కీచక టీచర్ల సస్పెన్షన్
Published Sat, Aug 6 2016 11:10 PM | Last Updated on Mon, Sep 4 2017 8:09 AM
కోరుట్ల: మండలంలోని చినమెట్పల్లి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థినుల వేధించిన ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్, హిందీ ఉపాధ్యాయుడు రాజేశంను డీఈవో శ్రీనివాసాచారి శనివారం సస్పెండ్ చేశారు. కొంత కాలంగా పాఠశాలలో చదువుతున్న 8, 9, 10వ తరగతి విద్యార్థినులతో ఈ ఉపాధ్యాయులు అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు పది రోజుల క్రితం చినమెట్పల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో జగిత్యాల డిప్యూటీ డీఈవో జగన్మోహన్రెడ్డి విచారణ జరిపారు. అనంతరం నివేదికను జిల్లా విద్యాశాఖ అధికారికి అందించారు. నివేదిక ప్రకారం డీఈవో ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Advertisement
Advertisement