లేపాక్షి : పర్యాటక కేంద్రం లేపాక్షి ఆలయాన్ని కర్ణాటకలోని కోలార్ జిల్లా జడ్జి బాదామికర్ మంగళవారం ఉదయం సందర్శించారు. ఆయనకు ఆలయ అర్చకులు సూర్యప్రకాష్రావు, నరసింహశర్మలు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఆలయంలోని దుర్గాదేవి, వీరభద్రస్వాముల వారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ విశిష్టతను గురించి అర్చకులను అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు.