షాద్‌ నగర్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం | Three Die in a Road Accident At Shadnagar | Sakshi
Sakshi News home page

కారు బోల్తా, ముగ్గురు దుర్మరణం

Published Fri, Oct 11 2019 5:53 PM | Last Updated on Fri, Oct 11 2019 5:57 PM

Three Die in a Road Accident At Shadnagar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రంగారెడ్డి జిల్లా షాద్‌ నగర్‌ సమీపంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు అదుపు తప్పి బోల్తా పడిన దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. వీరంతా స్నేహితుడి సోదరి వివాహానికి వెళ్లేందుకు హైదరాబాద్‌ నుంచి అనంతపురం బయల్దేరారు. అయితే షాద్‌ నగర్‌ టోల్‌గేట్‌ వద్దకు రాగానే ముందు వెళుతున్న మరో కారును ఓవర్‌ టేక్‌ చేసే క్రమంలో మారుతి ఎరిక్టా కారు అదుపు తప్పింది. దీంతో కారు సుమారు 20 ఫీట్ల ఎత్తుకు ఎగిరి పక్కనే ఉన్న పంట పొలాల్లోకి దూసుకు వెళ్లింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement