మహబూబ్నగర్ జిల్లా కేంద్రం సమీపంలో గురువారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృత్యువాత పడ్డారు.
- ఆరుగురు మృత్యువాత
మహబూబ్నగర్ : మహబూబ్నగర్ జిల్లా కేంద్రం సమీపంలో గురువారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. దేవరకద్ర నుంచి మహబూబ్నగ ర్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలోని 9 మందిలో ఆరుగురు చనిపోయారు. మరో ముగ్గురు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.