హోదా కోసం విద్యార్థుల ప్రతిజ్ఞ | fight for special status | Sakshi
Sakshi News home page

హోదా కోసం విద్యార్థుల ప్రతిజ్ఞ

Published Wed, Jul 27 2016 11:56 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

హోదా కోసం విద్యార్థుల ప్రతిజ్ఞ - Sakshi

విజయవాడ (సత్యనారాయణపురం) : 
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని ఏపీఎస్‌వైఎఫ్‌ ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. సత్యనారాయణపురం బీఆర్‌టీఎస్‌ రోడ్డులోని ఫుడ్‌ జంక్షన్‌ వద్ద జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కె. సుబ్బరాజు మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వాలు దోబూచులాడుతున్నాయని విమర్శించారు. మోసపూరిత విధానాలు విడనాడి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థి సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షడు నవనీతం సాంబశివరావు మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఇవ్వకుంటే ప్రజలే బుద్ధి చెపుతారని హెచ్చరించారు. చైతన్య టెక్నో స్కూల్‌ విద్యార్థులు, నారాయణ స్కూల్‌ విద్యార్థులు పాల్గొని ప్రత్యేకహోదా కోసం ప్రతిజ్ఞ చేశారు. ఏపీఎస్‌వైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్ర, ప్రధాన కార్యదర్శి గోవిందరాజులు, తమ్మిన గణేష్, మహిళా కన్వీనర్‌ లంక శశిరేఖ, గడ్డం   ర వికుమార్‌ పాల్గొన్నారు. 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement