
భారతదేశంతో సహా ప్రపంచంలోని వివిధ దేశాలలో ఈరోజు(సోమవారం) ఈద్ పండుగను ముంస్లింలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఉదయం నుండి మసీదులలో ప్రార్థనలు చేసేందుకు తరలివస్తున్నారు. రాజధాని ఢిల్లీ నుండి ముంబై వరకూ దేశంలోని వివిధ నగరాలలోని మసీదులలో ఈద్ వేడుకలు జరుగుతున్నాయి.
#WATCH दिल्ली: ईद-उल-फितर के मौके पर लोगों ने फतेहपुरी मस्जिद में नमाज अदा की। pic.twitter.com/9ZU0YrWq74
— ANI_HindiNews (@AHindinews) March 31, 2025
దేశ రాజధాని ఢిల్లీలో ఈద్-ఉల్-ఫితర్(Eid al-Fitr) సందర్భంగా ఫతేపురి మసీదులో ప్రార్థనలు కొనసాగుతున్నాయి. అలాగే జామా మసీదుకు పెద్ద సంఖ్యలో ముస్లింలు చేరుకుంటున్నారు.
#WATCH | Madhya Pradesh | People are seen wearing black arm bands while they are arriving to offer Namaz at Eidgah Masjid in Bhopal on the occasion of #EidAlFitr2025
All India Muslim Personal Law Board has appealed to people to wear black arm bands today to mark a protest… pic.twitter.com/2erjvinYUb— ANI (@ANI) March 31, 2025
మధ్యప్రదేశ్లోని భోపాల్లోని ఈద్గా మసీదు(Eidgah Mosque)కు ముస్లింలు తమ చేతులకు నల్లటి బ్యాండ్లు ధరించి తరలివస్తున్నారు. వక్ఫ్ (సవరణ) బిల్లుకు నిరసనగా చేతులకు నల్లటి బ్యాండ్ ధరించి, నమాజ్ చేయాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు విజ్ఞప్తి చేసింది. భోపాల్లోని ఈద్గా మసీదులో ఈద్ ప్రార్థనలు కొనసాగుతున్నాయి.
#WATCH | Madhya Pradesh | People offer Namaz at Eidgah in Bhopal on the occasion of #EidAlFitr2025 pic.twitter.com/UDwVvDhW6U
— ANI (@ANI) March 31, 2025
ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఈద్-ఉల్-ఫితర్ జరుపుకుంటున్నారు. పోలీసు సిబ్బంది అన్ని మసీదుల వద్ద పహారా కాస్తున్నారు.
#WATCH | दिल्ली: ईद-उल-फितर के मौके पर जामा मस्जिद में लोगों ने नमाज अदा की। pic.twitter.com/Ggeqo13E0O
— ANI_HindiNews (@AHindinews) March 31, 2025
గౌతమ్ బుద్ధ నగర్ పోలీస్ కమిషనర్ శివహరి మీనా మాట్లాడుతూ ఈ రోజు ఒకవైపు ఈద్, మరోవైపు నవరాత్రి వేడుకలు జరుగుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని, మతపరమైన ప్రదేశాలలో పోలీసు భద్రత కల్పించామన్నారు.
#WATCH | मुंबई, महाराष्ट्र: ईद-उल-फितर के मौके पर लोगों ने माहिम दरगाह पर नमाज अदा की। pic.twitter.com/s0mZdQSlHY
— ANI_HindiNews (@AHindinews) March 31, 2025
మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ముస్లింలు మహీం దర్గాలో నమాజ్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: మయన్మార్లో దారుణ పరిస్థితులు.. రెస్య్కూ వేళ వైమానిక దాడులు!