పుట్టపర్తి: అనంతపురం జిల్లా పుట్టపర్తిలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. భారీ ఎత్తున భద్రతా బలగాలను మోహరించారు. సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళ, బుధ వారాల్లో పుట్టపర్తిలో యూత్ ఫెస్టివల్ జరుగనుంది. ఈ ఉత్సవానికి 69 దేశాల నుంచి 3000మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. అనంతపురం జిల్లాలో టైస్టు కదలికల నేపధ్యంలో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. భారీ సంఖ్యలో పోలీసు బలగాలను తరలించారు. పుట్టపర్తిలో అణువణువూ గాలిస్తున్నారు. ఉత్సవానికి వచ్చేవారి కదలికలపై నిఘా పెట్టారు.
భద్రతా వలయంలో పుట్టపర్తి
Published Mon, Jul 11 2016 8:40 AM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM
Advertisement
Advertisement