మైనింగ్ శాఖ కార్యాలయానికి పవర్ కట్
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): బకాయిలు చెల్లించని మైనింగ్ శాఖ డీడీ కార్యాలయానికి బుధవారం విద్యుత్ శాఖాధికారులు పవర్ కట్ చేశారు. మూడు నెలల నుంచి రూ.23 వేల బకాయి ఉండడంతో పలుమార్లు హెచ్చరించారు. అయినా అధికారులు స్పందించకపోవడంతో విద్యుత్ సరఫరాను నిలిపి వేశారు. ఈ నేపథ్యంలో సిబ్బంది చీకటిలో విధులు నిర్వహించారు. మూడు నెలల నుంచి రెగ్యులర్ డీడీ లేకపోవడం..ఇన్చార్జి అధికారి పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందని అక్కడి సిబ్బంది తెలిపారు.