స్నేహితుడి చెల్లెలి పెళ్లికి వచ్చి.. | two youth dies in bike accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి 

Apr 6 2018 9:22 AM | Updated on Aug 30 2018 4:20 PM

two youth dies in bike accident - Sakshi

మోయిన్‌అలీ, సమీర్‌ మృతదేహాలు 

చిన్నకోడూరు(సిద్దిపేట)/సంగారెడ్డి రూరల్‌: స్నేహితుని చెల్లెలి పెళ్లికి వచ్చిన ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషాదకర సంఘటన మండల పరిధిలోని చంద్లాపూర్‌లో గురువారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సంగారెడ్డి జిల్లా మామిడిపల్లికి చెందిన మహమ్మద్‌ మోయిన్‌అలీ(26) సంగారెడ్డిలలలోని ఓ సబ్‌స్టేషన్‌లో ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు.

తన మిత్రుడైన నంగునూరు మండలం పాలమాకులకు చెందిన విష్ణవర్దన్‌ చంద్లాపూర్‌ సబ్‌స్టేషన్‌లో ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. విష్ణువర్దన్‌ సోదరి వివాహానికి  మోయిన్‌అలీ, డిగ్రీ చదువుతున్న అతని మిత్రుడు సమీర్‌(24)తో కలిసి బైక్‌పై బుధవారం రాత్రి సిద్దిపేటకు వచ్చారు. గురువారం ఉదయం మోయిన్, సమీర్‌లు చంద్లాపూర్‌లోని విష్ణువర్దన్‌ పని చేసే సబ్‌స్టేషన్‌లో స్నానాలు చేసి పెళ్లికి తయారు అయేందుకు బైక్‌పై బయలు దేరారు.

ఈ క్రమంలో రంగనాయక సాగర్‌ కట్ట నిర్మాణ పనుల వద్ద టిప్పర్‌ వీరి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాల పాలైన ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్, రూరల్‌ సీఐ సైదులు, ఎస్‌ఐ అశోక్‌ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు.

ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ అశోక్‌ తెలిపారు.  మృతి చెందిన మోమిన్‌అలీ వివాహం మే 11న జరగాల్సి ఉంది. ఇంతలోనే రోడ్డు ప్రమాదంలో అతను మృతిచెందటంతో అతని స్వగ్రామంలో విషాదఛాయాలు అలుముకున్నాయి.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement