుపై స్టాలోన్ న్యాయ పోరాటం చేస్తార’ని పేర్కొన్నారు. అయితే విచారణలో పురోగతి లేకపోవడంతో కేసు చతికిల పడిందనుకున్న తరుణంలో కేసుపై కోర్టు సమీక్షకు సిద్ధపడడం పట్ల స్టాలోన్ ఎలా స్పందిస్తారో చూడాలి. 1976లో ‘రాకీ’ చిత్రంతో స్టాలోన్ హాలీవుడ్లో యాక్షన్ సూపర్ స్టార్గా ఎదిగిన సంగతి తెలిసిందే. అయితే, లైంగిక దాడులపై గళం విప్పుతూ మొదలైన ‘మీ టూ’ ఉద్యమం స్ఫూర్తితో గత 8 నెలలుగా హాలీవుడ్ రంగంలోని మహిళా ప్రముఖులు స్పందిస్తున్నారు. తమపై జరిగిన లైంగిక దాడులపై కేసులు పెట్టి ప్రతీకారం తీర్చుకుంటున్నారు. ఇప్పటికే నిర్మాత హార్వే విన్స్టన్ లైంగిక దాడిపై ఆరోపణలు ఎదుర్కొంటుండగా, కమెడియన్ బిల్ కాస్బీ 2004లో ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడన్న కారణంగా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. -
ఇకపై వారిని అలా పిలువరాదు
బొమ్మనహళ్లి : సెక్స్ వర్కర్లను ఇక పైన ధమనిత మహిళలు అని పిలవాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ, కన్నడ సంస్కృతి శాఖ మంత్రి జయమాల సూచించారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా మంగళవారం తన శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయా శాఖల పరిధిలో చేపట్టిన అభివృద్ధిపనులు, అమలు తీరు, ప్రగతి తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. మంత్రి మాట్లాడుతూ సెక్స్ వర్కర్లను ఆ పేరుతో పిలు వరాదని, వారిని ధమనిత మహిళ అని పిలిచేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. వెనుకబడిన వర్గాల మహిళల సంక్షేమానికి అమలు చేసే పథకాలు లబ్ధిదా రుల దరిచేరేలా చూడాలన్నారు. ఆపదల్లో ఉన్న మహిళలను ఆదుకోవడానికి ముందుండాలని అన్నారు. కన్నడ, సంస్కృతి శాఖలో కళాకారులకు పింఛన్ల పంపిణీ, ఇతర సదుపాయాల కల్పనపై కసరత్తు చేస్తామన్నారు. -
నీలి చిత్రాలే.. బాలుడిని ప్రేరేపించాయ్!
వజ్రపుకొత్తూరు : నీలి చిత్రాలే బాలుడిని లైంగికదాడి వైపు నడిపించాయి. సమాజం సిగ్గుపడేలా జరిగిన ఈ సంఘటన వెనుక నీలిచిత్రాల కథ ఉందని తెలియగానే పోలీసులు అవాక్కయ్యారు. లోతుగా విచారణ చేపట్టి నిజాలు నిగ్గు తేల్చారు. వజ్రపుకొత్తూరు మండలంలో బెండి గ్రామంలో రెండేళ్ల బాలికపై 13 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడిన కేసులో వజ్రపుకొత్తూరు పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేశారు. పలాసలో మొబైల్ షాపు నిర్వహకుడు సాయి ప్రకాష్, బెండి గ్రామానికి చెందిన గొర్రెల కాపరి కె.మల్లేసును వజ్రపుకొత్తూరు పోలీసులు అదుపులోకి తీసుకుని శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. నీలి చిత్రాలను బాలుడికి చూపించడం వల్లే అత్యాచారం జరిగినట్టు పోలీసులు నిగ్గు తేల్చారు. వజ్రపుకొత్తూరు ఎస్ఐ కేవీ సురేష్ చెప్పిన కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గొర్రెల కాపరి మల్లేసు తన మొబైల్లో ఉన్న అశ్లీల చిత్రాలను బాలుడుకు ప్రతి రోజూ చూపించడంతో ఆ బాలుడు అశీల చిత్రాల్లో ఉన్న విధంగా తాను కూడా ఎవరికైనా అలా చేయాలని భావించుకుని చిన్నారిపై అఘాయిత్యానికి ఒడిగట్టినట్టు విచారణలో తేలిందని చెప్పారు. గొర్రెల కాపరి సెల్ ఫోన్లోకి నీలి చిత్రాలు అప్లోడ్ చేసి, బాలుడుని నీలి చిత్రాల వైపు మళ్లించినందుకు మొబైల్ షాపు నిర్వహకుడు సాయి ప్రకాష్ను సైతం విచారించామని, విషయాలు రుజువు కావడంతో ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండ్కు పంపించామని ఎస్ఐ తెలిపారు. ఇదే విషయాన్ని కాశీబుగ్గ పోలీసు స్టేషన్లో డీఎస్పీ బర్ల ప్రసాదరావు తెలిపారు. బాలుడితో పాటు గొర్రెల కాపరి, సెల్ షాపు యజమానిని అరెస్టు చేసి పాతపట్నం సబ్ జైలుకు తరలించామన్నారు. -
ఆటగాళ్ల దగ్గరకు వేశ్యలు...
మెక్సికో సిటీ: మరికొద్ది రోజుల్లో ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుండగా, సెక్స్ స్కాండల్ మెక్సికో జట్టును కుదిపేసింది. రష్యాకు బయలుదేరే ముందు ఆటగాళ్ల దగ్గరకి వేశ్యలను పంపిన విషయం వెలుగులోకి రావటంతో మెక్సికో ఫుట్బాల్ అసోషియేషన్(ఎంఎఫ్ఏ)పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మెక్సికోకు చెందిన టీవీ నోటాస్ మాగ్జైన్ కథనం ప్రకారం.. గత శనివారం అజ్టెక్ స్టేడియంలో స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్లో మెక్సికో జట్టు విజయం సాధించింది. అనంతరం 9 మంది ఆటగాళ్లను ఓ ప్రైవేట్ రిసార్ట్స్కు తరలించి, సుమారు 30 మంది వేశ్యలను వారి వద్దకు అధికారులు పంపారు. ‘ఆటగాళ్లకు అద్భుతమైన ఫేర్వెల్’ అంటూ సదరు మాగ్జైన్ ఫోటోలతో సహా ఓ కథనం ప్రచురించింది. దీంతో ఎంఎఫ్ఏపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయితే మెక్సికన్ అధికారులు మాత్రం ఈ అంశాన్ని వివాదాస్పదం చేయటం సరికాదంటున్నారు. ‘వారు ప్రాక్టీస్కు క్రమం తప్పకుండా హాజరయ్యారు. ఫ్రీ టైమ్లోనే ఏకాంతంగా గడిపారు. రిప్రెష్మెంట్ కోసమే ఈ పని చేశాం. కాబట్టి వారిపై ఎలాంటి చర్యలు ఉండబోవు’ అని మెక్సికన్ ఫుట్బాల్ ఫెడరేషన్ చీఫ్ ప్రకటించింది. గతంలో(సెప్టెంబర్ 2010) ఆటగాళ్లు ఇదే రీతిలో అమ్మాయిలతో గడపగా.. క్రమశిక్షణ నియమావళి కింద ఇద్దరు ఆటగాళ్లు తాత్కాలిక నిషేధం ఎదుర్కున్నారు. -
ఒకే అర్హత ఉంది, కానీ వేతనం మాత్రం...
మహిళలకు పనిప్రదేశాల్లో సమప్రాధాన్యం ఇవ్వాలి. మహిళలు, పురుషులు ఒకే అర్హతతో ఉంటే, ఇద్దరికీ సమాన వేతనం ఇవ్వాలి. బోర్డు ఆఫ్ డైరెక్టర్లలో కచ్చితంగా మహిళలుండాలి. ఇవన్నీ ఎన్నో రోజులుగా పనిప్రదేశాల్లో వెల్లువెత్తుతున్న డిమాండ్లు. కానీ మగవారికి, ఏ మాత్రం తీసిపోకుండా మహిళలు చదువుకున్నా.. వారికి తగిన గౌరవమే కాదు, కనీసం తగిన వేతనం కూడా లభించడం లేదు. తాజాగా ప్రభుత్వం వెల్లడించిన సర్వేలో మగవారితో సమానంగా ఒకే విద్యార్హత ఉన్నప్పటికీ, మహిళలు 30 శాతం తక్కువ వేతనమే పొందుతున్నట్టు తెలిసింది. పట్టణ ప్రాంతంలో గ్రాడ్యుయేట్ డిగ్రీలు కలిగి ఉన్న మహిళలు రోజుకు రూ.690.68 పొందుతుంటే, వారి కంటే 30 శాతం అధికంగా మగవారు రూ.902.45 ఆర్జిస్తున్నట్టు తాజా రిపోర్టు వెల్లడించింది. వ్యవసాయరంగంలో కూడా మగవారికి తగ్గస్థాయిలో మహిళలు పనిచేస్తున్నప్పటికీ, వారికి తగిన ప్రాధాన్యం లభించడం లేదని సర్వే తెలిపింది. గ్రామాల్లో చదువుకోని మహిళలు రోజుకు రూ.88.2 వేతనం పొందుతుంటే, వారి కంటే 45 శాతం అధికంగా చదువుకోని మగవారు రూ. 128.52ను ఆర్జిస్తున్నట్టు వెల్లడైంది. అయితే కొన్ని రంగాల్లో మాత్రం మగవారి కంటే అధికంగా మహిళలే సంపాదిస్తున్నట్టు తెలిసింది. గ్రామీణ ప్రాంతంలో నిర్మాణ రంగంలో పనిచేసే మహిళలు రోజుకు రూ.322 ఆర్జిస్తుంటే, వారి కంటే 13 శాతం తక్కువగా మగవారు రూ.279.15 పొందుతున్నట్టు తాజా రిపోర్టు వెల్లడించింది. పట్టణ ప్రాంతంలో రవాణా, స్టోరేజ్ రంగాల్లో కూడా మహిళలే అధికంగా వేతనం పొందుతున్నారట. 15 నుంచి 59 ఏళ్ల మహిళలు, పురుషులుకు చెందిన సగటు రోజువారీ వేతనాలను తీసుకొని గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ ‘మెన్ అండ్ ఉమెన్ ఇన్ 2017’ రిపోర్టును రూపొందించింది. ఈ రిపోర్టులోనే చదువుకోని వారి, చదువుకున్న వారి సంపాదనలను కూడా వెలువరించింది. చదువుకున్న మహిళలు, చదువుకోని మహిళల కంటే 5.8 సార్లు ఎక్కువగా సంపాదిస్తున్నారని రిపోర్టు పేర్కొంది. అలాగే చదువుకున్న మగవారు, చదువుకోని వారికంటే 3.6 సార్లు ఎక్కువగా ఆర్జిస్తున్నారని తెలిపింది. ఆశ్చర్యకరంగా చదువుకున్న తర్వాత కూడా మహిళలకు, పురుషులకు మధ్య వేతన చెల్లింపుల్లో చాలా వ్యత్యాసముంటుందని ఈ రిపోర్టు వెల్లడించింది. గ్రాడ్యుయేట్లు ఉన్నప్పటికీ మగవారి కంటే 24 శాతం తక్కువగా మహిళలు వేతనం పొందుతున్నారని తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఎక్కువ వేతనం చెల్లించే రంగం నిర్మాణ రంగమని పేర్కొంది. మైనింగ్, క్వారింగ్లో మగవారికి ఎక్కువ వేతనాలు ఉంటున్నాయని రిపోర్టు చేసింది. అదే పట్టణ ప్రాంతాలకు వచ్చే సరికి మైనింగ్, క్వారింగ్ రంగాల్లో మగవారు ఎక్కువగా సంపాదిస్తుంటే, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ యుటిలిటీస్లో మహిళలు ఎక్కువ వేతనం పొందుతున్నారని తెలిపింది. -
కామాంధుడి చేతిలో 6 గంటలు నరకం
సాక్షి, న్యూఢిల్లీ: పదుల సంఖ్యలో లైంగిక వేధింపుల కేసులు. జైలుకు వెళ్లటం.. బెయిల్పై రావటం... మళ్లీ అదే తరహా నేరాలకు పాల్పడటం ఆ కామాంధుడికి అలవాటుగా మారిపోయింది. ఈ క్రమంలో ఒంటరిగా ఉంటున్న ఓ యువతిపై ఆ కిరాతకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆరు గంటలపాటు మృగ చేష్టలతో ఆమెకు నరకాన్ని చూపించాడు. దేశ రాజధానిలో జరిగిన ఈ దారుణ ఘటన వివరాల్లోకి వెళ్తే... వసంత్ కుంజ్లోని రంగ్పూరి పహారిలో ఓ యువతి(27) ఒంటరిగా నివసిస్తోంది. మే 29వ తేదీన రాత్రి 10 గంటల సమయంలో ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగొచ్చింది. తాళం తీస్తున్న సమయంలో వెనకాల నుంచి వచ్చి ఓ వ్యక్తి అమాంతం ఆమెను ఇంట్లోకి ఈడ్చుకెళ్లాడు. మంచానికి కట్టేసి ఆమెతో బలవంతగా మందు తాగించి, ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అలా ఆరు గంటలపాటు అతని వికృత క్రీడలు కొనసాగాయి. చివరకు ఉదయం నాలుగు గంటల సమయంలో ఆమె ఫోన్ తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. స్నేహితురాలి సాయంతో వసంత్ కుంజ్ పోలీసులకు యువతి ఫిర్యాదు చేసింది. అయితే ఆమె చెప్పిన ఆనవాళ్లతో పోలీసులు ఓ వ్యక్తి ఫోటోను చూపించారు. ఫోటోలో ఉన్నదే నిందితుడిగా ఆమె అతన్ని గుర్తించటంతో గాలింపు చేపట్టారు. చివరకు నిందితుడైన సందీప్ చౌహాన్ను జూన్1న పోలీసులు అరెస్ట్ చేశారు. సందీప్ నేర చరిత్ర... పశ్చిమ్ విహార్కు చెందిన 38 ఏళ్ల సందీప్ వివాహితుడు. ఓ పాప కూడా ఉంది. గతంలో తైక్వాండో ట్రైనర్గా పని చేసేవాడు. ఏడాదిన్నర క్రితం ఓ యువతిని లైంగికంగా వేధించిన కేసులో మొదటిసారి అరెస్ట్ అయ్యాడు. దాంతో ఉద్యోగం ఊడింది. అప్పటి నుంచి తప్పుడు మార్గంలోనే ప్రయాణిస్తూ వస్తున్నాడు. కంటికి కనిపించిన మహిళలతో అసభ్యంగా ప్రవర్తించటం, వారి వెంటపడి వేధింపులకు గురిచేయటం, దాడి చేసి వాళ్ల దగ్గరి నుంచి గొలుసులు, ఫోన్లు దొంగతనం చేయటం... అలవర్చుకున్నాడు. ఈ క్రమంలో చాలాసార్లు జైలుకు వెళ్లి, బెయిల్పై బయటికొచ్చేవాడు. ఇప్పటిదాకా అతనిపై 30 కేసుల దాకా నమోదయినట్లు తెలుస్తోంది. ‘సందీప్ దాడి చేసిన మహిళలెవరూ అతనికి తెలీదు. అప్పటికప్పుడే వారిని లక్ష్యంగా చేసుకుని వారిపై దాడికి పాల్పడుతుంటాడు. కానీ, అత్యాచారం కేసులో అరెస్ట్ కావటం మాత్రం ఇదే తొలిసారి’ అని వసంత్ కుంజ్ ఎస్సై చెబుతున్నారు. ఇదిలా ఉంటే రెండు నెలల క్రితం తాను ఉండే ప్రాంతంలోనే ఓ మహిళ ఇంటి ముందు సందీప్ వికృత చేష్టలకు పాల్పడిన నేరంలో జైలుపాలయ్యాడు. బెయిల్పై బయటకు వచ్చిన కొద్ది రోజులకే ఇలా అత్యాచారం కేసులో ఇప్పుడు మళ్లీ ఊచలు లెక్కిస్తున్నాడు. పోలీసులేం చేస్తున్నారు?.. కాగా, ఈ ఘటనపై పలు మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వరుసగా నేరాలకు పాల్పడుతున్న వ్యక్తిని కఠినంగా శిక్షించకపోవటం, సమాజంలో తిరుగుతున్న అతనిపై నిఘా వేయకపోవటం ముమ్మాటికీ పోలీసుల నిర్లక్ష్యమేనని విమర్శిస్తున్నారు. శనివారం ఓ ఎన్జీవో ఆధ్వర్యంలో మహిళలు, విద్యార్థినులు పట్టణంలో ర్యాలీ నిర్వహించి, సందీప్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
పసుపు తాడు మెడలో కట్టి..
సంగెం : అభం, శుభం ఎరుగని ఓ మైనర్ బాలికను మభ్యపెట్టి పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వరంగల్ రూరల్జిల్లా సంగెం మండలంలో జరిగిన సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని మొండ్రా యికి చెందిన తొమ్మిదో తరగతి చదివే ఓ బాలికను అదే గ్రామానికి చెందిన తాళ్లపల్లి భరత్(20) అతడి స్నేహితులు బోనగిరి కోటేశ్వర్ అలియాస్ వివేక్, దామెరుప్పుల కపిల్తో కలిసి.. సదరు బాలికకు మాయమాటలు చెప్పి మే 3న వరంగల్ భద్రకాళి గుడికి తీసుకెళ్లాడు. అక్కడ బాలికను పెళ్లి చేసుకుంటున్నానని చెప్పి భరత్ పసుపు తాడును మెడలో కట్టాడు. ఈ తతంగాన్ని భరత్ స్నేహితులు వివేక్, కపిల్.. వారి సెల్ఫోన్లలో వీడియోలు తీశారు. అనంతరం ఇంటికి వచ్చారు. ఆ తర్వాత భరత్ ఆ బాలికను గ్రామ సమీపంలోని పాడుబడిన పాఠశాల గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే ఈ విషయం తెలిసిన వివేక్, కపిల్ కూడా.. సెల్ఫోన్లో ఫొటోలు తీశామని అవి బయట పెడతామని బెదిరించి ఆ బాలికపై లైంగిక దాడికి దిగారు. దీంతో బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు తెలపగా వారు ఎంచేయాలో తెలియక ఆందోళన చెందారు. చివరకు శనివారం సాయంత్రం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితులు భరత్, వివేక్, కపిల్పై నిర్భయ, పోక్సోచట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై దీపక్ తెలిపారు. -
చిన్నారిపై లైంగిక దాడి కేసులో..
ఖమ్మంఅర్బన్ : నగరంలోని కొత్తగూడెంలో మూడు రోజులు క్రితం చిన్నారిపై అదే గ్రామానికి చెందిన ఇద్దరు బాలురు లైంగిక దాడి చేశారు. వారిని గురువారం అరెస్ట్ చేసి జువైనల్ హోంకు తరలించినట్లు ఖమ్మం ఇన్చార్జి ఏసీపీ, వైరా ఏసీపీ ప్రసన్నకుమార్, అర్బన్ సీఐ నాగేంద్రచారి తెలిపారు. గురువారం అర్బన్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఆడపిల్లల తల్లిదండ్రులు ప్రతి ఒక్కరినీ గుడ్డిగా నమ్మవద్దన్నారు. నమ్మినవారే ఇలాంటి దారుణాలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. అందుకు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రస్తుతం సమాజంలో ఇంటర్రెట్ చౌకగా రావడంతో నీలి చిత్రాలను వయస్సుతో సంబంధం లేకుండా చూడటం ఎక్కువగా ఉందన్నారు. వాటిని చూసి చిన్న వయస్సు దగ్గర నుంచి వయోవృద్ధుల వరకు ఇలాంటి తప్పిదాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఇలాంటి ఘాతుకాలకు పాల్పడుతున్న వారిలో ఎక్కువ శాతం ఆ కుటుంబానికి సంబంధించిన బంధువులు, స్నేహితులు, చుట్టుపక్కల వారే ఉంటున్నారని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను... బంధువులైనా సరే, వారి వెంట ఒంటరిగా పంపకూడదని హెచ్చరించారు. పిల్లల ప్రవర్తనపై తల్లితండ్రులు నిరంతరం దృష్టి సారించాలన్నారు. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవని, ఎవరో ఒకరు ఇంట్లో ఉండేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని అన్నారు. సమావేశంలో వన్టౌన్ సీఐ వెంకటనర్సయ్య, త్రీటౌన్ సీఐ వెంకన్నబాబు తదితరులు పాల్గొన్నారు. -
ఎయిరిండియాలో కీచకపర్వం
న్యూఢిల్లీ: ఎయిర్ఇండియాలో ఓ ఉన్నతాధికారి గత ఆరేళ్లుగా లైంగికంగా వేధిస్తున్నారంటూ ఓ ఎయిర్హోస్టెస్ ఏకంగా ప్రధాని మోదీకి, విమానయానమంత్రి సురేశ్కు ఫిర్యాదుచేశారు. ‘ఎయిర్ఇండియాలో ఉన్న ఆ సీనియర్ అధికారి నన్ను లైంగికంగా లోబర్చుకునేందుకు చాలాసార్లు యత్నించాడు. ఇతర మహిళా సిబ్బంది గురించి నాతో అసభ్యంగా మాట్లాడేవాడు. అతనికి లొంగకపోవడంతో నా ప్రమోషన్లు, ప్రయోజనాలను నిలిపివేసి ఆరేళ్లుగా హింసిస్తున్నాడు’ అని మే 25న రాసిన లేఖలో బాధితురాలు పేర్కొంది. మంత్రి ప్రభును కలుసుకునే అవకాశం ఇస్తే సదరు అధికారి పేరును వెల్లడిస్తానని తెలిపింది. గతేడాది ఆగస్టులో ఆ మానవమృగంపై ఎయిరిండియా సీఎండీకి ఫిర్యాదుచేసినా ఎలాంటి ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని ప్రభు ఎయిరిండియా సీఎండీని ఆదేశించారు. విచారణ కమిటీకి ఆదేశించారు. -
ఆన్లైన్ నిర్భయలు
‘నిర్భయ’ ఘటనలు ఇప్పుడు ఆన్లైన్లోనూ మొదలయ్యాయి! గళమెత్తిన మహిళా సోషల్ వర్కర్లపై సామాజిక మాధ్యమాలలో దుర్భాషల లైంగిక దాడి నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. అయితే తమ నోరు నొక్కేయడానికి జరుగుతున్న ఈ దొంగ దాడికి భయపడేది లేదని బాధితులు అంటున్నారు. ఐక్యరాజ్య సమితి ఎప్పుడో గాని ఒక దేశాన్ని అలెర్ట్ చెయ్యదు. ఇప్పుడు చేసింది! ‘రాణా ఆయుబ్ అనే మహిళా జర్నలిస్టు ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని మేము భావిస్తున్నాం. ఆమెకు తక్షణం రక్షణ కల్పించండి’ అని భారతదేశాన్ని అలెర్ట్ చేసింది. ఆన్లైన్లో ఆయుబ్ మీద, మరికొందరు మహిళా సామాజిక కార్యకర్తల మీద ‘హేట్ క్యాంపెయిన్’ అవాంఛనీయమైన స్థాయికి చేరుకుందని.. ఐరాస చేసిన ఈ హెచ్చరిక వల్ల తేటతెల్లం అవుతోంది. రాణా ఆయుబ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్, రిపోర్టర్, రచయిత్రి. ఈ రింగుల జుట్టు అమ్మాయిని మీరిప్పటికే ఎక్కడైనా చూసి ఉండే అవకాశాలే ఎక్కువ. తరచూ టీవీ డిబేట్లలో కనిపిస్తుంటారు. సమాజిక సమస్యలపై సోషల్ సైట్లలోనూ చాలా బలంగా వాదిస్తుంటారు. అయితే కొంతకాలంగా రాణాకు ట్విట్టర్లో అసభ్యకరంగా బెదిరింపులు వస్తున్నాయి. ‘రేప్ చెయ్యడానికి నీ శరీరం అన్ని విధాలా అనువైనది, అర్హతగలదీ’ అని ఇటీవల కూడా ఆన్లైన్లో ఆమె ఆత్మాభిమానాన్ని కించపరుస్తూ ఒక పోస్టు ప్రత్యక్షం అయింది! అదొక్కటే కాదు, సోషల్ మీడియాలో ఆమె పేరుతో ఫేక్ అకౌంట్లు, ఫేక్ పోస్టులు పెడుతున్నారు. ఈమధ్య రాణా పేరుతో ఒక ఫేక్ పోస్ట్ వైరల్ అయింది. చిన్నపిల్లలపై అత్యాచారం చేస్తున్న రేపిస్టులకు ఉరిశిక్ష విధించడాన్ని ఆమె వ్యతిరేకిస్తున్నట్టుగా ఆ ఫేక్ పోస్టులో ఉంది! రాణా విస్తుపోయారు. దీనిపై ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ రాణా ఆయుబ్ గౌరవ మర్యాదలపై ఆన్లైన్లో జరుగుతున్న అఘాయిత్యాలు ఆగడం లేదు. ఆమె పేరుతో, ఆమె ఫొటోతో ప్రస్తుతం 14 ఫేక్ అకౌంట్లు ఆన్లైన్లో యాక్టివ్గా ఉన్నాయి! ‘నీ అకౌంట్ని క్లోజ్ చేసెయ్’ కిరుబ మునుసామి సుప్రీంకోర్టు న్యాయవాది. రాణా ఆయుబ్ మీద జరుగుతున్నట్లే ప్రస్తుతం ఈమె మీద కూడా ఆన్లైన్లో లైంగిక దాడి జరుగుతోంది. దళితులకు మద్ధతుగా ఆమె తన అభిప్రాయాన్ని గానీ, తన ఫొటోను గానీ పోస్ట్ చేసినప్పుడు ఈ దాడి మరింత ఎక్కువవడం ఆమె గమనించారు. తనపై లైంగికంగా ఒత్తిడి తెచ్చిన ఒక పర్యావరణవేత్త గురించి ఆన్లైన్లో ఆమె బహిర్గతం చేసినప్పటి నుంచీ ఆమె తన సహ న్యాయవాదుల సానుభూతిని కూడా కోల్పోయారు! ‘ఎందుకు అవన్నీ బయటపెట్టుకోవడం. నీ అకౌంట్ని క్లోజ్ చేసేయ్’ మని ఆమెపై వారు ఒత్తిడి తెచ్చారు. అంతేకాదు, ఆమె ప్రమేయం లేకుండానే ఫేస్బుక్లో ఆమెపై వచ్చిన కొన్ని కామెంట్లు డిలీట్ అయ్యాయి. అంటే ఫిర్యాదు చేయడానికి అవసరమైన సాక్ష్యాధారాలను నిర్మూలించడం! ‘పొగరు అణిచే వరకు నువ్వింతే’ వీళ్లిద్దరి లాగే షీలా రషీద్, స్వరాభాస్కర్ ఆన్లైన్ అత్యాచారాలకు గురవుతున్నవారు. బయటి ప్రసంగాలలో, ఆన్లైన్ పోస్టులలో సామాజిక అంశాలపై షీలా, స్వరా వ్యక్తం చేసే అభిప్రాయాలు ఆలోచన రేకెత్తించి, తక్షణ ప్రేరకాల్లా పనిచేస్తుంటాయి. షీలా పీహెచ్డీ విద్యార్థిని. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నాయకురాలు. తరచూ ఆమె మానవహక్కుల ఉల్లంఘనపై తిరుగుబాటు గళాన్ని వినిపిస్తూ ఉంటారు. ఆ గళానికి ప్రతిగళంగా ఆన్లైన్లో అంతే తరచుగా ఆమెపై దాడి జరుగుతుంటుంది. ‘నీ పొగరు అణిచే వరకు నువ్వింతే’ అనే అర్థంలో ఇటీవల కూడా ఆమెపై కొందరు సోషల్ మీడియాలో లైంగిక దాడి చేశారు. ‘ఆ రోజు ఎంతో దూరంలో లేదు’ స్వరాభాస్కర్ బాలీవుడ్ నటి. అవార్డు విజేత కూడా. పని చేస్తున్న చోట మహిళలపై జరిగే వేధింపుల గురించి, క్యాస్టింగ్ కౌచ్ గురించీ, పెద్ద హీరోల చెత్త సినిమాలు, చెత్త డైలాగుల గురించి స్వరా నిర్భయంగా తన అభిప్రాయాలను బయటపెడుతుంటారు. తన అనుభవాలను సామాజిక అంశాల చర్చావేదికలపై పంచుకుంటూ ఉంటారు. సోషల్ సైట్లలో పోస్టులు పెడుతుంటారు. ఇవి నచ్చని వారు స్వరాపై ఆన్లైన్లో నిరంతరం ఏదో ఒక విధమైన మానసిక హింసకు పాల్పడుతూనే ఉన్నారు. సర్వసాధారణంగా ఆమెపై జరుగుతుండే హింస.. ‘నిన్ను రేప్ చేసే రోజు ఎంతో దూరంలో లేదు’ అనే కామెంట్. టార్చర్కు పరాకాష్ట ‘డాక్సింగ్’ షీలా, స్వరా ఇలాంటి కామెంట్లను లెక్క చెయ్యరు కానీ, వీటిని నిరోధించే యంత్రాంగం ఉంటే బాగుంటుందని భావిస్తున్నారు. వీళ్లపై ఆన్లైన్లో ‘డాక్సింగ్’ కూడా జరిగింది. డాక్సింగ్ అంటే.. వీళ్ల వ్యక్తిగతమైన వివరాలను డాక్యుమెంట్లతో సహా సంపాదించి వాటిని అప్లోడ్ చెయ్యడం. డాక్సింగ్ సాధారణంగా కులం గురించి, డేటాఫ్ బర్త్ అండ్ ప్లేస్ గురించి; స్నేహితులు సన్నిహితుల గురించి జరుగుతుంటుంది. ఒక విధమైన ‘రహస్యఛేదన’ లాంటిది డాక్సింగ్. కొన్నిసార్లు డాక్సింగ్æ వల్ల వ్యక్తిగత ప్రతిష్ట దారుణంగా దెబ్బతింటుంది. మహిళలపై జరిగే ఆన్లైన్ టార్చర్కు ఇది పరాకాష్ట. ఫిర్యాదు చేసే చోటా వివక్షే!! స్త్రీద్వేషంతో, స్త్రీలపై చులకన భావంతో ఆన్లైన్లో స్త్రీలపై జరుగుతున్న వర్చువల్ లైంగిక అకృత్యాలపై ఏప్రిల్ 24న ఢిల్లీలో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ (ఇండియా) ఒక సదస్సును నిర్వహించింది. ఆ సందర్భంగా ఆమ్నెస్టీ ప్రతినిధులు ఆన్లైన్లో చురుగ్గా ఉండి, ఆన్లైన్ హింసను ఎదుర్కొంటున్న మహిళల్ని ఇంటర్వ్యూ చేశారు. ఆ సదస్సుకు రాణా ఆయుబ్, కిరుబ మునుసామి వంటి ప్రముఖ మహిళలూ హాజరై తమ అనుభవాలను వెల్లడించారు. ఆన్లైన్ వేధింపులను అరికట్టే చట్టాలు ఇండియాలో ఉండడానికైతే ఉన్నాయి. కానీ అవి సరిగ్గా అమలవడం లేదు. ఎవరైనా ఫిర్యాదు చేయడానికి వెళ్లినప్పుడు.. ‘అసలు ఆన్లైన్ జోలికి ఎందుకు వెళ్లారు?’ అన్నట్లుగా చూస్తున్నారని ఈ సదస్సులో కొందరు చెప్పడాన్ని బట్టి అణువణువునా లైంగిక వివక్ష వేళ్లూనుకుని ఉన్న చోట అన్యాయాన్ని పెకిలించడం సాధ్యమేనా అనిపిస్తుంది. కిరుబ, షీలా, స్వరాలాంటి యువ మహిళా పోరాట యోధులు మాత్రం.. ‘చూద్దాం.. ఎందుకు సాధ్యం కాదో’ అంటున్నారు. ‘ఆడదానివి ఆడదానిలా ఉండు’ గత ఏడాది ‘ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్’ యు.కె., యు.ఎస్., సహా ఎనిమిది దేశాలలోని (వాటిల్లో ఇండియా లేదు) నాలుగు వేల మంది మహిళల్ని సర్వే చేసి దాదాపు 76 శాతం మంది మహిళలు.. సామాన్యులైనా, సుప్రసిద్ధులైనా.. ఆన్లైన్ టార్చర్కు గురవుతున్నట్లు వెల్లడించింది. అయితే ఆ దేశాలకు భిన్నంగా ఇండియాలో ఏమీ లేదని సీపీఐ (ఎంఎల్) పొలిట్ బ్యూరో సభ్యురాలు, అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం కార్యదర్శి కవితా కృష్ణన్ అంటున్నారు. కవిత కూడా ఆన్లైన్లో అత్యాచార బెదిరింపులను ఎదుర్కొన్నవారే! ‘ఆడదానివి. ఆడదానిలా ఉండు’ అనేది ఆమెకు వచ్చిన స్త్రీద్వేష పోస్టులలో ఒకటి. అంతకంటే ఘోరమైన దాడి కూడా కవితపై జరిగింది. ప్రధాని ‘పటుత్వాన్ని’ ఆమె ప్రశ్నించినట్లు ఆన్లైన్లో వచ్చిన ఒక ఫేక్ పోస్టును చూసి దిగ్భ్రాంతికి లోనైన కవిత అభిమానులు ‘మీ శీల ప్రతిష్టను దిగజార్చే విధంగా ప్రచారం జరుగుతోంది. జాగ్రత్త పడండి’ అని ఆవేదన చెందారు. -
‘ఏపీ కబడ్డీ అసోసియేషన్ను రద్దు చేయండి’
విజయవాడ: ఏపీ కబడ్డీ అసోసియేషన్ను రద్దు చేయాలని వెటరన్ కబడ్డీ క్రీడాకారులు డిమాండ్ చేస్తున్నారు. కబడ్డీ అసోసియేషన్లో వెలుగు చూసిన ఆరోపణలు తమను తీవ్రంగా బాధించాయని పేర్కొన్న వారు.. ప్రధానంగా తమకు అన్యాయం జరిగిందని, వేధిస్తున్నారని ఆడపిల్లలు బయటకొచ్చి చెప్పడం తీవ్రంగా కలచివేసిందన్నారు. ఇంత జరుగుతున్నా కబడ్డీ అసోసియేషన్ పెద్దలు స్పందించకపోవడం విచారకరమన్నారు. ఇందుకు ఏపీ కబడ్డీ అసోసియేషన్ను రద్దు చేయడమే ఉత్తమమైన మార్గమని వారు సూచించారు. ఈ మేరకు నగరంలోని రైల్వే ఇనిస్టిట్యూట్ ఆడిటోరియంలో సమావేశమైన వెటరన్ కబడ్డీ క్రీడాకారులు.. క్రీడాకారిణుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడటాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. దీనిలో భాగంగా ఏపీ కబడ్డీ సంఘం కార్యదర్శి వీరలంకయ్యను తిరిగి కార్యదర్శిగా నియమించడాన్ని వారు తప్పుబట్టారు. దీనిపై కృష్ణా జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్షుడు కేఈ ప్రభాకర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. బాధితులకు అండగా ఉన్న శ్రీకాంత్ను జిల్లా అసోసియేషన్ను తొలగించిన పెద్దలు.. వీర లంకయ్యపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. కనీసం క్రీడాకారుల ఆరోపణలపై కమిటీని కూడా వేయకుండా వీర లంకయ్యను వెనుకేసుకొస్తున్నారన్నారు. ఏపీ కార్యదర్శి హోదాలో వీర లంకయ్య అనేక అక్రమాలకు పాల్పడటం వాస్తవమన్నారు. జిల్లా అసోసియేషన్ ను రద్దు చేసిన పెద్దలు.. ఏపీ అసోసియేషన్ ను ఎందుకు రద్దు చేయలేదన్నారు. అధికారం, డబ్బు ఉంటే ఏదైనా చేయవచ్చని చెప్పేందుకు ఈ ఘటనే ఉదాహరణ అని వారు పేర్కొన్నారు. ఎంతో మంది ఆడపిల్లలు రోడ్డెక్కి ఆవేదన చెప్పినా .. పట్టించుకోకుండా నిందితుడిగా ఉన్న వ్యక్తికి అండగా నిలవడం బాధాకరమన్నారు. ఇలా అయితే ఆడపిల్లలు క్రీడల్లోకి పంపేందుకు తల్లిదండ్రులు భయపడిపోతారన్నారు. ఏపీ కబడ్డీ అసోసియేషన్ ను పూర్తిగా రద్దు చేసి .. క్రీడాకారులకు న్యాయం చేయాలని వెటరన్ క్రీడాకారుల హోదాలో సీఎం చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. క్రీడా సంఘంలో సీనియర్ క్రీడాకారులు ఉండేలా చూస్తే భవిష్యత్ తరాలకు మేలు జరుగుతుందన్నారు. -
అతనుగా మారబోతున్న మహిళా కానిస్టేబుల్!
ఇతని పేరు లలితా సాల్వే. వయస్సు 28 ఏళ్లు. మహారాష్ట్రలోని బీడ్ జిల్లా రాజేగావ్కు చెందిన వాడు. 2010 నుంచి కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. ఇందులో విశేషం ఏముంది అంటే.. అసలు విషయమంతా అక్కడే ఉంది. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన ఘనత ఇతనిదే. ఇంతకీ అతను ఏం చేశాడు? ఎందుకు అతని విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం తల పట్టుకుంది? ఫొటో చూస్తే తెలుస్తోంది కదా లలితా సాల్వే పురుషుడని.. కానీ అక్కడే మిస్టరీ ఉంది. నిజానికి అతను పురుషుడు కాదు...అక్షరాలా మహిళే! కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరింది కూడా మహిళగానే. అయితే చిన్నప్పటినుంచీ లలితా సాల్వే.. ఆమెనా.. అతడా అన్నది పెద్ద కన్ఫ్యూజన్. శరీరమేకాదు.. హావభావాలు, ప్రవర్తన, అంతా డిఫరెంట్. డాక్టర్లకు కూడా పెద్ద పజిల్. చివరికి ఎన్నో టెస్ట్ల తర్వాత వైద్యులు అసలు విషయం తేల్చేశారు. లలితా సాల్వేలో స్త్రీ లక్షణాల కంటే పురుష లక్షణాలే ఎక్కువ ఉన్నాయని వెల్లడించారు. పురుషులకు ఉండాల్సిన అంగాలు వున్నప్పటికీ.. అవి సంపూర్ణం కావాలంటే 'సెక్స్ రీ-అసైన్మెంట్ సర్జరీ (ఎస్ఆర్ఎస్)’ చేయాలని తేల్చారు. నిజానికి స్త్రీగా కంటే పురుషుడిగా వుండాలనే కోరిక లలితా సాల్వేలో మొదటినుంచీ బలంగా వుండేది. డాక్టర్లు కూడా సర్జరీ చేయించుకుంటే పురుషుడిగా మారిపోవచ్చని గ్యారంటీ ఇచ్చారు. దీంతో సర్జరీ చేయించుకోవడానికి ఒక నెల రోజులు సెలవు కావాలంటూ మహారాష్ట్ర పోలీసు అధికారులకు ఓ దరఖాస్తు పెట్టుకుంది. అప్పటిదాకా తమ కానిస్టేబుల్ మహిళ అనుకున్న పోలీసులకు ఒక్కసారి షాక్ తగిలింది. అధికారులు కూడా ఏం చేయాలిరా బాబూ అని తలపట్టుకున్నారు. కుదరదంటూ ఆమెకు తేల్చిచెప్పారు. ఇక లాభం లేదనుకున్న లలిత ఏకంగా ముంబై హైకోర్టు మెట్లు ఎక్కింది. తాము తేల్చలేమని నేరుగా రాష్ట్ర పరిపాలనా ట్రిబ్యునల్ను ఆశ్రయించాలని హైకోర్టు సలహా ఇచ్చింది. విషయం కాస్తా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ దాకా వెళ్లింది. ఒకవైపు లలితకు మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో ఒత్తిడి పెరగడంతో ఆయన చివరికి ఓకే చెప్పేశారు. లలిత విషయంలో పాజిటివ్గా స్పందించాలంటూ హోంశాఖను ఆదేశించారు. అలా..అలా చివరికి పురుషుడుగా మారేందుకు లలితకు లైన్ క్లియర్ అయింది. సెలవు మంజూరైంది. ఇప్పుడు లలిత ఎంతో హ్యాపీ. ఒకటి రెండు రోజుల్లో జేజే ఆస్పత్రిలో ఆమె సర్జరీ చేయించుకోబోతున్నారు. ఆమె నుంచి అతడిలా ఈ కథ ఇలా సుఖాంతమవుతోంది. -
ఆమె అతడు
-
21 ఏళ్ల క్రితం ఇక్కడే నన్ను చెరబట్టాడు
పారిస్: హాలీవుడ్ మూవీ మొఘల్ హార్వీ వెయిన్స్టీన్ లైంగిక వేధింపుల వ్యవహారం యావత్ సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ కామాంధుడి వ్యవహారం వెలుగులోకి రావటానికి ప్రధాన కారణమైన వ్యక్తుల్లో ఒకరు ఇటాలియన్ నటి ఏసియా అర్గెంటో. 1997లో కేన్స్ చలనచిత్రోత్సవానికి హాజరైన తనపై వెయిన్స్టీన్ అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె అప్పట్లో ఆరోపించారు. తద్వారానే మరికొందరు సెలబ్రిటీలు ముందుకు రావటంతో ఆయన లీలలు బయటపడ్డాయి. అయితే తనపై జరిగిన దారుణంపై అర్గెంటో ప్రస్తుతం జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికగా స్పందించారు. భయానక అనుభవం... ‘సరిగ్గా 21 ఏళ్ల క్రితం. అప్పుడు నా వయసు 21 ఏళ్లు. ఇదే కేన్స్ వేడుకల్లో పాల్గొన్న నాపై వెయిన్స్టీన్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మహిళలను జీవితాలను నాశనం అతనికి కేన్స్ ఓ వేదికగా ఉండేది. అప్పట్లో నేను నటించిన ఓ చిత్రానికి వెయిన్స్టీన్ డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరించాడు. అందుకే చిత్ర యూనిట్ మొత్తానికి ఓ పెద్ద హోటల్లో పార్టీ ఇస్తానంటూ ఆహ్వానించాడు. తీరా నేను అక్కడికి వెళ్లే సరికి పార్టీ వాతావరణం లేదు. హోటల్ గదిలో వెయిన్స్టీన్ ఒక్కడే ఉన్నాడు. తిరిగి నేను బయలుదేరుతున్న సమయంలో మసాజ్ చేయాలంటూ నన్ను బతిమిలాడాడు. నన్ను దగ్గరికి లాక్కుని మృగంలా ప్రవర్తించాడు. భయంతో వణికిపోయా. నన్ను చిత్రవధలకు గురిచేస్తూ అత్యాచారం చేశాడు’ అంటూ జరిగిన విషయం మొత్తం పూసగుచ్చినట్లు ఆమె వివరించారు. ‘నాలాగే చాలా మంది బాధితులు ఉంటారని అప్పుడే భావించా. అందుకే ఆయన విషయాలను వెలుగులోకి తెచ్చా. కానీ, ఇప్పుడు ఒక్కటే చెప్పదల్చుకుంటున్నా. ఆ రాక్షసుడు ఇకపై ఇక్కడ కనిపించడు. అది నాకు సంతోషాన్ని ఇస్తోంది. అవకాశాల కోసం జీవితాలను నాశనం చేసుకోకండి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి’ అని ఆమె ప్రసంగించారు. అర్గెంటో భావోద్వేగ ప్రసంగంపై పలువురు సెలబ్రిటీలు అభినందనలు వ్యక్తం చేశారు. చాలా ధైర్యంగా మాట్లాడారంటూ ఆమెపై ప్రశంసలు గుప్పిస్తున్నారు. అయితే అదే సమయంలో అభ్యంతరం వ్యక్తం చేసిన వాళ్లు లేకపోలేదు. అంతర్జాతీయ వేదికపై ఆ విషయాన్ని అంత వివరంగా ప్రస్తావించాల్సిన అవసరం ఏంటని? కొందరు ప్రశించగా, త్వరలో తాజాగా ఆమె ఓ చిత్రాన్ని డైరెక్ట్ చేశారని.. దాని ప్రమోషన్ కోసం ఆమె ఇలా ప్రసంగం ఉంటారని మరికొందరు విమర్శిస్తున్నారు. నిర్మాత కమ్ దర్శకుడు అయిన వెయిన్స్టీన్ గురించి సుమారు 50 మంది నటీమణులు ఆరోపణలు గుప్పించగా, ఆ దెబ్బకు సొంత నిర్మాణ సంస్థ ‘ది వెయిన్స్టెయిన్’తోపాటు కీలక పదవులకు ఆయన దూరం కావాల్సి వచ్చింది. -
కృష్ణా జిల్లా కబడ్డీ అసోసియేషన్ రద్దు
సాక్షి, విజయవాడ : విమర్శల నేపథ్యంలో కృష్ణా జిల్లా కబడ్డీ అసోసియేషన్ను స్వచ్చందంగా రద్దు చేసి పదవుల నుంచి తప్పుకుంటున్నట్లు అధ్యక్షుడు కేఈ ప్రభాకర్ తెలిపారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. క్రీడాకారులను లైంగికంగా వేధిస్తున్నారని మీడియాకి చెప్పి అల్లరి చేయడం తగదన్నారు. ఏదైనా సమస్య ఉంటే అంతర్గంత చర్చించుకోవాలన్నారు. వీర్ల లంకయ్యకి, జిల్లా అసోసియేషన్ కార్యదర్శి శ్రీకాంత్కి మధ్య వ్యక్తిగత విభేదాలు ఉన్నాయని, ఈనేపథ్యంలో వారు అసోసియేషన్ను పావుగా వాడుకున్నారని ఆరోపించారు. ఈ వివాదాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుందని, ఈ వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక పంపామన్నారు. అసోసియేషన్ మద్దతు వల్లే క్రీడాకారులు రాణిస్తున్నారని తెలిపారు. -
మనుషులు కాదు మృగాళ్లు
నాయుడుపేటటౌన్: ఆభం శుభం తెలియని చిన్నారులను మానవ మృగాళ్లు చిదిమేస్తున్నారు. వావివరుసలు, వయసు తారతమ్య భేదాలు మరిచి లైంగిక దాడులతో దారుణాలకు తెగబడుతున్నాడు. మండల పరిధిలో రెండు రోజుల్లో రెండు దారుణాలు వెలుగుచూశాయి. నాయుడుపేట మండలంలో ఓ గిరిజన బాలికను అడవుల్లోకి తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. పట్టపగలు పట్టణంలో ఓ ఇంట్లో ఐదేళ్ల చిన్నారిపై వృద్ధుడు కామాంతో కళ్లుముసుకుపోయి లైంగిక దాడి జరిపిన ఘటన శనివారం జరిగింది. నాయుడుపేట పట్టణంలో పడమటి వీధిలో గురుస్వామి ఆచారి అనే 58 ఏళ్ల వ్యక్తి నివాసం ఉంటున్నాడు. శనివారం మధ్యాహ్నం సమయంలో గురుస్వామి ఇంటి ముందు ఆటలాడుకుంటున్న ఐదేళ్ల చిన్నారిని బిస్కెట్లు ఇస్తానని చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నం చేస్తుండగా ఇంట్లోకి వెళ్లిన చిన్నారి నాయనమ్మ ఘటన చూచి కోపోద్రిక్తురాలై పాపను తీసుకుని బటయకు వచ్చి చుట్టు పక్కల వారికి చెప్పింది. దీంతో గురుస్వామిని పట్టుకుని స్థానికులు దేహశుద్ధి చేశారు. ఈ విషయమై చిన్నారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురుస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై ఎస్సై రవినాయక్ ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. గురుస్వామి చేసేది అక్రమ వ్యాపారాలే గురుస్వామి ఆచారి మద్యం షాపుల్లో పనిచేస్తూ అక్రమ వ్యాపారాలు సాగిస్తున్నాడు. పలుమార్లు అక్రమంగా మద్యం విక్రయాలు చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. ప్రస్తుతం అధిక రేట్లకు రేషన్ బియ్యం, కిరోసిన్తో పాటు అర్ధరాత్రి సమయల్లో మద్యం విక్రయాలు జరుపుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. గురుస్వామి భార్య మృతి చెందడంతో ఇంట్లోనే ఆసాంఘిక కార్యక్రమాలు సైతం జరుపుతున్నట్లు చెబుతున్నారు. చిన్నారిపై అఘాయిత్యానికి ఒడిగట్టిన ఇలాంటి మానవ మృగానికి మరణ శిక్ష విధించాలని స్థానికులు కోరుతున్నారు. గిరిజన బాలికపై లైంగిక దాడి నమ్మకంగా ఇంటి వద్ద దింపుతానని మాయమాటలు చెప్పి బైక్పై తీసుకు వెళ్లి గిరిజన బాలికపై లైంగిక దాడి జరిపిన ఘటన ఆలస్యంగా శనివారం వెలుగులోకి వచ్చింది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన 17 ఏళ్ల బాలిక కుటుంబ పోషణ కోసం నాయుడుపేటలోని శ్రీకాళహస్తి బైపాస్రోడ్డులో ఉన్న హెచ్పీ పెట్రోల్ బంక్లో కోద్ది రోజుల క్రితం పనిలోకి చేరింది. ప్రతి రోజు బాలిక విధులు ముగించుకుని సాయంత్రం బస్సులో శ్రీకాళహస్తికి వెళ్తుంది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం విధులు ముగించుకుని శ్రీకాళహస్తికి వెళ్లేందుకు ఆర్టీసీ బస్టాండ్కు వెళ్లింది. అయితే శ్రీకాళహస్తికి వెళ్లే బస్సు వెళ్లిపోవడంతో ఆమెను నాయుడుపేటలో పనిలో చేర్చిన పెళ్లకూరు మండలం మొదుగులపాళెంకు చెందిన మల్లికార్జునకు స్నేహితుడైన అదే మండలం సీఎన్పేటకు చెందిన ఆరూరు పవన్కళ్యాణకు ఫోన్ చేసింది. దీంతో పవన్ కళ్యాణ్ బాలికను మోటారు బైక్లో శ్రీకాళహస్తికి తీసుకు వెళ్లేందుకు పయనమయ్యాడు. అయితే పవన్కాళ్యాణ్ ఆ బాలికను పెళ్లకూరు మండలం శిరసనంబేడు వైపు మోటారు బైక్లో తీసుకెళ్లడంతో నిలదీసింది. అయితే అతడు షార్ట్కట్గా వెళ్లొచ్చునని చెప్పి నమ్మించి నేరుగా శిరసనంబేడు అడవుల్లోకి దౌర్జన్యంగా తీసుకువెళ్లాడు. అప్పటికీ ఆ యువతి ప్రతిఘటించినప్పటికీ ఆమెపై దాడికి పాల్పడి భయపెట్టి అరిస్తే చంపేస్తానని బెదిరించి లైంగిక దాడి చేశాడు. తిరిగి బైక్ తీసుకుని శిరసనంబేడు సమీపంలోని రహదారిపైకి వచ్చే సరికి స్థానికులు గుర్తించి బాలికను రక్షించి నాయుడుపేటలో ఉన్న పెట్రోల్ బంకు వద్దకు తీసుకువచ్చి వదిలారు. ఈ విషయమై బాధిత కుటుంబ సభ్యులు శుక్రవారం రాత్రి స్థానిక పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలికకు శుక్రవారం రాత్రి స్థానిక ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ ఘటనపై సీఐ మల్లికార్జునరావుతో పాటు ఎస్సై రవినాయక్ నిందితుడిపై అత్యాచారంతో పాటు ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
ఇదేనా అండ?
-
రుయాలో కీచక వైద్యులు
తిరుపతి (అలిపిరి): రుయా చిన్నపిల్లల ఆస్పత్రిలో కీచకపర్వం వెలుగుచూసింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులే లైంగిక వేధింపులకు దిగారు. వారి వేధింపులు భరించలేని ఎస్వీ మెడికల్ కళాశాల పీడియాట్రిక్ పీజీ ఫైనలియర్ విద్యార్థిని ఇటీవల గవర్నర్కు ఫిర్యాదు చేసింది. తనకు రక్షణ కల్పించాలంటూ ఈ మెయిల్ ద్వారా మొరపెట్టుకుంది. దీనిపై స్పందించిన గవర్నర్... విచారణ చేపట్టాల్సిందిగా హెల్త్ యూనివర్సిటీ వీసీకి ఆదేశాలు జారీ చేశారు. పీడియాట్రిక్ విభాగాధిపతి డాక్టర్ రవికుమార్, ప్రొఫెసర్ కిరీటి, ప్రొఫెసర్ శశికుమార్లు తన పట్ల అవమానకరంగా ప్రవర్తిస్తున్నారని బాధితురాలు లేఖలో పేర్కొంది. ప్రతిరోజు లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని, అభ్యంతరకర పదాలతో హింసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రాక్టికల్ పరీక్షలు వారి చేతుల్లో ఉన్నాయని వేధిస్తున్నారని ఆరోపించింది. ఓ పాపకు తల్లినైన తాను వారి బాధలు భరించలేక ఓ సారి ఆత్మహత్యకు యత్నించగా, తన భర్త కాపాడినట్లు వివరించింది. పలుమార్లు ఎస్వీ మెడికల్ కళాశాల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయింది. దీనిపై స్పందించిన గవర్నర్... లైంగిక వేధింపులపై విచారణ చేపట్టాలని హెల్త్ వర్సిటీ వీసీని ఆదేశించారు. రుయాఆస్పత్రి అనస్థీషియా విభాగాధిపతి జమున, జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ జయా భాస్కర్, రుయా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధానాయక్లతో విచారణ కమిటీని నియమించారు. ఈ కమిటీ 4 రోజులుగా అత్యంత గోప్యంగా విచారణ చేస్తోంది. -
బాధితులు మాట్లాడాలి
‘ఫిల్మ్ ఇండస్ట్రీలో సెక్సువల్ హెరాస్మెంట్ ఉంది’ అంటూ హాలీవుడ్ నుంచి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీల వరకూ ‘మీటూ’ ఉద్యమ దుమారం లేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ స్పందిస్తూ – ‘‘లైంగిక దాడుల గురించి అందరూ తమ ఒపీనియన్ చెప్పాలి అంటున్నారు. నా ఉద్దేశం ఏంటంటే.. వర్క్ ప్లేస్లో ఇలాంటి హెరాస్మెంట్కి గురైన వారు బయటికొచ్చి నిర్భయంగా మాట్లాడితే ఏదైనా మార్పు వస్తుంది కానీ అందరూ బాధితులు కానివాళ్లు మాట్లాడటం వల్ల ఏ మార్పూ రాదు. ఏ ఉద్యమమైనా బాధితులు బయటకు వచ్చి మాట్లాడగలిగినప్పుడే విజయవంతం అవుతుంది. అలా బయటకు వచ్చిన వారికి మేమంతా అండగా నిలబడొచ్చు’’ అని పేర్కొన్నారాయన. -
దాచేపల్లి హైవేపై ఉద్రిక్త పరిస్థితులు
-
త్రిష సేస్
‘‘బయటికి వెళ్తున్నప్పుడు మీరు ప్రయాణించ బోతున్న రవాణా వాహనాల రద్దీకి అనుగుణంగా మీరు మీ బట్టల్ని ఎంపిక చేసుకుని ధరిస్తారా?’’ అని త్రిషా షెట్టి అడిగినప్పుడు చాలామంది అమ్మాయిలు ‘అవును’ అనే సమాధానం చెప్పారు. అదే ప్రశ్నను ఆమె కొద్దిగా మార్చి, ‘‘మీరు ఆటోలో ప్రయాణిస్తున్నప్పుడు ఎవరైనా మీ కాళ్లను చూస్తారేమోనన్న బిడియంతో మీరు షార్ట్ వేసుకోకుండా ఉంటారా?’’ అని అబ్బాయిలను అడిగినప్పుడు వాళ్లంతా పెద్ద పెట్టున నవ్వారు! అప్పుడే అనిపించింది త్రిషకు.. సమాజంలో ‘లైంగిక సమానత్వం’ కోసం, లైంగిక వేధింపుల నివారణ కోసం ఏదైనా చేయాలి అని. ఆ ఆలోచన నుంచి ఆవిర్భవించిందే ‘షీ సేస్’ ఫౌండేషన్. స్వేచ్ఛ, భద్రత, ఇష్టమైన వస్త్రధారణ అనేవి ఆడపిల్లలకు హక్కులు అవ్వాలే గానీ, పోరాటం కాకూడదని త్రిష అంటారు. త్రిష షెట్టి.. మహిళలకు సంబంధించిన ఏ సమస్యల మీదైనా చాలా చురుకుగా స్పందిస్తారు. ఆమె గళం కూడా అంతే గట్టిగా వినిపిస్తుంది! మొన్నటికి మొన్న జరిగిన ఉన్నావ్, కథువా అత్యాచార ఘాతుకాలనూ అంతే ధైర్యంగా ఎండగట్టింది. టీవీ చానళ్లలో అన్ని పార్టీల ప్రతినిధులను కడిగిపారేసింది. గత యేడాది యూఎన్ ఎంపిక చేసిన పదిహేడు మంది యంగ్ లీడర్స్లో త్రిష షెట్టి కూడా ఒకరు. ముంబై అమ్మాయి త్రిష షెట్టి ముంబైలో పుట్టి, పెరిగారు. చిన్నప్పటి నుంచీ చదువులో ఫస్ట్. లాయర్ కావాలనేది ఆమె లక్ష్యం. ముంబైలోని జైహింద్ కాలేజ్లో పొలిటికల్ సైన్స్, సైకాలజీ ఆప్షనల్స్గా బీఏ పూర్తి చేశారు. ఆ తర్వాత ఆమె అనుకున్నట్టుగా ‘లా’ కూడా చదివారు. లాయర్గా ప్రాక్టీసూ మొదలుపెట్టారు. షీ సేస్ లాయర్గా మంచి పేరు, కీర్తి, డబ్బు వస్తున్న తరుణంలో త్రిషను నిర్భయ çఘటన మార్చేసింది! పేరు ప్రతిష్టల కోసం కాదు.. లైంగిక వేధింపులు, లైంగిక దాడులకు బలైన మహిళల కోసం నిలబడాలని నిర్ణయించుకున్నారు. లైంగిక దాడికి బలైన మహిళలను ఆ గాయం కన్నా కూడా వాళ్లను అర్థం చేసుకోలేని, మళ్లీ వాళ్లను మామూలు మనుషులుగా మార్చలేని సామాజిక పరిస్థితులే ఎక్కువగా బాధిస్తాయని తెలుసుకున్నారు. అందుకే అలాంటి వాళ్లకు నైతిక స్థయిర్యం, న్యాయపరమైన సహాయం అందించే ప్లాట్ఫామ్ ఒకటి ఏర్పాటు చేయాలని నిశ్చయించుకున్నారు. తన సోదరి నేహా షెట్టితో కలిసి ‘షీ సేస్’ అనే ఆన్లైన్ పోర్టల్ను ప్రారంభించారు. మీడియా కన్నా వేగంగా ‘షీ సేస్’ ద్వారా మహిళల్లో చైతన్యం తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు త్రిష. మహిళలకున్న న్యాయపరమైన హక్కులు, వాటిని ఎలా సాధించుకోవచ్చో పోర్టల్లో వివరంగా ఉంటాయి. ‘షీ సేస్’ మొదలైన కొద్ది రోజుల్లోనే ఈ పనిలో తాము సైతం భాగస్వామ్యం అవుతామని వేలమంది వలంటీర్లు చేరారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అందులో 60 వేల మంది పనిచేస్తున్నారు. 2016, డిసెంబర్ 31, బెంగళూరు డార్క్నైట్ సంఘటన (ఆ రోజు రాత్రి ఓ అమ్మాయిని కొంతమంది అబ్బాయిలు నడి రోడ్డు మీద వేధించారు) గుర్తుంది కదా. త్రిషానే ఆ ఘటనను తన పోర్టల్ ద్వారా వెలుగులోకి తెచ్చారు. లింగ వివక్ష మీద ‘షీ సేస్’ పోర్టల్ ద్వారా ఇంకా అన్ని రకాల లింగ వివక్షల మీద త్రిష పోరాడుతున్నారు. లింగ వివక్ష సమసిపోవాలంటే క్షేత్రస్థాయిలో మార్పు రావాలని ఆమె అంటారు. అందుకే ముందుగా కుటుంబాలను విద్యావంతులను చేయాలని అంటారు. స్థిరమైన మార్పే తన లక్ష్యం అని త్రిష చెబుతున్నారు. స్ఫూర్తి ప్రదాతలు అమెరికన్ మహిళా న్యాయమూర్తి రుత్ బేడర్ గిన్స్బర్గ్, ఫ్రెంచి మహిళా న్యాయవాది క్రిస్టీన్ లాగార్డ్ త్రిషకు స్ఫూర్తి. బరాక్ ఒబామా నాయకత్వ లక్షణాలు ఆమెకు ప్రేరణ. మానవ హక్కుల కోసం నిలబడ్డమే ఆమె జీవిత లక్ష్యం. ఒబామాను కలవడం, స్కై డైవింగ్ ఆమె కలలు.వినాలనుకునే మాట.. శానిటరీ నాప్కిన్స్ మీద ట్యాక్స్ ఎత్తేస్తున్నాం! సాకారం కావలసినవి.. షీ సేస్ లాంటి సంస్థల అవసరంలేకుండా పోవాలి. అంటే సమాజంలో అంతగా మార్పు రావాలి. లైంగిక సమానత సాధించాలి. – శరాది -
బోనులో మైనర్లు
అత్యాచార కేసుల్లో మైనర్లు నిందితులుగా ఉన్న కేసులు ఏడాది ఏడాదికి పెరిగిపోతున్నాయి. ఢిల్లీలో నిర్భయ అత్యాచార ఘటనలో ఒక మైనర్ కూడా ఉండడం అప్పట్లో తీవ్ర సంచలనమే కలిగించింది. అప్పట్నుంచి లైంగిక దాడుల కేసుల్లో మైనర్ల ప్రమేయం ఎక్కువైపోయిందని గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. దీంతో అత్యాచారం, హత్య వంటి కేసుల్లో 16–18 వయసు ఉన్న వారు కూడా మేజర్ల కిందకి తీసుకువస్తూ ది జువైనల్ జస్టిస్ చట్టానికి సవరణలు చేశారు. చట్టాలు ఏ పని ఎలా చేస్తున్నా పట్టుమని పదమూడేళ్లు కూడా నిండని వారు అత్యంత హేయమైన నేరాలకు ఎందుకు పాల్పడుతున్నారనే ప్రశ్నలు వేధిస్తున్నాయి. జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్సీఆర్బీ)ప్రకారం అత్యాచారం కేసుల్లో మైనర్లు నిందితులుగా ఉన్న కేసులు 1991–2016 మ«ధ్య 11 రెట్లు ఎక్కువగా నమోదయ్యాయి. 2016 సంవత్సరంలో మైనర్లు నిందితులుగా ఉన్న రేప్ కేసుల్లో ఎక్కువగా మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. రాష్ట్రం మైనర్లు నిందితులుగా ఉన్న అత్యాచారం కేసులు మధ్యప్రదేశ్ 442 (23.2%) మహారాష్ట్ర 258 (13.6%) రాజస్థాన్ 159 (8.4%) ఢిల్లీ 155 (8.1%) ఛత్తీస్గఢ్ 148 (7.8%) ఉత్తరప్రదేశ్ 126 (6.6%) ఒడిశా 122 (6.4%) పశ్చిమ బెంగాల్ 77 (4.0%) హర్యానా 62 (3.3%) తెలంగాణ 54 (2.8%) మైనర్లు ఎన్ని నేరాలు చేశారు, ఎలా చేశారు అన్నదే కాకుండా ఎందుకు చేశారో కూడా తెలుసుకొని వారిలో మార్పు తీసుకురావడానికి కృషి జరగాల్సిన అవసరం ఉందని బాలల హక్కుల్ని పరిరక్షించే ఢిల్లీకి చెందిన స్వచ్ఛంద సంస్థ హెచ్ఎక్యూ కో డైరెక్టర్ గంగూలీ అభిప్రాయపడ్డారు. అందులోనూ 16–18 ఏళ్ల మధ్య వయసు అత్యంత ప్రమాదకరమైనది. శారీరకంగా మార్పులు వస్తాయి కానీ మానసిక పరిపక్వత అంతగా ఉండదు. విచక్షణా జ్ఞానం అసలే కనిపించదు. ఆ వయసులో తల్లిదండ్రుల పర్యవేక్షణ సరిగా లేకపోవడం, చుట్టూ నెలకొని ఉన్న పరిస్థితుల ప్రభావంతో వారు చేస్తున్న నేరాలే అధికంగా ఉంటున్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. నేరం నేరాల సంఖ్య 12 కంటే తక్కువ 12–16 వయసు 16–18 వయసు (నేరం శాతాల్లో) లైంగిక దాడి 1627 0.6 20.2 79.2 అత్యాచారం 2054 1.4 22.6 76.0 అత్యాచార యత్నం 73 2.7 24.7 72.6 అసహజ నేరాలు 218 3.7 42.2 54.1 మహిళల్ని అవమానపరచడం 94 1.1 29.8 69.1 మొత్తం లైంగిక నేరాలు 4066 1.2 22.9 75.9