లోక కల్యాణార్థం.. | for noble cause | Sakshi
Sakshi News home page

లోక కల్యాణార్థం..

Sep 18 2016 11:18 PM | Updated on Sep 27 2018 5:46 PM

లోక కల్యాణార్థం.. - Sakshi

లోక కల్యాణార్థం..

శ్రీశైల మహాక్షేత్రంలోని చంద్రావతి కల్యాణమండపంలో తెనాలి శ్రీమద్భాగవత సప్తాహజ్ఞాన యజ్ఞట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఈ నెల 11 నుంచి కోటి గాయత్రి, కోటి లలితానామ జపయజ్ఞ పారాయణ మహోత్సవం అత్యంతవైభవంగా కొనసాగుతోంది.

–  శ్రీశైలంలో కొనసాగుతున్న కోటి గాయత్రి, లలితానామ జపయజ్ఞ మహోత్సవం 
శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రంలోని చంద్రావతి కల్యాణమండపంలో తెనాలి శ్రీమద్భాగవత సప్తాహజ్ఞాన యజ్ఞట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఈ నెల 11 నుంచి కోటి గాయత్రి, కోటి లలితానామ జపయజ్ఞ పారాయణ మహోత్సవం అత్యంతవైభవంగా కొనసాగుతోంది. కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఉదయం 7.30గంటల నుంచి 9 గంటల వరకు జపాలు, అనంతరం 12గంటల వరకు పారాయణలు, ఆ తర్వాత మహానివేదన, ప్రసాద వితరణ చేసినట్లు ట్రస్ట్‌ వ్యవస్థాపకులు విష్ణుభట్ల  తెలిపారు. ఈ కార్యక్రమం ఈ నెల 21 వరకు నిర్వహిస్తామని పేర్కొన్నారు.  జగద్గురువు దివ్యాశీస్సులతో లోక కల్యాణార్థం, మానవులందరికీ సంత్పంకల్పం కలగాలంటే శ్రీగాయత్రీ మాతను సమష్టిగా కోటి సంఖ్యారూపంగా ఆరాధించి, జపించడంతో పాటు మహిళలచే కోటి లలితా నామ జప పారాయణలు జరిపించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. శ్రీశైల మహాక్షేత్రంలో నిర్వహిస్తున్న కోటి గాయత్రి, లలితానామ జపయజ్ఞ మహోత్సవంలో భాగంగా ఆదివారం సాయంత్రం సమయానికి 84 లక్షలు లలితానామ జపం, 72 లక్షల గాయత్రి నామ జపం పూర్తయినట్లు తెలిపారు. ఈ మహోత్సవంలో ఉమ్మడిరాష్ట్రాల హైకోర్టు  న్యాయమూర్తి జస్టీస్‌  బి. శివ శంకరరావు పాల్గొన్నారు. వారికి ట్రస్ట్‌ నిర్వాహకులు ఆశీర్వచనాలను అందజేశారు. ముందుగా ఆయన శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్లను దర్శించుకున్నారు.    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement