Published
Sun, Oct 9 2016 12:54 AM
| Last Updated on Mon, Sep 4 2017 4:40 PM
గంగమ్మ మెరిసె.. గౌరమ్మ మురిసె..
జిల్లాలో సద్దుల బతుకమ్మ సంబురాలు శనివారం అంబరాన్నంటాయి. మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చుకుని చెరువుల వద్దకు తరలివెళ్లారు. గౌరీదేవికి నిర్వహించి ఉయ్యాల పాటలు పాడారు. పిల్లపాపలను చల్లంగా చూసి, ఇళ్లలో సిరులు కురిపించాలని భక్తి శ్రద్ధలతో గౌరమ్మను వేడుకున్నారు. ‘‘మాయమ్మ లక్ష్మీదేవి పోయిరావమ్మా..’’ అంటూ బతుకమ్మను గంగమ్మ ఒడికి ఆనందంగా సాగనంపారు. సద్దుల బతుకమ్మను పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా అధికార యంత్రాంగం చెరువుల వద్ద భారీ ఏర్పాట్లు చేసింది.