కృష్ణా జిల్లా మచిలీపట్నం డీప్ వాటర్ పోర్ట్ నిర్మాణానికి ఉన్నతాధికారులు మంగళవారం భూసేకరణ నోటిఫికేషన్ను విడుదల చేశారు.
విజయవాడ : కృష్ణా జిల్లా మచిలీపట్నం డీప్ వాటర్ పోర్ట్ నిర్మాణానికి ఉన్నతాధికారులు మంగళవారం భూసేకరణ నోటిఫికేషన్ను విడుదల చేశారు. మూడు గ్రామాల పరిధిలోని సుమారు 4800 ఎకరాలు భూసేకరణ చేపట్టాలని ఆ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అలాగే అనుబంధ పరిశ్రమలకు 27 గ్రామాల్లోని మరో 25 వేల ఎకరాల సేకరణ చేయాలని నోటిఫికేషన్లో వివరించారు.