రోడ్డుప్రమాదంలో మాజీ మంత్రి కుమారుడు మృతి | Former Minister G.Nagi Raddy's Son dies in Road accident | Sakshi
Sakshi News home page

రోడ్డుప్రమాదంలో మాజీ మంత్రి కుమారుడు మృతి

Jan 22 2016 4:27 PM | Updated on Aug 30 2018 3:58 PM

వేగంగా వెళ్తున్న వాహనం.. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో అదుపుతప్పి పల్టీలు కొట్టిన ఘటనలో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు.

బత్తులపల్లి (అనంతపురం) : వేగంగా వెళ్తున్న వాహనం.. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో అదుపుతప్పి పల్టీలు కొట్టిన ఘటనలో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో మృతి చెందినవారిలో ఒకరు మాజీ మంత్రి గరుడమ్మగారి నాగిరెడ్డి కుమారుడు సతీష్‌ రెడ్డి(45) కాగా.. మరొకరు అతని బంధువు రామకృష్ణా రెడ్డి(60)గా గుర్తించారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా బత్తులపల్లి మండలం మరుగొడ్డువంక వద్ద శుక్రవారం చోటుచేసుకుంది.

అనంతపురం నుంచి తన స్వగ్రామమైన తాడిమర్రి మండలం దాడితోటకు స్కార్పియో వాహనంలో బయలుదేరిన సతీష్‌ రెడ్డి మరుగొడ్డువంక వద్దకు చేరుకోగానే ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేసే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో కారు అదుపుతప్పడంతో.. రోడ్డుపై పల్టీలు కొట్టుకుంటూ వెళ్లి బోల్తా కొట్టింది. దీంతో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement