బిర్యానీ తెమ్మంటే తేలేదని.. | Wife Commits Suicide Attempt in Hyderabad | Sakshi
Sakshi News home page

బిర్యానీ తేలేదని భార్య ఆత్మహత్యాయత్నం

Feb 7 2020 10:49 AM | Updated on Feb 7 2020 10:49 AM

Wife Commits Suicide Attempt in Hyderabad - Sakshi

బంజారాహిల్స్‌:  బిర్యానీ తెమ్మంటే తేలేదని భర్తపై అలిగిన మహిళ ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. రహ్మత్‌నగర్‌లో  వెంకటయ్య–పద్మ దంపతులు అద్దెకుంటున్నారు. గత మూడు రోజుల నుంచి పని ముగించుకొని ఇంటికి వచ్చేటప్పుడు బిర్యానీ తేవాలంటూ పద్మ భర్తను కోరుతూ వస్తున్నది. అయితే వెంకటయ్య పెడచెవిన పెట్టాడు. తాను ఎన్నిసార్లు అడిగినా బిర్యానీ తేవడం లేదంటూ అలిగిన పద్మ గురువారం తెల్లవారుజామున ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకుంది. పెద్ద ఎత్తున మంటల్లో చిక్కుకొని అరుస్తున్న భార్యపై నీళ్ళుపోసి మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు వెంకటయ్య యత్నిస్తున్న సమయంలోనే ఆమె 70 శాతం గాయాలతో విలవిల్లాడుతుండగా వెంటనే చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పద్మ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement