పాఠశాలకు తాళం | people strikes and school lock | Sakshi
Sakshi News home page

పాఠశాలకు తాళం

Jun 24 2017 11:32 PM | Updated on Sep 15 2018 5:45 PM

పాఠశాలకు తాళం - Sakshi

పాఠశాలకు తాళం

గ్రామ జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల సంఖ్యను పెంచాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు శనివారం పాఠశాలకు తాళం వేసి రోడ్డుపై బైఠాయించారు.

రాంపురం (పెనుకొండ రూరల్‌) : గ్రామ జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల సంఖ్యను పెంచాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు శనివారం పాఠశాలకు తాళం వేసి రోడ్డుపై బైఠాయించారు.  వారు మాట్లాడుతూ పాఠశాలలో 140 మంది విద్యార్థులకు ఒకే ఉపాధ్యాయుడు  ఉన్నాడన్నారు. ఒక్కరే విద్యార్థులకు బోధించలేకపోతున్నారని తెలిపారు.   ఉపాధ్యాయులు లేకపోవడంతో  పిల్లలు పాఠశాలలో చేరడం లేదని మండిపడ్డారు.

విద్యార్థులు లేక పాఠశాలలు మూతపడుతుండగా, తమ గ్రామంలో విద్యార్థులు ఉన్నా ఉపాధ్యాయులు లేక పాఠశాల మూతపడే దుస్థితి వచ్చిందని అన్నారు. ప్రధానోపాధ్యాయుడు మహిధర్‌ ఒక్కడే ఉండడం వల్ల విద్యార్థులకు టీసీలు, నూతన విద్యార్థులను చేర్చుకోవడం తదితర వాటితో విద్యార్థులకు బోధన దూరం అవుతోందన్నారు. ఉపాధ్యాయులను నియమించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని వారు కోరారు. లేకపోతే కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement