power
-
విద్యుత్ వాడుతూ.. మిగిలింది అమ్ముతూ..
సాక్షి, హైదరాబాద్: ఎలక్ట్రిక్ టూవీలర్స్ తయారీ సంస్థ ప్యూర్(Pure) సరికొత్త రంగంలోకి అడుగుపెట్టింది. ఇళ్లతోపాటు, వాణిజ్య, గ్రిడ్స్థాయిలో ఉపయోగపడే ఎనర్జీ స్టోరేజీ సొల్యూషన్స్ (విద్యుత్తును నిల్వ చేసుకుని అవసరానికి తగ్గట్టుగా వాడుకునేందుకు వీలు కల్పించే) ఉత్పత్తులను ‘ప్యూర్-పవర్(Pure-Power)’ పేరుతో మార్కెట్లోకి తెచ్చింది. ఇవి సాధారణ యూపీఎస్లలో మాదిరిగా వీటిల్లో లెడ్ ఆక్సైడ్ బ్యాటరీలు కాకుండా.. అత్యాధునిక లిథియం-అయాన్ బ్యాటరీలు ఉండటం ఒక ప్రత్యేకతైతే.. సౌర విద్యుత్తు లాంటి సంప్రదాయేతర ఇంధన వనరులతో ఉత్పత్తి అయ్యే విద్యుత్తును కూడా ఎటువంటి అదనపు పరికరాల అవసరం లేకుండా నిల్వ చేసుకోగలగడం ఇంకో ప్రత్యేకత. కొంచెం సులువుగా చెప్పుకోవాలంటే.. మీ ఇంటిపైకప్పుపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుని ‘ప్యూర్-పవర్: హోం’ను వాడటం మొదలుపెట్టారనుకోండి.. మీ ఇంటికి కావాల్సిన విద్యుత్తును అక్కడికక్కడ ఉత్పత్తి చేసుకుని వాడుకోవడమే కాకుండా.. మిగిలిపోయిన విద్యుత్తును నేరుగా ప్రభుత్వానికి అమ్ముకోవచ్చునన్నమాట. నీతీఆయోగ్ సభ్యుడు, డీఆర్డీవో మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ వి.కె.సారస్వత్ మంగళవారం హైదరాబాద్లోని నోవోటెల్లో ప్యూర్-పవర్ ఉత్పత్తులను లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ప్యూర్ సంస్థ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నిశాంత్ దొంగరి మాట్లాడుతూ ‘‘దేశం మొత్తమ్మీద రానున్న 18 నెలల్లో 300 మంది డీలర్ల ద్వారా ‘ప్యూర్-పవర్’ ఉత్పత్తులను మార్కెట్ చేయనున్నాము’’ అని తెలిపారు. యూపీఎస్లతో పోలిస్తే ప్యూర్-పవర్ ఎన్నో విధాలుగా ప్రత్యేకమైనవని, నానో పీసీఎం మెటీరియల్ ద్వారా భద్రతకు పెద్దపీట వేశామని ఆయన తెలిపారు. ప్యూర్-పవర్లో ప్రస్తుతం రెండు రకాలను మార్కెట్లోకి విడుదల చేస్తున్నామని, గ్రిడ్ స్థాయిలో విద్యుత్తును నిల్వ చేసే ‘ప్యూర్-పవర్: గ్రిడ్’ను వచ్చే ఏడాది లాంచ్ చేస్తామన్నారు. ఇళ్లల్లో, అపార్ట్మెంట్లలో వాడుకోగలిగిన ‘ప్యూర్-పవర్:హోం’ 3 కిలోవోల్ట్ ఆంపియర్ (కేవీఏ), 5కేవీఏ, 15కేవీఏ సామర్థ్యాల్లో లభిస్తాయని ధర రూ.74,999తో ప్రారంభమవుతాయని చెప్పారు.దుకాణాలు, కార్యాలయాలు, టెలికాం టవర్స్ వంటి వాటి కోసం 25 కేవీఏ నుంచి 100 కేవీఏల సామర్థ్యం గల ‘ప్యూర్-పవర్’ కమర్షియల్ను అందుబాటులోకి తెస్తున్నామని నిశాంత్ వివరించారు. వీటి వాడకం ద్వారా డీజిల్ జనరేటర్ల అవసరాన్ని లేకుండా చేసుకోవచ్చునని తెలిపారు. ప్యూర్-పవర్ మూడో ఉత్పత్తి గ్రిడ్ స్థాయిలో విద్యుత్తును నిల్వ చేసుకునేదని, 20 అడుగుల పొడవైన కంటెయినర్లోకి ఇమిడిపోయే ‘ప్యూర్-పవర్: గ్రిడ్’లో ఏకంగా నాలుగు మెగావాట్ల విద్యుత్తును నిల్వ చేసుకోవచ్చునని ఆయన వివరించారు. సోలార్ పార్కుల్లో వీటిని ఏర్పాటు చేసుకుంటే.. విద్యుత్తు డిమాండ్ తక్కువగా ఉన్న సమయంలో ఉత్పత్తి చేసిన విద్యుత్తును ఎక్కువ ఉన్న సమయంలో సరఫరా చేసేందుకు వీలేర్పడుతుందన్నారు. ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి ఈ ఉత్పత్తులను బుక్ చేసకోవచ్చునని, నెలాఖరు నుంచి డెలివరీ మొదలవుతుందని తెలిపారు.ఇదీ చదవండి: రూ.కోట్లు కోల్పోయిన వ్యాపారవేత్త.. ఏం జరిగిందంటే..దేశ అభివృద్ధికి కీలకం..2070 నాటికి కర్బన్ ఉద్గారాలను సున్నాస్థాయికి తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో విద్యుత్తు వాహనాలతోపాటు ప్యూర్-పవర్ లాంటి ఉత్పత్తులు ఎంతో ఉపయోగపడతాయని నీతి ఆయోగ్ సభ్యులు వీకే సారస్వత్ స్పష్టం చేశారు. ప్యూర్-పవర్ ఉత్పత్తుల ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 2030 నాటికి వాహనాల్లో 40 శాతం విద్యుత్తుతో నడిచేవిగా చేయాలని ప్రభుత్వం తీర్మానించిందని, కోటి ఇళ్ల పైకప్పులపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు సంకల్పించిందని వివరించారు. అయితే ప్రస్తుతం దేశం మొత్తమ్మీద ఉన్న విద్యుత్తు వాహనాల సంఖ్య (అన్ని రకాలు కలుపుకుని) ఇరవై లక్షలకు మించడం లేదని తెలిపారు. విద్యుత్తు వాహనాల ఛార్జింగ్ కోసం గ్రిడ్ను వాడటం మొదలుపెడితే గ్రిడ్పై అధిక భారం పడుతుందని, ఈ నేపథ్యంలోనే ప్యూర్-పవర్ వంటి ఉత్పత్తులకు ప్రాధాన్యం ఏర్పడుతోందని అన్నారు. బ్యాటరీల ధరలు తగ్గించేందుకు, మరింత సమర్థమైన వాటిని తయారు చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ఫలితస్తే మరింత మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ప్యూర్ సంస్థ సహ వ్యవస్థాపకుడు రోహిత్ వడేరా తదితరులు పాల్గొన్నారు. -
ఇండియా గేట్, రాష్ట్రపతి భవన్.. అంతటా అంథకారం.. కారణమిదే..
న్యూఢిల్లీ: దేశంలోని అన్ని చారిత్రక ప్రదేశాలకు ఉన్నట్టుండి ఒక్కసారిగా విద్యుత్ సరఫరాను నిలిపివేయడాన్ని ఎప్పుడైనా చూశారా?. రాత్రివేళ ఎప్పుడూ కాంతులీనే ఈ ప్రాంతాల్లో అంథకారం అలముకుంటే ఎలా ఉంటుంది? ఇటువంటి దృశ్యం శనివారం కనిపించింది. డబ్ల్యూడబ్యూఎఫ్ ఇండియా ఎర్త్ అవర్ సెలబ్రేషన్ 2025 కింద ఈ విధంగా చారిత్రక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.శనివారం సాయంత్రం ఇండియా గేట్, ఎర్రకోట, రాష్ట్రపతి భవన్, విక్టోరియా మెమోరియల్, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్.. ఇలా దేశవ్యాప్తంగా ఉన్న పలు చారిత్రక ప్రదేశాలలో లైట్లు ఆపివేశారు. ఈ ఏడాది 19వ ఎర్త్ అవర్(Earth Hour) ప్రపంచ జల దినోత్సవంతో పాటు జరిగింది. ఈ సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంగీతకారుడు, డబ్ల్యూడబ్యూఎఫ్ ఇండియా హోప్ అండ్ హార్మొనీ రాయబారి శంతను మొయిత్రా తన సంగీత ప్రదర్శనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఎర్త్ అవర్ సందర్భంగా రాత్రి 8.30 గంటల నుండి 9.30 గంటల వరకు చారిత్రక ప్రాంతాల్లో విద్యుత్ ఉపకరణాలను ఆపివేయడం ద్వారా ఢిల్లీలో దాదాపు 269 మెగావాట్ల విద్యుత్తును ఆదా చేశారు.ఎర్త్ అవర్ అనేది విద్యుత్తును ఆదా చేసే ప్రచార కార్యక్రమం. ప్రజలు తమ దైనందిన జీవితంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ప్రపంచంపై పడే భారాన్ని తగ్గించవచ్చని ఎర్త్డే చెబుతుంది. నీటిని ఆదా చేయడం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్(Single-use plastic) వాడకాన్ని తగ్గించడం, గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడం ద్వారా భూమిని కాపాడవచ్చని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. ఈ ప్రచారానికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి. గత సంవత్సరం ఢిల్లీలో జరిగిన ఎర్త్ అవర్ సందర్భంగా 206 మెగావాట్ల విద్యుత్ ఆదా అయిందని పలు నివేదికలు చెబుతున్నాయి.ఇది కూడా చదవండి: అమర వీరులకు ప్రముఖుల నివాళులు -
కరెంటు కోత... హీత్రూకు మూత!
లండన్: అంతర్జాతీయ ప్రయాణాలకు గుండెకాయ వంటి లండన్ హీత్రూ విమానాశ్రయం శుక్రవారం పూర్తిగా మూతబడింది. ఎయిర్పోర్టుకు విద్యుత్ సరఫరా చేసే సబ్స్టేషన్లో మంటలు చెలరేగడమే ఇందుకు కారణం. దాంతో హీత్రూకు కరెంటు సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో విమానాశ్రయాన్ని రోజంతా మూసేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయంతో అంతర్జాతీయంగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఏకంగా 1,350 విమానాలను రద్దు చేయడం, దారి మళ్లించడం జరిగినట్టు విమాన ట్రాకింగ్ సేవల సంస్థ ఫ్లైట్రాడార్24 వెల్లడించింది.దీనివల్ల 2.9 లక్షల మంది ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు లోనైనట్టు సమాచారం. ‘‘విమానాశ్రయానికి విద్యుత్ను పూర్తిగా తిరిగి ఎప్పుడు పునరుద్ధరించేదీ చెప్పలేం. విమానాశ్రయాన్ని తెరిచేదాకా ప్రయాణికులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈవైపు రావొద్దు’’అని హీత్రూ సీఈఓ థామస్ వోల్డ్బీ విజ్ఞప్తి చేశారు. శనివారానికల్లా పూర్తిస్థాయిలో సేవలను పునరుద్ధరిస్తామని ఆయన ఆశాభావం వెలిబుచ్చినా చాలా రోజులే పట్టవచ్చంటున్నారు.ప్రయాణికులు తమ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోవడం, అందుకు తగ్గట్టు విమానయాన సంస్థలు విమానాలను, సిబ్బందిని సమకూర్చుకునేందుకు కూడా కొన్ని రోజులు పడుతుందని చెబుతున్నారు. హీత్రూ యూరప్లోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం. ప్రతి 90 సెకన్లకు ఒక విమానం టేకాఫ్/లాండింగ్ జరుగుతుంది! ఇక్కణ్నుంచి రోజుకు 669 విమానాలు టేకాఫ్ అవుతాయి.మండిపడుతున్న ప్రయాణికులు హీత్రూ మూసివేతతో ఉత్తర అమెరికా, ఆసియా దేశాలకు చెందిన సుదూర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిణామంపై వారంతా తీవ్రంగా మండిపడుతున్నారు. ఒక్క అగ్నిప్రమాదం కారణంగా యూరప్లోనే అత్యంత రద్దీ విమానాశ్రయం మూతబడటమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇది అసాధారణమైన పరిస్థితని ఏవియేషన్ కన్సల్టెంట్ అనితా మెండిరట్టా తెలిపారు. ‘‘శనివారానికల్లా సమస్యను సరిదిద్దుతాం. కానీ పూర్తి సాధారణ స్థితికి చేరేందుకు నాలుగు రోజులు పట్టొచ్చు’’అని చెప్పారు. హీత్రూ వైపు వెళ్లే అన్ని రైళ్లను కూడా రద్దు చేసినట్లు నేషనల్ రైల్ తెలిపింది. హీత్రూ మూసివేత కారణంగా 4 వేల టన్నుల కార్గో రవాణా కూడా నిలిచిపోయిందని అధికారులు తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రికల్లా కొన్ని విమాన సేవలను పునరుద్ధరించినట్టు చెప్పుకొచ్చారు. ‘‘జొహన్నెస్బర్గ్, సింగపూర్, రియాద్, కేప్టౌన్, సిడ్నీ, బ్యూనస్ఎయిర్స్ వంటి నగరాలకు విమానాలు బయల్దేరాయి. అవన్నీ విమానాశ్రయంలో చిక్కుకుపోయిన ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడానికే పరిమితమయ్యాయి’’ అని స్పష్టం చేశారు. కారణమేంటి? పశి్చమ లండన్లో హీత్రూ విమానాశ్రయానికి రెండు మైళ్ల దూరంలో ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో గురువారం అర్ధరాత్రి భారీ పేలుడు శబ్దం విన్పించిందని, మంటలు సబ్ స్టేషన్ను చుట్టుముట్టాయని స్థానికులు వివరించారు. లండన్ ఫైర్ బ్రిగేడ్ 70 మంది సిబ్బంది 10 ఫైరింజిన్లతో హుటాహుటిన చేరుకుని 7 గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చింది. అప్పటికే విమానాశ్రయంలో పవర్ కట్ ఏర్పడింది. ప్రమాదానికి కారణమేమిటనే దానిపై స్పష్టత లేదు. కుట్ర కోణం లేదని ప్రభుత్వం పేర్కొంది.జరిగింది చాలా పెద్ద ప్రమాదం. హీత్రూ విమానాశ్రయానికి ఉన్న అతి పెద్ద బలహీనత విద్యుత్ సరఫరాయే – విమానాశ్రయం సీఈఓ థామస్ వోల్డ్బీ తీవ్ర వైఫల్యమే: ప్రధాని హీత్రూకు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోవడం తీవ్ర వైఫల్యమేనని ప్రధాని కియర్ స్టార్మర్ అంగీకరించారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిగి తీరుతుందని ఆయన అధికార ప్రతినిధి టామ్ వెల్స్ ప్రకటించారు. ఇలాంటివి పునరావృతం కాకుండా అన్ని చర్యలూ తీసుకుంటామని తెలిపారు.బిలియన్లలో నష్టం!హీత్రూ ప్రమాదం విమానయాన సంస్థల నడ్డి విరిచేలా కని్పస్తోంది. విమానాల రద్దు, బీమా, పరిహారం చెల్లింపులు తదితరాల రూపంలో అవి బిలియన్ల కొద్దీ డాలర్ల నష్టాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చని ఆ రంగ నిపుణులు చెబుతున్నారు. హీత్రూ మూసివేత దెబ్బ ఇప్పటికే వాటి మార్కెట్ విలువపై పడింది. బ్రిటిష్ ఎయిర్వేస్, లుఫ్తాన్సా, ర్యాన్ఎయిర్ వంటి పలు సంస్థల షేర్లు 1 నుంచి 2 శాతం దాకా పతనమయ్యాయి.ఆ సమయంలో గాల్లో 120 విమానాలువిద్యుత్ సరఫరా నిలిచి విమానాశ్రయాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించిన సమయంలో సుమారు 120 విమానాలు హీత్రూ సమీపంలో గాల్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. కొన్నింటిని సమీపంలోని గాట్విక్, మాంచెస్టర్కు మళ్లించగా మరికొన్ని సమీప యూరప్ దేశాల్లోని పారిస్, ఆమ్స్టర్డామ్, ఫ్రాంక్ఫర్ట్ తదితర విమానాశ్రయాల్లో లాండయ్యాయి.మరికొన్ని విమానాలు వెనక్కు వెళ్లిపోయాయి. హీత్రూ మూసివేత వల్ల పారిస్లో లాండైన తమ ప్రయాణికుల కోసం క్వాంటాస్ ఎయిర్లైన్ సింగపూర్, పెర్త్ నుంచి విమానాలను పంపింది. లండన్కు వెళ్లాల్సిన వారిని బస్సులు, రైళ్లలో తరలిస్తామని తెలిపింది. ర్యాన్ఎయిర్ కూడా తమ ప్రయాణికుల కోసం డబ్లిన్, స్టాన్స్టెడ్ ఎయిర్పోర్టులకు విమానాలు నడుపుతామని తెలిపింది.అత్యంత బిజీ! అంతర్జాతీయ ప్రయాణాల విషయంలో ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో హీత్రూ ఒకటి. ఇది 1964లో అందుబాటులోకి వచ్చింది. ఇక్కడినుంచి ఏకంగా 90 దేశాల్లోని 230 గమ్యస్థానాలకు విమానాలు నడుస్తాయి. బ్రిటిష్ ఎయిర్వేస్తో పాటు 90 సంస్థలకు చెందిన విమానాలు ఇక్కడినుంచి రాకపోకలు సాగిస్తాయి.జనవరిలో రికార్డు స్థాయిలో 63 లక్షల మంది ప్రయాణికులు హీత్రూ గుండా రాకపోకలు సాగించారు! 2010లో ఐస్ల్యాండ్లో అగ్నిపర్వతం బద్దలై భారీగా దుమ్ముధూళి మేఘాలు కమ్ముకోవడంతో అట్లాంటిక్ మీదుగా విమానాల రాకపోకలకు నెలలపాటు అంతరాయం ఏర్పడింది. అప్పుడు కూడా హీత్రూలో విమాన సేవలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అయినా ఇలాంటి సందర్భాలను ఎదుర్కొనేందుకు బ్రిటన్ సన్నద్ధం కాలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.మూడు సబ్స్టేషన్లున్నా... హీత్రూకు కరెంటు సరఫరా కోసం మూడు సబ్స్టేషన్లతో పాటు ఒక బ్యాకప్ ట్రాన్స్ఫార్మర్ కూడా ఉంది. కానీ వాటిలో ఒక సబ్స్టేషన్ ప్రస్తు తం పని చేయడం లేదు. మరికొటి కొద్ది రోజులు గా సమస్యలు ఎదుర్కొంటోంది. హీత్రూ విమానాశ్రయం నడవాలంటే ఏకంగా ఒక మినీ నగర అవసరాలకు సమానమైన కరెంటు అవసరం!ఎయిరిండియా సేవలూ రద్దు..న్యూఢిల్లీ: హీత్రూకు విమాన సేవలను శుక్రవారం నిలిపేసినట్టు ఎయిరిండియా పేర్కొంది. ‘‘ఒక విమానం ముంబైకి తిరిగొచ్చింది. మరొకటి ఫ్రాంక్ఫర్ట్ మళ్లించాం. మిగతావి రద్దయ్యాయి’’ అని ప్రకటించింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు నుంచి శుక్రవారం లండన్ వెళ్లాల్సిన 5 వర్జిన్ అట్లాంటిక్, 8 బ్రిటిష్ ఎయిర్వేస్ విమానాలు కూడా రద్దయ్యాయి. -
మార్కెట్లోకి కొత్త ఉత్పత్తులు: ప్యూర్ ఎనర్జీ ప్రకటన
భారతదేశంలోని ఫ్యూయెల్ స్టోరేజ్ అండ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో అగ్రగామిగా ఉన్న ప్యూర్ ఎనర్జీ (Pure Energy).. మార్చి 25న హైదరాబాద్లో జరిగే ఒక ప్రత్యేక కార్యక్రమంలో స్టోరేజ్ విభాగంలో కంపెనీ సరికొత్త ఉత్పత్తుల ఆవిషకరించనున్నట్లు ప్రకటించింది. కంపెనీ తీసుకురానున్న ఈ కొత్త ఉత్పత్తులు వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయని తెలుస్తోంది.స్టోరేజ్ విభాగంలో సరికొత్త ఉత్పత్తులను పరిచయం చేయడానికి మేము సంతోషిస్తున్నామని ప్యూర్ ఎనర్జీ వ్యవస్థాపకుడు & మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ 'నిశాంత్ డోంగారి' అన్నారు. త్వరలో జరగనున్న కార్యక్రమంలో మా ఉత్పత్తి శ్రేణికి సంబంధించిన ప్రదర్శన ఉంటుందని వెల్లడించారు.హైదరాబాద్లోని హెచ్ఐసీసీ నోవోటెల్లో జరగనున్న ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీ.కే సరస్వత్, క్రియేటివ్ సెన్సార్ ఇంక్. (CSI) అండ్ టెకో ఇమేజ్ సిస్టమ్స్ (TIS) ఛైర్మన్ యూజీన్ హువాంగ్ పాల్గొని.. కంపెనీ ఉత్పత్తులను అధికారికంగా ఆవిష్కరించనున్నారు. కంపెనీ ఆవిష్కరించనున్న ఉత్పత్తులకు సంబంధించిన డెమోలను చూపించడం, వాటి సామర్థ్యాలను వెల్లడించడం, పంపిణీకి సంబంధించిన విషయాలను.. మార్చి 25న వెల్లడించనున్నారు. -
ఉపన్యాసాలు, రాతల కన్నా శక్తిమంతమైనది ధ్యానశక్తి.!
ఎవరైతే జీవిత ప్రాముఖ్యాన్నీ, దాని ప్రయోజనాన్నీ తెలుసు కోవడానికి ప్రయత్నించరో... అటువంటివారు తమ జీవితాన్ని వృథా చేసుకొంటారు. చాలామంది తాము ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాలు, వృత్తులపైనా; బంధువులు, స్నేహితులు, విలాసాల పైనా మనసును నిమగ్నం చేసి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అటువంటివారు దురదృష్టవంతులు. ఎందుకంటే... వారు పైపై ప్రాపంచిక విషయాల వల్ల సంతోషాన్ని పొందుతూ, విషయవాంఛల్లో మునిగిపోతూ ఉంటారు. జీవితంలో ఏ సంఘటన కూడా అటువంటి వారి హృదయాన్ని చలింపజేయదు. ఆ విధంగా ఎంత కాలం మోటుగా జీవితం సాగించగలరు?పరాత్పరుడే వారిని ఏదో ఒకరోజు తన వైపు మళ్ళించుకుంటాడు. ముందుగా ప్రతికూ లత, నిరాశ, నిస్పృహలు వారిని చుట్టు ముడ తాయి. అందువలన వారికి అతీతమైన ఏదో ఒక శక్తి వారి ఊహలను తారుమారు చేస్తూ ఉన్నట్లు తెలుసుకుంటారు. అప్పుడు వారు నెమ్మదిగా దేవాలయాలకు, గురువు దగ్గరికి వెళ్ళడం, సంప్రదాయంగా పూజించడం ప్రారంభిస్తారు. చివరగా వారు జీవితం ఎందుకు వచ్చింది, దానికి గల ప్రయోజనం ఏమిటి అని ఆలోచిస్తారు.చదవండి: ఆటలు లేని బాల్యం : ఊబకాయం, ఫ్యాటీ లివర్దుఃఖం, నిరాశ కలిగే వరకూ వేచివుండి, దేవుని శరణు జొచ్చుట తెలివిగలవారు చేసే పనేనా? మరణం సంభవించే వరకూ నిరీక్షిస్తూ, మందబుద్ధితో ఉండటమా? దీని గురించి సుదీర్ఘంగా ఆలోచించాలి. నీకు జీవితం ఎందుకు వచ్చిందంటూ విచారిస్తూ (ఆలోచిస్తూ) కాలం వృథా చేయకూడదు. అంటే ఈ విషయాన్ని త్వరగా తెలుసుకొని, జీవితాన్ని సఫలం చేసుకోవాలి. ఉపన్యాసాల కన్నా, రాతల కన్నా శక్తిమంతమైనది ధ్యానశక్తి. ఉపన్యాసాలు, పుస్తకాలు స్వల్ప ప్రయోజనం కలిగిస్తాయి. ప్రారంభ దశలో ఉన్నవారికి అవి మార్గాన్ని చూపించడానికి ఉపయోగ పడతాయి. ఆధ్యాత్మిక విషయాలలో అవి మీ ఆసక్తిని పెంపొందించినా పెంపొందించవచ్చు. మెదడుకు మేత పెట్టవచ్చు. బుద్ధికి ప్రోత్సాహాన్ని కలిగించవచ్చు. కాని అవి ‘ఆత్మజ్యోతి’ని చూపించలేవు. ఇటువంటి దర్శనానికై మనస్సు ఆత్మను అంటిపెట్టుకొనిఉండాలి. ఈ విషయంలో సద్గురువు నిర్దేశంలో ధ్యానం చేయడమే మార్గం. నీవు దేనిని గూర్చి అన్వేషిస్తున్నావో, అది నీ లోపలే ఉంది. పుస్తకాలన్నీ బాహ్య ప్రపంచంలో ఉన్నాయి. ధ్యానంలోనే నిజమైన కార్యం జరిగిపోతుంది. ‘ఆత్మపై లక్ష్యమును ఉంచి ధ్యానం చెయ్యి’ అని భగవద్గీత కూడా ప్రబోధిస్తోంది శ్రీగణపతి సచ్చిదానందస్వామి -
ఎక్స్ఛేంజీల విద్యుత్తో రూ.982 కోట్లు ఆదా చేశాం
సాక్షి, హైదరాబాద్: థర్మల్ విద్యుత్కన్నా తక్కువ ధరకు లభించే పవర్ ఎక్స్ఛేంజీల విద్యుత్ను కొనుగోలు చేయడం ద్వారా 2023 డిసెంబర్ నుంచి 2025 జనవరి మధ్య రూ. 982.66 కోట్లు ఆదా చేశామని ట్రాన్స్కో సీఎండీ కృష్ణ భాస్కర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. పవర్ ఎక్స్ఛేంజీల్లో తక్కువ ధరకు విద్యుత్ లభిస్తున్న సమయాల్లో విద్యుత్ వేరియబుల్ కాస్ట్ అధికంగా ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రాలను బ్యాక్డౌన్ చేసి ఈ మేరకు డబ్బు ఆదా చేశామని పేర్కొన్నారు. దీనివల్ల వినియోగదారులపై ఆ మేరకు ఆర్థిక భారం తప్పిందన్నారు. దీన్ని కేంద్రం సైతం గుర్తించి తెలంగాణ లోడ్ డిస్పాచ్ సెంటర్ను దేశంలోనే అత్యుత్తమైన ఎస్ఎల్డీసీగా ఎంపిక చేసి గతేడాది డిసెంబర్ 14న పురస్కారం అందించిందని గుర్తుచేశారు.గతేడాది డిసెంబర్, ఈ ఏడాది జనవరిలో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో తయారైన విద్యుత్ యూనిట్ ధర సగటున రూ. 3.97 నుంచి రూ. 4.18గా ఉండటంతో థర్మల్ విద్యుత్ కేంద్రాలను బ్యాక్డౌన్ (ఉత్పత్తి తగ్గించి) చేసి పవర్ ఎక్స్ఛేంజీల నుంచి రూ. 2.69 నుంచి రూ. 2.82 సగటు ధరతో విద్యుత్ కొన్నామని కృష్ణ భాస్కర్ ఆ ప్రకటనలో వివరించారు. దీంతో డిసెంబర్లో రూ. 196.68 కోట్లు, జనవరిలో రూ. 185.27 కోట్లు ఆదా అయ్యాయన్నారు. దీర్ఘకాలిక విద్యుత్ ఒప్పందాల ద్వారా 9,134 మెగావాట్ల విద్యుత్ మాత్రమే లభ్యతగా ఉండటంతో విద్యుత్ కొనుగోళ్లు తప్పవన్నారు. విద్యుత్ డిమాండ్ కొత్త రికార్డు రాష్ట్రంలో గురువారం గరిష్ట విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో పెరిగి ఏకంగా 15,752 మెగావాట్లకు ఎగబాకింది. రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు ఇదే అత్యధిక గరిష్ట విద్యుత్ డిమాండ్. గతేడాది మార్చి 8న ఏర్పడిన 15,523 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ ఇప్పటివరకు అత్యధికంకాగా దాన్ని తాజాగా రాష్ట్రం అధిగమించిందని ట్రాన్స్కో సీఎండీ డి.కృష్ణభాస్కర్ పేర్కొన్నారు. వేసవిలో గరిష్ట డిమాండ్ 17,000 మెగావాట్లకు పెరిగినా సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.ఎక్స్ఛేంజీల్లో కొనుగోళ్లతో నష్టమే: ఎం.వేణుగోపాల్రావు ట్రాన్స్కో సీఎండీ వాదనను విద్యుత్రంగ నిపుణుడు ఎం.వేణుగోపాల్రావు తోసిపుచ్చారు. ఎక్స్ఛేంజీల్లో కొనుగోళ్ల కోసం అధికంగా ఖర్చు చేశారని ఆరోపించారు. ఎక్స్ఛేంజీల నుంచి యూనిట్కు రూ. 2.82 ధరతో విద్యుత్ కొనుగోలు చేయగా ఆ మేరకు బ్యాక్డౌన్ చేసిన విద్యుత్ స్థిర చార్జీ యూనిట్కు రూపాయిన్నరగా ఉన్నా మొత్తం యూనిట్ విద్యుత్ ధర రూ. 4.32కు పెరిగిపోతుందన్నారు. మరోవైపు బ్యాక్డౌన్ చేసిన విద్యుత్ ధర యూనిట్కు రూ. 4.15 మాత్రమే ఉండటంతో వాస్తవానికి డిస్కంలు యూనిట్కు అదనంగా 0.17 పైసలు నష్టపోయాయని తేల్చిచెప్పారు. బ్యాక్డౌన్ చేసి ఉత్పత్తి తగ్గించిన విద్యుత్కు సంబంధించిన మొత్తం స్థిర ధరలు చెల్లించాల్సి ఉంటుందని.. సగటు స్థిర చార్జీలు కాదన్నారు. దీనికితోడు ఎక్స్ఛేంజీల నుంచి విద్యుత్ కొంటే ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ చార్జీలు, ట్రాన్స్మిషన్ నష్టాలు భరించాల్సి ఉంటుందన్నారు. -
సీఈఆర్సీ నిర్ణయంతో రూ.1,000 కోట్ల మేర నష్టం
ప్రభుత్వ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (CERC) ఇటీవల తీసుకున్న నిర్ణయం విద్యుత్ ఉత్పత్తిదారులకు నష్టాలను మిగిల్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించడానికి ముందు విద్యుత్ ప్లాంట్ల(Power plants) ట్రయల్ రన్ సమయంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్కు చెల్లింపులను నిషేధించే కొత్త నిబంధనను సీఈఆర్సీ ఇటీవల ప్రవేశపెట్టింది. దాంతో దేశంలోని విద్యుత్ ఉత్పత్తిదారులు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటారని విద్యుత్ ఉత్పత్తిదారుల సంఘం తెలిపింది. దీనివల్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు రూ.1,000 కోట్ల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని పేర్కొంది.కొత్త నిబంధన ప్రభావంవిద్యుత్ ప్లాంట్ వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించడానికి ముందు ట్రయల్ పీరియడ్(Trail Period) నిర్వహిస్తుంది. ఇది సాధారణంగా 6-12 నెలల పాటు ఉంటుంది. ఈ సమయంలో సరఫరా చేసే విద్యుత్ను గ్రిడ్తో అనుసంధానం చేసుకుని గతంలో ప్రభుత్వం చెల్లింపులు చేసేది. కానీ కొత్త నిబంధన ప్రకారం ఎలాంటి చెల్లింపులు ఉండవని సీఈఆర్సీ నిర్ణయించింది. ట్రయల్ పీరియడ్ కాలంలో విద్యుత్ ఉత్పత్తిదారులు ఎటువంటి పరిహారం లేకుండా ఇంధన ఖర్చులతో సహా నిర్వహణ ఖర్చులను భరించాల్సి ఉంటుంది. ఇది విద్యుత్ ఉత్పత్తుదారులకు భారంగా మారుతుంది. దీంతో ఈ నిబంధనను పునఃసమీక్షించాలని పవర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ కోరుతోంది. సీఈఆర్సీ నిబంధనలపట్ల ఈ అసోసియేషన్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.ఉత్పత్తిదారులపై ఆర్థిక భారంముఖ్యంగా దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏలు) లేకుండా మార్కెట్లో విద్యుత్ను విక్రయించే మర్చంట్ పవర్ ప్లాంట్లకు ఈ నిర్ణయంతో ఆర్థిక భారం ఎక్కువవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ట్రయల్ పీరియడ్లో రెవెన్యూ పరంగా ప్రభుత్వ హామీ లేనందున ఈ ప్లాంట్లు బలహీనపడుతాయని చెబుతున్నారు. అదనంగా, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) ప్రొసీడింగ్స్ ద్వారా ప్లాంట్లు పొందినవారు యథాతథంగా వీటిని నిర్వహించాలంటే సవాలుగా మారుతుంది. కాబట్టి మూలధన పెట్టుబడితో వాటిని అప్డేట్ చేసి ఉపయోగించాల్సి ఉంటుంది. అందుకోసం ప్రభుత్వం హామీ కరవవడంతో ఎన్సీఎల్టీ ద్వారా ప్లాంట్లను చేజిక్కించుకోవడం అర్థం లేని అంశంగా మారుతుందని భావిస్తున్నారు.ఇదీ చదవండి: పెరిగిన జీడీపీ వృద్ధి అంచనాలుఅసోసియేషన్ వాదనలు..టెస్టింగ్, కమిషనింగ్ కార్యకలాపాలను నిర్వహించడంలో ఉత్పత్తి కేంద్రాలు ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎత్తిచూపుతూ, కొత్త నిబంధనను పునఃపరిశీలించాలని విద్యుత్ ఉత్పత్తిదారుల సంఘం సీఈఆర్సీను కోరింది. ఇంధన ఖర్చులకు ఎలాంటి నిధుల వనరులు లేకుండా ఉంటే ప్రాజెక్టుల మనుగడ ప్రమాదంలో పడుతుందని అసోసియేషన్ పేర్కొంది. -
Electricity Charges: పేద ప్రజలకు కేంద్రం దీపావళి కానుక..
-
మూడు చక్రాల వింత వాహనం: ఇలాంటిది మీరెప్పుడూ చూసుండరు (ఫోటోలు)
-
విద్యుత్ రంగానికీ పీఎల్ఐ!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం విద్యుత్ ప్రసార(పవర్ ట్రాన్స్మిషన్) రంగానికి సైతం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక(పీఎల్ఐ) పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) చివరికల్లా పీఎల్ఐను వర్తింపచేయాలని చూస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు పేర్కొన్నారు. ప్రపంచస్థాయిలో ట్రాన్స్మిషన్ పరికరాల కొరత కారణంగా ధరలు పెరిగిపోతుండటంతో తాజా యోచనకు తెరతీస్తున్నట్లు తెలియజేశారు. మరోవైపు ప్రభుత్వం పునరుత్పాదక(రెనెవబుల్) ఇంధనాన్ని ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో వేగవంతంగా విద్యుత్ ప్రసార లైన్లను ఏర్పాటు చేయడంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. దేశీయంగా విద్యుత్ ప్రసార పరికరాల కోసం అత్యధిక శాతం దిగుమతులపైనే ఆధారపడుతుండటంతో పీఎల్ఐకు ప్రభుత్వం తెరతీస్తున్నట్లు అధికారిక వర్గాలు తెలియజేశాయి. తద్వారా దేశీయంగా ట్రాన్స్మిషన్ పరికరాల తయారీకి ప్రభుత్వం దన్నునివ్వనున్నట్లు వెల్లడించాయి. దీంతో విదేశీ మారక నిల్వలను సైతం ప్రభుత్వం ఆదా చేసుకోనుంది. దిగుమతులే అధికం ప్రధానంగా ట్రాన్స్ఫార్మర్లు, సర్క్యూట్ బ్రేకర్లు, స్విచ్గేర్లు తదితర విద్యుత్ ప్రసార పరికరాల కోసం భారత్ విదేశాలపై అధికంగా ఆధారపడుతోంది. ప్రపంచ బ్యాంకు గణాంకాల ప్రకారం 2023లో భా రత్ 33.8 కోట్ల డాలర్ల (సుమారు రూ.2,840 కో ట్లు) విలువైన పరికరాలను దిగుమతి చేసుకుంది. -
ఇజ్రాయెల్కు పవర్ చూపించాలి: ఇరాన్ సుప్రీం లీడర్
టెహ్రాన్: తమ సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ జరిపిన తాజా దాడులపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ స్పందించారు. తమ పవర్ను ఇజ్రాయెల్కు చూపించాలన్నారు. దీని కోసం ఎలా స్పందించాలనే విషయాన్ని అధికారులే నిర్ణయిస్తారని ఖమేనీ చెప్పినట్లు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ వెల్లడించింది. ఇజ్రాయెల్ దాడులను మరీ తక్కువ చేసి చూడవద్దని, అదే సమయంలో అతిగా భావించవద్దని ఖమేనీ చెప్పినట్లు తెలిపింది. కాగా,శనివారం(అక్టోబర్ 26) తెల్లవారుజామున ఇరాన్ రాజధాని టెహ్రాన్తో పాటు 20 లక్ష్యాలపై ఇజ్రాయెల్ దళాలు దాడులు చేశాయి.ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలే లక్ష్యంగా 100 యుద్ధ విమానాలు,డ్రోన్లతో అక్కడి క్షిపణి,డ్రోన్ వ్యవస్థలకు భారీ నష్టం కలిగించామని ఇజ్రాయెల్ సైన్యం (ఐడీఎఫ్) ప్రకటించింది. ఇదీ చదవండి: ఇరాన్పై నిప్పుల వర్షం -
ఒక్క రోజు అమ్మాయిలకు అధికారం ఇస్తే..సూపర్ సక్సెస్!
దసరా నవరాత్రుల సందర్భంగాఉత్తర ప్రదేశ్లో హఠాత్తుగా పది జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చారు.అందరూ హైస్కూల్ గర్ల్ స్టూడెంట్లే. ‘జనతా దర్శన్’ పేరుతో సాగే ప్రజా దర్బార్లలో పాల్గొని సమస్యలు విని పరిష్కారాలకోసం నిర్ణయాలు తీసుకున్నారు. ఇది ఉత్తుత్తికి కాదు.స్త్రీ శక్తి నిరూపణ కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంచాలా సీరియస్గా నిర్వహించిన ‘ఆడపిల్లలకు ఒక రోజు అధికారం’ కార్యక్రమంలోజిల్లా యంత్రాంగం చేతులు కట్టుకుని వారి మాట వింది.ఈ అమ్మాయిలు ఈ అనుభవంతో ఐ.ఏ.ఎస్ కావాలనే తలంపునకు వచ్చారు. ప్రతి రాష్ట్రం ఇలాంటి ప్రయత్నం చేయాలి. అమ్మాయిలు చదువుకోవడం, విదేశాలకు వెళ్లి పై చదువులు చదవడం, మగవారికి మాత్రమే సాధ్యమయ్యే ఉద్యోగాలు తామూ చేయడం చూస్తూనే ఉన్నాం. చరిత్రలో మొదటిసారి అమెరికాలో అధ్యక్షపదవికి ఒక మహిళ పోటీ పడటం వరకూ ఈ మహిళా చైతన్యం సాగింది. అయినప్పటికీ మహిళల పట్ల వివక్ష, కుటుంబాలలో మగ పిల్లాడికి దక్క ప్రాధాన్యం, చదివించే విషయంలో అబ్బాయిలకు మంచి కోర్సు అమ్మాయిలకు అప్రధానమైన కోర్సు దేశంలో సాగుతూనే ఉన్నాయి. ఇలాంటి మైండ్సెట్ని మార్చడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ‘శక్తి మిషన్’ అనే కార్యక్రమం నిర్వహిస్తోంది. మహిళల స్వావలంబనే కాదు... అమ్మాయిల ఆత్మవిశ్వాసం పెంచడం ఈ కార్యక్రమం ఉద్దేశం. ఇందులో మరో ముఖ్యమైన కార్యక్రమం ‘అమ్మాయిలకు ఒకరోజు అధికారం’. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మొన్నటి అక్టోబర్ 12న దాదాపు పది జిల్లాలలో ఈ కార్యక్రమం కింద ఇంటర్ లోపు చదువుతున్న అమ్మాయిలకు జిల్లా కలెక్టర్గా, ఎస్.పి.గా, సి.డి.ఓ. (చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్గా) పూర్తి అధికారాలు ఇచ్చారు. సర్వోన్నత ఉద్యోగాల్లో ఉంటే పేదవారికి, బలహీనులకు ఎలా న్యాయం చేయవచ్చో ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థినులకు తెలియచేయడమే కాదు... వారు అధికారంలో ఉంటే మిగిలిన సిబ్బంది ఎలా వ్యవహరిస్తారో నిజంగా చేసి చూపించారు. ఆ విధంగా ఇదో స్ఫూర్తినిచ్చే కార్యక్రమం.కూరగాయల రేట్లు ఇవా?లక్ష్మీపూర్ ఖేరి జిల్లాకు ఎనిమిదవ తరగతి చదువుతున్న అగరిమ ధావన్ ఒకరోజు కలెక్టర్ అయ్యింది. ఆమె ఆ రోజు తన దగ్గరకు వచ్చిన ప్రజల సమస్యలు వింది. అందులో భాగంగా కూరగాయల రేట్లు పెరగడం వల్ల ఇబ్బంది పడుతున్నామన్న ఫిర్యాదు వింది. వెంటనే కింది స్థాయి అధికారులను పిలిచి ‘కూరగాయల రేట్లు ఇలా ఉంటే ఎలా? వీటిని క్రమబద్ధీకరించరా?’ అని ప్రశ్నించి వాటి అదుపునకు చర్యలు తీసుకోమంది. వెంటనే అందుకు తగిన చర్యలు మొదలయ్యాయి. జౌన్పూర్ జిల్లాకు ఇంటర్ చదువుతున్న సాజల్ గుప్తా కలెక్టర్ అయ్యింది. ప్రజాదర్బార్ లో 87 ఫిర్యాదులు ఆమె వద్దకు వచ్చాయి. వాటిలో 14 ఫిర్యాదులను అక్కడిక్కడే ఆమె పరిష్కరించింది తన అధికారాలతో. ఇక మహరాజ్ గంజ్కు కలెక్టర్ అయిన నిధి యాదవ్ అనే అమ్మాయి ఆ ప్రాంత వాసులకు రావాల్సిన (హైవే నిర్మాణం వల్ల) నష్టపరిహారాన్ని అప్పటికప్పుడు మంజూరయ్యేలా చేసింది. అదే జిల్లాకు ఎస్.పి.గా అధికారాలు స్వీకరించిన గోల్టీ అనే అమ్మాయి తన పరిధిలోని స్టేషన్లలో ఆడవాళ్లు ఇబ్బంది పడుతున్న కేసులను మొదటగా ఇన్వెస్టిగేట్ చేసి పరిష్కరించాలని గట్టి ఆదేశాలు ఇచ్చింది. మిర్జాపూర్, ఘాజీపూర్, షామ్లీ, శ్రావస్థి, బాందా తదితర జిల్లాలలో కూడా ఆ జిల్లాల్లో చురుగ్గా చదువుతున్న అమ్మాయిలను ఎంపిక చేసి కలెక్టర్, ఎస్.పి. బాధ్యతలు అప్పజెప్తే వారు ఒక రోజంతా అద్భుతంగా బాధ్యతలు నిర్వహించడమే కాదు... విజిట్లకు కూడా వెళ్లారు.ఒక రోజు ఆఫీసర్ఎన్.శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఒకే ఒక్కడు’ సినిమాలో అర్జున్ ఒక్క రోజు కోసం సి.ఎం. అయినా అతని నిర్ణయాలన్నీ అమలవుతాయి. ఇక్కడ కూడా ఈ అమ్మాయిలు తీసుకున్న నిర్ణయాలు అమలయ్యాయి. అమలు అయ్యేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ కార్యక్రమంలో కొన్ని జిల్లాల్లో తాసిల్దార్లుగా కూడా అమ్మాయిలను నియమించారు ఒకరోజు కోసం. కలెక్టర్గా నియమితమైన అమ్మాయి, తాసిల్దార్లుగా నియమితమైన అమ్మాయిలు కలిసి మాట్లాడుకుని ఆ రోజున తమ టేబుళ్ల మీద ఉన్న సమస్యలను చకచకా పరిష్కరించడం అందరినీ ఆకర్షించింది. ఎస్.పి.గా చేసిన అమ్మాయిలు కొందరు ఎఫ్ఐఆర్ల మీద కూడా సంతకాలు చేశారు.కలెక్టర్లమవుతాంఈ కార్యక్రమంలో పాల్గొన్న అమ్మాయిలందరూ ప్రజల సమస్యలు విన్నారు. తాము బాగా చదువుకున్న ఆ సమస్యలను పరిష్కరించే అధికార స్థానంలో వెళ్లవచ్చని గ్రహించారు. ‘మేము బాగా చదువుకుంటాం’ అని ఆత్మవిశ్వాసంతో చెప్పారు. ఈ సందర్భంగా వీరందరూ కాన్వాయ్లలో ఆఫీసులకు చేరుకున్నారు. వీరందరూ భవిష్యత్తులో ఇంతకుమించిన బాధ్యతాయుత స్థానాల్లోకి వెళ్లాలని కోరుకుందాం. -
సర్దుబాటు షాక్రూ. 8,113.60 కోట్లు
సాక్షి, అమరావతి: ఇంధన, విద్యుత్ కొనుగోలు ఖర్చు సర్దుబాటు (ఎఫ్పీపీసీఏ) చార్జీలు రూ.8,113.60 కోట్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ)కి ప్రతిపాదించినట్లు విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్) మంగళవారం వెల్లడించాయి. ఏపీఈఆర్సీ అనుమతితో గృహ విద్యుత్ వినియోగదారుల నుంచి రూ.2,194 కోట్లు, వ్యవసాయ విద్యుత్ సర్వీసుల నుంచి రూ.1901 కోట్లు, పారిశ్రామిక సర్వీసుల నుంచి రూ.2,748 కోట్లు, వాణిజ్య సర్వీసుల నుంచి రూ.669 కోట్లు, సంస్థ(ఇన్స్టిట్యూషన్స్) నుంచి రూ.547 కోట్లు చొప్పున విద్యుత్ బిల్లుల్లో అదనంగా వసూలు చేయనున్నట్లు డిస్కంలు వెల్లడించాయి. ప్రతి నెలా ఒక్కో బిల్లుపై యూనిట్కు రూ.1.27 చొప్పున వసూలు చేస్తామని తెలిపాయి. ప్రస్తుతం రాష్ట్ర విద్యుత్ వినియోగదారులపై యూనిట్కు రూ.1.65 వసూలు చేస్తున్నామని, వీటిని వచ్చే ఏడాది మార్చి వరకూ కొనసాగిస్తామని స్పష్టం చేశాయి. వీటికి తాజా ఎఫ్పీపీసీఏ చార్జీలు అదనమని పేర్కొన్నాయి. ఈ చార్జీల వసూలుకు ఏపీఈఆర్సీ అనుమతి ఇవ్వాల్సి ఉందని, ఇవ్వకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇందులో 75 శాతం భరించాల్సి ఉంటుందని డిస్కంలు స్పష్టం చేశాయి. ‘బాబు’ గుదిబండ పీపీఏ కోసమే రుణాలుగత ప్రభుత్వంలో సెకీ నుంచి 7 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలు మినహా ఎలాంటి దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకోలేదని డిస్కంలు తెలిపాయి. దీంతో స్పల్పకాలిక విద్యుత్ కొనుగోళ్లకు 2022–23లో రూ.6,522 కోట్లు వెచ్చించినట్లు పేర్కొన్నాయి. అయితే గతంలో చంద్రబాబు హయాంలో జరిగిన పీపీఏలను సమీక్షించేందుకు 2019 జూలైలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్నత స్థాయి చర్చల కమిటీని నియమించిందని, అయితే ఒప్పందం ప్రకారం చెల్లింపులు జరపాలని 2022 మార్చిలో హైకోర్టు సూచించిందని డిస్కంలు గుర్తు చేశాయి. దీనివల్ల సౌర, పవన విద్యుత్ సరఫరా దారులకు యూనిట్ రూ.2.44 చొప్పున బకాయిలు చెల్లించేందుకు రూ.9 వేల కోట్ల రుణం తీసుకోవాల్సి వచ్చిందని డిస్కంలు వెల్లడించాయి. దీన్నిబట్టి చంద్రబాబు పాపాలు విద్యుత్ సంస్థలను, రాష్ట్ర ప్రజలను వెంటాడుతున్నాయనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలని విద్యుత్తు రంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. -
పరిమాణం చిన్నది.. పనిమాత్రం పెద్దది: 'పవర్'ఫుల్ రియాక్టర్
న్యూక్లియర్ రియాక్టర్.. ఈ పేరు చదువుకునే రోజుల్లోనే చాలాసార్లు విని ఉంటారు. ఇది పవర్ ప్లాంట్స్ వంటి వాటిలో ఉపయోగిస్తారని చిన్నప్పుడే చదువుకుని ఉంటారు. అలాంటి న్యూక్లియర్ రియాక్టర్ ఇప్పుడు మన రోజువారీ వినియోగానికి ఉపయోగిస్తే?.. న్యూక్లియర్ రియాక్టర్ ఏమిటి.. రోజువారీ వినియోగానికి ఉపయోగించడమేమిటని చాలామందిలో సందేహం రావచ్చు. ఈ అనుమానం పోవాలంటే ఈ కథనం తప్పకుండా చదివేయాల్సిందే..వెస్టింగ్హౌస్ ఎలక్ట్రిక్ కంపెనీ.. ఒక మైక్రో న్యూక్లియర్ రియాక్టర్ అభివృద్ధి చేస్తోంది. స్పేస్ న్యూక్లియర్ టెక్నాలజీ ఆధారంగా కంపెనీ 'ఈవిన్సి' (eVinci) అనే న్యూక్లియర్ రియాక్టర్ రూపొందిస్తోంది. ఇది పరిమాణంలో 10 అడుగులు మాత్రమే ఉంటుంది. ఇది 15 మెగావాట్ల థర్మల్ (MWth) కోర్ డిజైన్తో 5 మెగావాట్ల పవర్ ఉత్పత్తి చేస్తుంది. దీని నుంచి వచ్చే శక్తిని అవసరమైన వాటికి ఉపయోగించుకోవచ్చు.వెస్టింగ్హౌస్ మైక్రో న్యూక్లియర్ రియాక్టర్లో ఒకసారి ఇంధనాన్ని నింపితే ఎనిమిది సంవత్సరాల పాటు నడుస్తుంది. ఇంధనం పూర్తయిన తరువాత కంపెనీ దీనిని మళ్ళీ తీసుకెళ్లి ఇంధనం నింపి ఇస్తుంది లేదా కొత్త రియాక్టర్తో రీప్లేస్ చేస్తుంది. దీనిని ఒకసారి ఒక ప్రదేశంలో ఫిక్స్ చేస్తే మళ్ళీ కదిలించాల్సిన అవసరం కూడా ఉండదు. అంతే కాకుండా దీనిని ప్రత్యేకంగా కూలింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈ రియాక్టర్లో TRISO (ట్రై స్ట్రక్చరల్ ఐఎస్ఓ ట్రాఫిక్ పార్టికల్ ఫ్యూయల్) ఇంధనం వినియోగిస్తారు.ఇదీ చదవండి: రాత్రిపూట వెలుగు ఆర్డర్ చేసుకోవచ్చు.. మీరు ఎక్కడంటే అక్కడ!ఇది పరిమాణంలో చిన్నదిగా ఉంటుంది కాబట్టి ఎక్కడికైనా తీసుకెళ్లడానికి లేదా తీసుకురావడానికి చాలా సానుకూలంగా ఉంటుంది. ఇందులో నుంచి వచ్చే శక్తిని మైనింగ్, డ్రిల్లింగ్ కార్యకలాపాలకు, పారిశ్రామిక సౌకర్యాలకు, డిస్ట్రిక్ట్ హీటింగ్, హైడ్రోజన్ ఉత్పత్తి, పరిశోధన, సైనిక స్థావరాలలో, డేటా సెంటర్లలో ఉపయోగించుకోవచ్చు.కంపెనీ ఈవిన్సి మైక్రో రియాక్టర్ ప్రిలిమినరీ సేఫ్టీ డిజైన్ రిపోర్టును డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ (DOE) నేషనల్ రియాక్టర్ ఇన్నోవేషన్ సెంటర్ (NRIC)కి అందించింది. అనుకున్నవన్నీ సజావుగా జరిగితే ఈ న్యూక్లియర్ రియాక్టర్ త్వరలోనే అందుబాటులోకి రానుందని, వీటిని ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తామని.. ఈవిన్సి టెక్నాలజీస్ ప్రెసిడెంట్ 'జోన్ బాల్' అన్నారు. -
టొరెంట్ పవర్ భారీ పెట్టుబడులు
గాంధీనగర్: ప్రయివేట్ రంగ కంపెనీ టొరెంట్ పవర్ పునరుత్పాదక(గ్రీన్) ఇంధన ప్రాజెక్టులపై భారీ పెట్టుబడులకు తెరతీయనుంది. గ్రీన్, సస్టెయినబుల్ ఎనర్జీ ప్రాజెక్టులపై మొత్తం రూ. 64,000 కోట్లుపైగా ఇన్వెస్ట్ చేయనుంది. తద్వారా 26,000 మందికి ఉపాధి కల్పించే అవకాశముంది. ఈ బాటలో పెట్టుబడుల కట్టుబాటును ప్రదర్శిస్తూ కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖకు రెండు శపథ పత్రాలను దాఖలు చేసింది.పరిశ్రమల సమాఖ్య(సీఐఐ)తో కలసి పునరుత్పాదక ఇంధన శాఖ నిర్వహించే ఆర్ఈ–ఇన్వెస్ట్ 4వ సదస్సులో భాగంగా టొరెంట్ పవర్ 2030కల్లా 10 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని అందుకునే లక్ష్యాన్ని ప్రకటించింది. తొలి శపథ పత్రంలో భాగంగా సుమారు రూ. 57,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 25,000 మందికి ఉద్యోగావకాశాలు లభించే వీలుంది. ఇందుకు ద్వారకలో 5 గిగావాట్ల సోలార్ లేదా విండ్ లేదా రెండింటి కలయికతో హైబ్రిడ్ పవర్ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు గుజరాత్ ప్రభుత్వంతో తాజాగా అవగాహనా ఒప్పందాన్ని(ఎంవోయూ) కుదుర్చుకుంది.ఇక రెండవ శపథ పత్ర ప్రకారం ఏడాదికి లక్ష కిలో టన్నుల సామర్థ్యంతో గ్రీన్ అమోనియా ఉత్పత్తికి ప్లాంటును ఏర్పాటు చేయనుంది. ఇందుకు రూ. 7,200 కోట్లు వెచ్చించనుంది. తద్వారా 1,000 మందికి ఉపాధి లభించనుంది. దేశంలోని విద్యుత్ రంగ దిగ్గజాలలో ఒకటైన టొరెంట్ పవర్ భారత్ పునరుత్పాదక ప్రయాణంలో భాగమయ్యేందుకు కట్టుబడి ఉన్నట్లు కంపెనీ చైర్మన్ సమీర్ మెహతా పేర్కొన్నారు. -
గుళికల ప్యాకెట్ను తెచ్చిన కోతి.. టీ పొడి అనుకుని..
రాజానగరం: ఓ కోతి చేసిన పనికి వృద్ధ దంపతులు కన్నుమూశారు. రాజానగరం మండలంలోని పల్లకడియం గ్రామానికి చెందిన వెలుచూరి గోవిందు (75), అప్పాయమ్మ (70) దంపతులకు ఒక కుమారుడు, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. కుమారుడు తన పిల్లల చదువు కోసం కుటుంబంతో సహా రాజమహేంద్రవరంలో ఉంటున్నారు. ముగ్గురు కుమార్తెలకు వివాహాలు చేశారు. గోవిందు, అప్పాయమ్మ మాత్రమే తమ ఇంట్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం గోవిందు, అప్పాయమ్మల ఇంటి నుంచి ఒక టీ పొడి ప్యాకెట్ను కోతి ఎత్తుకుపోయింది. మరుసటి రోజు శుక్రవారం ఉదయం వేరొక ఇంటి నుంచి పంటలకు ఉపయోగించే విష గుళికల మందు ప్యాకెట్ను తీసుకువచ్చి వీరి ఇంటి పెరటిలో పడేసింది. కళ్లు సరిగా కనిపించని అప్పాయమ్మ పెరటిలో పడి ఉన్న ప్యాకెట్ను తన ఇంటి నుంచి కోతి తీసుకువెళ్లిందేనని భావించి దానితో టీ పెట్టింది. ఆ టీని తన భర్తకు ఇచ్చి, తాను కూడా తాగింది. కొద్దిసేపటికే వారిద్దరూ నోటి నుంచి నరుగులు కక్కుతూ పడిపోయారు. ఇరుగు పొరుగువారు చూసి హుటాహుటిన రాజమహేంద్రవరం ఆస్పత్రికి తీసుకువెళ్లగా, అప్పటికే మరణించారు. ఈ మేరకు రాజానగరం పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలకు శనివారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
డిస్కంల నష్టాలు రూ.57,448 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి విద్యుత్ సరఫరాకు చేస్తున్న వ్యయంతో పోలిస్తే వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్న బిల్లులు, సబ్సిడీల రూపంలో వచ్చే ఆదాయం తక్కువగా ఉండటంతో.. విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కం) నష్టాలు ఏటేటా పేరుకుపోతున్నాయి. గత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రాష్ట్రంలోని రెండు డిస్కంల నష్టాలు కలిపి మొత్తం రూ.57,448 కోట్లకు ఎగబాకాయి. అందులో రూ.39,692 కోట్ల నష్టాలు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్)వే కాగా, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎన్పిడీసీఎల్) నష్టాలు రూ.17,756 కోట్లు ఉన్నాయి. 2023–24లో రెండు డిస్కంలు మరో రూ.6,299.29 కోట్ల నష్టాలను మూటగట్టుకున్నాయి. టీజీఎస్పీడీసీఎల్, టీజీఎన్పిడీసీఎల్ సంస్థలు 2023–24కి సంబంధించిన తమ చివరి త్రైమాసిక నివేదికల్లో ఈ విషయాన్ని వెల్లడించాయి. ఏటేటా పెరుగుతున్న నష్టాలు: గృహాలు, వ్యవసాయం, పరిశ్రమలు, వాణిజ్యం, ఇతర అన్ని కేటగిరీల వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరాలో కీలకమైన డిస్కంలు ఏటేటా భారీ నష్టాలు మూటగట్టుకోవడం ఆందోళన కలిగిస్తోంది. 2017–18 ముగిసే నాటికి రూ.28,209.26 కోట్లకు పెరిగిన డిస్కంల నష్టాలు, 2018–19 ముగిసే నాటికి రూ.36,231.47 కోట్లకు చేరాయి. 2020 మార్చి 31 నాటికి రూ.రూ.42,292 కోట్లకు ఎగబాకినట్టు తాజాగా డిస్కంలు బహిర్గతం చేసిన వార్షిక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 2022–23 నాటికి 51,149.98 కోట్లు ఉన్న నష్టాలు 2023–24 నాటికి రూ.57,448 కోట్లకు చేరాయి. రూ.45,241 కోట్లకు చేరిన అప్పులు: రెండు డిస్కంల దీర్ఘకాలిక రుణాలు రూ.23,895.27 కోట్లకు, స్వల్ప కాలిక రుణాలు రూ.21,345.73 కోట్లకు పెరిగాయి. దీంతో డిస్కంల మొత్తం రుణాలు రూ.45,241 కోట్లకు చేరాయి. విద్యుదుత్పత్తి కంపెనీలకు బిల్లుల చెల్లింపులతోపాటు ఉద్యోగులకు జీతాల చెల్లింపుల కోసం డిస్కంలు ఎడాపెడా స్వల్పకాలిక రుణాలు తీసుకుంటున్నాయి. దీనికితోడు పంపిణీ వ్యవస్థ సామర్థ్యం పెంపుదల కోసం భారీగా దీర్ఘకాలిక రుణాలు పొందాయి. బకాయిలు రూ.44,744 కోట్లు తెలంగాణ జెన్కో, ఏపీ జెన్కో, సింగరేణి తదితర విద్యుదుత్పత్తి సంస్థల నుంచి కొనుగోలు చేసిన విద్యుత్కి సంబంధించిన బకాయిలతోపాటు ఇతర అన్ని బకాయిలు కలిపి రెండు డిస్కంలు చెల్లించాల్సిన బకాయిలు రూ.44,744.3 కోట్లను ఎగబాకాయి. ఇటు అప్పులు, అటు చెల్లించాల్సి ఉన్న బకాయిలు భారీగా పెరిగిపోవడంతో రెండు డిస్కంలు దివాళాబాటలో నడుస్తున్నాయి. ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలు వెంటిలేటర్గా మారి డిస్కంల దీపం ఆరిపోకుండా కాపాడుతున్నాయి. -
నాడు విద్యుత్ పొదుపు భేష్
సాక్షి, అమరావతి: విద్యుత్ పొదుపులో ఆంధ్రప్రదేశ్ తీసుకున్న చర్యలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖకు చెందిన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ(బీఈఈ) ఇటీవల వెల్లడించింది. రాష్ట్రంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో ఉజాలా పథకం ద్వారా అందరికీ ఎల్ఈడీ బల్బులు అందుబాటులోకి తీసుకురావడం, వీధి దీపాల జాతీయ పథకం, వ్యవసాయ బోర్లకు విద్యుత్ ఆదా పంపు సెట్లు అమర్చడం వంటి ప«థకాలు సమర్థవంతంగా అమలయ్యాయి.రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీలు, పంచాయతీలలో దాదాపు 29 లక్షల ఎల్ఈడీ వీధి దీపాలను ఎప్పటికప్పుడు పునరుద్ధరిస్తూ ఇతర రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలిచింది. అదే విధంగా బీఈఈ ఆధ్వర్యంలో భవనాల్లో భారీ ఎత్తున విద్యుత్ పొదుపు సాధించేందుకు ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ (ఈసీబీసీ) అమలు, రవాణా రంగంలో కాలుష్య నియంత్రణకి ఉద్దేశించిన ఎలక్ట్రిక్ వాహనాల(ఈ–మొబిలిటీ) పథకంలో విద్యుత్ వాహనాలకు రాయితీలు కల్పించడంలో దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇటువంటి చర్యల ద్వారా రాష్ట్రంలో భారీగా విద్యుత్ ఆదాతో పాటు కర్బన ఉద్గారాలు తగ్గినట్లు బీఈఈ తెలిపింది. తద్వారా రాష్ట్ర విద్యుత్ వినియోగదారులకు, విద్యుత్ సంస్థలకు రూ.కోట్లలో ఆర్థిక ప్రయోజనం చేకూరినట్లు వివరించింది.ఉజాలా పథకంలో ఆదా ఇలా..దేశ వ్యాప్తంగా వార్షిక విద్యుత్ ఆదా – 47,882 మిలియన్ కిలోవాట్లు రాష్ట్రంలో వార్షిక విద్యుత్ ఆదా – 2,863 మిలియన్ కిలోవాట్లు ›దేశంలో వార్షిక విద్యుత్ వ్యయంలో మిగులు– రూ. 19,153 కోట్లు, రాష్ట్రంలో వార్షిక విద్యుత్ వ్యయంలో మిగులు – రూ.1,145 కోట్లు. దేశంలో పీక్ డిమాండ్ తగ్గుదల – 9,586 మెగావాట్లు రాష్ట్రంలో పీక్ డిమాండ్ తగ్గుదల – 573 మెగావాట్లుదేశంలో కర్బన ఉద్గారాల నియంత్రణ – 3,87,84,253 టన్నులు రాష్ట్రంలో కర్బన ఉద్గారాల నియంత్రణ – 33,18,461 టన్నులువీధి దీపాల జాతీయ పథకంలో ఆదా ఇలా.. దేశంలో వార్షిక విద్యుత్ ఆదా – 8,989.66 మిలియన్ కిలోవాట్లు రాష్ట్రంలో వార్షిక విద్యుత్ ఆదా – 1,980 మిలియన్ కిలోవాట్లు దేశ వ్యాప్తంగా పీక్ డిమాండ్ తగ్గుదల– 1,498 మెగావాట్లు రాష్ట్రంలో పీక్ డిమాండ్ తగ్గుదల– 330 మెగావాట్లుజాతీయ స్థాయిలో కర్బన ఉద్గారాల నియంత్రణ – 6.19 మిలియన్ టన్నులురాష్ట్రంలో కర్బన ఉద్గారాల నియంత్రణ – 1.36 మిలియన్ టన్నులు విద్యా సంస్థల్లో ఎనర్జీ క్లబ్లురాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు ఇంధన సామర్థ్య ఫలాలను అందించేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నాం. బీఈఈ ఆర్థిక సహకారంతో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) ద్వారా రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో ఇప్పటికే సుమారు 1,000 ఇంధన సామర్థ్య క్లబ్(ఎనర్జీ క్లబ్)లను ఏర్పాటు చేశాం. వీటి ద్వారా విద్యుత్ పొదుపుపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో పాటు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం’’ – కె విజయానంద్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శివిద్యుత్ ఆదాలో తెలుగు రాష్ట్రాల కృషి ప్రశంసనీయంవిద్యుత్ ఆదా, లైఫ్మిషన్ అమలులో దక్షిణాది రాష్ట్రాలు, ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలు చేస్తున్న కృషిని చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ (సీఐసీ) హీరాలాల్ సమారియా కొనియాడారు. రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని అన్ని వర్గాల ప్రజలకు పర్యావరణహిత జీవన విధానాల కోసం మిషన్లైఫ్లో భాగస్వామ్యం కావాలని సమారియా పిలుపునిచ్చారు. బీఈఈ దక్షిణాది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మీడియా సలహాదారు ఎ.చంద్రశేఖర్రెడ్డి ఢిల్లీలో సమారియాతో సోమవారం భేటీ అయ్యారు. ఏపీ సాధించిన విజయాలకు సంబంధించిన సమగ్ర నివేదికను సమారియాకు చంద్రశేఖరరెడ్డి అందించారు. – సీఐసీ హీరాలాల్ సమారియా -
సుప్రీం కోర్టు తీర్పు.. విద్యుత్ రేట్లు పెరుగుతాయా?
భారత అత్యున్నత న్యాయస్థానం ఇటీవల మైనింగ్ రాయల్టీ కేసును విచారించి తీర్పును వెలువరించింది. ఖనిజాలు, గనులు కలిగి ఉన్న భూమిపై పన్నులు విధించే అధికారం రాష్ట్రాలకు ఉందని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. దాంతో మైనింగ్ కంపెనీలపై దాదాపు రూ.2 లక్షల భారం పడవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. భారతీయ మైనింగ్ రంగం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక పన్ను రేట్లను ఎదుర్కొంటుందని భారతీయ ఖనిజ పరిశ్రమల సమాఖ్య (ఫిమి) పేర్కొంది. సుప్రీం కోర్టు తీర్పు వల్ల మైనింగ్, ఉక్కు, విద్యుత్, బొగ్గు రంగాల్లోని సంస్థలు గణనీయంగా ప్రభావితం అవుతాయని ఫిమి విచారం వ్యక్తం చేస్తుంది. బొగ్గుపైనే ఆధారపడి విద్యుత్ తయారు చేసుకునే రాష్ట్రాలు ఇతర దేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవాలని యోచిస్తున్నాయి.సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఏప్రిల్ 1, 2005 నుంచి మైనింగ్ కంపెనీలు రాష్ట్రాలకు రాయల్టీలు చెల్లించాల్సి ఉంటుంది. ఖనిజాలు, గనులు ఎక్కువగా ఉన్న జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కంపెనీలు దీనివల్ల ఎక్కువగా ప్రభావితం చెందుతాయి. బొగ్గు ఎక్కువ వెలికితీసి ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసేది ఆ రాష్ట్రాలే. అయితే బొగ్గునే ఆధారంగా చేసుకుని విద్యుత్ తయారు చేసుకునే రాష్ట్రాలకు కోర్టు తీర్పుతో నష్టం జరిగే అవకాశం ఉందని కొందరు నిపుణులు భావిస్తున్నారు. రాష్ట్రాలకు రాయల్టీలు చెల్లించాలనే ఉద్దేశంతో కంపెనీలు బొగ్గు ధరను పెంచే ప్రమాదం ఉంది. అందుకు అనుగుణంగా రాష్ట్రాల ట్రాన్స్కోలు విద్యుత్ యూనిట్ ధరను పెంచుతాయి. అంతిమంగా సామాన్య ప్రజలపై భారం పడుతుంది. దాంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై స్థానిక ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది.ఇదీ చదవండి: రూ.30 వేలకోట్ల ప్రాజెక్ట్లకు కేబినెట్ ఆమోదంఇప్పటికే చాలా రాష్ట్రాలు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ను అందిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా కొన్ని రాష్ట్రాల్లో గృహావరాలకు సైతం ఉచితంగా విద్యుత్ను అందిస్తామని పార్టీలు హామీ ఇచ్చాయి. ఆ పార్టీలే అధికారంలోకి రావడంతో విద్యుత్ సరఫరా భారంగా మారుతుంది. దానికితోడు సుప్రీం కోర్టు తీర్పు ప్రభావం చూపబోతుండడంతో విద్యుత్ తయారీకి అవసరమయ్యే బొగ్గును చౌకగా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని యోచిస్తున్నాయి. దేశీయ బొగ్గును మండిస్తే బూడిద ఎక్కువగా వెలువడి సామర్థ్యం తగ్గుతుందని గతంలో కొన్ని సర్వేలు వెల్లడించాయి. చైనా వంటి దేశాల్లోని బొగ్గుతో తక్కువ బూడిద వస్తుండడంతో దాన్ని దిగుమతి చేసుకునే అవకాశం ఉంది. ఇదిలాఉండగా, సుప్రీం కోర్టు తీర్పు వల్ల అంతిమ ఉత్పత్తులపై ప్రభావం పడుతుంది. దాంతో ద్రవ్యోల్బణం పెరుగుతుంది. పన్నుల విధానాన్ని స్థిరీకరించేందుకు, మైనింగ్ రంగం వృద్ధికి కేంద్ర ప్రభుత్వం శాసనపరమైన చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. -
పవర్ కమిషన్ కొత్త చైర్మన్ పై కొనసాగుతున్న సస్పెన్స్
-
‘పవర్ కమిషన్ విచారణపై సుప్రీంకోర్టు తీర్పు స్వాగతిస్తున్నాం’
సాక్షి, హైదరాబాద్: పవర్ కమిషన్ విచారణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘పవర్ కమిషన్ చైర్మన్ మార్చాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. వెంటనే జడ్జిని ఎవరిని నియమిస్తారో సుప్రీంకోర్టుకు ప్రభుత్వం తెలియజేయాలి. విచారణ న్యాయబద్ధంగా జరగడం లేదు. కమిషన్ విచారణ పారదర్శకంగా జరగాలి. రాష్ట్రంలో సమస్యలను పక్కదారి పట్టించేలా కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఉంది. ఇప్పటికైనా కమిషన్ల పేరుతో కాలయాపన మానుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారులు కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నారు’ అని కేటీఆర్ అన్నారు. చదవండి: TG: పవర్ కమిషన్కు సుప్రీంకోర్టు షాక్ -
TG: పవర్ కమిషన్కు సుప్రీంకోర్టు షాక్
సాక్షి,న్యూఢిల్లీ: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లపై విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన విద్యుత్ కమిషన్కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. కమిషన్ను రద్దు చేయాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు మంగళవారం(జులై 16) విచారణ జరిపింది. పిటిషన్ను విచారించిన సందర్భంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా(సీజేఐ) డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కమిషన్ చైర్మన్ రిటైర్డ్ జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డిని మార్చాలని బెంచ్ ఆదేశించింది. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ ఎల్.నర్సింహారెడ్డి తీరుపై సీజేఐ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రెస్మీట్ పెట్టి విచారణకు సంబంధించిన విషయాలపై ఓపెన్గా ఎలా మాట్లాడతారని సీజేఐ ప్రశ్నించారు.న్యాయమూర్తి విచారణ చేయడమే కాకుండా నిష్పక్షపాతంగా ఉన్నట్లు కనిపించాలని వ్యాఖ్యానించారు. కాగా, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చైర్మన్ను మార్చడానికి తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకున్నట్లు తెలిసింది. లంచ్ తర్వాత కొత్త చైర్మన్ ఎవరనేది చెబుతామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీంతో పిటిషన్ విచారణను లంచ్ తర్వాతకు కోర్టు వాయిదా వేసింది. విచారణలో కేసీఆర్ తరపున సీనియర్న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించగా తెలంగాణ ప్రభుత్వం తరపున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. అడ్వకేట్ జనరల్తో సీఎం రేవంత్ మంతనాలు .. కొత్త చైర్మన్ ఎవరనేదానిపై చర్చ పవర్ కమిషన్ చైర్మన్ ఎల్.నర్సింహారెడ్డిని మార్చాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సమయంలో సీఎం రేవంత్రెడ్డి హైదరాబాద్ సచివాలయంలో కలెక్టర్ల సమావేశంలో ఉన్నారు. ఆదేశాల గురించి తెలియగానే కలెక్టర్ల సమావేశ హాల్ నుంచి వెళ్లి అడ్వకేట్ జనరల్(ఏజీ) సుదర్శన్రెడ్డితో మంతనాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త చైర్మన్గా ఎవరిని నియమించాలన్నదానిపై సీఎం ఏజీతో చర్చిస్తున్నట్లు సమాచారం. -
‘నాణ్యమైన విద్యుత్కు కట్టుబడి ఉన్నాం’
అమరావతి:’రాష్ట్రంలోని అన్ని వర్గాలకు నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ‘మిషన్ లైఫ్’ కార్యక్రమానికి సంబంధించి బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) సలహాదారు చంద్రశేఖర్రెడ్డి రూపొందించిన పోస్టర్ను సీఎం విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఇళ్లు, పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్తును అందిస్తామని తెలిపారు. ఇంధన సామర్థ్య నిర్వహణకు సాయం చేసే ఉపకరణాల వినియోగంపై ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామని పేర్కొన్నారు -
‘పవర్ కమిషన్’ లీకులు ఇవ్వడమేంటి: జగదీష్రెడ్డి
సాక్షి,హైదరాబాద్: విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించి కేసీఆర్పై నింద వేద్దామనే ఉద్దేశంతోనే ఆరోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి జగదీష్రెడ్డి అన్నారు. ఛత్తీస్గఢ్ నుంచి కేసీఆర్ ఒక్కరే విద్యుత్ కొనుగోలు ఒప్పందం రాసుకోలేదని, అప్పటి ఛత్తీస్గఢ్ సీఎం రమణ్సింగ్ కూడా సంతకం చేశారన్నారు.తెలంగాణ రాష్ట్ర డిమాండ్ మేరకు విద్యుత్ ప్రాజెక్టులను కేసీఆర్ నిర్మించారని చెప్పారు. జస్టిస్ నర్సింహారెడ్డి నేతృత్వంలోని పవర్ కమిషన్కు తన వాదనను మెయిల్ రూపంలో పంపించిన అనంతరం శనివారం(జూన్29) ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు ప్రభుత్వాల మధ్య లంచాలకు ఎక్కడైనా ఆస్కారం ఉంటుందా అని ప్రశ్నించారు. విచారణ కమిషన్ మీడియా సమావేశం పెట్టి లీకులు ఇవ్వడంపై అభ్యంతరం తెలిపాను. ‘సబ్ క్రిటికల్ టెక్నాలజీతో దేశంలో 2017 నాటికి 17 పవర్ ప్రాజెక్టులు నిర్మాణం అవుతున్నాయి. భద్రాద్రి 800 మెగావాట్లతో సూపర్ క్రిటికల్ టెక్నాలజీ, యాదాద్రి సబ్ క్రిటికల్ టెక్నాలజీతో పవర్ ప్లాంట్ల నిర్మాణం చేపట్టాం.కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమోతో సబ్ క్రిటికల్, సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అనే తేడా లేకుండా పోయింది. అన్నీ అనుకూలంగా వున్న తర్వాతనే దామరచర్లలో యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టాం. బొగ్గు కేటాయింపు కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది. ప్రతి పవర్ ప్లాంట్ 10 శాతం విదేశీ బొగ్గును వాడాలని కేంద్ర ప్రభుత్వం రూల్ పెట్టింది. సింగరేణి బొగ్గు ఉండటం వల్ల విదేశీ బొగ్గుకు మేం ఒప్పుకోలేదు’అని చెప్పారు. -
‘విద్యుత్’ విచారణలో దాపరికం లేదు: తెలంగాణ సర్కార్ వాదనలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు వేసిన పిటిషన్పై వాదనలు ముగిశాయి. దీంతో హైకోర్టును తీర్పును రిజర్వ్ చేసింది. గత బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయంటూ తెలంగాణ ప్రభుత్వం వేసిన జ్యూడిషియల్ కమిషన్ను రద్దు చేయాలని కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. గురువారం సైతం ఈ పిటిషన్పై విచారణ జరగ్గా.. ఇవాళ సైతం వాదనలు కొనసాగాయి. విద్యుత్ కొనుగోళ్లలో ఎక్కడా అవకతవకలు జరగలేదని.. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా కమిషన్ ఏర్పాటైందని కేసీఆర్ తరఫు న్యాయవాది ఆదిత్య సోందీ వాదించారు. ఇవాళ ప్రభుత్వం తరుపున ఏజీ సుదర్శన్రెడ్డి వాదనలు వినిపించారు. ‘‘కమిషన్ ఏర్పాటు విషయంలో కోర్టులు కలుగజేసుకోలేవు. 15 మంది సాక్ష్యులను ఇప్పటి వరకు కమిషన్ విచారించింది. అందులో ట్రాన్స్కో, జెన్కో అధికారులున్నారు. ప్రభాకర్రావును సైతం విచారించింది. కేసీఆర్కు కమిషన్ ఏప్రిల్లో నోటీసులు జారీ చేసింది. పార్లమెంట్ ఎన్నికల కారణంగా జూలై వరకు రావడం కుదరదని చెప్పారు. జూన్ 30 వరకు కమిషన్ గడువు ముగుస్తున్నందున జూన్ 15న రావాలని కోరాం.వివరాలు ఎవరి ద్వారా అయినా పంపినా ఓకే.. లేదా కేసీఆర్ స్వయంగా వస్తానంటే ఆ మేరకు తగిన ఏర్పాట్లు కూడా చేస్తామని కమిషన్ అత్యంత మర్యాదపూర్వకంగా లేఖలో కోరింది. గతంలోనూ కమిషన్లు మీడియాకు వివరాలు వెల్లడించాయి. ఇది బహిరంగ కమిషన్. విచారణలో దాపరికం ఏమీ లేదు. జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి ఎక్కడా పక్షపాత ధోరణితో మాట్లాడలేదు. విచారణకు రావాల్సిన వారికి 8బీ నోటీసులు జారీ చేసే అధికారం కమిషన్లకు ఉంటుంది. బీఆర్ఎస్ కూడా సభలో పలు విషయాలపై కమిషన్ ఏర్పాటు చేస్తామని గతంలో పేర్కొంది అని వాదించారు. ఈ క్రమంలో కేసీఆర్ పిటిషన్ విచారణ స్వీకరించవద్దని ఏజీ కోరగా.. పిటిషన్ను విచారణకు అనుమతించడంపైనే వాదనలు వినిపించాలని, మెరిట్స్లోకి వెళ్లవద్దని ఏజీకి ధర్మాసనం సూచించింది. మరోవైపు.. ఏజీ వాదనలపై కేసీఆర్ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో కమిషన్ సభ్యులు పక్షపాత వ్యాఖ్యలు చేయలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జ్యుడిషియల్ విచారణగా నోటిఫికేషన్లో పేర్కొన్నప్పుడు.. నివేదిక ఇవ్వాలే తప్ప మీడియాకు వివరాలు వెల్లడించకూడదని, విద్యుత్ రంగానికి తీవ్ర నష్టం వాటిల్లిందని ముందే చెప్పి.. కారకులెవరో తేల్చమన్నారని, ఇది అసలు సరికాదని కేసీఆర్ తరఫు న్యాయవాది ఆదిత్య సోందీ వాదించారు. ఈ క్రమంలో ఇరువైపులా వాదనలు పూర్తి కావడంతో.. తీర్పును రిజర్వ్ చేసింది ధర్మాసనం. ఇవాళ లేదంటే సోమవారం తీర్పు వెల్లడిస్తామని జడ్జి తెలిపారు. -
సమస్య ఉంటే ఈ నంబర్లకు కాల్ చేయండి
సాక్షి, హైదరాబాద్: ఈదురుగాలులతో కూడిన వర్షానికి తరచూ ఫీడర్లు ట్రిప్పవుతున్నాయి. చెట్ల కొమ్మలు విరిగి పడుతుండటంతో వైర్లు తెగుతున్నాయి. విద్యుత్ స్తంభాలు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు నేలకూలుతున్నాయి. దీనితో గంటల తరబడి సరఫరా నిలిచిపోతోంది. అలాంటి సమయంలో వినియోగదారులు 1912 కాల్ సెంటర్/ మొబైల్యాప్లో/ స్థానిక లైన్మన్లకు సమాచారం ఇచ్చినా స్పందించడం లేదనే ఫిర్యాదులు ఉన్నాయి. ఈ క్రమంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలకు ఆస్కారం ఇవ్వకూడదనే ఉద్దేశంతో సర్కిళ్ల వారీగా ప్రత్యేక కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు.సర్కిల్ పేరు ఫోన్ నంబర్ హైదరాబాద్ సెంట్రల్ 9491629047 హైదరాబాద్ సౌత్ 9491628269 సికింద్రాబాద్ 9491629380 బంజారాహిల్స్ 9491633294 సైబర్సిటీ 9493193149 రాజేంద్రనగర్ 7382100322 సరూర్నగర్ 7901679095 హబ్సిగూడ 9491039018 మేడ్చల్ 7382618971 వికారాబాద్ 9493193177విద్యుత్ సరఫరా, తలెత్తుతున్న సాంకేతిక సమస్యలు, చేపట్టిన అభివృద్ధి పనులపై గతంలో నెలకోసారి రివ్యూలు నిర్వహించేవారు. ప్రస్తుతం రోజు ఉదయం 8.30 గంటలకే టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తున్నాం. బ్రేక్ డౌన్లు, గృహజ్యోతి దరఖాస్తులు, సేవల్లో లోపాలపై ఆన్లైన్లో అందుతున్న ఫిర్యాదులపై చర్చిస్తున్నాం. అంతర్గత సామర్థ్యం పెంపు, నష్టాల నియంత్రణపైనా చర్యలు చేపట్టాం. అత్యవసర పరిస్థితుల్లో సీజీఎంలు, ఎస్ఈలు, డీఈలు, ఏడీ ఈలు, ఏఈలు, జూనియర్ లైన్మెన్లు, ఆరి్టజన్లు అంతా అందుబాటులో ఉండేలా ఆదేశాలిచ్చాం. అర్ధరాత్రి, భారీ వర్షాలను సైతం లెక్క చేయకుండా లైన్ల పునరుద్ధరణ పనులు చేపడుతున్నాం. బ్రేక్డౌన్, ఇతర అంతరాయాలను చాలా వరకు తగ్గించాం.సరఫరా మెరుగుపడాలంటే ఏం చేయాలి? ⇒ విద్యుత్ స్తంభాల పాలిట ఉరితాళ్లుగా మారిన టీవీ, ఇంటర్నెట్ కేబుళ్లను తక్షణమే తొలగించాలి. ⇒ లైన్ టు లైన్ తనిఖీలు చేపట్టి అనధికారిక కనెక్షన్లను తొలగించాలి. అంతర్గత భారీ నష్టాల నుంచి సంస్థను గట్టెక్కించాలి. ⇒ ఏబీ స్విచ్ల నాణ్యతను పరిశీలించాలి. సరఫరాలో హెచ్చుతగ్గుల నియంత్రణ, షార్ట్ సర్క్యూట్ల నియంత్రణ కోసం ఎర్తింగ్ సిస్టంను పకడ్బందీగా ఏర్పాటు చేయాలి. ⇒ చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో భూగర్భ కేబుళ్లు, ఎయిర్ బంచ్డ్ కేబుళ్లు ఏర్పాటు చేస్తే.. ఈదురుగాలులతో సరఫరా నిలిచే సమస్య తలెత్తదు. ⇒ భూగర్భ విద్యుత్ కేబుళ్ల ఏర్పాటు కోసం ప్రత్యేకంగా డక్ట్ సిస్టం ఏర్పాటు చేయాలి. ⇒ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి. అక్కడి చెత్తను ఎప్పటికప్పుడు తొలగించడం ద్వారా అగ్ని ప్రమాదాలను నివారించొచ్చు. ⇒ ఏఈలు, ఏడీఈలు కేవలం కొత్త కనెక్షన్ల జారీ, మీటర్ రీడింగ్లపైనే దృష్టి సారిస్తున్నారు. వారు సాంకేతిక అంశాలపైనా దృష్టి సారించేలా చర్యలు చేపట్టాలి. ⇒ కోర్సిటీలో ఇప్పటికీ నిజాం కాలం నాటి లైన్లే ఉన్నాయి. చాలాచోట్ల ఒకే స్తంభం నుంచి ఎల్టీ, హెచ్టీ లైన్లు వెళ్తున్నా యి. ప్రమాదాలను నివారించేందుకు వీటిని వేరు చేయాలి. ⇒ కొందరు జూనియర్ లైన్మన్లు.. అనధికారికంగా ఎలాంటి అనుభవం, అవగాహన లేని ప్రైవేటు వ్యక్తులను అసిస్టెంట్లుగా నియమించుకుని.. వారితో పనులు చేయిస్తున్నారు. అలాంటి వారిని గుర్తించి, చర్యలు తీసుకోవడం ద్వారా సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చూడొచ్చు. -
పవన విద్యుత్తుకు రాష్ట్రమే బెస్ట్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన విద్యుత్ సంస్కరణల ఫలితంగా పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం భారీగా పెరుగుతోంది. ఇందులో పవన విద్యుత్ది ప్రథమ స్థానం. రాష్ట్రంలో పవన్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 9.8 శాతం పెరిగింది. పవన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం దేశవ్యాప్తంగా 8 శాతం పెరిగితే మన రాష్ట్రంలో అంతకంటే 1.8 శాతం ఎక్కువగా ఉంది. దేశంలోనే 6వ స్థానంలో ఏపీ నిలిచింది. రాష్ట్రంలో ఉన్న 9009.973 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్లో పవన విద్యుత్ వాటా 4083.37 మెగావాట్లుగా ఉంది. పవన విద్యుత్ను పెంచడం ద్వారా దేశంలో మిలియన్లకు పైగా ఉద్యోగాలను సృష్టించవచ్చని గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ (జీడబ్ల్యూఈసీ) పేర్కొంది.అందుబాటులో టారిఫ్దీర్ఘకాల పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల (పీపీఏ)తో ఆర్థ్ధికంగా కుదేలవుతున్న డిస్కంలకు ఊరట కలిగిస్తూ ఏపీఈఆర్సీ పవన విద్యుత్ ధరలను నిర్ణయించింది. చాలా తక్కువ ధరకు పవన్ విద్యుత్ లభిస్తుంది. పవన విద్యుత్ ఉత్పత్తి సంస్థలతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్న డిస్కంలు తొలి పదేళ్లు యూనిట్కు రూ. 3.43 చొప్పున చెల్లించాలని ఏపీఈఆర్సీ తెలిపింది. 11వ సంవత్సరం నుంచి 20 ఏళ్ల వరకు యూనిట్కు రూ.2.64 చెల్లించాలని తెలిపింది. అనుకూలమని తేల్చిన అధ్యయనాలువాతావరణంలో వస్తున్న మార్పులతో ఏపీలో పవన విద్యుత్కు అత్యంత అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెటీయెరాలజీ (పూణె) పరిశోధకులు వెల్లడించారు. ఉత్తరాది రాష్ట్రాల్లో గాలి వేగం తగ్గి, ఏపీలో పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఏపీలోని సముద్రతీర ప్రాంతాలపై గాలి సామర్ధ్యం పెరుగుతున్నట్లు ‘కపుల్డ్ మోడల్ ఇంటర్–కంపారిజన్ ప్రాజెక్ట్’ ప్రయోగాల్లో తేలింది. ప్రస్తుతం రోజుకి 15 మిలియన్ యూనిట్ల నుంచి 20 మిలియన్ యూనిట్ల మధ్య పవన విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. భవిష్యత్తులో ఇది మరింత పెరుగుతుందని ఇంధన శాఖ అధికారులు చెబుతున్నారు. -
కేసీఆర్ కు నోటీసులు
-
మార్కెట్ అల్లకల్లోలం
లోక్సభ తాజా ఫలితాలలో ఎన్డీఏ 300 సీట్లకంటే తక్కువకు పరిమితం కానున్నట్లు స్పష్టమవడంతో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా ఆందోళన చెందారు. మార్కెట్ ఆరంభం నుంచే అమ్మకాలకు దిగారు. దీంతో సెన్సెక్స్ 6,234 పాయింట్లు, నిఫ్టీ 1,982 పాయింట్ల చొప్పున కుప్పకూలాయి. చివరికి కొంత కోలుకుని 4,390 పాయింట్ల నష్టంతో 72,079 వద్ద సెన్సెక్స్ నిలిచింది. 1,379 పాయింట్లకు నిఫ్టీ నీళ్లొదులుకుని 21,885 వద్ద ముగిసింది.ఇది రెండు నెలల కనిష్టంకాగా.. ఇంట్రాడేలో సెన్సెక్స్ 70,234కు పడిపోయింది. వెరసి ఎగ్జిట్ పోల్స్ కారణంగా సోమవారం ఇన్వెస్టర్లకు అందిన 3 శాతం లాభాలు ఒక్క రోజు తిరగకుండానే ఆవిరయ్యాయి. అంతేకాకుండా రికార్డ్ గరిష్టాలు 76,469, 23,264 పాయింట్ల స్థాయిల నుంచి సెన్సెక్స్, నిఫ్టీ గత నాలుగేళ్లలోలేని విధంగా భారీగా పతనమయ్యాయి! ఇంతక్రితం కోవిడ్–19 మహమ్మారి కట్టడికి కేంద్రం లాక్డౌన్ ప్రకటించడంతో దేశీ స్టాక్ మార్కెట్లు 2020 మార్చి 23న ఇంతకంటే అధికంగా 13 % కుప్పకూలిన సంగతి తెలిసిందే!! పీఎస్యూ షేర్లు ఫట్ మోడీ ప్రభుత్వానికి స్పష్టమైన మెజారిటీ లభించకపోవడంతో ప్రభుత్వ రంగ కౌంటర్లు తీవ్రంగా నష్టపోయాయి. ప్రధానంగా ఆర్ఈసీ 24 శాతం, పీఎఫ్సీ 22%, బీఈఎంఎల్, కంకార్, బీఈఎల్, బీహెచ్ఈఎల్ 19%, హెచ్ఏఎల్ 17%, ఓఎన్జీసీ, మజ్గావ్ డాక్ 16%, రైల్టెల్, ఎన్టీపీసీ, కోల్ ఇండియా 14%, ఆర్వీఎన్ఎల్ 13%, ఐఆర్సీటీసీ, పవర్గ్రిడ్, బీపీసీఎల్ 12% చొప్పున దిగజారాయి. ఇక పీఎస్యూ బ్యాంక్స్లో యూనియన్ బ్యాంక్, బీవోబీ, పీఎన్బీ, కెనరా బ్యాంక్, ఎస్బీఐ 18–13% మధ్య కుప్పకూలాయి. దీంతో పీఎస్ఈ ఇండెక్స్ 16%పైగా క్షీణించింది. ఎన్ఎస్ఈలో బ్యాంకెక్స్ 2022 ఫిబ్రవరి తదుపరి అత్యధికంగా 8% పతనమైంది. ఎదురీదిన ఎఫ్ఎంసీజీ.. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో అన్ని రంగాలూ దెబ్బతిన్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్, మెటల్, చమురు, రియలీ్ట, క్యాపిటల్ గూడ్స్, విద్యుత్ 15–6 శాతం మధ్య పతనమయ్యాయి. ఎఫ్ఎంసీజీ మాత్రం 1 శాతం బలపడింది. ప్రభుత్వేతర దిగ్గజాలలో ఎల్అండ్టీ, శ్రీరామ్ ఫైనాన్స్,టాటా స్టీల్, ఇండస్ఇండ్, హిందాల్కో, ఐసీఐసీఐ, జేఎస్డబ్ల్యూ, భారతీ, యాక్సిస్ 16–7 శాతం మధ్య క్షీణించాయి. అయితే హెచ్యూఎల్, బ్రిటానియా, నెస్లే, హీరో మోటో, టాటా కన్జూమర్ 6–2 % మధ్య జంప్ చేశాయి.అదానీ గ్రూప్ బేర్.. అదానీ గ్రూప్ కౌంటర్లు భారీగా పతనమై ముందురోజు ఆర్జించిన లాభాలను పోగొట్టుకోవడంతోపాటు మరింత నష్టపోయాయి. అదానీ పోర్ట్స్ 21 శాతం, ఎనర్జీ సొల్యూషన్స్ 20 శాతం దిగజారగా.. గ్రీన్ ఎనర్జీ, ఎంటర్ప్రైజెస్, టోటల్ గ్యాస్, ఎన్డీటీవీ 19 శాతం, అదానీ పవర్, అంబుజా సిమెంట్స్ 17 శాతం చొప్పున పతనమయ్యాయి. ఏసీసీ 15 శాతం, అదానీ విల్మర్ 10 శాతం పడ్డాయి. అత్యధిక శాతం షేర్లు కొనేవాళ్లులేక లోయర్ సర్క్యూట్లను తాకాయి. ఫలితంగా గ్రూప్లోని 10 లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువకు ఒక్క రోజులో రూ. 3.64 లక్షల కోట్లమేర కోతపడింది. రూ. 15.78 లక్షల కోట్లకు పరిమితమైంది. -
పవర్ ప్లాంట్లపై రష్యా దాడి.. ఉక్రెయిన్లో విద్యుత్ సంక్షోభం
ఉక్రెయిన్పై రష్యా నిరంతర దాడులను కొనసాగిస్తూనే ఉంది. తాజాగా ఇంధన మౌలిక సదుపాయాలపై దాడికి దిగింది. తూర్పు డొనెట్స్క్ ప్రావిన్స్లోని పలు పవర్ ప్లాంట్లను ధ్వంసం చేసింది. దీంతో ఉక్రెయిన్లోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రష్యా తాజాగా ఉక్రెయిన్లోని పవర్ ప్లాంట్లను లక్ష్యంగా చేసుకుని డ్రోన్, క్షిపణి దాడులను చేపట్టంది. దీంతో ఉక్రెయిన్లోని మూడు ప్రాంతాలు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో విద్యుత్తు నిలిచిపోయింది. ఈ దాడుల్లో 19 మందికిపైగా జనం మంది గాయపడ్డారు. ఉక్రెయిన్ ప్రభుత్వ విద్యుత్ గ్రిడ్ ఆపరేటర్ ఉక్రెనెర్గో మాట్లాడుతూ రష్యా చేపడుతున్న దాడులతో విద్యుత్ అంతరాయాలు ఏర్పడ్డాయని, ఇవి పారిశ్రామిక, గృహ వినియోగదారులను తీవ్రంగా ప్రభావితం చేశాయన్నారు. ఇటీవలి కాలంలో ఉక్రెయిన్ పవర్ గ్రిడ్పై రష్యా చేస్తున్న దాడులు దేశవ్యాప్తంగా బ్లాక్అవుట్ను విధించేలా చేశాయన్నారు.గత ఏప్రిల్లో కీవ్లోని భారీ థర్మల్ పవర్ ప్లాంట్పై రష్యా దాడి చేసింది. మే 8న మరో పవర్ ప్లాంట్పై దాడి జరిగింది. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ సంస్థలు తీవ్రంగా నష్టపోయాయి. మరోవైపు డొనెట్స్క్ ప్రాంతంలోని ఉమాన్స్కే గ్రామాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు రష్యా ప్రకటించింది. రష్యా ఇప్పుడు ఉత్తర సుమీ, చెర్నిహివ్ ప్రాంతాలలోకి చొచ్చుకుపోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోందని ఉక్రెయిన్ అధికారిక వర్గాలు చెబుతున్నాయి.ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ సింగపూర్లో జరిగిన ఆసియా ప్రధాన భద్రతా శిఖరాగ్ర సమావేశంలో మాట్లాడుతూ ఉక్రెయిన్ యుద్ధంపై త్వరలో జరగబోయే శాంతి సమావేశానికి అడ్డుపడేందుకు రష్యాకు చైనా సహకారం అందిస్తున్నదని ఆరోపించారు. -
ఏపీలో ఆల్ టైం హై విద్యుత్ వినియోగం!
-
‘మిట్టీకూల్’: మట్టితో ఫ్రిడ్జ్!..కరెంట్తో పనిలేదు..!
రిఫ్రిజిరేటర్... సామాన్య భాషలో ఫిడ్జ్. ఒకప్పుడూ అది అపురూపమైన వస్తువు. ధనికులు మాత్రమే దీన్ని ఉపయోగించేవారు. ఇప్పుడూ మధ్య తరగతి ఇళ్లల్లో కూడా ఇవి దర్శనమిస్తున్నాయి. కానీ పేదవాళ్లకు మాత్రం ఇప్పటికీ అపురూపమైన వస్తువే. పైగా కొనాలంటే రూపాయి, రూపాయి పోగు చేసుకుని అప్పోసొప్పో చేసుకుని కొంటారు. పైగా దీన్ని వేసవిలోనే జాగ్రత్తగా వాడుకుంటారు. ఎందుకంటే..? దీనికి అయ్యే కరెంట్ బిల్లు కూడా ఎక్కువే. ఒకవేళ పాడైతే బాగు చేయించుకోవాలన్న కష్టమే. అలాంటి వాటికి చెక్పెట్టేలా ఎకో ప్రెండ్లీగా మట్టితో ఫ్రిడ్జ్ని ఆవిష్కరించారు గుజరాత్కి చెందిన డ భాయ్ ప్రజాపతి. ఎలా రూపొందించారంటే..‘మిట్టీకూల్’ ఫ్రిడ్జ్..ఇది పూర్తిగా బంకమన్నుతో తయారైన ఫ్రిజ్. అందుకే దీనికి ‘మిట్టీకూల్’ ఫ్రిడ్జ్ అని పేరు పెట్టి, మార్కెట్లోకి తెచ్చాడు ,మన్సుఖ్ . ఈ ఫ్రిడ్జ్ కు విద్యుత్ అవసరం లేదు. ఎటువంటి మరమ్మత్తులూ చేయాల్సిన పని లేదు. అయినా అద్భుతంగా పని చేస్తుంది. సాధారణ గది ఉష్ణోగ్రతలో రెండు రోజుల్లోనే పాడైపోయే కూరగాయలను ఇందులో భద్రపరిస్తే, ఐదారు రోజులు నిక్షేపంగా నవనవలాడుతూ తాజాగా ఉంటాయి. పెరుగు, దోశె పిండి లాంటివి కూడా పుల్లబడకుండా ఉంటాయి. జ్యూసులు, నీళ్లు పెడితే చల్లబడతాయి. ఇందులో 5 కిలోల కూరగాయలు, పండ్లను నిల్వ చేయవచ్చు. విద్యుత్ కోతలు తరచుగా ఉండే ప్రాంతాల్లో, మట్టి రిఫ్రిజిరేటర్ను ఉపయోగిస్తున్నారు. మిట్టి కూల్లో పైన ఉన్న అరలో 2 లీటర్ల నీటిని పోయాలి. ఈ ఫ్రిజ్ బాష్పీభవన సూత్రాలపై పనిచేస్తుంది. దీనికి నిర్వహణ ఖర్చు కూడా ఉండదని కనగరాజ్ తెలిపారు.విద్యుత్ అవసరం లేదుసాధారణంగా విద్యుత్ ఆధారితంగా పనిచేసే ఫ్రిడ్జ్లో ఉంచిన వస్తువులు తింటే కొంత అనారోగ్యానికి గురవుతారు. కాని మట్టితో తయారు చేసి.. సహజసిద్దంగా ఉండే మట్టితో తయారు చేసి ఈ మిట్టి కూల్ లోని వస్తువులు తింటే ఎలాంటి అనారోగ్యం రాదని చెబుతున్నారు. అందుకే ప్రస్తుతం తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ఈ మిట్టి కూల్ కు అత్యంత డిమాండ్ ఉంది. ఇందులో ఉంచిన ఆహార పదార్ధాల్లో రుచిలో ఎలాంటి మార్పు రాదంటున్నారు మన్సుక్భాయ్ ప్రజాపతి.ప్రజాపతి నేపథ్యం..ప్రజాపతి గుజరాత్లోని రాజ్కోట్లోని మోర్బిలోని నిచ్చిమండల్ గ్రామంలో జన్మించాడు. ప్రతికూల ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువుకు స్వస్తి చెప్పి.. కుటుంబ పోషణ కోసం కూలీ పనులు చేసేవాడు. అతను చిన్నతనం నుంచి సాంప్రదాయక మట్టి వస్తువుల తయారీపై సమగ్రమైన పరిజ్ఞానం ఉంది. దీంతో 1988లో ప్రజాపతి రూ. 30,000 చెల్లించి మట్టి పలకల తయారీకి సంబంధించిన తన సొంత కర్మాగారాన్ని ప్రారంభించాడు. కానీ మట్టి చిప్పల మన్నిక గురించి అతనికి చాలా ప్రతికూల అభిప్రాయాలు వచ్చాయి. అయినప్పటికీ పలు ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. అలా 1990లో అతని కంపెనీ రిజిస్టర్ అయ్యింది.ఇక 2001లో మిట్టికూల్ ట్రేడ్ మార్క్ రిజిస్టర్ చేయబడింది. ఆ తర్వాత 2002 నుంచి పూర్తి స్థాయిలో దీనిపై పనిచేయడం మొదలు పెట్టారు. అదే ఏడాది GIANగా ప్రసిద్ధి చెందిన గ్రాస్రూట్స్ ఇన్నోవేషన్ ఆగ్మెంటేషన్ నెట్వర్క్తో ప్రపంచానికి పరిచయమై.. ఈ మిట్టీకూల్ గురించి అందరికీ తెలియడం జరిగింది. ఇక బ్రిటన్, జర్మనీల్లో జరిగిన ప్రదర్శనల్లో ఈ ఫ్రిడ్జ్ను చూసి, అక్కడి శాస్త్రవేత్తలు ప్రశంసలు కురిపించారు. విద్యుత్తుతో పనిచేసే ఫ్రిజ్లతో పోలిస్తే, ఈ మట్టి ఫ్రిజ్ ఖరీదు చాలా తక్కువ. దీని ఖరీదు రూ. 8,500/అంతే!.(చదవండి: జపాన్ బుల్లెట్ రైలు తరాతని మార్చిన కింగ్ఫిషర్!) -
తూర్పు ఏజెన్సీలో కరెంట్ కష్టాలకు చెక్ పెట్టిన వైఎస్ జగన్
-
సౌరశక్తి ఉత్పాదనలో జపాన్ను తలదన్నిన భారత్
భారత్ 2023లో సౌరశక్తి ఉత్పాదనలో జపాన్ను వెనక్కి నెట్టి, ప్రపంచంలోనే మూడో అతిపెద్ద సౌరశక్తి ఉత్పాదక దేశంగా అవతరించింది. గ్లోబల్ ఎనర్జీ సెక్టార్లో పనిచేస్తున్న పరిశోధనా సంస్థ అంబర్ తన నివేదికలో ఈ విషయాన్ని తెలిపింది.2015లో సౌరశక్తి వినియోగంలో భారత్ తొమ్మిదో స్థానంలో నిలిచింది. భారత్ గత కొన్ని ఏళ్లుగా సౌరశక్తి వినియోగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. దాని ఫలితమే ఈ విజయం. ‘గ్లోబల్ ఎలక్ట్రిసిటీ రివ్యూ’ పేరుతో అంబర్ ఈ నివేదికలో 2023లో ప్రపంచ విద్యుత్ ఉత్పత్తిలో 5.5 శాతం సౌరశక్తి రూపంలో లభించిందని పేర్కొంది. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి వృద్ధి 2023లో ఆశా జనకంగా ఉందని, అయితే చైనాలో కరువు కారణంగా జలవిద్యుత్ ఉత్పత్తి ఐదేళ్ల కనిష్టానికి పడిపోయిందని ఆ నివేదిక పేర్కొంది.ప్రపంచంలో అత్యంత చౌకైన సౌరశక్తిని ఉత్పత్తి చేసే దేశం భారతదేశం అయితే అత్యంత ఖరీదైన సౌరశక్తిని ఉత్పత్తి చేసే దేశం కెనడా. 2023 నాటికి భారతదేశం సౌరశక్తి ఉత్పత్తి విషయంలో ప్రపంచంలోనే నాల్గవ దేశంగా నిలిచింది. ఈ విషయంలో చైనా, అమెరికా, బ్రెజిల్లు అగ్రస్థానంలో ఉన్నాయి. సౌరశక్తి వృద్ధిలో ఈ నాలుగు దేశాల వాటా 2023లో 75 శాతంగా ఉంది. జపాన్.. భారత్ తరువాతి స్థానంలో నిలిచింది.భారతదేశంలో విద్యుత్ ఉత్పత్తిలో సౌరశక్తి సహకారం 2015లో 0.5 శాతంగా ఉండగా, ఇది 2023లో 5.8 శాతానికి పెరిగింది. సౌర శక్తి 2030 నాటికి ప్రపంచ విద్యుత్ ఉత్పత్తిలో 22 శాతానికి పెరగనున్నదనే అంచానాలున్నాయి. 2030 నాటికి పునరుత్పాదక సామర్థ్యాన్ని మూడు రెట్లు పెంచాలని యోచిస్తున్న కొన్ని దేశాలలో భారతదేశం ఒకటి. -
చీకటి రాత్రులకు బ్రేక్
ప్రతి సర్వీసుకీ ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్ విద్యుత్ ప్రమాదాలు జరగడానికి, సరఫరా నష్టాలు రావడానికి ఫీడర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, లైన్లు బలంగా లేకపోవడం, ఓవర్ లోడ్ కావడమే ప్రధాన కారణం. ఈ సమస్యను తగ్గించడానికి కొత్త సబ్స్టేషన్లు నిర్మించడంతో పాటు పాత సబ్స్టేషన్లలో ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెరిగింది. ట్రాన్స్కో పరిధిలో ఉన్న 220కేవీ, 132 కేవీ లైన్లను పాతవి బాగుచేయడంతో పాటు కొత్తవి వేశారు.డిస్కంల పరిధిలోని 33 కేవీ, 11కేవీ లైన్లు మార్చారు. సబ్ స్టేషన్లలో పవర్ కెపాసిటర్లు ఏర్పాటు చేశారు.ప్రతి వ్యవసాయ సర్విసుకీ ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి విద్యుత్ ఇస్తున్నారు. ఫలితంగా ప్రస్తుతం రాష్ట్రంలో 19.92 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు నాణ్యమైన విద్యుత్ అందుతోంది. ‘మా ప్రాంతంలో మొత్తం విద్యుత్పై ఆధారపడే వ్యవసాయం చేస్తారు. గత ప్రభుత్వంలో 7 గంటలు విద్యుత్ అని ప్రకటించినా అందులో ఒకటి రెండు గంటలపాటు కోతలు ఉండేవి. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పగటి పూట 9 గంటలు నిరంతరాయంగా విద్యుత్ అందిస్తున్నారు. దీనివల్ల కూలీలతో పనిచేయించుకొని, చేను మొత్తం తడపడానికి వీలవుతోంది.గతంతో హెచ్టీ, ఎల్టీ లైన్లు ఒకే స్తంభంపై ఉండేవి. దీనివల్ల కొద్దిపాటి గాలికే కలిపిపోయి ట్రాన్స్ఫార్మర్, మోటార్లు కాలిపోయేవి. ఇప్పుడా సమస్య లేదు. గతంలో రోజుకి ఏడు గంటలు రాత్రి సమయాల్లో సేద్యానికి విద్యుత్ ఇవ్వడం వల్ల పొలాల్లోనే ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు ఒకే స్పెల్లో ఇవ్వడంతో చేను మొత్తం ఒకేసారి తడుస్తోంది’. – సూర్పని రామకృష్ణ, ఉద్యాన రైతు, కొమ్ముగూడెం సాక్షి, అమరావతి: ‘సేద్యానికి విద్యుత్ లోటు రాకూడదు. రైతులకు ఇచ్చే విద్యుత్కు ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుంది. వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దెబ్బతింటే 48 గంటల్లోనే బాగుచేయడం, లేదా కొత్తది ఇవ్వాలి. ఎలాంటి జాప్యం ఉండకూడదు. సర్విసు కూడా అడిగిన వెంటనే మంజూరు చేయాలి. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలుగకూడదు’.అంటూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పిన మాటలను ఈ ప్రభుత్వం అక్షర సత్యం చేసింది.పంటలకు నీటి కొరత లేకుండా చేసి రైతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు అవసరమైన అన్ని చర్యలను ఆచరణలో పెట్టింది. పగటిపూట 9 గంటలు నిరంతరాయంగా ఉచిత విద్యుత్ అందించేందుకు ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చర్యలు చేపట్టింది. అందుకు అనుగుణంగా ముందుగా వ్యవసాయ విద్యుత్ ఫీడర్లను ఆధునీకరించి ఉచిత విద్యుత్ సరఫరాకు అనుకూలంగా మార్చింది. గతమెంతో ‘హీనం’ రాష్ట్రంలో వ్యవసాయ ఫీడర్లు ఏడాదికి దాదాపు 15,700 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగంలో ఉండేవి. ఇది రాష్ట్రంలో ఏడాదికి జరిగే 64 వేల నుంచి 66 వేల మిలియన్ యూనిట్ల వినియోగంలో దాదాపు నాలుగింట ఒక వంతు. జూన్ 2019కి ముందు, ఏడు గంటల విద్యుత్ సరఫరాకే గ్యారెంటీ ఉండేది కాదు.అప్పుడు దాదాపు 18 లక్షల వ్యవసాయ సర్విసులకు ఒకేసారి విద్యుత్ ఇవ్వాల్సిన అవసరం ఉండేది కాదు. అయినప్పటికీ వాటికే సరిపెట్టలేక రాత్రి పూట సహా రెండు, మూడు విడతల్లో విద్యుత్ అందించేవారు. కానీ ప్రస్తుత ప్రభు త్వం పగటి పూట విద్యుత్ సరఫరా అందిస్తోంది. దానికి తగ్గట్టుగా ప్రణాళికలు రచించి అమలు చేసింది. రెట్టింపైన ఫీడర్లు టీడీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 6,663 ఫీడర్లలో కేవలం 3,854 మాత్రమే వ్యవసాయ విద్యుత్ సరఫరా చేయడానికి అందుబాటులో ఉండేవి. దానిని మెరుగుపరచడం కోసం చంద్రబాబు ఏమాత్రం దృష్టి సారించలేదు. కానీ వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే దాదాపు రూ.1,700 కోట్లను కేటాయించింది.దీంతో ఏపీ ట్రాన్స్కో, ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు తమ తమ పరిధిలో ఫీడర్ల ఆధునికీకరణ చేపట్టాయి. రూ.1200.20 కోట్లతో 32 ప్యాకేజీలలో మౌలిక సదుపాయాల పనులను పూర్తి చేశాయి. పెరిగిన 6,735 ఫీడర్లలో 6,605 ఫీడర్లకు పగటిపూట 9 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయగల సామర్థ్యం వచ్చింది. -
ఉప్పల్ స్టేడియానికి కరెంట్ కట్
సాక్షి, హైదరాబాద్: కొన్ని నెలల నుంచి బిల్లులు చెల్లించకపోవడంతో ఉప్పల్ స్టేడియానికి విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. రేపు(శుక్రవారం) ఉప్పల్ స్టేడియం వేదికగా హైదరాబాద్, చెన్నై మధ్య మ్యాచ్ జరగనుంది. ఆ జట్లు ప్రాక్టీస్ చేస్తుండగా పవర్ కట్ అయ్యింది. కీలక మ్యాచ్కు ముందు బిల్లులు చెల్లించకపోవడంతో విద్యుత్ అధికారులు పవర్ కట్ చేశారు. ఉప్పల్ స్టేడియం నిర్వాహకులు విద్యుత్ బిల్లులు చెల్లించకుండా రూ.1.67 కోట్లు విద్యుత్ వాడుకున్నారని విద్యుత్ శాఖ వెల్లడించింది. పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని పలుమార్లు నోటీసులు ఇచ్చిన కానీ హెచ్సీఏ పట్టించుకోలేదని, నోటీసులకు స్పందించకపోవడంతోనే విద్యుత్ సరఫరాను కట్ చేసినట్లు విద్యుత్ అధికారులు పేర్కొన్నారు. ఉప్పల్ స్టేడియం నిర్వాహకులపై విద్యుత్ చౌర్యం కేసు నమోదైంది. బిల్లులు చెల్లించకుండా విద్యుత్ వాడుకున్నారన్న విద్యుత్ శాఖ.. 15 రోజుల క్రితం నోటీసులు పంపించామని హబ్సిగూడ ఎస్ఈ రాముడు వెల్లడించారు. ప్రస్తుతం ఉప్పల్ స్టేడియంలో జనరేటర్తో పవర్ను సరఫరా చేస్తున్నారు. -
చేతులు కలిపిన అంబానీ– అదానీ
న్యూఢిల్లీ: బిలియనీర్ పారిశ్రామిక దిగ్గజాలు ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ తొలిసారి చేతులు కలిపారు. దీనిలో భాగంగా అదానీ పవర్కు చెందిన పవర్ ప్రాజెక్టులో రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) 26 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. అంతేకాకుండా మధ్యప్రదేశ్లోని ఈ ప్లాంటుకు చెందిన 500 మెగావాట్ల యూనిట్లో ఉత్పత్తయ్యే విద్యుత్ను ఆర్ఐఎల్ సొంత అవసరాలకు వినియోగించుకునేందుకు రెండు సంస్థలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. వెరసి అదానీ పవర్ పూర్తి అనుబంధ సంస్థ మహన్ ఎనర్జెన్ లిమిటెడ్లో 5 కోట్ల ఈక్విటీ షేర్లను ఆర్ఐఎల్ సొంతం చేసుకోనుంది. రూ. 10 ముఖ విలువకే(రూ. 50 కోట్లు) వీటిని చేజిక్కించుకోవడంతోపాటు.. 500 మెగావాట్ల విద్యుత్ను సొంత అవసరాలకు ఆర్ఐఎల్ వినియోగించుకోనుంది. సొంత వినియోగ పాలసీలో భాగంగా ఆర్ఐఎల్ 20 ఏళ్ల దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని(పీపీఏ) ఎంఈఎల్తో కుదుర్చుకున్నట్లు అదానీ పవర్ వెల్లడించింది. మొత్తం 2,800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ సామర్థ్యంతో ఏర్పాటవుతున్న ఎంఈఎల్ ప్లాంటులో 600 మెగావాట్ల యూనిట్ను సొంత అవసరాల పద్ధతిలో తెరతీయనున్నట్లు వివరించింది. -
విద్యుత్ నాణ్యతలో ఏపీ నంబర్ 1
సాక్షి, అమరావతి: ఇంధన సామర్థ్యం.. విద్యుత్ పొదుపు.. పర్యావరణ పరిరక్షణ చర్యల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్ర స్థానంలో దూసుకుపోతోంది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) శనివారం విడుదల చేసిన స్టేట్ ఎనర్జీ ఎఫిషియెన్సీ ఇండెక్స్ (ఎస్ఈఈఐ)–2023లో ఏపీ ప్రథమ స్థానం (గ్రూప్–2లో) దక్కించుకుంది. దేశంలోని అనేక పెద్ద రాష్ట్రాలను సైతం వెనక్కి నెట్టి ఏపీ ముందువరుసలో నిలిచింది. అలయన్స్ ఫర్ ఎనర్జీ ఎఫిషియెంట్ ఎకానమీ (ఏఈఈఈ) సహకారంతో రూపొందిన ఈ ఇండెక్స్లో 5 మిలియన్ టన్నుల నుంచి 15 మిలియన్ టన్నుల చమురుకు సమానం (ఎంటీఓఈ) అయిన ఇంధనాన్ని ఆదా చేసిన రాష్ట్రాలను గ్రూప్–2గా విభజించగా, వాటిలో ఏపీ 83.25 పాయింట్లు తెచ్చుకుని ఈ ఘనత సాధించింది. 2022లో ఇదే ఇండెక్స్లో ఏపీ టాప్–5లో నిలిచింది. ఏడాదిలోనే వేగంగా మెరుగుపడి టాప్–1కి చేరుకుంది. 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో భవనాలు, పరిశ్రమలు, మునిసిపల్, రవాణా, వ్యవసాయం, విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లలో ఇంధన సామర్థ్య విధానాలు, కార్యక్రమాలు, పెట్టుబడులు వంటి దాదాపు 65 అంశాలను పరిగణలోకి తీసుకుని నిర్వాహకులు ఈ పాయింట్లను నిర్థారించారు. ఏపీ విధానాల కారణంగానే అగ్రస్థానం 100కి 60 కంటే ఎక్కువ పాయింట్లు సాధించిన రాష్ట్రాలను ఫ్రంట్ రన్నర్, 50 నుంచి 59.75 పాయింట్లు వచ్చిన వాటిని అచీవర్, 30 నుంచి 49.75 పాయింట్లు వస్తే కంటెండర్, 30 కంటే తక్కువ పాయింట్లు వస్తే ఆస్పిరెంట్ రాష్ట్రాలుగా బీఈఈ విభజించింది. ఇందులో మన రాష్ట్రం అత్యధిక ప్రదర్శన కనబరిచింది. రాష్ట్రంలో ఇంధన సామర్థ్యానికి ప్రత్యేక విధానాలను రూపొందించడం ద్వారా అనేక విధానాలను అవలంబించడం, ఆర్థిక ప్రోత్సాహకాలు, సామర్థ్యాన్ని పెంపొందించడం, వివిధ సహకార కార్యక్రమాలను చేపట్టడం ద్వారా ఏపీ ముందంజలో నిలిచింది. భవన నిర్మాణ రంగంలో ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ను రాష్ట్రం తప్పనిసరి చేసింది. పట్టణ/స్థానిక సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంధన సామర్థ్య ఉపకరణాలపై దృష్టి పెట్టింది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో ఎనర్జీ ఆడిట్ను తప్పనిసరి చేసింది. రవాణా రంగంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ తీసుకువచ్చింది. విద్యుత్ వాహనాలు, చార్జింగ్ స్టేషన్లను ప్రోత్సహిస్తోంది. మునిసిపాలిటీల్లో విద్యుత్ ఆదా చేసే వీధి దీపాలు, నీటి పంపింగ్(ఎనర్జీ ఎఫిషియెన్సీ పంపుసెట్లు) సరఫరా వ్యవస్థలను ఏర్పాటు చేసింది. ప్రసార, పంపిణీ నష్టాలను తగ్గించే చర్యలు తీసుకుంది. వ్యవసాయంలో సమీకృత నీరు, విద్యుత్ పొదుపు, పద్ధతులను ప్రోత్సహిస్తోంది. ఇలాంటి విప్లవాత్మక చర్యలు కారణంగా ఎనర్జీ ఇండెక్స్లో దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. -
వాటర్ప్రూఫ్ పవర్స్టేషన్
ఆరుబయట విహారయాత్రలకు వెళ్లేటప్పుడు వెంట తీసుకుపోవడానికి వీలుగా పోర్టబుల్ పవర్ స్టేషన్లు రకరకాలకు చెందినవి ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. వాతావరణం పొడిగా ఉన్నప్పుడు వీటితో ఇబ్బందేమీ ఉండదు గాని, అకస్మాత్తుగా వాన కురిసి, వాన నీటి వల్ల వీటి లోపలి భాగాలు తడిస్తే మాత్రం ప్రమాదాలు తలెత్తే అవకాశాలు లేకపోలేదు. నీరు పడినా ఎలాంటి ప్రమాదం లేకుండా ఉండేలా ఆస్ట్రేలియన్ కంపెనీ ‘ఆర్క్ప్యాక్’ ప్రపంచంలోనే మొట్టమొదటి వాటర్ప్రూఫ్ పోర్టబుల్ పవర్స్టేషన్ను ‘ఆర్క్ ఐపీ67’ బ్రాండ్ పేరుతో అందుబాటులోకి తెచ్చింది. ఇది 1500 డబ్ల్యూహెచ్ సామర్థ్యంతో పనిచేస్తుంది. ఏకకాలంలో పదకొండు ఎలక్ట్రానిక్ పరికరాలను దీని ద్వారా చార్జింగ్ చేసుకోవడానికి తగిన వెసులుబాటు ఉండటం విశేషం. ఆరుబయట విహారయాత్రలకు వెళ్లేటప్పుడు, బోటు షికార్లకు వెళ్లేటప్పుడు వెంట తీసుకుపోయి, ఎక్కడ కావాలనుకున్నా ఉపయోగించుకోవడానికి అనువుగా దీనిని తీర్చిదిద్దారు. దీని ధర 1,999 డాలర్లు (రూ.1.66 లక్షలు). -
మొబైల్ తరహాలోనే విద్యుత్కూ రీచార్జ్
సాక్షి, అమరావతి:విద్యుత్ వినియోగదారులందరినీ ప్రీపెయిడ్ మీటర్ల నెట్వర్క్ పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ (ఆర్డీఎస్ఎస్)లో భాగంగా దేశవ్యాప్తంగా 19.79 కోట్ల విద్యుత్ సర్వీసులు, 52.19 లక్షల డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు (డీటీఆర్), 1.88 లక్షల ఫీడర్లకు ప్రీపెయిడ్ లేదా స్మార్ట్మీటర్లు బిగించాలనుకుంటోంది. ఈ మేరకు మీటర్ల బిగింపు, అమలు ప్రక్రియపై స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) జారీ చేసింది. ప్రీపెయిడ్ మీటర్లు బిగించుకునేవారు ఒక నెలలో ఎంతమేర విద్యుత్ వాడుతున్నారో ఆ మేరకు విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు ముందుగా చెల్లించి రీచార్జ్ చేసుకోవాలి. రీచార్జ్ మొత్తం అయిపోగానే వినియోగదారుల మొబైల్కు మూడుసార్లు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం పంపాలి. ప్రతి కస్టమర్కు రూ.300 అరువు ఇచ్చేలా.. ప్రతి వినియోగదారునికీ గరిష్టంగా రూ.300 క్రెడిట్ ఇవ్వాలని కేంద్రం సూచించింది. అంటే రూ.1,000 రీచార్జ్ చేసుకుంటే అదనంగా రూ.300 కరెంట్ను వాడుకునే వెసులుబాటు కల్పించాలి. ముందుగా చెల్లించిన రూ.1,000లో వినియోగం పూర్తవుతూ రూ.50 మిగిలి ఉండగానే రీచార్జ్ చేసుకునేలా తొలి సందేశం పంపాలి. రీచార్జ్ మొత్తం అయిపోయాక మరోసారి, క్రెడిట్గా ఇచ్చిన రూ.300 కరెంట్ను వాడుకున్న తర్వాత మూడోసారి సందేశం ఇచ్చి ఆ తరువాత విద్యుత్ సరఫరా నిలిపివేయాలని (డిస్కనెక్ట్) కేంద్రం సూచించింది. వినియోగదారులు మళ్లీ రీచార్జ్ చేసుకున్న 15 నిమిషాల్లోపే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని స్పష్టం చేసింది. ప్రీపెయిడ్ మీటర్లు బిగించాక మొబైల్లో సంబంధిత యాప్ డౌన్లోడ్ చేయాలని, వినియోగదారులు ఈ యాప్ ఆధారంగా విద్యుత్ వినియోగాన్ని నియంత్రించుకోవచ్చని పేర్కొంది. అంటే విద్యుత్ అవసరం లేనప్పుడు మీటర్ను ఆఫ్ చేసుకోవడం ద్వారా బిల్లును ఆదా చేసుకోవచ్చు. రాష్ట్రంలో మొదలైన ప్రక్రియ విద్యుత్ పంపిణీ పునర్వ్యవస్థీకరణ పథకం (ఆర్డీఎస్ఎస్) పథకంలో భాగంగా స్మార్ట్ మీటర్లను 2025 మార్చిలోపు ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా రాష్ట్రంలోని మూడు డిస్కంలు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాయి. ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన విద్యుత్ సర్వీసులకు, వాణిజ్య, పరిశ్రమలు, గృహæ విద్యుత్ సర్వీసులకు ప్రీ–పెయిడ్ స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తున్నాయి. మొదటి విడతలో దక్షిణ డిస్కం పరిధిలో 6.19 లక్షల సింగిల్ ఫేజ్ మీటర్లు, 2.56 లక్షల త్రీ ఫేజ్ మీటర్లను ఏర్పాటు చేయనుండగా.. మధ్య డిస్కం పరిధిలో 7.23 లక్షల సింగిల్ ఫేజ్ మీటర్లు, 1.09 లక్షల త్రీ ఫేజ్ మీటర్లు అమర్చనున్నారు. తూర్పు డిస్కం పరిధిలో 6.09 లక్షల సింగిల్ ఫేజ్ మీటర్లు, 1.15 లక్షల త్రీ ఫేజ్ మీటర్లను అమర్చనున్నారు. స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్ల సరఫరా, నిర్వహణ, ఆపరేషన్ బాధ్యత మొత్తం సర్వీస్ ప్రొవైడర్లదే. ఈ మీటర్లు పెట్టడం వల్ల సమయానుసార (టైం అప్డే) టారిఫ్ విధానంలో పాల్గొనే అవకాశం వస్తుంది. విద్యుత్ కొనుగోలు ధరలు తక్కువగా ఉండే ఆఫ్ పీక్ సమయంలో వారి వినియోగాన్ని పెంచుకుని టారిఫ్ లాభం పొందే అవకాశం ఉంది. బిల్లును ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఆ బిల్లు మొత్తాన్ని ఒకేసారి కాకుండా అవసరాన్ని బట్టి చెల్లించవచ్చు. విద్యుత్ సరఫరా చేసే సమయం, విద్యుత్ నాణ్యత తెలుసుకునే అవకాశం ఉంది. -
అదిరిపోయే పవర్ సూట్లో అలియా భట్! దాని ఖరీదే ఏకంగా..!
బాలీవుడ్ నటి అలియా భట్ ప్యాషన్కి ఐకాన్లా తనదైన శైలిలో ఉంటుంది. ఏ వేడుకకు తగ్గ ట్రెండీ డ్రస్తో అందర్నీ మిస్మరైజ్ చేస్తుంటుంది. ఎప్పటి కప్పుడూ ఓ ట్రెండీ లుక్తో వస్తూ.. సరికొత్త డ్రస్సింగ్ స్టయిల్ని పరిచేయం చేస్తుంది అలియా. అందుకు నిదర్శనం ఇటీవల జాతీయ అవార్డు అందుకున్న ఘటన, అయోధ్య వేడుకలే. జాతీయ అవార్డుల ఫంక్షన్ తగ్గట్టుగా హుందాగా స్టన్నింగ్ శారీతో మంత్ర ముగ్ధుల్ని చేసింది. ఆ తర్వాత ఇటీవల అయోధ్యలో జరిగిన బాలరాముడి ప్రాణ ప్రతిష్ట వేడుకల్లో చీరపై రామాయాణ ఇతిహాస చిత్రాలతో అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఎప్పడూ కొంగొత్త స్టయిలిష్ డ్రస్లతో వార్తల్లో నిలుస్తుంటారు అలియా. మళ్లీ ఈ పవర్ ఫుల్ పవర్ సూట్తో సరికొత్త ట్రెండ్ని సెట్ చేసి హాట్టాపిక్గా మారారు. ఈ మేరకు అలియా గురువారం తన రాబోయే సిరీస్ పోచర్ ట్రైలర్ లాంచర్ కోసం అలియా ఓంబ్రే పవర్ సూట్ని ధరించారు. ఈ లుక్లో ఆమె పవర్ ఫుల్ విమెన్లా ఉంది. అందరీ కళ్లు ఆమె డ్రస్ పైనే ఉన్నాయి. ఆ సూట్కి తగ్గ హైహిల్స్, చెవిపోగులు, లైట్ మేకప్తో కళ్లు తిప్పుకోలేనంత కలర్ఫుల్గా కనిపించింది అలియా. ఇంతకీ ఆ సూట్ ధర ఎంతో తెలిస్తే కళ్లు చెదిరిపోతాయి. ఆ ఓంబ్రే ప్యాంట్ సూట్ ధర ఏకంగా రూ. 3.15 లక్షలు/- (చదవండి: మిస్ వరల్డ్ 2023 పోటీల్లో భారత్ తరఫున సినీ శెట్టి ప్రాతినిధ్యం!!) -
విద్యుత్ ఆదా కోసం ‘బిల్డింగ్ కోడ్’!
సాక్షి, అమరావతి: భవన నిర్మాణ రంగంలో విద్యుత్ ఆదా చర్యల ద్వారా పర్యావరణానికి మేలు చేసేందుకు కేంద్ర విద్యుత్ శాఖ నేతృత్వంలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియన్సీ(బీఈఈ) మరో అడుగు ముందుకేసింది. ఇప్పటికే తీసుకువచ్చిన ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్(ఈసీబీసీ) ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో సత్ఫలితాలను ఇస్తుండగా.. తాజాగా దానిని సవరిస్తూ ఎనర్జీ కన్జర్వేషన్ అండ్ సస్టైనబుల్ బిల్డింగ్ కోడ్(ఈసీఎస్బీసీ) పేరుతో కొత్త డ్రాఫ్ట్ను బీఈఈ రూపొందించింది. ఈ ముసాయిదాపై ఈ నెల 12లోగా అభ్యంతరాలు, అభిప్రాయాలు వెల్లడించాలని ప్రజలను, రాష్ట్రాలను బీఈఈ కోరింది. ఇది అమల్లోకి వస్తే కొత్తగా నిర్మించే వాణిజ్య–నివాస భవనాల్లో నిబంధనలకు అనుగుణంగా విద్యుత్ పొదుపు చర్యలను పాటించాల్సి ఉంటుంది. ఏమిటీ ముసాయిదా.. ప్రపంచంలో విద్యుత్ వల్ల వెలువడే కర్బన ఉద్గారాల్లో 39 శాతం భవన నిర్మాణ రంగం నుంచే వస్తోంది. అలాగే మొత్తం విద్యుత్ వినియోగంలో 36 శాతం భవనాల్లోనే జరుగుతోంది. పారిస్ ఒప్పందానికి అనుగుణంగా 2030 నాటికి నిర్మాణ రంగ ఇంధన డిమాండ్ను 50 శాతం తగ్గించగల సామర్థ్యం ఈసీఎస్బీసీకి ఉందని బీఈఈ గుర్తించింది. ఇంజనీర్లు, డెవలపర్లు, నిర్మాణ సంస్థల సంయుక్త సహకారంలో దీనిని విజయవంతం చేయాలని బీఈఈ భావిస్తోంది. వనరుల సంరక్షణతో పాటు వ్యర్థాలు, కాలుష్యం, పర్యావరణ క్షీణతను తగ్గించడం, పగటిపూట సహజ వెలుతురు ప్రసరణ వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ ముసాయిదాను తయారు చేసింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంధన సామర్థ్యాన్ని ప్రోత్సహించేందుకు అన్ని విభాగాలను భాగస్వామ్యం చేసిన సంగతి తెలిసిందే. గృహ, పరిశ్రమ, వ్యవసాయం సహా అనేక రంగాల్లో ఇంధన సామర్థ్య కార్యక్రమాలను అమలు చేస్తోంది. భవనాల్లో దాదాపు 5,600 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఆదా చేయవచ్చని అంచనా వేసింది. స్కూళ్లు, ఆస్పత్రులు, టీటీడీ, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఇంధన సామర్థ్య ప్రాజెక్టులతో పాటు వాణిజ్య భవనాలు, నివాస భవనాల్లో ఇంధన సంరక్షణను ప్రోత్సహించడం కోసం ఈసీబీసీని కూడా అమలు చేస్తోంది. ప్రభు త్వం ఇందుకోసం ప్రత్యేక బడ్జెట్ను కూడా అందించింది. వ్యవసాయంలో డిమాండ్ సైడ్ మేనేజ్మెంట్పై దృష్టి సారించి రైతులు, పంప్ టెక్నీషియన్లతో వివిధ అవగాహన సెషన్లను నిర్వహించింది. ఇటువంటి చర్యలతో గతేడాది జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రతిష్టాత్మక నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు–2023ను ఆంధ్రప్రదేశ్ అందుకుంది. ‘ఈసీబీసీ’లో ఏపీ ఆదర్శం వెయ్యికి పైగా భవనాల్లో ఈసీబీసీ అమలుతో పాటు 3 వేల మంది కంటే ఎక్కువ వాటాదారులకు శిక్షణ ఇవ్వడంలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించింది. వేగంగా అభివృద్ధి చెందుతూ.. విస్తరిస్తున్న విశాఖ వంటి నగరాల్లో ఈసీబీసీ అమలు వల్ల విద్యుత్ ఆదాతో పాటు కర్బన ఉద్గారాలు తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతోంది. నీటి వనరులు కూడా కలుషితం కావు. ఉత్పాదక రంగం వృద్ధి చెందుతుంది. భవన నిర్మాణ రంగంలో ఆవిష్కరణలు, పోటీతత్వం, గ్రీన్ ఉద్యోగాలు, నైపుణ్యాలు, సాంకేతికతలకు అవకాశాలు పెంచడంలో ఈ కోడ్ సహాయపడుతుంది. ఈ క్రమంలోనే విశాఖలో సూపర్ ఈసీబీసీ భవన నిర్మాణాన్ని చేపట్టిన ఏపీ.. దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. – అభయ్ భాక్రే, డైరెక్టర్ జనరల్, బీఈఈ -
ప్రత్యామ్నాయ విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి
సాక్షి, రంగారెడ్డి జిల్లా, షాబాద్: రాష్ట్ర ప్రజల భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ విద్యుత్ ఉత్పత్తికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందనవెల్లి గ్రామంలో శుక్రవారం జున్నా సోలార్ పవర్ ప్యానెల్ ఉత్పత్తి ప్లాంటును ఆయన ప్రారంభించారు. అనంతరం భట్టి మాట్లాడుతూ 2030 సంవత్సరం నాటికి డిమాండ్కు అనుగుణంగా ప్రత్యామ్నాయ విద్యుత్ను ఉత్పత్తిని చేస్తామన్నారు. విద్యుత్ రంగంపై గత ప్రభుత్వం రూ.81 వేల కోట్లకుపైగా అప్పుల భారం మోపిందని ఆయన విమర్శించారు. ఈ భారాన్ని అధిగమిస్తూ, విద్యుత్ డిమాండ్ పెరిగిపోతున్న క్రమంలో ప్రత్యామ్నాయంగా విద్యుత్ ఉత్పత్తిని పెంచుకునే దిశగా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోందని వెల్లడించారు. ఈ మేరకు సౌరశక్తి, పవనశక్తి, హైడెల్, చెత్త నుంచి తయారు చేసే కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి ప్రజల అవసరాలు తీరుస్తుందని చెప్పారు. చందనవెల్లి భూసేకరణలో అక్రమాలపై విచారణ రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని హైతాబాద్, చందనవెల్లి గ్రామాల్లో పరిశ్రమల కోసం చేసిన భూ సేకరణలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. శుక్రవారం స్థానికంగా నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన భూ బాధితులను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నిజమైన లబ్థిదారులకు పరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. -
కృష్ణా జలాలపై హక్కుల పరిరక్షణలో.. ఫలించిన సీఎం జగన్ కృషి
సాక్షి, అమరావతి: కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాలుగున్నరేళ్లుగా చేస్తున్న పోరాటం, కృషి ఫలించాయి. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్లను నెలలోగా కృష్ణా బోర్డుకు అప్పగించాలని కేంద్రం నిర్ణయిం చింది. దాంతో శ్రీశైలం, నాగార్జునసాగర్లో తెలంగాణ ప్రభుత్వ అక్రమ నీటి వినియోగానికి అడ్డుకట్ట పడుతుంది. దీనివల్ల మన రాష్ట్రానికే కాదు.. తెలంగాణకూ ప్రయోజనమే. రెండు రాష్ట్రాల హక్కులకు విఘాతం కలగదు. కృష్ణా జలాలపై హక్కుల పరిరక్షణలో సీఎం వైఎస్ జగన్ చూపిన చొరవ, పట్టుదలను నీటి పారుదల రంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు. ఆనాడు ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోవడం, రెండు కళ్ల సిద్ధాంతంతో కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను చంద్రబాబు తెలంగాణ సర్కార్కు తాకట్టు పెట్టారని, నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పరిరక్షించారని నిపుణులు కొనియాడుతున్నారు. హక్కులను తెలంగాణకు తాకట్టు పెట్టిన చంద్రబాబు రాష్ట్ర విభజన నేపథ్యంలో కృష్ణా జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా చేసేందుకు విభజన చట్టం ద్వారా 2014లో కేంద్రం కృష్ణా బోర్డును ఏర్పాటుచేసింది. బోర్డు పరిధిని నోటిఫై చేసేదాకా ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలంను ఏపీ, నాగార్జునసాగర్ను తెలంగాణ నిర్వహించాలని నిర్దేశించింది. దాంతో తెలంగాణ ప్రభుత్వం నాగార్జున సాగర్ను 2014–15లో పూర్తిగా ఆదీనంలోకి తీసుకుంది. శ్రీశైలంలో మాత్రం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం తెలంగాణలో ఉందనే సాకు చూపి దాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. అదే సాకు చూపి పులిచింతల విద్యుత్ కేంద్రాన్ని కూడా ఆధీనంలోకి తీసుకుంది. అయినా సరే.. ఆనాటి ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం కనీస ప్రయత్నం చేయలేదు. ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోవడం, తెలంగాణలోనూ టీడీపీని బతికించుకోవాలన్న స్వార్ధంతో రాష్ట్ర ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెట్టేశారు. ► శ్రీశైలం ప్రాజెక్టులో 881 అడుగుల స్థాయిలో నీటి మట్టం ఉన్నప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు 44 వేల క్యూసెక్కుల నీటిని రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు తరలించవచ్చు. నీటి మట్టం 854 అడుగుల స్థాయిలో ఉంటే ఆరేడు వేల క్యూసెక్కులే తరలించడానికి సాధ్యమవుతుంది. అంతకంటే నీటి మట్టం తగ్గితే శ్రీశైలంలో నీటి కోటా ఉన్నా సరే సీమ అవసరాలకు నీటిని వినియోగించలేని దుస్థితి. శ్రీశైలం ప్రాజెక్టులో 796 అడుగుల నుంచే రోజుకు 4 టీఎంసీలను తరలించే సామర్థ్యం తెలంగాణకు ఉంది. తెలంగాణకు దిగువన నీటి అవసరాలు లేకపోయినా కృష్ణా బోర్డు అనుమతి తీసుకోకుండానే ఎడమ గట్టు కేంద్రం నుంచి విద్యుదుత్పత్తి చేస్తూ శ్రీశైలంలో నీటిమట్టం తగ్గేలా ఆ ప్రభుత్వం చేస్తోంది. తద్వారా శ్రీశైలంలో ఏపీ వాటా జలాలు వినియోగించుకోకుండా చేస్తోంది. ► 2015లో ఇదే రీతిలో శ్రీశైలం నుంచి సాగర్కు తెలంగాణ తరలించిన నీటిని.. కుడి కాలువ కింద సాగు అవసరాల కోసం విడుదల చేయాలని అప్పటి రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ చేసిన విజ్ఞప్తిని తెలంగాణ తోసిపుచ్చింది. దాంతో రాష్ట్ర భూభాగంలోని సాగర్ స్పిల్ వేలో 13 గేట్లతోపాటు కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ను స్వాధీనం చేసుకుని, రాష్ట్ర హక్కులను పరిరక్షించడానికి 2015, ఫిబ్రవరి 13న పోలీసులతో కలిసి ఆదిత్యనాథ్ దాస్ నాగార్జునసాగర్కు వచ్చారు. అయితే ఆనాటి సీఎం చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంతో రాజకీయంగా లబ్ధి పొందాలనే లక్ష్యంతో.. వాటిని స్వాధీనం చేసుకోకుండా తక్షణమే వెనక్కి రావాలని ఆదిత్యనాథ్ను ఆదేశించారు. తద్వారా కృష్ణా జలాలపై రాష్ట్రం హక్కులు కోల్పోయేలా చేశారు. ► శ్రీశైలం నుంచి 800 అడుగుల నుంచే రోజుకు 2 టీఎంసీలు తరలించేలా పాలమూరు, డిండి ఎత్తిపోతలతోపాటు కల్వకుర్తి, నెట్టెంపాడు సామర్థ్యం పెంచి.. సుంకేశుల బ్యారేజ్ జల విస్తరణ ప్రాంతంలో తుమ్మిళ్ల ఎత్తిపోతల, భక్తరామదాస ఎత్తిపోతలను తెలంగాణ సర్కార్ అక్రమంగా చేపట్టింది. వీటి ద్వారా కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తెలంగాణ హరించివేస్తున్నా ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోవడం కోసం నాటి సీఎం చంద్రబాబు పట్టించుకోలేదు. హక్కుల పరిరక్షణ కోసం సీఎం జగన్ రాజీలేని పోరాటం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం రాజీలేని పోరాటం చేస్తున్నారు. కృష్ణాపై తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా చేపట్టిన ప్రాజెక్టులను నిలిపేయాలని కేంద్రానికి ఫిర్యాదు చేశారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాల సాగు, తాగు నీటి అవసరాలు తీర్చడానికి తెలంగాణ తరహాలోనే శ్రీశైలంలో 800 అడుగుల స్థాయిలో నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్లోకి రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసేలా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. దీనిపై ఇరు రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తింది. దీన్ని పరిష్కరించడానికి 2020 అక్టోబర్ 6న కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రానికి హక్కుగా దక్కిన నీటిని వినియోగించుకోవడం కోసమే రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టామని సీఎం జగన్ చెప్పారు. తెలంగాణ చేపట్టిన అక్రమ ప్రాజెక్టులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలను నిలిపివేసేలా తెలంగాణను ఆదేశించాలని కోరుతూ సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ► 2021లో శ్రీశైలానికి ఎగువ నుంచి వరద ప్రవాహం ప్రారంభం కాకుండానే తెలంగాణ జెన్కో విద్యుదుత్పత్తి ప్రారంభించింది. ఇక్కడి నుంచి నీటిని సాగర్కు తరలిస్తోంది. ఇలా శ్రీశైలం జలాశయాన్ని ఖాళీ చేస్తూ రాష్ట్ర హక్కులను హరిస్తుండటంతో సీఎం వైఎస్ జగన్ న్యాయపోరాటానికి దిగారు. కృష్ణా బోర్డు పరిధిని నోటిఫై చేయడం ద్వారా అక్రమంగా విద్యుదుత్పత్తి చేయకుండా తెలంగాణను కట్టడి చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దాంతో కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ 2021 జూలై 15న కేంద్ర జల్ శక్తి శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉమ్మడి ప్రాజెక్టులను ఏడాదిలోగా బోర్డుకు అప్పగించాలని కేంద్రం ఆదేశించింది. శ్రీశైలం, సాగర్లో రాష్ట్ర భూభాగం పరిధిలోని ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైనా, తెలంగాణ సర్కారు తన భూభాగంలోని ప్రాజెక్టులను అప్పగించేందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర భూభాగంలోని సాగర్ స్పిల్ వే 13 గేట్లతోపాటు కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ను రాష్ట్రానికి అప్పగించాలని, లేదంటే ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ► శ్రీశైలం ప్రాజెక్టు నుంచి గతేడాది అక్టోబర్ 6న కృష్ణా బోర్డు ఏపీకి కేటాయించిన 30 టీఎంసీల్లో 17 టీఎంసీలను ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ నాగార్జునసాగర్కు తెలంగాణ తరలించింది. ఆ 17 టీఎంసీలను గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాలకు సాగర్ కుడి కాలువ ద్వారా విడుదల చేయాలని రాష్ట్ర అధికారుల విజ్ఞప్తులను తెలంగాణ పట్టించుకోలేదు. ఇదే అంశాన్ని సీఎం జగన్కు రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు వివరించారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యత కేంద్రం రాష్ట్రానికి అప్పగిస్తే.. తమ భూభాగంలో ఉందని ఎడమ గట్టు విద్యుత్కేంద్రాన్ని తెలంగాణ తన ఆధీనంలోకి తీసుకుందని.. అదే తరహాలో రాష్ట్ర భూభాగంలో ఉన్న నాగార్జునసాగర్ స్పిల్ వే 13 గేట్లతోసహా కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ను ఆధీనంలోకి తీసుకుని, నీటిని విడుదల చేయాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు. దాంతో నవంబర్ 30 తెల్లవారుజామున సీఈ మురళీనాథ్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర పోలీసులు, జలవనరుల అధికారులు రాష్ట్ర భూభాగంలోని సాగర్ స్పిల్ వేలో సగాన్ని, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ను స్వాధీనం చేసుకున్నారు. తాగునీటి అవసరాల కోసం కుడి కాలువకు 2,300 క్యూసెక్కులు విడుదల చేశారు. దీనిపై సర్కారు కేంద్రానికి ఫిర్యాదు చేసింది. దాంతో సీఎం జగన్ ఆది నుంచి చేస్తున్న డిమాండ్ మేరకు ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించేందుకు కేంద్రం అంగీకరించింది. -
‘90 శాతం ఉచిత విద్యుత్ ఇచ్చాం’.. మంత్రి వెల్లడి
రాష్ట్రంలోని గృహ వినియోగదారులకు 2023లో ప్రభుత్వం 90 శాతం ఉచిత విద్యుత్ను అందించినట్లు పంజాబ్ విద్యుత్ శాఖ మంత్రి హర్భజన్ సింగ్ వెల్లడించారు. ప్రభుత్వం ఉచిత విద్యుత్ ప్రకటించినప్పటి నుంచి ప్రతినెలా గృహాల్లో సరాసరి 300 యూనిట్లకు బదులు 600 యూనిట్ల కరెంట్ అధికంగా సరఫరా అవుతుందన్నారు. పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (పీఎస్పీసీఎల్) ఆధ్వర్యంలోని అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు రూ.3,873 కోట్లతో పంపిణీ వ్యవస్థలను పునరుద్ధరించినట్లు తెలిపారు. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం ఇతర సంస్థలతో పవర్పర్చేజ్ అగ్రిమెంట్లపై సంతకం చేసిందని చెప్పారు. దాంతో 1,200 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టుల నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు జరిగినట్లు వివరించారు. పంజాబ్ 2023లో అత్యధిక విద్యుత్ డిమాండ్ రికార్డు అయింది. గరిష్ఠంగా జూన్ 23, 2023న 15,293 మెగావాట్ల విద్యుత్ అవసరమైనట్లు తెలిసింది. -
ఒక అసాధ్యాన్ని సాధిస్తా! ఈ భూమిని మరింత గొప్పగా తీర్చిదిద్దుతా
మనం అందరం కారణజన్ములం. ఏదో ఒక ప్రత్యేకమైన గొప్ప పని చేసేందుకు ఈ భూమిపై జన్మించాం. ఇంత గొప్ప అవకాశం వృథా చేసుకోకండి. ఈ సంవత్సరం ఏదైనా కొత్త, సృజనాత్మకమైన పని మొదలుపెట్టండి. ఏదైనా కొత్త పని చేయకుండా ఏ సంవత్సరమూ గడచిపోకూడదు. మీకు ఏ కలలూ లేకపోతే, వాటిని నిజం చేసుకోలేరు కదా! ఏ కొత్త ఆవిష్కరణ అయినా ఒక కలతో మొదలవుతుంది. ఉన్నతంగా కలలుగనే, ఆలోచించే స్వేచ్ఛని మీకు మీరు ఇచ్చుకోండి. ఆపై, వాటిని సాధించేందుకు నూరుశాతం ధైర్యంతో, సమర్పణ భావంతో పనిచేయండి. చాలాసార్లు ఉన్నతమైన కలలు కనేవారిని ఇతరులు అపహాస్యం చేశారు. కానీ వారు వెనక్కు తగ్గకుండా, తమ లక్ష్యాలను సాధించేవరకూ స్థిరంగా నిలబడ్డారు. మనలో ఉండే ప్రాణశక్తి ప్రవహించేందుకు ఒక దిశను చూపటం అవసరం. దానికి సరైన దిశను చూపకపోతే మీరు గందరగోళంలో చిక్కుకుపోతారు. జీవశక్తి ఒక నిర్దిష్ట దిశలో పయనించేలా చేయాలంటే మనకు నిబద్ధత అవసరం. ఈ రోజున చాలామంది, తమ జీవితానికి ఒక నిర్దిష్టమైన లక్ష్యం, దిశానిర్దేశం లేకపోవడం చేత అయోమయంలో ఉన్నారు. మీరు ఆనందంగా ఉన్నప్పుడు మీ ప్రాణశక్తి తారాస్థాయిలో ఉంటుంది, మరి అంత ఎక్కువగా ఉన్న ఆ ప్రాణశక్తికి, ఎటువెళ్లాలో చెప్పకపోతే, అది అక్కడే చిక్కుకుపోతుంది. ఒకేచోట పేరుకుపోతే ఏమౌతుంది? కుళ్ళిపోయి, పనికి రాకుండా పోతుంది. ఇక్కడ రహస్యం ఏమిటీ అంటే, మన లక్ష్యం పట్ల నిబద్ధత ఎంత గొప్పగా ఉంటే, దాన్ని సాధించేందుకు అంత గొప్ప శక్తి మనకు లభిస్తుంది. లక్ష్యం ఎంత గొప్పగా ఉంటే, పనులు అంతా సులభంగా, తేలికగా జరిగిపోతాయి. అదే చిన్న లక్ష్యాలు పెట్టుకున్నారనుకోండి, ఎందుకంటే మీలో సామర్థ్యం కొండంత ఉంది, మీరేమో ఈ చిన్న పనిలో ఇరుక్కుపోయారు అనిపించి మీకే చికాకుగా ఉంటుంది. మీరు సమాజం బాగు కోసం పనిచేస్తున్నప్పుడు, మీరు పది పనులు చేస్తున్నారనుకుందాం. వాటిలో ఒక పనిలో పొరపాటు జరిగినా, మిగతా తొమ్మిది పనులూ చేస్తూ ఉంటే, ఈ మొదటి పనిలో పొరపాట్లు వాటంతట అనే సర్దుకుంటాయి. సాధారణంగా కృప అనేది ఇలా పనిచేస్తుంది. మొదట అవసరమైన వనరులు సమకూరితే, అప్పుడు పెద్ద లక్ష్యం పెట్టుకుని పని చేద్దామమని మనం సాధారణంగా అనుకుంటాం. కాని, మొదట మీ లక్ష్యం గొప్పగా ఉంటే, వనరులు వాటంతట అనే సమకూరుతాయి. మనం పెట్టుకున్న లక్ష్యమే మనకు ఆ శక్తిని బహుమతిగా ఇస్తుంది. మీరు మీ కుటుంబ శ్రేయస్సును లక్ష్యంగా పెట్టుకున్నారనుకోండి, ఆ కుటుంబమే మీకు సహాయం చేస్తుంది. మీరు సమాజం మొత్తానికి గొప్ప పనిచేయాలని సంకల్పించుకుంటే సమాజం మొత్తం మీకు సహాయపడటాన్ని మీరే చూస్తారు. మీకు కావలసిన సహాయం మీరు అడక్కముందే వచ్చి చేరుతుంది. సాధారణంగా మనం మనసులో తపనపడుతూ ఉంటాము, కానీ మన చర్యలు నెమ్మదిగా ఉంటాయి. విజయానికి సోపానం ఏమంటే, మనసులో ఓరిమి, పనిలో ఉత్సాహం. అభిరుచిని, వైరాగ్యాన్ని సరిసమానంగా స్వీకరించండి. మీ లక్ష్య సాధనకై ధైర్యంగా ముందుకు సాగండి, అవసరమైనప్పుడు వదిలేయడం కూడా నేర్చుకోవాలి. అపుడు సహజంగా సమృద్ధి చేకూరుతుంది. మీరు ధ్యానం చేసినపుడు మీరు సూక్ష్మంగా గమనించగలుగుతారు. మీకు పూర్తిగా విశ్రాంతి లభిస్తుంది, అదే సమయంలో బుద్ధి, వివేచన, సద్యఃస్ఫూర్తి వృద్ధి చెందుతాయి. మీరు ఎఱుకతో ఉండి పనిచేస్తే అది సరైన పని అవుతుంది. చెదిరిపోని దృష్టి, సద్యఃస్ఫూర్తితో పనిచేసే మనసు మీ లక్ష్యాన్ని సాధించేందుకు సహాయ పడతాయి. ఒత్తిడి లేని, ఉత్సాహభరితమైన జీవితానికి, మీరు అనుకున్న లక్ష్యాలపై స్పష్టమైన అవగాహనతో పనిచేసేందుకు సరైన మార్గం ధ్యానం. నిబద్ధత అనేది దీర్ఘకాలంలో ఎప్పుడూ సుఖాన్ని ఇస్తుంది. ఈ ప్రపంచాన్ని మరింత సురక్షితంగా జీవించే అద్భుత ప్రదేశంగా మార్చాలని కంకణం కట్టుకోండి. అసాధ్యమైన కల కనండి! మీ నిబద్ధతకు ఆశించిన ఫలితం రావాలంటే సరైన ఆలోచనలు, సరైన చర్యలు రెండూ అవసరమే. మీరు సాధించాలనుకుంటున్న అన్ని విషయాలతో పెద్ద చిట్టా తయారు చేసుకోకండి. స్థూలంగా పరిశీలించి, నిజంగా అవసరమైన కొన్ని లక్ష్యాలను ఎంచుకోండి. మనకు అత్యంత సంతృప్తిని ఇచ్చే వాటిని, దీర్ఘకాలంలో పదిమంది జీవితాలను తీర్చిదిద్దే వాటిని ఎంచుకుని పని చేసినపుడు, మగిలిన చిన్నాచితక విషయాలు వాటంతట అవే గాడిలో పడతాయి. మనస్సు పూర్తిగా వర్తమానంలో ఉన్నప్పుడు, మీకు సరైన ఆలోచనలు వస్తాయి. లక్ష్యాలు పెట్టుకోవడం మాత్రమే కాకుండా, వాటిని సాధించే విధానం కూడా ప్రణాళిక వేసుకోవాలి. మూడేళ్ళ తర్వాత మిమ్మల్ని మీరు ఎలా చూడాలనుకుంటున్నారు? ఒక ఇరవై ఏళ్ల తర్వాత? నలభై ఏళ్ళ తర్వాత? ఫలితం గురించి ఎక్కువ ఆలోచించకుండా మీ విధిని నూరు శాతం నిర్వర్తించండి. గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ -
దేవుడు మనిషికి ఇచ్చిన శక్తి ఎంతో తెలుసా?
మానవుడు శక్తి హీనుడనని డీలా పడిపోతాడు. ధనం,అధికారం లేదు కాబట్టి తాను పనిరానివాడిగా భావిస్తాడు. ఇక ఇంతే జీవితమని నిరాశ నిస్ప్రుహలకు స్థానం ఇచ్చి జీవితాన్ని చీకటి మయం చేసుకుంటాడు. ఏదో ఒకరోజు ఇక్కడ నుంచి వెళ్లాల్సిందే కదా అని తన ఆఖరి ఘడియ కోసం నిర్లిప్తంగా ఎదురు చూస్తాడు. నిజానికి ప్రతి వ్యక్తికి దేవుడు చాలా శక్తిని ఇచ్చాడు. ధనం, అధికారం, ప్రతిష్టా, మంచి వంశం అనేవి పక్కన పెట్టండి. ప్రతి మనిషికి స్వతహగా ఎంతో శక్తిని ఇచ్చాడు. దాన్ని గుర్తించం, తెలుసుకుని ప్రయోజనం పొందే యోచన చెయ్యం. నిజానికి సైన్సు పరంగా మనిషిక ఎంత శక్తి ఉందో తెలిస్తే షాకవ్వడం ఖాయం!. అదేంటో సవివరంగా తెలుసుకుందాం!. మానవుని యొక్క మెదడులో 10 కోట్ల కణాలు ఉన్నాయి. మానవుని కంటిలో 13 కోట్ల చిన్న చిన్న రాడ్ కణములు, 70 లక్షల కోన్ కణములు, 3 లక్షల నరములతో కలుపబడి ఉన్నాయి. ఒక కన్ను తయారు చేయుటకు 2 లక్షల టెలివిజను ట్రాన్స్ మీటర్లు, 2 లక్షల టెలివిజను రిసీవర్లు కావలి. ఇక హార్మోన్స్లో 45కేలరీలు, మానవుని చెవిలో 15,000 కీలు ఉన్నాయి. శరీరం వద్దకు వస్తే ప్రతి మానవుని శరీరములో 1,00,000 మైళ్ళ పొడవైన రక్తనాళాలు ఉన్నాయి. ప్రతి క్షణమునకు 20 లక్షల కణాలు తయారవుతాయి. గుండె దగ్గరకు వస్తే. మానవుని హృదయము నిముషానికి 72 సార్లు చొప్పున రోజుకు ఇంచు మించు 1,00,000 (ఒక లక్ష) సార్లు, సంవత్సరానికి 4 కోట్ల సార్లు ఎటువంటి విశ్రాంతి లేకుండా కొట్టుకొట్టుంది. మానవుని జీవిత కాలములో హృదయములోని ఒక చిన్న కండరము 30 కోట్ల సార్లు సంకోచ వ్యాకోచములు చేస్తాయి. మానవుని శరీరములోని రసాయన పదార్ధములన్నీ కొనాలి అంటే 2 కోట్ల 70 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. మనిషి చనిపోయాక అమ్మితే 6 రూపాయల 45 పైసలు వస్తాయి. మనిషి నవ్వటానికి శరీరములో 17 కండరములు కోప్పడటానికి 43 కండరములు పనిచేస్తాయి. మనిషి చర్మంలో 46 మైళ్ళ పొడవైన నాడులు ఉన్నాయి. మనిషి శరీరములోని రక్తనాళములు అన్నీ ఒకదానికి ఒకటి జోడిస్తే 1,00,000 మైళ్ళ పొడవు ఉంటుంది. మానవుని నాలుక పైన రుచిని తెలుపటానికి 3000 రకాల బుడిపెలు ఉంటాయి ఆరోగ్యము కల మనిషి ఒకరోజులో 23000 సార్లు శ్వాస పీల్చును. మనిషి చేతివేళ్ళ చర్మము మీద ప్రతి చదరపు అంగుళానికి 3000 స్వేద గ్రంధులు ఉన్నాయి. మనిషి తలపై సగటున 1,00,000 వెంట్రుకలు ఉంటాయి. మానవుని పంటి దవడ 276 కేజీల కంటే ఎక్కువ బరువు ఆపగలదు. మానవుని శరీరములో 206 ఎముకలు కలవు. మనిషి జీవిత కాలములో 16,000 గాలన్ల నీరు తాగుతాడు, 35000 కిలోగ్రాముల ఫుడ్ని తింటాడు. మనిషి నోటిలో రోజుకు 2 నుంచి 3 పాయింట్ల జీర్ణరసము ఏర్పడుతుంది . మనిషి జీవిత కాలములో గుండె 100 ఈత కోలనులు నింపగలిగిన రక్తము పంపు చేస్తుంది. మానవుని శరీరములో నాలుకయే బలమైన కండరము. మానవుని శరీరములో 100 ట్రిలియను కణములు ఉంటాయి. మానవుని మెదడులో 80% నీరు ఉంటుంది. మానవుని మెదడుకు నొప్పి తెలియదు. మానవుని శరీర బరువులో ఎముకుల వంతు 14% ఉంటుంది. మానవుని వ్రేళ్ల కొనలకు శరీర బరువును మొత్తము ఆపగల శక్తి ఉంటుంది. మానవుని ఎముకలు బయటికి గట్టిగాను లోపల మెత్తగాను ఉంటాయి. వీటిలో 75% నీరు ఉంటుంది. ఒక్క తుమ్ము ఏకంగా.. తుమ్ము గంటకు వంద మైళ్ళ వేగముతో ప్రయాణిస్తుంది. చేతి వేలి గోళ్ళు కాలి వేళ్ల గొళ్ల కన్నా 4 రెట్లు తొందరగా పెరుగుతాయి. స్త్రీ గుండె పురుషుని గుండె కన్నా ఎక్కువ వేగముగా కొట్టుకుంటుంది. స్త్రీలు పురుషుల కన్నా ఎక్కువ సార్లు కనురెప్పలు ఆర్పుతారు. రక్తం, నీరు కుడా వారికి 6 రెట్లు చిక్కగా ఉంటుంది. మానవుని మూత్రపిండములు నిముషానికి 1.3 లీటర్ల రక్తమును శుద్ది చేయును. రోజుకు 1.4 లీటర్ల మూత్రమును విసర్జిస్తాం. స్త్రీ శరీరములో 4.5 లీటర్ల రక్తము, పురుషుని శరీరములో 5.6 లీటర్ల రక్తము ఉంటాయి. మానవుని గుండె రక్తమును 9 మీటర్ల ఎత్తు వరకు చిమ్మకలిగిన శక్తి కలిగి ఉంటుంది. మానవుని శరీరములో రక్త ప్రసరణ జరగని ఒకే ఒక్క ప్రాంతము కంటిలోని కరోన. ఒక ఎర్ర రక్త కణమునకు శరీరము మొత్తము చుట్టి రావటానికి 20 సెకన్ల సమయము పడుతుంది. రక్తములోని ప్రతి చుక్క కుడా శరీరము చేత రోజుకి 300 సార్లు శుద్ది చేయబడుతుంది. మానవుని జుత్తు, చేతి గోళ్ళు చనిపోయిన తరువాత కుడా పెరుగుతాయి. మనిషి గొంతులో ఉండే హ్యోఇడ్ అనే ఎముక శరీరములోని వేరే ఏ ఎముకతోను అతుకబడి ఉండదు. మనిషి పుర్రె 10 సంవత్సరములకు ఒకసారి మారుతూ ఉంటుంది. మనిషి మెదడులోని కుడి బాగము శరీరములోని ఎడమ బాగమును, మెదడులోని ఎడమ బాగము శరీరములోని కుడి బాగమును అదుపు చేస్తుంది. మనిషి ఏమి తినకుండా 20 రోజులు, ఏమి త్రాగకుండా 2 రోజులు బ్రతుకును. మనిషి ముఖములో 14 ఎముకలు ఉంటాయి. మానవుని నాడి నిముషమునకు 70 సార్లు కొట్టుకుంటుంది. ప్రతి ఏడు రోజులకొకసారి శరీరములోని ఎర్ర రక్త కణములలో సగము మార్పిడి చేయబడతాయి. కంటితో 2.4 మిలియన్ల.. మనిషి దగ్గినపుడు గాలి శబ్ద వేగముతో ప్రయాణము చేస్తుంది. ఆహారము నోటిలో నుంచి పొట్ట లోపలి చేరటానికి 7 సెకన్ల సమయము పడుతుంది. మనిషి శరీరములో దాదాపు 75% నీరు ఉంటుంది. మనిషి కంటితో 2.4 మిలియను కాంతి సంవత్సరముల దూరము (140,000,000,000,000,000,000 మైళ్ళు) చూడగలడు. అది సుమారుగా 528 మెగా పిక్సల్ లెన్స్కి సమానం. ఇంత గొప్పగా మనలను తయారుచేసిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు కలిగి ఉండటమే గాక మన శరీరీ అవయవాల ప్రాముఖ్యతను గుర్తించి ఆరోగ్యంగా ఉండేందుక ప్రయత్నించాలి. ఇదంతా విన్నారు కదా ఇప్పుడు చెప్పండి మనకు ఏమి తక్కువగా ఉంది? . కాబట్టి అస్సలు నిరాశ , నిస్పృహను దరిచేరనీయొద్దు. గమ్యం చేరే వరకు ప్రయాణించండి. ఇక్కడకి కేవలం వచ్చి పోవడానికి రాలేదు. వెళ్లేలోపు ఏదోఒకటి ఇచ్చి పోవడానికే వచ్చాము. బీ స్ట్రాంగ్.. ఏదైనా సాధించాలని పట్టుదలను పెంపొందించుకోండి. విజయం తథ్యం. (చదవండి: నమస్కారం అంటే..ఏదో యాంత్రికంగా చేసేది కాదు! ఎక్కడ? ఎలా? చేయాలో తెలుసుండాలి!) -
సాధారణ స్థితికి విద్యుత్ సరఫరా
సాక్షి, అమరావతి/కాకినాడ/మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా సాధారణ స్థితికి వస్తోంది. శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టడానికి అవకాశంలేని చోట్ల తాత్కాలిక చర్యలతో విద్యుత్ను పునరుద్ధరించారు. దీంతో గురువారం సాయంత్రానికి రాష్ట్రమంతటా దాదాపు 98 శాతం విద్యుత్ పునరుద్ధరణ పనులు పూర్తయినట్లు ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలు ఐ. పృథ్వీతేజ్, జె. పద్మజనార్ధనరెడ్డి, కె. సంతోషరావు ‘సాక్షి’కి వెల్లడించారు. మిచాంగ్ తీవ్రత ఎక్కువగా ఉన్న నెల్లూరు, గుంటూరు జిల్లాల్లోనూ విద్యుత్ సరఫరాను సాధారణ స్థితికి తీసుకురావడంలో రాష్ట్ర విద్యుత్ సంస్థల ప్రయత్నాలు ఫలించాయి. ఉమ్మడి ప్రకాశం, కృష్ణా, చిత్తూరు, కర్నూలు, పశ్చిమ, తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో తుపాను ప్రభావం ఉన్న ప్రాంతాల్లో నిరంతర విద్యుత్ సరఫరా అందిస్తున్నారు. విద్యుత్ పునరుద్ధరణ పనులను ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పూర్తయిన పునరుద్ధరణ.. ఏపీఎస్పీడీసీఎల్లో 231 ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. ఇక్కడ 17 ఫీడర్లు ప్రభావితం కాగా, ఒకటి రెండు మినహా మిగిలిన అన్ని ఫీడర్లు గురువారం రాత్రికి పునరుద్ధరించారు. నెల్లూరు, తిరుపతి, కడప సర్కిళ్లలో దెబ్బతిన్న మూడు ఈహెచ్టీ సబ్స్టేషన్లు, 33/11 కేవీ సబ్స్టేషన్లు 269, 33 కేవీ ఫీడర్లు 145, 33 కేవీ ఫీడర్లు, 32 కేవీ స్తంభాలు 770, 11 కేవీ 2,341 స్తంభాలు, 247 డీటీఆర్లను సాధారణ స్థితికి తీసుకొచ్చారు. నెల్లూరు సర్కిల్లో 33/11కేవి సబ్స్టేషన్లు 36 పూర్తిగా చెడిపోగా, పునరుద్ధరించారు. రూ.1,235.45 లక్షల నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు సర్కిళ్లలో 33 కేవి సబ్స్టేషన్లు 150, 33 కేవీ ఫీడర్లు 134, 33 కేవీ పోల్స్ 16, 11కేవీ పోల్స్ 514, 173 డీటీఆర్లు దెబ్బతినగా, అన్నిటినీ సాధారణ స్థితికి తెచ్చారు. డిస్కం మొత్తం మీద రూ.545.98 లక్షల నష్టం వాటిల్లిందని అంచనా. ఏపీసీపీడీసీఎల్ పరిధిలోని విజయవాడ, గుంటూరు, సీఆర్డీఏ, ఒంగోలు సర్కిళ్లలో 33/11 కేవీ సబ్స్టేషన్లు 204, 33కేవీ ఫీడర్లు 147, 33 కేవీ స్తంభాలు 115, 11కేవీ పోల్స్ 1,247, డీటీఆర్లు 504 పాడవ్వగా, అన్నిటినీ బాగుచేశారు. రూ.1,995.57 లక్షల నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. -
నాణ్యమైన విద్యుత్ అందివ్వాలనేదే ప్రభుత్వ లక్ష్యం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ప్రతీ ప్రాంతానికి నాణ్యమైన విద్యుత్ అందివ్వాలనేదే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. సబ్స్టేషన్లు లేక ఇబ్బంది పడుతున్న వారికి కష్టాలు తీరనున్నాయని, ఇవాళ ప్రారంభించిన సబ్స్టేషన్లను స్థానికులకే అంకితం చేస్తున్నామని సీఎం అన్నారు. రైతులకు 9 గంటల విద్యుత్ పగటి పూటే ఇవ్వాలని అధికారంలోకి రాగానే నిర్ణయించామని సీఎం పేర్కొన్నారు. రాష్ట్ర విద్యుత్ రంగ చరిత్రలో తొలిసారిగా ఒకేసారి 28 సబ్ స్టేషన్లకు ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీ ట్రాన్స్కో) శ్రీకారం చుట్టింది. సీఎం జగన్ వర్చువల్ విధానంలో 16 సబ్స్టేషన్లకు శంకుస్థాపన, 12 సబ్స్టేషన్ల ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే ఆయన మాటల్లోనే.. దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో ఈరోజు మరో మంచి కార్యక్రమం చేస్తున్నాం. 14 జిల్లాల్లో విద్యుత్ పంపిణీ వ్యవస్థ బలోపేతం అవుతోంది. 28 సబ్ స్టేషన్లలో కొన్నింటిని ప్రారంభించాం, కొన్నింటి పనులు ప్రారంభిస్తాం. గోదావరి ముంపు ప్రాంతాల్లో చింతూరు, వీఆర్పురం, ఎటపాక తదితర ప్రాంతాల్లో ఇటీవలే తిరిగినప్పుడు సబ్స్టేషన్లే లేకపోవడంవల్ల ఇబ్బందులు వస్తున్నాయని అక్కడి వారు చెప్పారు. ఆ సమస్యను పరిష్కరిస్తూ.. అక్కడ సబ్స్టేషన్లను ఇవాళ ప్రారంభిస్తూ అక్కడి ప్రజలకు అంకితం చేస్తున్నాం. 12 సబ్స్టేషన్లను ఇవాళ ప్రారంభిస్తున్నాం, 16 సబ్స్టేషన్లకు శంకుస్థాపన చేస్తున్నాం ట్రాన్స్మిషన్ కెపాసిటీని విస్తరించుకుంటూ, నాణ్యమైన విద్యుత్ ప్రతి గ్రామానికి ప్రతిరైతుకు ఇచ్చే వ్యవస్థను క్రియేట్ చేస్తున్నాం. రైతులకు 9 గంటలపాటు పగటిపూటే ఉచిత విద్యుత్ ఇవ్వాలన్న ఉద్దేశంతో అధికారంలోకి వచ్చిన తొలిరోజుల్లోనే విద్యుత్ పంపిణీ వ్యవస్థ బలోపేతానికి శ్రీకారం చుట్టాం. రూ.1700 కోట్ల తో ఫీడర్లను ఏర్పాటుచేసి రైతులకు నాణ్యమైన విద్యుత్ను ఇస్తున్నాం. ఉచిత విద్యుత్ను స్థిరంగా ఇవ్వడానికి రూ.2.4లకే యూనిట్ ధరతో సెకీతో ఒప్పందం చేసుకున్నాం. మరో 25 సంవత్సరాలపాటు రైతులకు ఎలాంటి ఢోకా లేకుండా ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. దీనివల్లరాష్ట్ర ప్రభుత్వంపై భారం తగ్గుతుంది’’ సీఎం వివరించారు. ‘‘దాదాపు రూ.3099 కోట్లతో సబ్స్టేషన్లకోసం ఖర్చుచేస్తున్నాం, ఇప్పటికే కొన్నింటిని ప్రారంభించాం. మరికొన్నింటి పనులు ప్రారంభిస్తున్నాం. రూ. 3400 కోట్లతో 850 మెగావాట్ల సోలార్ పవర్కు శ్రీకారం చుడుతున్నాం. 6500 కోట్ల పెట్టుబడి పెడుతున్నాం. అవేరా స్కూటర్స్ తయారీ సంస్థకు శ్రీకారం చుడుతున్నాం. ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభించింది. లక్ష స్కూటర్ల ఉత్పత్తి దిశగా సామర్థ్యాన్ని పెంచుకుంటుంది. 100 మందికి ఇప్పటికే ఉద్యోగాలు ఉన్నాయి. తాజా పెట్టుబడి వల్ల అదనపు ఉద్యోగాలు వస్తాయి. 28 సబ్ స్టేషన్లలో 200 మందికి ఉద్యోగావకాశాలు వస్తున్నాయి. 850 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు వల్ల 1700 ఉద్యోగాలు వస్తున్నాయి. హెచ్పీసీఎల్తో రూ.10 వేల కోట్ల పెట్టుబడికి ఒప్పందం పెడుతున్నాం. సోలార్,విండ్, పీఎస్పీ, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులను వీరు పెడుతున్నారు. దాదాపుగా 1500 మందికి ఉద్యోగావకాశాలు అందుబాటులోకి వస్తాయి. కాలుష్యరహిత విద్యుత్ రాష్ట్రానికి మేలు చేస్తుంది. పలు విద్యుత్ ప్రాజెక్టులను ఈరోజు ఇక్కడి నుంచి ప్రారంభిస్తూ.. ఈ రంగంలో మరింత అభివృద్ధి సాధించే దిశలో అడుగులు ముందుకు వేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా, వర్చువల్గా పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. -
అందరి తెలంగాణగా మార్చడమే లక్ష్యం : ఆర్ఎస్ ప్రవీణ్కుమార్
సాక్షి,హైదరాబాద్ : కొందరి తెలంగాణను అందరి తెలంగాణ చేయడమే బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. సాక్షి టీవీకి ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో ఆయన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. దొరల తెలంగాణ కాకుండా పేదల తెలంగాణగా మార్చుదామనేది బీఎస్పీ ఆలోచన అని తెలిపారు. తెలంగాణలో దొరలు వదిలిపెట్టిపోయిన గడీలు గడిచిన తొమ్మిదేళ్లలో మళ్లీ పునర్మిర్మాణమయ్యాయన్నారు. బాంచన్ కాల్మొక్త అనే సంస్కృతి తెలంగాణలో పోలేదని చెప్పారు. రాజ్యాధికారంతోనే బాంచన్ కాల్మొక్త సంస్కృతి పూర్తిగా పోతుందని ప్రవీణ్కుమార్ స్పష్టం చేశారు. స్పష్టమైన ప్రణాళికతో అన్ని వర్గాలను కలుపుకుని కృషి చేస్తే రాజ్యాధికారం తప్పకుండా సాధ్యమవుతుందన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో డబుల్ డిజిట్ సీట్లు సాధించి, వీలైతే రాజ్యాధికారం చేపడతామని ఆశాభావం వ్యక్తం చేశారు. జార్ఖండ్లో మధుకోడా ఒక్కడే ఎమ్మెల్యే అయి ముఖ్యమంత్రి అయిన విషయాన్ని ప్రవీణ్కుమార్ గుర్తుచేశారు. దళితులు ఎమ్మెల్యేలు, మంత్రులు అయితే సరిపోదని, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్థితిలో ఉంటేనే రాజ్యాధికారం వచ్చినట్లవుతుందన్నారు. ఉత్తరప్రదేశ్లో మాయావతి సీఎం అయిన తర్వాత బహుజనులకు రాజ్యాధికారంవచ్చిందన్నారు. మయావతి హయాంలో దళితులకు భూముల పంపిణీ జరిగిందని, మహిళలకు రక్షణ కల్పించిందని చెప్పారు. మాయావతి పాలన వల్ల బహుజనుల రెండు, మూడు తరాలు బాగుపడ్డాయని తెలిపారు. తెలంగాణలో ముఖ్యమంత్రిని కలిసి వారి ఆలోచనలు చెప్పుకునే అవకాశం తెలంగాణలో ఏ బ్యూరోక్రాట్కు లేదన్నారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారులు కానిస్టేబుల్ ఆపితే ప్రగతిభవన్ గేటు వద్ద నుంచే వెనక్కు వెళ్లిన సందర్భాలున్నాయన్నారు. గురుకులాల సెక్రటరీగా వెళ్లిన వెంటనే దళిత, నిమ్న, వెనుకబడిన, అణగారిన అనే పదాలను నిషేధించి స్వేరో అనే పదాన్ని తీసుకొచ్చానని తెలిపారు. బీఎస్పీ మేనిఫెస్టోలో పెట్టిన 10 లక్షల ఉద్యోగాలు మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలు కాదని, ప్రభుత్వ,ప్రైవేట్ ఉద్యోగాల అన్నీ కలిపి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని క్లారిటీ ఇచ్చారు. ఇవేకాక మరిన్ని విషయాలను ప్రవీణ్కుమార్ సాక్షి టీవీతో పంచుకున్నారు. -
కాంగ్రెస్ నేతలకు బంపర్ ఆఫర్ ఇస్తున్నా: కేటీఆర్
సాక్షి, సిరిసిల్ల : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ నేతలకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. సిరిసిల్ల నియోజకవర్గం ముస్తాబాద్ రోడ్డు షోలో మాట్లాడుతూ కాంగ్రెస్పై ఛలోక్తులు విసిరారు. ‘తెలంగాణలో 24 గంటల కరెంటు కనిపిస్తలేదన్న కాంగ్రెస్ నేతలారా.. ముస్తాబాద్ రండి.. ఎప్పుడు వస్తారో చెప్పండి. నేనే బస్సు పెడతా. వచ్చి లైన్లో నిల్చొని మండలంలో కరెంట్ వైర్లు గట్టిగా పట్టుకుని చూడండి. కరెంటుందో, లేదో తెలిసిపోతుంది’ అన్నారు. ‘మీరు దీవిస్తే ఎమ్మెల్యే అయ్యాను. కేసీఆర్ ఆశీర్వదిస్తే మంత్రి అయ్యాను. తెలంగాణలో సిరిసిల్ల నియోజకవర్గాన్ని నంబర్ వన్ చేశాను. మీరు ఓటు వేస్తే నేను ఎమ్మెల్యే అయి మీరు గౌరవంగా తల ఎత్తుకునేలా పని చేశాను. మీకోసం పని చేస్తున్నా. నన్ను మరొకసారి ఆశీర్వదించండి. ఎలక్షన్ రాగానే వాళ్ళు వీళ్ళు చెప్పేది నమ్మొద్దు. మనస్పూర్తిగా ఆలోచించి నాకు ఓటేయండి’ అని ప్రజలను కేటీఆర్ కోరారు. ‘కేసీఆర్కు తెలంగాణ మీద ఉండే ప్రేమ.. రాహుల్ గాంధీ, మోడీకి ఉంటదా..? కాంగ్రెస్సోళ్లు ధరణి ఎత్తేస్తామంటున్నరు. ధరణిపోతే మళ్లీ పట్వారీ వ్యవస్థ వస్తుంది. పట్వారీ వ్యవస్థ వస్తే ఎట్లుంటదో మీకు తెలుసుగా. కాంగ్రెస్సోళ్లు 3 గంటల కరెంటు ఇస్తమంటున్నరు. మళ్లీ రాత్రి బాయికాడికి పోయి పండుకోవాలి. ఎరువుల కోసం, విత్తనాల కోసం లైన్లు కట్టాలి’ అని కేటీఆర్ హెచ్చరించాలి. ఇదీచదవండి..కాంగ్రెస్ కార్పొరేటర్ అనిత ఇంటికి మల్లా రెడ్డి కోడలు -
కరెంటు, నీళ్లు కావాలంటే బీఆర్ఎస్కే ఓటు వేయాలి: కేసీఆర్
-
బొగ్గు ఉత్పత్తి పెంపునకు కృషి
న్యూఢిల్లీ: పెరుగుతున్న విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా దేశీయంగా బొగ్గు ఉత్పత్తిని పెంచేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. 2070 నాటికి 50 శాతం విద్యుత్ను పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా సమకూర్చుకోవాలని, సున్నా కర్బన ఉద్గారాల విడుదల స్థాయికి చేరుకోవాలన్న లక్ష్యానికి కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. ఎనిమిదో విడత వాణిజ్య స్థాయిలో బొగ్గు బ్లాకుల వేలాన్ని మంత్రి బుధవారం ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. ‘‘ఇంతకుముందెన్నడూ లేని స్థాయిలో విద్యుత్ వినియోగం నమోదవుతోంది. గరిష్ట విద్యుత్ డిమాండ్ ఇప్పటికే 240 గిగావాట్లకు చేరుకుంది. 2030 నాటికి ఇది రెట్టింపు అవుతుందన్న అంచనా ఉంది. ఇంధన వనరుల్లో బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి తగ్గొచ్చు. కానీ, మొత్తం మీద బొగ్గు విద్యుదుత్పత్తి ప్రస్తుత స్థాయి నుంచి పెరుగుతుంది’’అని వివరించారు. బొగ్గు మైనింగ్లో సుస్థిరతాభివృద్ధి సూత్రాలను అమలు చేయడంతోపాటు సంయుక్త కృషి ద్వారా పెరుగుతున్న డిమాండ్ను చేరుకోగలమన్నారు. 3 లక్షల మందికి ఉపాధి ప్రస్తుతం వేలం వేస్తున్న బొగ్గు గనులకు సంబంధించి రూ.33,000 కోట్ల పెట్టుబడులు రానున్నట్టు మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 3 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రకటించారు. ‘‘వాణిజ్య బొగ్గు మైనింగ్ ఎనిమిదో విడత వేలాన్ని ప్రారంభిస్తున్న నేడు ప్రత్యేకమైన రోజు. మొత్తం 39 బొగ్గు గనులను వేలానికి ఉంచాం. ఎందుకు ప్రత్యేకమైన రోజు అంటే నేడు గిరిజనుల గౌరవ దినోత్సవం’’అని మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. బొగ్గు రంగానికి, గిరిజనులకు లోతైన అనుబంధం ఉందన్నారు. వేలంలో ఉంచిన బొగ్గు గనుల్లో ఉత్పత్తి మొదలైతే గిరిజనులే ఎక్కువగా ప్రయోజనం పొందుతారని చెప్పారు. ఇప్పటి వరకు ఏడు విడతల వేలంలో మొత్తం 91 బొగ్గు గనులను వేలం వేసినట్టు గుర్తు చేశారు. -
2030 నాటికి పతాకస్థాయికి చేరనున్న శిలాజ ఇంధనాలు
శిలాజ ఇంధనాల క్షీణత, ముడిచమురు ధరల్లో అస్థిరత, కఠినమైన పర్యావరణ నిబంధనలు వంటి సవాళ్లను ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటోంది. ప్రపంచవ్యాప్తంగా చమురు, సహజ వాయువు, బొగ్గుకు గరిష్ఠ స్థాయిలో డిమాండ్ నెలకొనడం చరిత్రలో ఇదే మొదటిసారి. గ్లోబల్గా శిలాజ ఇంధన డిమాండ్ 2030 నాటికి పతాకస్థాయికి చేరుకుంటుందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ(ఐఈఏ) 2023 నివేదిక తెలిపింది. ఎలక్ట్రానిక్ వాహనాల అమ్మకాలు వేగంగా పుంజుకుంటున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అణు, సౌర, పవన విద్యుత్తుకు అధిక గిరాకీ ఉంటుందని నివేదిక తెలియజేసింది. అందులోని వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి. బొగ్గు, పెట్రోలియం, సహజవాయువు, అణుశక్తి తరిగిపోయే శక్తివనరులు. వాటిని ఒకసారి వినియోగిస్తే, మళ్లీ ఉపయోగించడం కుదరదు. నీరు, గాలి, సూర్యరశ్మి, సముద్ర తరంగాల శక్తి, భూతాపశక్తి, జీవశక్తి తదితరాలు ఎన్నటికీ తరిగిపోనివి. అందుకే వాటిన సంప్రదాయేతర లేదా తరిగిపోని ఇంధన వనరులు అంటారు. శాస్త్రవిజ్ఞానం, నవీన ఆవిష్కరణల ద్వారా వాటి వినియోగాన్ని పెంచుతున్నారు. (ఇదీ చదవండి: రూ.240కే ‘ఎక్స్’ సబ్స్క్రిప్షన్.. ఫీచర్లు ఇవే..) తగ్గుతున్న శిలాజ ఇంధన డిమాండ్ బొగ్గు, చమురు, సహజ వాయువులను శిలాజ ఇంధనాలు అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతాలవారీగా వీటి డిమాండ్ ఆధారపడుతుంది. అనేక దశాబ్దాలుగా విద్యుత్ ఉత్పత్తి, రవాణా, పారిశ్రామిక అవసరాలకు వీటిని వాడుతున్నారు. పట్టణీకరణ, జనాభా పెరుగుదల కారణంగా వీటికి మరింత డిమాండ్ పెరిగింది. కానీ వీటిని మండించడం ద్వారా పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం తగ్గించాలనే ఉద్దేశంతో వివిధ దేశాలు కఠిన చట్టాలు తీసుకొచ్చాయి. 2030 నాటికి శిలాజ ఇంధనాలకు గరిష్ట స్థాయిలో డిమాండ్ ఉంటుందని అంచనా. ప్రభుత్వాలు అనుసరిస్తున్న కొన్ని విధానల ద్వారా క్రమంగా వీటి వాడకం తగ్గనుంది. వీటిస్థానే క్లీన్ ఎనర్జీ టెక్నాలజీవైపు అడుగులు వేసే అవకాశం ఉంది. క్షీణిస్తున్న బొగ్గువాడకం ప్రపంచ బొగ్గు డిమాండ్ అనేది ప్రధానంగా విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లపై ఆధారపడుతుంది. ఇతర మార్గాల ద్వారా కరెంట్ ఉత్పత్తి అవుతుంటే క్రమంగా బొగ్గుకు డిమాండ్ తగ్గుతుంది. అయితే 65శాతం బొగ్గును ప్రస్తుతం కరెంట్ తయారీకే వాడుతున్నారు. థర్మల్పవర్ ప్లాంట్లు సిస్టమ్ సేవలు ఉపయోగిస్తున్నాయి. దాంతో బొగ్గు వినియోగం కొంతమేర తగ్గుతుంది. అయితే పారిశ్రామిక డిమాండ్, ఉక్కు తయారీ, సిమెంట్ పరిశ్రమల కోసం వాడే బొగ్గు వినియోగం స్థిరంగా ఉంది. పునరుత్పాదక వనరులపై మక్కువ సౌరశక్తి, పవన శక్తి, జలశక్తి, సముద్ర తరంగాల శక్తి, భూతాపశక్తి, జీవశక్తి వాడకంపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన ఏర్పడింది. వాటిని వినియోగించే దేశాల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ప్రస్తుతం 140కి పైగా దేశాలు వీటిని విరివిగా వాడుతున్నాయి. 2010తో పోలిస్తే 2022 వరకు సౌరశక్తి వల్ల 90శాతం, పవనశక్తి ద్వారా 70శాతం, ఆఫ్షోర్ విండ్ ద్వారా 60శాతం విద్యుత్ ధరలు తగ్గాయి. (ఇదీ చదవండి: ఇకపై లోన్ రికవరీ ఏజెంట్ల సమయం ఇదే..) క్లీన్ ఎనర్జీ వైపు..ప్రపంచం చూపు క్లీన్ ఎనర్జీ టెక్నాలజీ విస్తరణ వల్ల సౌర, పవన శక్తి వాడకం ఎక్కువైంది. దాంతో ప్రపంచ వ్యాప్తంగా ఉద్గారాలు తగ్గనున్నాయి. 2030 వరకు సోలార్ఎనర్జీ వల్ల దాదాపు 3 గిగాటన్నుల ఉద్గారాలు తగ్గుతాయని అంచనా. ఇది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రోడ్డుపై ఉన్న అన్ని కార్ల నుంచి వెలువడే ఉద్గారాలకు సమానం. పవన శక్తి వల్ల మరో రెండు గిగాటన్నుల ఉద్గారాలు తగ్గనున్నాయి. -
ఢీ అంటే ఢీ ఆర్ట్ ఆఫ్ డీఇన్ఫ్లుయెన్సింగ్
‘ఇప్పటి వరకు ఇన్ఫ్లుయెన్సర్ పవర్ ఏమిటో చూశారు. ఇక డీఇన్ఫ్లుయెన్సర్ పవర్ ఏమిటో చూసే టైమ్ వచ్చింది’... ఇది తెలుగు సినిమాలో మాస్ డైలాగ్ కాదు. సోషల్ మీడియాలో ఒక కుర్రాడు పెట్టిన కామెంట్.సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ల హవా నడుస్తున్న కాలం ఇది. కస్టమర్లు ఏది కొనాలో, ఏ షో చూడాలో, ఎలాంటి ఆరోగ్య సూత్రాలు పాటించాలో చెబుతున్నారు. ఇప్పుడు ఈ ట్రెండ్కు అడ్డుపడే ‘డీఇన్ఫ్లుయెన్సింగ్’ ట్రెండ్ యువతరం నుంచే వచ్చి బలపడుతోంది. ట్రెడిషనల్ ఇన్ఫ్లుయెన్సర్లు ఒక ప్రాడక్ట్ను హైప్ చేస్తే డీఇన్ఫ్లుయెన్సర్లు ఆ హైప్ను ఛాలెంజ్ చేస్తున్నారు.... మార్కెటింగ్ డాటా అండ్ ఎనలిటిక్స్ కంపెనీ కంతార్ స్టడీ రిపోర్ట్ ప్రకారం వినియోగదారులపై ఇన్ఫ్లుయెన్సర్ల సిఫారసుల ప్రభావం తక్కువేమీ కాదు. సోషల్ మీడియాలో ఎటు చూసినా ఇన్ఫ్లుయెన్సర్లు కనిపిస్తారు. టీ పోడుల నుంచి టీపాయ్ల వరకు రకరకాలప్రాడక్ట్స్ను ప్రమోట్ చేయడానికి చిన్నచిన్న క్యాచీ వీడియోలను రూపోందిస్తారు. దీనికి భిన్నంగా ఒక ప్రాడక్ట్ను విశ్లేషిస్తూ విమర్శిస్తే...అదే డీఇన్ఫ్లుయెన్సింగ్! ‘డీఇన్ఫ్లుయెన్సింగ్’ హ్యాష్ట్యాగ్తో టిక్ టాక్లో ఈ ట్రెండ్ మొదలైంది.సోషల్ మీడియా ఎనాలటిక్స్ ఫర్మ్ ట్యూబ్లర్ ల్యాబ్స్ చెబుతున్నదాని ప్రకారం గత సంవత్సరం నుంచి ఈ ట్రెండ్ ఊపందుకుంది. మ్యాడి వెల్ అనే ఇన్ఫ్లుయెన్సర్ ప్రముఖ కాస్మటిక్ స్టోర్స్లో పని చేసింది. కొన్నిప్రోడక్ట్స్ పట్ల కస్టమర్లు ఎందుకు విముఖంగా ఉన్నారో తన స్వీయ అనుభవాలను తెలియజేసింది. ఈ ప్రభావంతో ఆమె పేరు ఇన్ఫ్లుయెన్సర్ల జాబితా నుంచి డీఇన్ఫ్లుయెన్సర్ల జాబితాలోకి చేరింది. న్యూయార్క్కు చెందిన ఇరవై సంవత్సరాల క్లారా కొన్ని బ్రాండ్లను విమర్శిస్తూ వీడియోలు చేసింది. వాటిలో ఒకటి వైరల్గా మారింది. అదే సమయంలో తాను విమర్శించిన బ్రాండ్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో అనే భయం పట్టుకుంది. అయితే తనకు తానుగా ధైర్యం తెచ్చుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు.‘నేను సరిౖయెన వివరాలతోనే వీడియో చేశాను. నేనెందుకు భయపడాలి’ అంటోంది క్లారా. మన సెలబ్రిటీ ఒకరు ఆరోగ్య సంబంధమైన విషయాలపై కాస్త లోతుగానే మాట్లాడాడు. అయితే ఆయన అవగాహన లోపాన్ని ఒక వైద్యుడు వెంటనే ఎత్తిచూపాడు. పాపులర్ చైనీస్ వ్లోగర్ ఒకరు తన వయసు తక్కువగా కనిపించేలా సాంకేతిక మాయ చేస్తే ఎవరో కుర్రాడు కనిపెట్టి ‘ఆయన అసలు రూపం ఇది’ అని చూపాడు. స్వీడన్ ఇన్ఫ్లుయెన్సర్ ఫేక్ ట్రిప్ గురించి మరొక యువకుడు ‘ఇవి ఫొటోషాప్ చిత్రాలు’ అని నిజాన్ని బహిర్గతం చేశాడు. నిజానికి ఇలాంటివి సోషల్ మీడియాలో గతంలో లేవని కాదు. అయితే ‘డీఇన్ఫ్లుయెన్సింగ్’ పుణ్యామా అని ‘అది కాదు ఇది’ అని వెంటనే సాధికార సమాచారంతో స్పందించే ధోరణి పెరిగింది.డీఇన్ఫ్లూయెన్సర్లు వోవర్–హైప్డ్ప్రాడక్ట్స్ను విమర్శించడమే కాదు చౌక ధరల్లో లభించే వాటి గురించి చెబుతున్నారు. యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలోని వార్టన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ప్రోఫెసర్ అయిన అమెరికస్ రీడ్ ఇలా అంటున్నారు...‘ఇన్ఫ్లుయెన్సర్లలో ఎక్కువమంది సాధికారికంగా మాట్లాడడం లేదేమో అనే భావన కస్టమర్లలో వచ్చింది. డబ్బులు ఇస్తారు కాబట్టి సంబంధితప్రాడక్ట్ను ప్రమోట్ చేస్తారు. నిజానిజాల గురించి వారికి అవసరం లేదు. ఈ నేపథ్యంలో కాస్తో కూస్తో డీఇన్ఫ్లుయెన్సరే నయం అనుకుంటున్నారు. నిజానికి డీఇన్ఫ్లుయెన్సర్ కూడా ఇన్ఫ్లుయెన్సరే’ కొందరు ఒక అడుగు ముందుకు వేసి ఈ ట్రెండ్కు ‘యాంటీ క్యాపిటలిస్ట్’ ట్రెండ్గా నామకరణం చేశారు. డీఇన్ఫ్లుయెన్సింగ్ ట్రెండ్ వల్ల వృథా ఖర్చులు తగ్గుతాయని, వేలం వెర్రికి అడ్డుకట్టపడుతుందని, పర్యావరణ కోణంలో కూడా ఈ ట్రెండ్ వల్ల మేలు జరుగుతుందని యువతరంలో ఎంతోమంది బలంగా వాదిస్తున్నారు. తమ అభిప్రాయాలను సామాజిక మాధ్యమాలలలో ఇతరులతో పంచుకుంటున్నారు. అయితే ‘డీఇన్ఫ్లుయెన్సింగ్’ ట్రెండ్పై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా ఉన్నాయి.డీఇన్ఫ్లుయెన్సింగ్కు విషయ సాధికారత, నిజాయితీ అనేవి కీలకం. అయితే ‘డీఇన్ఫ్లుయెన్సింగ్’ రూపంలో సూడో–అథెంటిసిటీ ముందుకు వస్తుందని, ఈ ట్రెండ్ను తమ స్వార్థానికి ఉపయోగించుకునే వారి సంఖ్య పెరుగుతుందనే విమర్శ ఉంది. ‘ఈ ట్రెండ్ కాస్త చివరికి ఎలా మారుతుందంటే ఇది కొనవద్దు. మీరు కొనాల్సింది అది అన్నట్లుగా!’ అంటుంది 26 సంవత్సరాల అమెరికన్ ఇన్ఫ్లు్లయెన్సర్ జెస్సిక. ‘ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇన్ఫ్లుయెన్సర్లు చెప్పగానే కస్టమర్ల అభిప్రాయాలు రాత్రికి రాత్రి మారిపోవు. ఇన్ఫ్లుయెన్సర్లు కేవలం సలహా ఇస్తారు. అంతే. ఏది కొనాలి, ఏది కొనకూడదు అనే స్వీయవిచక్షణ కస్టమర్లలో ఉంది. ఇన్ఫ్లుయెన్సర్లుగా మేము పారదర్శకంగా, నిజాయితీగా ఉంటాం’ అంటుంది ఫ్రాన్స్కు చెందిన ఇన్ఫ్లున్సర్ కోలిన్. ఆమెకు ఇన్స్టాగ్రామ్లో 4,00,000 ఫాలోవర్స్ ఉన్నారు. ప్రస్తుతం డీఇన్ఫ్లుయెన్సింగ్ ట్రెండ్ హెల్త్, ఫైనాన్స్, లైఫ్స్టైల్ విభాగాలలో ఎక్కువగా కనిపిస్తుంది.‘డీఇన్ఫ్లూయెన్సింగ్ అనేది వాపా బలుపా?’ అనేది పక్కన పెడితే ఈ ట్రెండ్ మూలంగా ఇన్ఫ్లుయెన్సర్లుప్రాఫిట్కు మాత్రమే కాదు మెరిట్కు కూడాప్రాధాన్యత ఇచ్చే ధోరణి, జవాబుదారీతనం పెరుగుతుంది. సమస్య ఇన్ఫ్లుయెన్సర్లు కాదు. కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు అనుసరిస్తున్న ధోరణి. వారిలో మార్పు రావాలి. సామాజిక బాధ్యత పెరగాలి. యువతలో అశాంతి, ఆందోళన రేకెత్తించే కంటెంట్కు దూరంగా ఉండాలి.– హిమాద్రి పటేల్, డిజిటల్ క్రియేటర్ -
పరువు పోగొట్టుకున్న రామోజీ !
-
అధికారంలోకి రాగానే బెల్టుషాపులు రద్దు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రాగానే బెల్టుషాపుల్ని రద్దు చేస్తామని, అక్రమ మద్యం ప్రభావాన్ని ఉక్కుపాదంతో అణచివే స్తామని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి ప్రకటించారు. దశలవారీగా మద్యాన్ని నియంత్రిస్తామని స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యం కంటే ఆదాయం కోసం బీఆర్ఎస్ సర్కారు గ్రామగ్రామనా ఇష్టారాజ్యాంగా బెల్టు షాపుల్ని ప్రోత్సహిస్తూ ప్రజల రక్తాన్ని తాగుతోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం ఇప్పటికే దివాళా తీసిందని, మళ్ళీ ఆ పార్టీ అధికారంలోకి వస్తే తమ చేతికి చిప్ప మిగులుతుందని ప్రజలకు అర్ధం అయిందన్నారు. అందుకే కేసీఆర్ ప్రభు త్వాన్ని ఓడించేందుకు తెలంగాణ ప్రజలు పోలింగ్ కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. గురువారం పార్టీ కార్యాలయంలో కరీంనగర్ జిల్లా మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, వికా రాబాద్ జిల్లా పరిగికి చెందిన వన్నె ఈశ్వరప్పతో పాటు పలువురు స్థానిక ప్రజా ప్రతినిధులు, నేతలు కిషన్ రెడ్డి, పార్టీ పార్లమెంటరీబోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, జాతీయ ప్రధానకార్యదర్శి బండి సంజయ్ల సమక్షంలో బీజేపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి నేతలు సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్లో గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కు అమ్ముడుపోతారని ప్రజలకు తెలుసునని, 2014, 2018లో అమ్ముడుపోయిన విషయం ప్రజలకు గుర్తుందని చెప్పారు. కేసీఆర్ ఆటలో రేవంత్, హరీశ్ బలిపశువులు కేసీఆర్ ఆటలో రేవంత్, హరీశ్రావు బలి పశువులు కాబోతున్నారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. సీఎం వద్ద మేనిఫెస్టోపై హరీశ్, కేటీఆర్ చర్చ పెద్ద డ్రామా అని సీఎం పదవి కోసమే ఆ ఇద్దరూ కొట్టుకుంటున్నారనే టాక్ నడుస్తోందన్నారు. కేసీఆర్ ఆమోద ముద్ర పడనందునే కాంగ్రెస్ లిస్ట్ ఫైనల్ కాలేదన్నారు. ‘ౖకాంగ్రెస్ లిస్ట్ ఇంకా ప్రగతి భవన్ లో ఉంది. కేసీఆర్ స్టాంప్ పడలేదు. ఆయన 30 మంది అభ్యర్థుల పేర్లు చెప్పి ఆమోదముద్ర వేసినాక ఢిల్లీకి పోతది. పాపం రేవంత్ రెడ్డికి తెల్వదు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కలిసి ఎట్లైనా అధికారంలోకి రావాలని కుట్ర చేస్తున్నయ్. ఈ మొత్తం ఎపిసోడ్ లో హరీషన్న, కాంగ్రెస్లో రే వంతన్న బలిపశువులు కాబోతున్నరు.’’ అని పే ర్కొన్నారు. డా. లక్ష్మణ్ మాట్లాడుతూ బీసీల ఓట్లు అడిగే నైతిక హక్కు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, కాంగ్రెస్ నేతలు రాహుల్, రేవంత్ రెడ్డిలకు లేదన్నారు. రాజకీయంగా బీసీల అభ్యున్నతికి బీజేపీనే పెద్దపీట వేసిందని గుర్తు చేశారు. -
విద్యుత్ సరఫరాలో విశాఖ దూకుడు
గాలి వీచిందా..? అయితే కరెంట్ గోవిందా.? వర్షం పడుతోందా..? టార్చ్లైట్స్, చార్జింగ్ లైట్స్ వెతుక్కోవాల్సిందే. ఇంకేముంది.. గంటల తరబడి కరెంట్ రాదు. ఏంటో ఈ పవర్ సప్లై ..రోజులో గంటల తరబడి కరెంట్ ఉండటం లేదు. ఇదీ ఒకప్పుడు వినియోగదారుల నుంచి తరచూ వినిపించిన మాట.. కాలం మారింది.. కరెంట్ సరఫరాలోనూ మార్పులు వచ్చాయి. సరఫరా అంతరాయమూ మారింది. వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దుకుంటూ.. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు విశాఖ సర్కిల్ నిరంతరం శ్రమిస్తోంది. అందుకే సగటున పవర్ కట్ను రోజులో కేవలం 4 నిమిషాలకు మాత్రమే తగ్గించుకుంటూ ఈపీడీసీఎల్ పరిధిలో ఉన్న సర్కిళ్లలో నంబర్ వన్లో కొనసాగుతోంది. విద్యుత్ సరఫరా విషయంలో విశాఖ దూకుడుగా వ్యవహరిస్తోందని సైదీ సైఫీ సూచీలే స్పష్టం చేస్తున్నాయి. సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) పరిధిలో 5 సర్కిల్స్ ఉన్నాయి. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, ఏలూరు, విజయనగరం సర్కిల్స్ పరిధిలో నిరంతరం విద్యుత్ సరఫరాలో ఉన్న లోపాలు, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ను అందిస్తున్నారా లేదా అనే అంశాలను పరిశీలిస్తోంది. ఇందుకోసం ఏర్పాటు చేసిన వ్యవస్థలే సిస్టమ్ యావరేజ్ ఇంట్రప్షన్ డ్యూరేషన్ ఇండెక్స్ (సైదీ), సిస్టమ్ యావరేజ్ ఇంట్రప్షన్ ఫ్రీక్వెన్సీ ఇండెక్స్ (సైఫీ). రోజూ ఆయా సర్కిల్స్ పరిధిలో ఎంత సేపు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.? ఎంత సమయానికి పున రుద్ధరించారు.? ఇలాంటి వివరాలను ఎప్పటికప్పు డు గణిస్తూ సరాసరిని చూపిస్తుంటుంది. ఈ విషయంలో విశాఖ సర్కిల్ నంబర్వన్లో నిలిచింది. ఈ సర్కిల్ పరిధిలో 17,57,727 మంది వినియోగదారులున్నారు. ఇందులో 15,02,204 డొమెస్టిక్ కనెక్షన్లుండగా, 1,70,580 కమర్షియల్, 49,037 అగ్రికల్చర్, 30,632 ఇన్స్టిట్యూషనల్, 5,274 ఇండస్ట్రీస్ కనెక్షన్లున్నాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని సైదీ సైఫీ ర్యాంకింగ్ను ప్రకటిస్తుంది. నాలుగు నిమిషాలు మాత్రమే.. 2014–19 మధ్య కాలంతో పోల్చితే సర్కిల్ పరిధిలో వినూత్న మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ కాలంలో రోజుకు సగటున 60 నుంచి 85 నిమిషాల వరకూ విద్యుత్ అంతరాయం ఉండేది. అంటే 24 గంటల్లో కనీసం గంటకు పైగా కరెంట్ కోతలు ప్రజలను ఇబ్బందులకు గురిచేసేవి. పంపిణీ విషయంలో పక్కాగా వ్యవహరిస్తూ ఆధునిక సాంకేతికతను సిబ్బంది అందిపుచ్చుకుంటూ సరఫరా అంతరాయాన్ని తగ్గించారు. గంట ఉండే అంతరాయం క్రమంగా నిమిషాలకు చేరుకుంది. ఇప్పుడు కేవలం 4 నుంచి 10 నిమిషాలు మాత్రమే రోజులో విద్యుత్ అంతరాయం ఉంటుంది. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో సగటున రోజుకు 9 నిమిషాలు మాత్రమే సరఫరాకు అంతరాయం ఉండగా.. ఈ నెలలో కేవలం 4 నిమిషాలు మాత్రమే సగటు ఇంట్రప్షన్ ఉన్నట్లు సైదీ సైఫీ నివేదికలో స్పష్టమైంది. నంబర్ వన్ ర్యాంకులో... విశాఖ సర్కిల్ గత కొద్ది నెలలుగా విశాఖ సర్కిల్ సైదీ సైఫీ ర్యాంకింగ్లో నంబర్వన్ స్థానాన్ని నిలబెట్టుకుంటోంది. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ను అంతరాయాలు లేకుండా అందించడంలో సర్కిల్ అధికారులు, సిబ్బంది సఫలీకృతమవుతున్నారు. తర్వాత ర్యాంకింగ్స్లో రాజమండ్రి, శ్రీకాకుళం, ఏలూరు, విజయనగరం ఉన్నాయి. కేవలం సర్కిల్ మాత్రమే కాకుండా.. ఈపీడీసీఎల్ పరిధిలో విద్యుత్ వినియోగదారులకు ఇంట్రప్షన్ తగ్గిస్తూ సరఫరా అందిస్తున్నారు. విశాఖ సర్కిల్లో 4 నిమిషాలు మాత్రమే ఉండగా రాజమహేంద్రవరంలో 8 నిమిషాలు, శ్రీకాకుళం పరిధిలో 10, విజయనగరంలో 13, ఏలూరులో 16 నిమిషాలు మాత్రమే రోజుకు సగటున విద్యుత్ కోతలు జరుగుతున్నట్లు సైదీ సైఫీ ర్యాంకింగ్స్లో స్పష్టమైంది. మరింత తగ్గించేందుకు కృషి చేస్తున్నాం ఎప్పటికప్పుడు సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నాం. వినియోగదారులకు ఇచ్చే విద్యుత్ను నాణ్యంగా ఎలా అందించాలనే అంశంపై సీఎండీ సలహాలు, సూచనలు తీసుకుంటున్నాం. దానికనుగుణంగా మార్పులు చేస్తూ అంతరాయాన్ని క్రమంగా తగ్గించుకుంటూ వస్తున్నాం. ప్రస్తుతం సగటున 4 నిమిషాలున్న ఇంట్రప్షన్ను క్రమంగా తగ్గించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. విపత్తుల కారణంగా ఏదైనా అవాంతరాలు ఎదురైనా వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నాం. ఇటీవలే ఆటోమేటెడ్ సబ్స్టేషన్ను రూపొందించాం. మిగిలిన చోట్లా అదే తరహా టెక్నాలజీ వస్తే ఈ అంతరాయం మరింత తగ్గించగలం. – ఎల్ మహేంద్రనాథ్, ఏపీఈపీడీసీఎల్ విశాఖ సర్కిల్ ఎస్ఈ -
కాంగ్రెసోళ్లది ఉత్త కరెంటు
సిద్దిపేట జోన్: ముఖ్యమంత్రి కేసీఆర్ను కరెంట్ గురించి అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ నాయకులకు లేదని ఆర్ధిక, వైద్యారోగ్యాశాఖ మంత్రి టి.హరీశ్రావు తేల్చిచెప్పారు. కాంగ్రెస్ పాలనలో ఉచిత కరెంట్ను ఉత్త కరెంట్గా మార్చిన కాంగ్రెసోళ్లు ఇప్పుడు సిగ్గు లేకుండా కరెంట్ గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. శనివారం సిద్దిపేట జిల్లా నర్మెటలో రూ.300 కోట్లతో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి భూమి పూజ చేశారు. జిల్లా కేంద్రంలో సఖి, భరోసా కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ ‘సీఎం కేసీఆర్ సంకల్పానికి దైవబలం ఉంది.. ఆయన పనిమంతుడే కాదు దేవున్ని బాగా కొలుస్తారు, నమ్ముతారు. అందుకే తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్రంలో కరువే లేదు’ అని వ్యాఖ్యానించారు. అదే చంద్రబాబు, కిరణ్ కుమార్రెడ్డి హయాంలో కరువుతో రాష్ట్ర ప్రజలు అల్లాడిపోయారని గుర్తుచేశారు. చాలా రాష్ట్రాల్లో కరువు వచ్చినా తెలంగాణలో కాళేశ్వరం వల్ల ఆ ఛాయలు లేవన్నారు. ఒక్కప్పుడు ఐటీ అని కలవరించిన చంద్రబాబు ఇప్పుడు తెలంగాణ భూముల విలువ గురించి మాట్లాడుతున్నారని చెప్పారు. కాగా, ఈ వయసులో ఆయనను అరెస్టు చేయడం దురదృష్టకరమన్నారు. కార్యక్రమంలో డీజీపీ అంజన్కుమార్, అదనపు డీజీ (ఉమెన్ సేఫ్టీ) షికాగోయల్, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్, ఉద్యానవన శాఖ కమిషనర్ హన్మంత రావు, జెడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, కలెక్టర్ పాటిల్ పాల్గొన్నారు. శతమానం భవతి.. శ్రీజ సిద్దిపేటలో రూ 30 లక్షలతో ఏర్పాటు చేసిన శిశుగృహ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఆ సమయంలో అక్కడి సిబ్బంది చేతిలో ఓ మూడు నెలల పసికందు చిరునవ్వులు చిందించడంతో ఆయన అబ్బురపడ్డారు. వెంటనే పసికందును ఎత్తుకొని సిబ్బంది ద్వారా వివరాలు సేకరించారు. మూడు నెలల క్రితం పసికందును విక్రయించే క్రమంలో అడ్డుకొని సంరక్షణ బాధ్యతలు స్వీకరించినట్టు వారు మంత్రి దృష్టికి తెచ్చారు. కాగా ఇప్పటివరకు పేరులే కుండా ఉన్న ఆ పసికందుకు శ్రీజ అని నామకరణం చేశారు. నిండు నూరేళ్లు శ్రీజ ముఖంలో చిరునవ్వులు వెల్లివిరియాలని దీవించారు. -
సిమెంట్కు ఇన్ఫ్రా దన్ను
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిమెంట్కు డిమాండ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10–12 శాతం పెరిగే అవకాశం ఉందని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేస్తోంది. మౌలిక వసతుల కోసం ప్రభుత్వం చేస్తున్న భారీ వ్యయాలు ఈ వృద్ధికి దోహదం చేస్తాయని వెల్లడించింది. క్రిసిల్ రేటింగ్స్ ప్రకారం.. రోడ్లు, రైల్వే లైన్లు, విద్యుత్, పునరుత్పాదక ఇంధన వనరులు, నగరాభివృద్ధి, టెలికం, పోర్టులు, విమానాశ్రయాలు, నీరు వంటి మౌలిక వసతులకు 2022–23తో పోలిస్తే రూ.1.6 లక్షల కోట్ల అదనపు బడ్జెట్ కేటాయింపులతో ఈ మొత్తం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.5.9 లక్షల కోట్లకు చేరింది. గత రెండు ఆర్థిక సంవత్సరాలలో పటిష్ట ప్రయాణాన్ని కొనసాగిస్తూ సిమెంట్ డిమాండ్ 2023–24లో 10–12 శాతం అధికమై 440 మిలియన్ టన్నులకు చేరే అవకాశం ఉంది. సిమెంట్ డిమాండ్ 2022–23లో 12 శాతం, 2021–22లో 8 శాతం ఎగసింది. నిర్వహణ లాభం జూమ్.. స్థిరంగా ఉన్న సిమెంట్ ధరలకుతోడు విద్యుత్, ఇంధన ఖర్చులు కాస్త తగ్గడంతో సిమెంట్ తయారీదారుల నిర్వహణ లాభం గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2023–24లో టన్నుకు రూ.200 పుంజుకునే చాన్స్ ఉంది. మౌలిక సదుపాయాలకు ప్రభుత్వం చేస్తున్న వ్యయం సిమెంట్ డిమాండ్ను నడిపిస్తోంది. సిమెంట్ వార్షిక అమ్మకాల్లో మౌలిక సదుపాయాల వాటా 30 శాతం ఉంది. ప్రధాన మౌలిక సదుపాయాల రంగాలకు బడ్జెట్ కేటాయింపులు ఈ ఆర్థిక సంవత్సరంలో 38 శాతం పెరిగాయి. బడ్జెట్ మొత్తంలో చేసిన ఖర్చు 2023 జూలై వరకు 40 శాతంగా ఉంది. సిమెంట్ డిమాండ్లో 55 శాతం వాటాను కలిగి ఉన్న గృహ విభాగం స్థిర వృద్ధిని సాధిస్తుందని అంచనా. సరసమైన గృహాలకు ప్రభుత్వం కొనసాగిస్తున్న మద్దతు డిమాండ్ను పెంచుతుంది. రెండంకెల వృద్ధికి.. 2023 ఏప్రిల్–సెప్టెంబర్లో సిమెంట్ డిమాండ్ 13–15 శాతంగా ఉంది. అధిక బేస్, సాధారణ ఎన్నికలు సమీపిస్తున్నందున కేంద్రం చేయబోయే మూలధన వ్యయం కొంత మందగించవచ్చు. దీంతో ద్వితీయార్థంలో డిమాండ్ 7–9 శాతానికి మధ్యస్థంగా ఉండవచ్చు. అయితే ఆలస్యమైన, అసమాన రుతుపవనాల కారణంగా గ్రామీణ గృహాల డిమాండ్ కొంత తగ్గే అవకాశం ఉంది. ఐదు రాష్ట్రాలు ఎన్నికలకు వెళ్లే మూడవ త్రైమాసికంలో కార్మికుల పరిమిత లభ్యత కూడా పాత్ర పోషిస్తుంది. బలమైన ప్రథమార్ధం ఈ ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధికి దోహదం చేస్తుంది. దేశవ్యాప్తంగా సిమెంట్ ధరలు 2023 ఏప్రిల్–ఆగస్ట్ మధ్య 2.5 శాతం పడిపోయాయి. సిమెంట్ ధరలు ఇటీవల స్వల్పంగా పెరగడంతో అధికం అవుతున్న డిమాండ్ తయారీ కంపెనీల ఆదాయ వృద్ధికి సహాయపడుతుంది. -
కరెంట్ కోసం కొత్త టారిఫ్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఏపీ ఈఆర్సీ) టారిఫ్ బేస్డ్ కాంపిటేటివ్ బిడ్డింగ్ కింద ఇంట్రా–స్టేట్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్ల అభివృద్ధి కోసం థ్రెషోల్డ్ లిమిట్ రెగ్యులేషన్–2023ని రూపొందించింది. ఈ మేరకు విద్యుత్ చట్టం 2003లోని సెక్షన్ 63 ప్రకారం.. కొత్త నిబంధనలతో డ్రాఫ్ట్ రెగ్యులేషన్ను కమిషన్ తయారు చేసింది. దీనిపై ఎవరికైనా సూచనలు, అభ్యంతరాలుంటే ఈ నెల 29లోగా తమ ప్రధాన కార్యాలయానికి మెయిల్ ద్వారా తెలియజేయాలని కోరింది. ఈ గడువు ముగిసిన తర్వాత డ్రాఫ్ట్ రెగ్యులేషన్ ఖరారు చేస్తామని కమిషన్ తెలిపింది. ఈ రెగ్యులేషన్ వచ్చే ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని ఏపీ ఈఆర్సీ పేర్కొంది. రెండుసార్లు అడిగిన కేంద్రం విద్యుత్ మంత్రిత్వ శాఖ 2021 మార్చి 15న ఒక లేఖ విడుదల చేసింది. ఇందులో ఇంట్రా–స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్స్ అభివృద్ధి కోసం టారిఫ్ బేస్డ్ కాంపిటేటివ్ బిడ్డింగ్(టీబీసీబీ)ని ఆమోదించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సిఫార్సు చేసింది. టీబీసీబీ ద్వారా ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్లను అందించడానికి గరిష్ట పరిమితిని తెలియజేయాలని విద్యుత్ మంత్రిత్వ శాఖ ఈ ఏడాది ఆగస్టు 21న ఏపీ ఈఆర్సీకి మరో లేఖ పంపింది. వీటిని పరిగణలోకి తీసుకుని 2020–21 నుంచి 2023–24 వరకు నాలుగు ఆర్థి క సంవత్సరాల్లో ఏపీ ట్రాన్స్కో స్టేట్ ట్రాన్స్మిషన్ యుటిలిటీకి మంజూరైన పెట్టుబడి అనుమతులను కమిషన్ పరిశీలించింది. ఆమోదించిన 23 ప్రాజెక్ట్లలో 10 ప్రాజెక్ట్లు (43.5 శాతం) అమలు జరిగినట్టు గుర్తించింది. ఈ నేపథ్యంలో వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చేలా ఇంట్రా–స్టేట్ ట్రాన్స్మిషన్ టారిఫ్ను తగ్గించడం, జాతీయ స్థాయిలో, వివిధ రాష్ట్రాల్లో ట్రాన్స్మిషన్ సేవల కోసం ఇప్పటికే అమలులో ఉన్న టారిఫ్ బేస్డ్ కాంపిటేటివ్ బిడ్డింగ్ ప్రాజెక్ట్లను పరిగణనలోకి తీసుకోవడం, ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్ల అభివృద్ధిలో పోటీని ప్రోత్సహించే పవర్ మార్గదర్శకాల అభివృద్ధి కోసం కొత్త డ్రాఫ్ట్ రెగ్యులేషన్ను కమిషన్ తీసుకువస్తోంది. -
ఇలా అమ్ముకోండి.. అలా కొనుక్కోండి
సాక్షి, అమరావతి: విద్యుత్ కొనుగోళ్లు, విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం తాజాగా పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) ముగిసిన విద్యుత్ ఉత్పత్తి సంస్థ (జెన్కో)లు కరెంటును నేరుగా ఎవరికైనా అమ్ముకొనే అవకాశం కల్పించింది. ఏదైనా జెన్కో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించినప్పుడు డిస్కంలతో పీపీఏ కుదర్చుకుంటుంది. ఇది సాధారణంగా 12 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వరకూ ఉంటుంది. ఈ ఒప్పందం గడువు ముగిసిన తరువాత కూడా డిస్కంలు అదే రేటుకి అదే జెన్కో ద్వారా విద్యుత్ను తీసుకునే వెసులుబాటు ఇప్పటివరకూ ఉంది. ఇప్పుడు కేంద్రం ఈ వెసులుబాటు లేకుండా చేసింది. గడువు ముగిసిన తరువాత కూడా అదే రేటుకి కొంటే జెన్కోలకు నష్టం వాటిల్లుతుందన్నది కేంద్రం చెబుతున్న కారణం. దీంతో జెన్కోలు పీపీఏల గడువు ముగిసిన తరువాత ఇండియన్ ఎనర్జీ ఎక్సే్ఛంజ్ (ఐఈఎక్స్)లోగానీ, ఎక్కువ ధర ఇచ్చే డిస్కంలకు గానీ విద్యుత్ను విక్రయించుకోవచ్చు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో కరెంటును పీపీఏలు ముగిసిన తరువాత విక్రయించేందుకు సెంట్రల్ పూల్ విధానాన్ని కేంద్రం కొత్తగా తీసుకువచ్చింది. కేంద్రానికి చెందిన పదహారు ప్లాంట్లలో విద్యుత్ను డిస్కంలు ముందస్తు దరఖాస్తు ద్వారా కొనుక్కొనే అవకాశం కలి్పంచింది. కొనుగోలు ఒప్పందాన్ని కూడా ఐదేళ్లకు పరిమితం చేసింది. పీపీఏలు చేసుకోగా మిగిలిన విద్యుత్ను ఐఈఎక్స్లో విక్రయిస్తారు. అంతా ఐఈఎక్స్లోనే విద్యుత్ను అమ్మాలన్నా, కొనాలన్నా ఇప్పుడు జెన్కోలు, డిస్కంలకు ఉన్న ప్రధాన మార్కెట్ ఇండియన్ ఎనర్జీ ఎక్సే్ఛంజ్. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ అనుమతితో 2008 జూన్ 27న ప్రారంభమైన ఐఈఎక్స్ 2017లో స్టాక్ మార్కెట్లో లిస్టెడ్ కంపెనీగా మారింది. అప్పటినుంచి విద్యుత్ క్రయ విక్రయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. 29 రాష్ట్రాలు, 5 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 55కు పైగా విద్యుత్ పంపిణీ సంస్థలు, 600కుపైగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, 1800కుపైగా పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సంస్థలు, 4,600కు పైగా వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు ఐఈఎక్స్లో చేరాయి. గత నెలలో ఐఈఎక్స్లో 8,469 మిలియన్ యూనిట్ల లావాదేవీలు జరిగాయి. యూనిట్ సగటు ధర రూ.6.89గా ఉంది. బహిరంగ మార్కెట్లో విద్యుత్ లావాదేవీలకు జెన్కోలు, డిస్కంల నుంచి గరిష్టంగా యూనిట్కు 2 పైసలు రుసుమును (ఐఈఎక్స్) వసూలు చేస్తోంది. -
తప్పుడు ప్రచారం చేస్తే రుణాలు ఆపేస్తాం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వంపై విద్యుత్ రంగానికి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి తప్పుడు ప్రచారం చేస్తే.. రుణాలు, సబ్సిడీలు ఆపేస్తామని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్. కె.సింగ్ హెచ్చరించారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్ల ఏర్పాటు, విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తారంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ విషప్రచారం చేస్తున్నారని, వ్యవసాయ పంపుసెట్లకు మినహా అన్నింటికి మీటర్లు ఏర్పాటు చేయాలని కేంద్రం స్పష్టం చేసిందని చెప్పారు. విద్యుత్ సంస్థల ఆడిట్ నివేదికలు, ఎనర్జీ ఆడిట్ ఎప్పటికప్పుడు చేయించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ విద్యుత్ సంస్థలు రుణాలు చెల్లించే స్థితిలో లేవని తమకు సమాచారం అందిందని మంత్రి తెలిపారు. గురువారం ఇక్కడ మంత్రి ఆర్.కె. సింగ్, పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డి, విద్యుత్ శాఖ సహాయ మంత్రి క్రిషన్పాల్ గుర్జర్లు ‘విద్యుత్ శాఖ’పై ఏర్పాటైన పార్లమెంట్ సభ్యుల కన్సల్టేటివ్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఆర్.కె. సింగ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వానికి గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్ (ఆర్ఈసీ) రూ.1.57 లక్షల కోట్ల రుణం మంజూరు చేస్తే అందులో ఇప్పటికే రూ. 1.38 లక్షల కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర మంత్రి వివరించారు. అలాగే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) నుంచి రూ.1.10 లక్షల కోట్లు మంజూరు అయితే.. రూ.91 వేల కోట్లు విడుదల చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఎన్టీపీసీ 4 వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లు నిర్మిస్తుంది..: రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో ఎన్టీపీసీ 4 వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్లను నిర్మిస్తుందని కేంద్ర మంత్రి ఆర్.కె. సింగ్ తేల్చి చెప్పారు. ఇప్పటికే ఒక్కొక్కటి 800 మెగావాట్ల రెండు యూనిట్లు సిద్ధమయ్యాయని, ఈనెల 26న ఒక యూనిట్ వాణిజ్య ఉత్పత్తి ప్రారంభిస్తుందని, మరొకటి డిసెంబర్లో ఉత్పత్తి ప్రారంభిస్తుందని ఆయన వెల్లడించారు. వీటిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని చెప్పారు. మిగిలిన 2,400 మెగావాట్ల విద్యుత్ కేంద్రాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకోవాలని ఎన్టీపీసీ కోరినా స్పందించడం లేదన్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం స్పందించకపోయినా ఎన్టీపీసీ ఒక్కొక్కటీ 800 మెగావాట్లుగల మూడు యూనిట్లను నిర్మిస్తుందని తేల్చి చెప్పారు. కాగా, దేశం మొత్తాన్ని ఒకే గ్రేడ్ కిందకు తీసుకువచ్చి 1.97 లక్షల కిలోమీటర్ల ట్రాన్స్మిషన్ లైన్లు వేసినట్లు చెప్పారు. తద్వారా దేశంలో ఏకకాలంలో 1.20 లక్షల మెగావాట్ల విద్యుత్ను ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరఫరా చేస్తే సామర్థ్యం ఏర్పడిందని మంత్రి వివరించారు. -
మార్కెట్ యార్డుల్లో విద్యుత్ ఆదాకు చర్యలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పలు మార్కెట్ యార్డుల్లో ఇంధన సామర్థ్య చర్యల ద్వారా విద్యుత్ను, డబ్బును ఆదా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని వ్యవసాయ, మార్కెటింగ్, కో–ఆపరేటివ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి తెలిపారు. గుంటూరు యార్డును ఆసియాలోనే అతిపెద్ద విద్యుత్ ఆదా మిర్చి వ్యాపార కేంద్రంగా మార్చే లక్ష్యంతో ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్(ఈఈఎస్ఎల్) రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖతో భాగస్వామి అయ్యేందుకు అంగీకరించింది. రాష్ట్రంలోని మరికొన్ని కీలక మార్కెట్ యార్డుల్లో కూడా ఇంధన సామర్థ్య చర్యలను అమలు చేయనుంది. వ్యవసాయ వాణిజ్యానికి మార్కెట్ యార్డులు కీలక కేంద్రాలు. ఇక్కడ లైటింగ్, శీతలీకరణ, ప్రాసెసింగ్, లాజిస్టిక్స్ కోసం విద్యుత్ను ఎక్కువగా వినియోగిస్తుంటారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం వీటిని విద్యుత్ పొదుపు కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ, మార్కెటింగ్, కో–ఆపరేటివ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవితో ఈఈఎస్ఎల్ కమ్యూనికేషన్స్, మార్కెటింగ్ సీజీఎం అనిమేష్ మిశ్రా ఆదివారం భేటీ అయ్యారు. విద్యుత్ ఆదా చర్యలకు సంబంధించిన నివేదికను చిరంజీవికి అందజేశారు. అనంతరం ఈఈఎస్ఎల్ అధికారులు, మార్కెటింగ్, సహకార శాఖ ఉన్నతాధికారుల సమావేశంలో చిరంజీవి మాట్లాడారు. తొలుత గుంటూరు మిర్చి యార్డులో ఇంధన సామర్థ్య చర్యలు అమలు చేస్తా మన్నారు. ఈఈఎస్ఎల్ ప్రతినిధులు నితిన్ భట్, సావిత్రి సింగ్, మార్కెటింగ్ శాఖ కమిషనర్ రాహుల్ పాండే, ఆప్కాబ్ ఎండీ శ్రీనాథ్రెడ్డి పాల్గొన్నారు. -
కరెంట్ షాక్తో దంపతుల మృతి
చాంద్రాయణగుట్ట: కరెంట్ షాక్తో దంపతులు మృతి చెందిన విషాద ఘటన బండ్లగూడ పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గౌస్నగర్కు చెందిన షాకీరా బేగం(30), తన్వీర్ మజ్జా (36) దంపతులు. వీరికి ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. శనివారం ఉదయం మంచినీటి సరఫరా జరుగుతుండడంతో నల్లా మోటార్ స్విచ్ వేయడానికి షాకీరా బయటికి వచ్చింది. సంప్ ఐరన్ మూతపై నిల్చొని షాకీరా బేగం కరెంట్ స్విచ్ ఆన్ చేసింది. అప్పటికే విద్యుత్ తీగ తేలి ఐరన్ మూతకు ఆనుకుని ఉండడంతో షాక్కు గురైంది. ఇది గమనించిన భర్త తన్వీర్ ఆమెను కాపాడేందుకు వెళ్లడంతో ఆయనకు సైతం షాక్ కొట్టింది. దంపతులిద్దరూ విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే అసువులు బాశారు. అలికిడితో నిద్ర లేచిన పిల్లలు.. తల్లిదండ్రులు విగత జీవులుగా పడి ఉండటాన్ని చూసి తీవ్రంగా రోదించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రాష్ట్రంలో పవర్ హాలిడే లేదు - పరిశ్రమలకు పరిమితుల తొలగింపు
అమరావతి: రాష్ట్రంలో పవర్ హాలిడే లేదని, పరిశ్రమలకు విద్యుత్ సరఫరాపై ఎలాంటి పరిమితులు అమలు చేయడం లేదని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రకటించాయి. ఈమేరకు సోమవారం ప్రకటన విడుదల చేశాయి. విద్యుత్ డిమాండుకు అనుగుణంగా సరఫరా పరిస్థితి మెరుగుపడినందున పరిశ్రమలకు సరఫరాలో పరిమితులు ఎత్తివేయాలని నిర్ణయించినట్లు తెలిపాయి. రాష్ట్రంలో ఆదివారం అన్నిరంగాలకు ఎలాంటి కోతలు, పరిమితులు లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసినట్లు వివరించాయి. రాష్ట్రంలో మొత్తం 206.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా సరఫరాలో ఎలాంటి అంతరాయాలుగానీ, లోడ్ షెడ్డింగ్ లేదు. సెప్టెంబర్ 1 వ తేదీన రాష్ట్రంలో నెలకొన్న గ్రిడ్ డిమాండ్ – సరఫరా పరిస్థితులను బట్టి పారిశ్రామిక రంగానికి కొద్ది మేర విద్యుత్ సరఫరా తగ్గించి, ప్రాధాన్యతా రంగాలైన గృహ, వ్యవసాయ రంగాలను ప్రాధాన్యం ఇచ్చి అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా చేశాయి. వ్యవసాయ, గృహ వినియోగరంగాలను పాధాన్యతా రంగాలుగా పరిగణించి అంతరాయాలు లేని విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ సంస్థలు భావించాయి. ఇందులో భాగంగానే డిమాండు ఎక్కువగా ఉన్నప్పుడు పరిశ్రమలకు కొంతమేరకు సరఫరా తగ్గించి వ్యవసాయ, గృహ వినియోగదారులకు పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరా చేస్తామని గౌరవ కమిషన్ కు అభ్యర్ధన పంపించాం. విద్యుత్ పంపిణీ సంస్థల అభ్యర్ధన మేరకు గౌరవ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి 2023 సెప్టెంబర్ 09న ఈనెల 5 వ తేదీ నుంచి రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి స్వల్పంగా విద్యుత్ వాడకంలో పరిమితులు విధించవచ్చని కమిషన్ అనుమతించింది. తగ్గిన డిమాండుతో పరిశ్రమలకు పరిమితుల తొలగింపు మారిన వాతావరణ పరిస్థితులు, రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న అల్పపీడన పరిస్థితులలు, వర్షాల దృష్ట్యా గ్రిడ్ డిమాండ్ కొంత మేర తగ్గింది. గత రెండు రోజులుగా ఎటువంటి విద్యుత్ కొరత లేదు. విద్యుత్ సౌధలో సోమవారం ట్రాన్స్కో సీఎండీ, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి కె. విజయానంద్ ట్రాన్స్కో, జెన్కో, ఏపీపీసీసీ అధికారులతో రాబోయే రెండు వారాలపాటు విద్యుత్ డిమాండు, సరఫరా పరిస్థితిపై కూలంకుషంగా సమీక్షించారు. ప్రస్తుతం లోడ్ కొద్దిమేర తగ్గి సరఫరా పరిస్థితి మెరుగుపడి నందువల్ల పారిశ్రామిక వినియోగదారులకు అధికారిక లోడ్ షెడ్డింగ్ విధించే అవసరం కలగదని ఈ సమీక్ష సందర్భంగా భావించారు. దీంతో విద్యుత్ పంపిణీ సంస్థలు పారిశ్రామిక రంగానికి విద్యుత్ వాడకంపై పరిమితి నిబంధనల అమలును రద్దు చేసుకున్నాయి. దయచేసి వినియోగదారులందరూ ఈ విషయాన్ని గ్రహించగలరని రాష్ట్రంలో ఏవిధమైన లోడ్ షెడ్డింగ్ కానీ, విద్యుత్ వాడకంలో పరిమితులు కానీ లేవని తెలియజేస్తున్నాం. మెరుగుపడిన సరఫరా పరిస్థితి వల్ల కమిషన్ ఇచ్చిన పారిశ్రామిక విద్యుత్ వాడకంలో పరిమితి – నియంత్రణ ఉత్తర్వులను అమలు చేయడం లేదు. ఈ విషయం గౌరవ కమిషన్ కు నివేదించాలని పంపిణీ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. సెప్టెంబర్ నెల 15వ తేదీ వరకు స్వల్పకాలిక మార్కెట్ నుంచి రోజుకి దాదాపు 40 మిలియన్ యూనిట్లు, ప్రతి యూనిట్కు రూ . 9.10 వెచ్చించి వినియోగదారుల సౌకర్యార్ధం కొంటున్నాం. సరఫరా పరిస్థితి అదుపు తప్పకుండా నిరంతరాయం అధికారులందరూ అప్రమత్తంగా వున్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా గృహ, వ్యవసాయ, వాణిజ్య & పారిశ్రామిక రంగాలకు సరఫరా అంతరాయం లేకుండా చేయడానికి శాయశక్తులా కృషి చేస్తున్నామని తెలియజేస్తున్నాం. -
రాష్ట్ర విద్యుత్ డిమాండ్లో 99.6 శాతం సరఫరా
సాక్షి, అమరావతి: దక్షిణాది రాష్ట్రాల్లో విద్యుత్ కొరత ఏపీలోనే అధికంగా ఉందనడంలో వాస్తవం లేదని స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఎల్డీసీ), డిస్కంలు స్పష్టం చేశాయి. ‘దక్షిణాదిలో ఏపీలోనే విద్యుత్ కొరత అధికం’ శీర్షికతో ఆదివారం ఈనాడు ప్రచురించిన కథనాన్ని ఎస్ఎల్డీసీ, డిస్కంలు ఖండించాయి. 20 సూత్రాల అమలు కార్యక్రమంపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన 2022–23 ఆ ర్థిక సంవత్సరం విద్యుత్ సరఫరా గణాంకాలను ఉటంకిస్తూ ఈనాడు వార్తా కథనం ప్రచురించింది. అయితే గత ఆ ర్థిక సంవత్సరం రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదని, 0.04 శాతం మాత్రమే సరఫరాలో లోటు ఉందని, ఇది కూడా స్థానికంగా ఏర్పడిన సాంకేతిక ఇబ్బందుల వల్లేనని డిస్కంలు పేర్కొన్నాయి. ఎస్ఎల్డీసీ, డిస్కంలు ఏం చెప్పాయంటే.. ఏపీలో వాస్తవ కొరత 0.4 శాతమే కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం విద్యుత్ సరఫరాలో ఝార్ఖండ్ రాష్ట్రం చాలా వెనుకబడి ఉంది. 2022–23 సంవత్సరంలో 20 సూత్రాల అమలు పథకంపై కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన విద్యుత్ డిమాండ్–సరఫరా గణాంకాలు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. ఝార్ఖండ్ రాష్ట్రం మొత్తం విద్యుత్ డిమాండ్లో 93 శాతం మాత్రమే విద్యుత్ సరఫరా చేయగలిగింది. నాగాలాండ్ డిమాండ్లో 94 శాతం సరఫరా చేసింది. అరుణాచల్ప్రదేశ్లో మొత్తం ఏడాదిలో 915 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉండగా.. 892 మిలియన్ యూనిట్లు సరఫరా చేసింది. 24 మిలియన్ యూనిట్ల లోటు ఏర్పడింది. దీంతో ఆ రాష్ట్రం 98 శాతం విద్యుత్ సరఫరా చేసినట్టు కేంద్ర ప్రభుత్వం వార్షిక నివేదికలో పేర్కొంది. రాజస్థాన్లో గత ఆ ర్థిక సంవత్సరం 1,01,801 మిలియన్ యూనిట్ల డిమాండ్కు గాను.. 1,00,057 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేసింది. అంటే 1,745 మిలియన్ యూనిట్ల సరఫరా లోటు ఏర్పడింది. మొత్తమ్మీద చూస్తే రాజస్థాన్ డిమాండ్లో 98 శాతం విద్యుత్ సరఫరా చేసింది. బీహార్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు కూడా మొత్తం వార్షిక విద్యుత్ డిమాండ్లో 98 శాతం మేరకు సరఫరా చేశాయి. కేంద్ర గణాంకాల ప్రకారం తెలంగాణలో 0.04 శాతం, కర్ణాటకలో 0.03 శాతం విద్యుత్ కొరత ఉంది. ఏపీలో కూడా వాస్తవ కొరత 0.4 శాతం మాత్రమే. విద్యుత్ డిమాండ్లో తెలంగాణ 99.96 శాతం, కర్ణాటక 99.97 శాతం, తమిళనాడు 99.93 శాతం, ఆంధ్రప్రదేశ్ 99.56 శాతం విద్యుత్ సరఫరా చేశాయి. -
గృహలక్ష్మి పథకం ప్రారంభం.. కుటుంబంలో మహిళా పెద్దకు రూ.2000
బెంగళూరు: ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం గృహ లక్ష్మి పథకంతో ఘణంగా వేడుకను జరుపుకుంది. ఈ పథకంలో ప్రతి ఇంట్లో ఒక మహిళా పెద్దకు రూ.2000 అందించనున్నారు. ఈ కార్యక్రమం సీఎం సిద్ధరామయ్య స్వస్థలం మైసూర్లో జరిగింది. కేంద్రం నుంచి సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ, మళ్లికార్జున ఖర్గే హాజరయ్యారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి మహిళలు కూడా కార్యక్రమానికి వచ్చారు. నేడు 50 శాతం మందికి అందాల్సిన రూ.1.08 కోట్ల లబ్దిదారులకు అకౌంట్లలో డబ్బులు జమ అయ్యాయని తెలిపారు. మిగిలిన లబ్దిదారుల అకౌంట్లలో రేపు జమ అవుతాయని స్పష్టం చేశారు. కార్యక్రమానికి హాజరైన పలువురు మహిళలు.. తమ అకౌంట్లలో డబ్బులు పడ్డాయని సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఇకపై తన పిల్లల స్కూల్ ఫీజులు సులభంగా చెల్లించవచ్చని అన్నారు. Congress has always delivered as promised. Guarantee schemes guaranteed for the welfare of people. Gruha Lakshmi is launched to provide Rs 2000 for every woman head of the family.#CongressGuarantee pic.twitter.com/8nVz2uQJ1Q — Siddaramaiah (@siddaramaiah) June 2, 2023 ఫెరిఫికేషన్పై అభ్యంతరాలు.. జీఎస్టీ రిటర్న్లు ఫైల్ చేయని కుటుంబాలకు ఈ పథకం వర్తించనుంది. అయితే.. ఈ పథకం అమలు తీరుపై పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రేషన్ కార్డులు, ఆధార్ కార్డుల ఆధారంగా వారి జీఎస్టీ వివరాలు సేకరిస్తామని కర్ణాటక మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి లక్ష్మి హెబ్బాల్కర్ తెలిపారు. కుటుంబ సాఫ్ట్వేర్ ఆధారంగా వివరాలు భద్రపరుస్తామని పేర్కొన్నారు. అయితే.. డేటా భద్రతపై మాత్రం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకే ఇంటి నుంచి ఇద్దరు మహిళలకు స్కీం వర్తించకుండా జాగ్రత్తలు పాటించామని మంత్రి తెలిపారు. కానీ మరణించినవారి పేరుపై ఉన్న రేషన్ కార్డుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. త్వరలో ఈ వివరాలు మార్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇదీ చదవండి: అమితాబచ్చన్కి రాఖీ కట్టిన సీఎం మమతా బెనర్జీ.. -
ఆమె ముస్లిం రాకుమారి.. దేశంలో తొలి మహిళా పైలెట్.. తరువాత పాక్ వెళ్లిపోయి..
అబిదా సుల్తాన్.. నాటిరోజుల్లో భోపాల్ రాచరిక సంస్థానానికి యువరాణి. మన దేశంలో విమానాన్ని నడిపేందుకు పైలట్ లైసెన్స్ పొందిన మొదటి మహిళ. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించకముందే ఆమె మహిళా పైలట్గా మారారు. భోపాల్ సంస్థానానికి చెందిన ఈ యువరాణి 1913, ఆగస్టు 28న జన్మించారు. 2002 మే 11న మరణించారు. ఆమె 1942, జనవరి 25న ఫ్లయింగ్ లైసెన్స్ పొందారు. ఆమె తండ్రి హమీదుల్లా ఖాన్ భోపాల్ రాచరిక సంస్థానానికి చివరి నవాబు. హమీదుల్లా ఖాన్కు అబిదా పెద్ద కుమార్తె. ఆమె చిన్న వయస్సులో డ్రైవింగ్, గుర్రపుస్వారీ మొదలైన వాటిని నేర్చుకోవడంతో పాటు షూటింగ్లో నైపుణ్యం సాధించారు. ఆ రోజుల్లో ఆమె ముసుగు వేసుకోకుండానే కారు నడిపారు. భోపాల్ సంస్థానం తండ్రి చేతుల్లో ఉన్నంత కాలం ఆమె తండ్రికి చేదోడువాదోడుగా ఉన్నారు. అయితే ఆమె ముస్లిం రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించలేదు. కానీ తన తండ్రి మంత్రివర్గంలో చైర్పర్సన్, ప్రధాన కార్యదర్శి బాధ్యతలను స్వీకరించారు. అబిదా ఎంతో ఇష్టంగా పోలో, స్క్వాష్ వంటి క్రీడలను ఆడేవారు. 1949లో ఆమె ఆల్ ఇండియా ఉమెన్స్ స్క్వాష్లో ఛాంపియన్గా నిలిచారు. ఆమె బాంబే ఫ్లయింగ్ క్లబ్, కోల్కతా ఫ్లయింగ్ క్లబ్లలో విమానం నడపడం నేర్చుకున్నారు. దేశ విభజన తర్వాత భారతదేశాన్ని విడిచిపెట్టారు. అబిదాకు 1926 జూన్ 18న కుర్వాయికి చెందిన నవాబ్ సర్వర్ అలీ ఖాన్తో వివాహం జరిగింది. 1949లో దేశ విభజన కోసం జరిగిన తిరుగుబాటు తర్వాత నవాబ్ సర్వర్ అలీ ఖాన్ భారతదేశాన్ని విడిచిపెట్టారు. అబిదాకు నాటి రోజుల్లో జిన్నాతో పరిచయం ఉంది. ఆమె తండ్రి భారతదేశ విలీనానికి తన సమ్మతిని తెలియజేస్తూ, విలీన లేఖపై సంతకం చేసినప్పుడు, ఆమె దానిని వ్యతిరేకించారు. అబిదా పాకిస్తాన్కు వస్తే అక్కడి రాజకీయాలో ఆమెకు అవకాశం కల్పించడమే కాకుండా ఆ దేశంలో ఆమెకు పూర్తి గౌరవం లభిస్తుందని జిన్నా ఆమెకు హామీ ఇచ్చారు. పాకిస్తాన్కు చేరుకున్న ఆమె కరాచీలోని ఒక విలాసవంతమైన రాజభవనంలో నివసించారు. అక్కడ ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించి, పాకిస్తాన్ ప్రభుత్వంలో హోదాను కూడా పొందారు. ఆమె ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్ తరపున ప్రాతినిధ్యం వహించారు. ఆమె చైనాలో అధికారిక పర్యటన కూడా చేశారు. 1960లో పాకిస్తాన్లో మార్షల్ లా అమలులోకి వచ్చినప్పుడు జిన్నా సోదరి ఫాతిమాతో కలిసి దానిని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. అబిదా తండ్రి మొదట్లో తమ రాచరిక సంస్థానాన్ని భారతదేశంలో కలపడంపై తిరుగుబాటు వైఖరి ప్రదర్శించినప్పటికీ, తరువాత ఆయన తన సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయవలసి వచ్చింది. అప్పడు అతను మాత్రమే భారతదేశంలో ఉన్నారు. కుమార్తెను ఇండియాకు తిరిగి రమ్మని కోరారు. అయితే దీనికి ఆమె అంగీకరించలేదు. అయితే తండ్రి చనిపోయిన సమయంలో ఆమె భారతదేశానికి తిరిగి వచ్చారు. ఆమె కుమారుడు షహర్యార్ ఖాన్ పాకిస్తాన్ విదేశాంగ మంత్రిగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షునిగా పనిచేశారు. 2001 అక్టోబర్ నాటికి అబిదాను అనేక వ్యాధులు చుట్టుముట్టాయి. ఆమెను ఆసుపత్రిలో చేర్పించినా ఫలితం లేకపోయింది. అబిదా పాకిస్తాన్లో స్థిరపడినందున, ఆమె తండ్రి తన మధ్య కుమార్తె సాజిదా సుల్తాన్ను భోపాల్ పాలకురాలిగా నియమించారు. పటౌడీ రాజకుటుంబానికి చెందిన నవాబ్ ఇఫ్తికార్ అలీఖాన్.. సాజిదా బేగంను వివాహం చేసుకున్నారు. మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ వారి కుమారుడు. అనంతర కాలంలో భోపాల్ రాచరిక సంస్థానంలో ఆస్తి వివాదానికి సంబంధించి పలు వివాదాలు చెలరేగాయి. అవి నేటికీ కొనసాగుతున్నాయి. ఇది కూడా చదవండి: 3000 ఏళ్లుగా ఎడారి గర్భంలో రాజు సమాధి -
లోక్సభ ఎన్నికలు ముందస్తుగానే రావొచ్చు: మమతా బెనర్జీ
కోల్కతా: దేశంలో బీజేపీ వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తే నియంతృత్వమే రాజ్యమేలుతుందని, అరాచకం తప్పదని తృణమూల్ కాంగ్రెŠ పారీ్ట(టీఎంసీ) అధినేత, పశి్చమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. బీజేపీ దేశంలో మతాల మధ్య, కులాల మధ్య శత్రుత్వాన్ని పెంచిందని మమత మండిపడ్డారు. బీజేపీ గనుక మళ్లీ గెలిస్తే ప్రజల నడుమ విద్వేషాలు మరింత రగులుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. బెంగాల్లో మూడు దశాబ్దాల కమ్యూనిస్టుల పాలనను అంతం చేశానని, వచ్చే ఎన్నికల్లో బీజేపీని సైతం మట్టికరిపిస్తానని చెప్పారు. వచ్చే ఏడాది జరగాల్సిన లోక్సభ ఎన్నికలు ఈ ఏడాది డిసెంబర్లోనే జరిగే అవకాశం ఉందని ఆమె తెలిపారు. డిసెంబర్లో ఎన్నికలకు బీజేపీ మొగ్గు చూపుతున్నట్లు చెప్పారు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే వచ్చే ఏడాది జనవరిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్నారు. ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ నాయకులు ఇప్పటికే దేశంలోని అన్ని హెలికాప్టర్లను బుక్ చేసుకున్నారని వెల్లడించారు. ఇతర పారీ్టలకు హెలికాప్టర్లు లభించకూడదన్నదే బీజేపీ ఎత్తుగడ అని విమర్శించారు. సోమవారం కోల్కతాలో టీఎంసీ యువజన విభాగం ర్యాలీలో మమతా బెనర్జీ ప్రసంగించారు. -
రూ.2 లక్షల రుణమాఫీపైనే మొదటి సంతకం
నల్లగొండ: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు సంబంధించిన రూ.2 లక్షల రుణమాఫీపైనే మొదటి సంతకం పెడతామని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎవరు సీఎంగా ఉన్నా.. తాను కీలకంగా వ్యవహరించి రుణమాఫీ చేయిస్తానని హామీఇచ్చారు. నల్లగొండ మండలం వెలుగుపల్లి గ్రామంలో వివిధ పార్టీ లకు చెందిన 200 మంది శనివారం ఎంపీ కోమటిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గతంలో నల్లగొండను దత్తత తీసుకుంటానని చెప్పి ఎలాంటి అభివృద్ధి పనులూ చేయలేదని విమర్శించారు. నల్లగొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధే తప్ప కొత్తగా ఏమీ కనిపించడం లేదన్నారు. ప్రస్తుతం ఎక్కడ కూడా 14 గంటల కన్నా ఎక్కువ విద్యుత్ సరఫరా కావడం లేదని చెప్పారు. ఎన్నికలు వస్తున్నాయని రాష్ట్రంలో భూములు అమ్మడంతో పాటు వైన్షాపులకు ముందస్తుగానే టెండర్లు వేసి వచ్చిన డబ్బులను సీఎం కేసీఆర్ తమ ఖాతాలో జమ చేసుకున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తనను నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని కోరారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 సీట్లను గెలుచుకుంటామని, రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని కోమటిరెడ్డి స్పష్టంచేశారు. కార్యక్రమంలో నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోహన్రెడ్డి, పలువురు కౌన్సిలర్లు, వెలుగుపల్లి మాజీ సర్పంచ్ జూలకంటి వెంకట్రెడ్డి, నాయకులు చెల్ల పద్మారెడ్డి, బ్రహ్మచారి, చెలక సైదిరెడ్డి, ఎం.రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అదానీలో పెట్టుబడుల జోష్: అబుదాబి ఆయిల్ మేజర్ వేల కోట్ల ప్లాన్!
UAE TAQA seeks to investment: షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్బర్గ్ నివేదికతో ఇబ్బందుల్లోపడిన అదానీ గ్రూపు ప్రస్తుతం పెట్టుబడుల విషయంలో దూసుకుపోతోంది. వేల కోట్ల రూపాయలు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు అందుకోనుంది. అదానీకి చెందిన పవర్ కంపెనీ GQG, గోల్డ్మాన్ సాచ్స్ పెట్టుబడుల తర్వాత మరో డీల్ సాధించ నుంది. అబుదాబికి చెందిన TAQA అదానీ సంస్థల్లో 2.5 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడి పెట్టాలని యోచిస్తోందని మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది. (అదిరిపోయే లుక్లో మహీంద్ర థార్ ఎలక్ట్రిక్ వెర్షన్) తాజాగా అబుదాబి నేషనల్ ఎనర్జీ కంపెనీ PJSC(TAQA) తన వ్యాపారాన్ని విస్తరించేందుకు గౌతమ్ అదానీకి చెందిన పవర్ బిజినెస్లలో పెట్టుబడి పెట్టాలని చూస్తోంది. అదానీ గ్రూప్ సంస్థలలో లేదా ఏదైనా ఒక సంస్థలో 1.5-2.5 బిలియన్ల డాలర్ల పెట్టుబడుల నిమిత్తంTAQA చూస్తోందిన ఎకనామిక్ టైమ్స్లోని ఒక నివేదిక తెలిపింది. ఉత్తర ఆఫ్రికా, పశ్చిమాసియాలోని ప్రాజెక్టులపై సంయుక్తంగా పనిచేయాలని చూస్తున్నాయని తెలిపింది. ఇవి థర్మల్ ఉత్పత్తి నుండి క్లీన్ ఎనర్జీ అండ్ గ్రీన్ హైడ్రోజన్ వరకు వివిధ నిలువు వరుసలలో విస్తరించి ఉన్నాయని పేర్కొంది. ప్రాథమిక ఇన్ఫ్యూషన్ , ప్రమోటర్ ఫ్యామిలీ ఎంటిటీల నుండి షేర్లను సెకండరీ కొనుగోలు చేయడం ద్వారా అదానీ గ్రూప్ సంస్థలలో 19.9 శాతం వరకు వాటాను కొనుగోలు చేయనుంది. (సంక్షోభం: చైనా రియల్ ఎస్టేట్ దిగ్గజం ఎవర్గ్రాండే సంచలనం) అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రస్తుత విలువ రూ. 91,660 కోట్లు, ప్రమోటర్లు 68.28 శాతం వాటాను కలిగి ఉన్నారు. ప్రస్తుత ధరల ప్రకారం, దాదాపు 20 శాతం వాటా అంటే రూ. 18,240 కోట్ల పెట్టుబడి (2.19 బిలియన్లడాలర్లు) TAQA పెట్టనుంది. అబుదాబి సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ (ADX)లో లిస్టెడ్ కంపెనీ TAQA నాలుగు ఖండాల్లోని 11 దేశాలలో పనిచేస్తున్న అంతర్జాతీయ ఇంధన మరియు నీటి సంస్థ. కాగా గత వారం, ఖతార్ వెల్త్ ఫండ్ ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ అనుబంధ సంస్థ 500 మిలియన్ డాలర్ల బ్లాక్ డీల్ ద్వారా అదానీ గ్రీన్ ఎనర్జీలో వాటాను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. -
పాపపు కాంగ్రెస్.. శాపపు బీజేపీ.. దీపంలాంటి కేసీఆర్
ఇబ్రహీంపట్నం/అబ్దుల్లాపూర్మెట్ /మహేశ్వరం: పాపపు కాంగ్రెస్ కావాలా? శాపపు బీజేపీ కావాలా? దీపం లాంటి కేసీఆర్.. బీఆర్ఎస్ కావాలా? ప్రజలే నిర్ణయించుకోవాలని మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రూ.62.21 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు గురువారం మంత్రి సబితారెడ్డితో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ మూడు గంటల కరెంట్ సరిపోతుందని రేవంత్రెడ్డి అంటుంటే, వ్యవసాయ బావులకు మీటర్లు పెట్టాలని బీజేపీ అంటోందని విమర్శించారు. సీఎం కేసీఆర్ 24 గంటల కరెంటు ఇస్తూ ఏటా మూడు పంటలు సాగు చేసుకోమంటున్నారని గుర్తు చేశారు. వారిని నమ్మొద్దు ఎన్నికలు రాగానే ఇది చేస్తాం..అది చేస్తామని చెప్పే నాయకులను నమ్మొద్దని మంత్రి హరీశ్ ప్రజలకు పిలుపునిచ్చారు. నిరంతరం ప్రజల మధ్యే ఉండే సమర్థులైన నాయకులను ఎన్నుకోవాలని కోరారు. వీఓఏలు, మెప్మా ఆర్పీల ఆటోమెటిక్ రెన్యూవల్, ఇన్సూరెన్స్, వేతన పెంపు సమస్యలను పది రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రైతు రుణమాఫీ పూర్తికాగానే, మహిళలకు రావాల్సిన వడ్డీలేని రుణాలను చెల్లిస్తామన్నారు. మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ. కేసీఆర్ నాయకత్వంలో అన్నిరంగాల్లో సమగ్రాభివృద్ధి జరుగుతోందన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, పార్టీ నాయకులు క్యామ మల్లేశ్, మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కిషన్రెడ్డి సమాధానం చెప్పాలి తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకా లు, అభివృద్ధిని కేంద్రంలోని బీజేపీ సర్కార్ కాపీ కొడుతోందని మంత్రి హరీశ్రావు అన్నా రు. మహేశ్వరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లా డుతూ.. రాష్ట్రానికి రావాల్సిన రూ.35 వేల కోట్ల నిధులు మోదీ సర్కార్ ఎందుకు నిలిపేసిందో..? కిషన్రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. -
ఫోన్ ఛార్జింగ్పై బాస్ ఆగ్రహం.. టాయిలెట్ ఫ్లష్ చేయద్దంటున్న నెటిజన్లు!
ఉద్యోగ జీవితంలో పలు సమస్యలు ఎదురవుతుంటాయనే విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఒక ఉద్యోగి సోషల్ మీడియాలో తన ప్రొఫిషినల్ లైఫ్లో ఎదురైన ఒక అనుభవాన్ని వెల్లడించాడు. తాను తన కార్యాలయంలో విచిత్రమైన అనుభవాన్ని ఎదుర్కొన్నాననని దానిలో పేర్కొన్నాడు. వైరల్ అవుతున్న రెడ్డిట్ పోస్టులో @Melodic-Code-2594 అనే ఖాతా కలిగిన యూజర్ తన బాస్ తాను ఆఫీసులో ఫోన్ ఛార్జ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారని పేర్కొన్నాడు. ‘వ్యక్తిగత ఉపయోగం కోసం కంపెనీ విద్యుత్ చోరీ చేశానని’ బాస్ ఆరోపించాడని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ యూజర్ తన పోస్టులో.. ‘ఆఫీసులో తాను ఫోన్ ఛార్జ్ చేసినందుకు మా బాస్ నాతో.. వ్యక్తి గత అవసరాలకు కంపెనీ విద్యుత్ చోరీ చేస్తున్నారు. మీ లాంటి వాళ్లకు ఎలా చెప్పాలి? నేనేమీ రోజంతా ఫోనులోనే మునిగిపోను. అప్పుడప్పుడు రాత్రి వేళ బెడ్మీదకు చేరేముందు ఫోన్ చార్జ్ చేయడం మరచి పోతుంటానంతే. ఇది డెస్క్ జాబ్’ అని బాస్ సీరియస్గా చెప్పాడని వివరించారు. ఈ పోస్టును చూసిన యూజర్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఒక యూజర్..‘మీ బాస్ పెద్ద మూర్ఖుడు. ఫోన్ ఛార్జింగ్ పెడితే కంపెనీ కరెంట్ చోరీ చేసినట్లు అవుతుందన్నాడంటే.. అక్కడి గాలి పీల్చినా, నీటిని తాగినా చోరీ చేశావని అంటాడేమో’ అని కామెంట్ చేశాడు. మరో యూజర్..‘మీ బాస్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవద్దన్నాడంటే.. ఆఫీసులోని ఫోనుకు వచ్చిన ఏ కాల్ను రిసీవ్ చేసుకోకూడదు. ఎందుకంటే అప్పుడు కంపెనీ ఫోను టాక్టైమ్, బ్యాటరీ పవర్ చోరీ చేసినట్లువుతుందని’ పేర్కొన్నాడు. మరో యూజర్ ‘ఆఫీసులోని టాయిలెట్ యూజ్ చేసినప్పుడు ఫ్లష్ చేయవద్దని మీ బాస్కు చెప్పండి. ఎందుకంటే అలా చేస్తే కంపెనీకి చెందిన నీరు వృథా అవుతుందని వివరించండి’ అని సలహా ఇచ్చాడు. ఇది కూడా చదవండి: అందం.. నేర సామ్రాజ్యంలోకి అడుగిడితే.. లేడీ డాన్ లవ్ స్టోరీస్! -
‘కల్వకుంట్ల’ మళ్లీ అధికారంలోకి వస్తే అంతే..తెలంగాణ పూర్తిగా తిరోగమనంలోకే
సాక్షి, హైదరాబాద్: కల్వకుంట్ల కుటుంబం మరోసారి అధికారంలోకి వస్తే తెలంగాణ అన్ని రంగాల్లో పూర్తిగా తిరోగమన బాట పడుతుందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు. నేను.. నా కుటుంబం.. అనే విధంగా సాగుతున్న కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం వచ్చిందన్నారు. శనివారం బీజేపీ కార్యాలయంలో జరిగిన బీజేపీ మీడియా, సోషల్ మీడియా వర్క్షాపులో కిషన్రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలను మళ్లీ మభ్యపెట్టి ఓట్లు దండుకునేందుకు సీఎం కేసీఆర్ కొత్త హామీలిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణను మోదీ ప్రభుత్వం అన్ని విధాలు గా ఆదుకుని అభివృద్ధికి అండదండలిస్తుంటే బీఆర్ఎస్ సర్కారు దు్రష్పచారం చేస్తోందని విమర్శించా రు. రాష్ట్ర ప్రభుత్వం తన వైఫల్యాలు, అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు బీజేపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతోందని ధ్వజమెత్తారు. మోదీ నాయకత్వంలో తెలంగాణకు ఏయే రూపాల్లో నిధులు ఇచ్చామో చెప్పేందుకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. ఆ మోసాలను బయట పెట్టండి కల్వకుంట్ల కుటుంబ పార్టీ చేస్తున్న విష ప్రచారాన్ని సామాజిక మాధ్యమాలు ఇతర రూపాల్లో తిప్పికొట్టాల్సిన అవసరం, బాధ్యత పార్టీనాయకులు, కార్యకర్తలపై ఉందని కిషన్రెడ్డి స్పష్టం చేశారు. ‘దళితబంధు పేరుతో.. ప్రజలను దగా చేయడం, మోసం చేయడం కేసీఆర్కు అలవాటు.ఊరికి ఒకరికో ఇద్దరికో ఇచ్చి.. అందరికీ ఇచ్చినట్లు ప్రచారం చేస్తున్నారు. డబుల్ బెడ్ రూమ్ఇళ్లు మండలానికి ఇద్దరికి ఇచ్చి అందరికీ ఇచ్చినట్లు ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి విషయాల్లో ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూ.. ప్రజల మద్దతును కూడగట్టాలి’అని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీ ఎప్పటికీ బీఆర్ఎస్, కాంగ్రెస్తో కలవదు ‘‘గతంలో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో కేసీఆర్మంత్రిగా పనిచేశారు. బీజేపీ ఏ రోజు కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్తో కలవలేదు.. భవిష్యత్లో కలవబోదు.’అని కిషన్రెడ్డి స్పష్టం చేశారు.’’12 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కనీసం రాజీనామా చేయకుండా.. చేతి గుర్తుతో గెలిచి బీఆర్ఎస్లో కేసీఆర్తో సంసారం చేస్తున్నారు. వాళ్లు ఇప్పుడు నీతులు చెబుతున్నారు. ఈరోజైనా, రేపైనా.. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలు ఒక్కటే. ఈ పార్టీలు మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. పెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా సంతకాలు చేశాయి’అని అన్నారు. రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి ప్రకాశ్ జవదేకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు డీకే అరుణ, ఈటల రాజేందర్, నల్లు ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు. -
కాళేశ్వరానికి కరెంట్ కష్టాలు!
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి అప్పుడే కరెంట్ కష్టాలు మొదలయ్యాయి. పంప్హౌజ్ల నిర్వహణకు అవసరమైన నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు తెలంగాణ ట్రాన్స్కో సంసిద్ధతను వ్యక్తం చేయడం లేదు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య మాత్రమే విద్యుత్ను వినియోగించుకోవడానికి నీటిపారుదల శాఖకు అనుమతిస్తోంది. సౌర విద్యుదుత్పత్తి లభ్యత ఉండే పగటి వేళల్లోనే ప్రాజెక్టుకు విద్యుత్ సరఫరా చేసేందుకు ట్రాన్స్కోలోని లోడ్ డిస్పాచ్ సెంటర్(ఎల్డీసీ) స్థానిక సబ్ స్టేషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. నిరంతరంగా నడపాలనే ప్రభుత్వ ఉద్దేశానికి అనుగుణంగా ప్రాజెక్టు పంపులను డిజైన్ చేయగా, నిరంతర విద్యుత్ లేక తరచుగా పంపుల ను ఆపాల్సి వస్తోందని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో ఇప్పటికే కొన్ని చోట్లలోని పంపుల్లోని విడిభాగాలు దెబ్బతిన్నాయని ఓ సీనియర్ ఇంజనీర్ ‘సాక్షి’కి తెలియజేశారు. వాడింది 240 మెగావాట్లే! కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ప్రాజెక్టు నిర్వహణ అవసరాలకు మొత్తం 5391.56 మెగావాట్ల విద్యుత్ అవసరం కానుంది. ప్రాజెక్టులో భాగంగా 109 పంపులను నిర్మించారు. ప్రస్తుత వానాకాలం ప్రారంభంలో వర్షాలు లేకపోవడంతో గత నెల తొలివారంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మిడ్మానేరు నుంచి అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయకమ్మసాగర్లలోకి నీళ్లను ఎత్తిపోశారు. మిడ్మానేరు నుంచి అన్నపూర్ణ రిజర్వాయర్కు నీళ్లను ఎత్తిపోసే పంప్హౌజ్లో చెరో 106 మెగావాట్ల సామర్థ్యం గల 4 పంపులు ఉండగా, ఒకే పంప్ను నడిపారు. అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి రంగనాయకసాగర్కి నీళ్లను ఎత్తిపోసే పంప్హౌజ్లో చెరో 134 మెగావాట్ల సామర్థ్యం గల 4 పంపులుండగా, అక్కడ సైతం ఒకే పంప్ను నడిపారు. దాదాపు 10 రోజుల పాటు పగటి వేళల్లో పంపులను నడిపి 3 టీఎంసీల వరకు నీళ్లను ఎత్తిపోసినట్టు నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. మళ్లీ వర్షాలు ప్రారంభం కాగా పంపింగ్ను నిలుపుదల చేశారు. రెండు పంపులు కలిపి మొత్తంగా 240 మెగావాట్ల విద్యుత్ అవసరం కాగా, పగటి పూట మాత్రమే సరఫరా చేసేందుకు ట్రాన్స్కో అనుమతిచ్చింది. యాదాద్రి విద్యుత్ వస్తే.. తీవ్ర వర్షాభావ సమయాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు చాలా ఉపయోగకరంగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటోంది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత ఇలాంటి సందర్భాల్లో పూర్తి సామర్థ్యంతో నీళ్లను ఎత్తిపోయడానికి గరిష్టంగా 5391.56 మెగావాట్ల విద్యుత్ అవసరం కానుంది. ఓ వైపు రాష్ట్రంలోని అన్ని వర్గాల వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరాను కొనసాగిస్తూ కాళేశ్వరం ప్రాజెక్టుకు ఈ మేరకు విద్యుత్ను నిరంతరంగా సరఫరా చేయడంట్రాన్స్కోకు పెను సవాలేనని భావిస్తున్నారు. నిర్మాణం చివరి దశలో ఉన్న 4000 మెగావాట్ల యాదాద్రి, 1600 మెగావాట్ల తెలంగాణ ఎన్టీపీసీ థర్మల్ విద్యుత్ కేంద్రాలు పూర్తయితే కాళేశ్వరం ప్రాజెక్టుకు విద్యుత్ కష్టాలు తప్పే అవకాశాలున్నాయి. -
వృత్తిధర్మం కోసం ప్రాణాలకు తెగించిన లైన్ మెన్
-
ప్రపంచంలో తొలిసారి.. ఈ సోలార్ ప్యానళ్ల ప్రత్యేకత ఏంటో తెలుసా?
కాగితాలతో చిత్రవిచిత్రమైన ఆకృతులను రూపొందించే జపనీస్ కళ ఒరిగామి. ఒరిగామి కళ స్ఫూర్తితో తేలికగా మడిచిపెట్టి ఎక్కడికైనా తీసుకుపోయేందుకు అనువైన సోలార్ ప్యానల్స్ను రూపొందించింది ఇంగ్లండ్కు చెందిన బహుళజాతి సంస్థ ‘సెగో ఇన్నోవేషన్స్’. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ‘ఒరిగామి సోలార్ ప్యానల్’. ఆరుబయట పిక్నిక్లకు వెళ్లేటప్పుడు, విద్యుత్ సరఫరా లేని అడవుల్లో రాత్రివేళ బస చేయాల్సి వచ్చేటప్పుడు ఈ సోలార్ ప్యానల్స్ చక్కగా ఉపయోగపడతాయి. వీటిని 20 వాట్, 50 వాట్, 100 వాట్, 400 వాట్ మోడల్స్లో ‘సెగో ఇన్నోవేషన్స్’ అందుబాటులోకి తెచ్చింది. వీటిని ప్రీ–ఆర్డర్లపై సరఫరా చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. గత జూన్ 6 నుంచి ప్రీ–ఆర్డర్లను స్వీకరించడం ప్రారంభించింది. -
డిమాండ్కు సరిపడా విద్యుత్.. రాష్ట్రంలో ఎక్కడా కోత లేదు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ హామీ మేరకు రాష్ట్రంలో డిమాండ్కు సరిపడా విద్యుత్ సరఫరా జరుగుతోందని, ఎక్కడా విద్యుత్ కోతలు విధించడంలేదని ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ (ఏపీ ట్రాన్స్కో) బుధవారం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. విద్యుత్ పంపిణీ సంస్థలు ఈ నెల 24న 206.62 మిలియన్ యూనిట్లు, 25న 197.19 మిలియన్ యూనిట్లు, 26న 201.97 మిలియన్ యూనిట్లు చొప్పున ఎలాంటి విద్యుత్ లోటు, లోడ్ రిలీఫ్లు లేకుండా అందించాయని తెలిపింది. ఈ మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (ఏపీజెన్కో) థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు సగటున రోజుకు 80 మిలియన్ యూనిట్లు అందించాయని వెల్లడించింది. 27వ తేదీ వరకు సగటు విద్యుత్ ఎగుమతి (అమ్మకాలు) రోజుకు 1.36 మిలియన్ యూనిట్లు మాత్రమేనని పేర్కొంది. అందువల్ల సరఫరా – డిమాండ్ గ్యాప్ కారణంగా లోడ్ రిలీఫ్లు లేవని, గ్రిడ్ డిమాండ్కు సరిపడా విద్యుత్ను డిస్కంలు సమకూర్చుకుంటున్నాయని తెలిపింది. విద్యుత్ కొరత తీర్చడానికి ఎప్పటికప్పుడు బహిరంగ మార్కెట్ (ఎనర్జీ ఎక్సే్చజీలు) నుంచి కొని, రాష్ట్రంలోని వినియోగదారులకు నిరంతరాయంగా కరెంటు సరఫరా చేస్తున్నాయని వివరించింది. -
రష్యాలో జరిగినట్లుగా..చరిత్రలో తిరుగుబాటు చేసిన నాయకులు వీరే!
ప్రపంచమంతా ఏకతాటిపై నిలబడి యుద్దం వద్దన్నా లెక్కచేయక మంకుపట్టుతో ఉక్రెయిన్పై యుద్ధానికి కాలుదువ్వింది. చిన్న దేశం అయినా ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి దిగితే ఇక అంతే అన్నారు అంతా. కానీ ఊహించని రీతిలో తనదైన వ్యూహంతో రష్యాకు చుక్కలు చూపించేలా ఉక్రెయిన్ సైన్యం యుద్ధం చేసింది. మమల్ని నిలవరించడం అసాధ్యం అని ఉక్రెయిన్ చెప్పకనే చెప్పింది రష్యాకి. ప్రతి ఉక్రెయిన్ పౌరుడు మాతృభూమి కోసం తమ చివరి రక్తపు బొట్టువరకు పోరాడి రక్షించుకుంటాం అని సగర్వంగా చెప్పి విస్మయపర్చింది. ఏడాదికిపైగా యుద్ధం జరగుతుందని ఎవ్వరూ ఊహించలేదు. ఇక రష్యాలో అంతకంతకు పెరిగిపోతున్న కోపం.. ఇక పంతం నెగ్గించుకునే వెర్రిలో ఎన్నో యుద్ధ నేరాలకు తెరతీసిందో చెప్పనవసరం లేదు. అయినా ఉక్రెయిన్ని నిలువరించలేక పోయింది. పైగా ఒకనొక సమయంలో సైన్యం వెనక్కి వెళ్లిపోయింది కూడా. ఇలా రసవత్తరంగా ఇరు దేశాల మధ్య యుద్ధం సాగుతున్న వేళ.. రష్యాకు ఊహించని రీతిలో షాక్ తలిలింది. ఉక్రెయిన్ యుద్ధంలోకి దింపిన కిరాయి సైన్యానికి చెందిన సంస్థ వాగ్నర్ గ్రూప్ గట్టి షాక్ ఇచ్చింది. రష్యా వెన్నులో బాకు దింపి తిరుగుబాటు జెండా ఎగరువేశారు వాగ్నర్ గ్రూప్ చీఫ్. తాను పెంచి పోషించిన కిరాయి సైన్యమే తనపై కత్తి దూయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు పుతిన్. ఇది అమానుషం, వెన్నుపోటు, అన్యాయం అంటూ వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ యుద్ధంలో కీలకంగా వ్యవహరించింది ఈ కిరాయి సైన్యమే కావడంతో రష్యాకు తలనొప్పి తప్పేలాలేదు. ఇప్పటికే రష్యా ఈ యుద్ధంలో వేలాది సైనికులను పోగొట్టుకుంది. పెద్ద సంఖ్యలో సైనిక మొబైలేజేషన్ పేరిటతో రిక్రూట్మెంట్ చేసుకుంది. అలాగే ఈ కిరాయి సైన్యాన్ని కూడా దింపింది. ఒక పక్క ఆయుధాలు, సైనికుల కొరతతో సతమతమతున్న రష్యా గత్యంతరం లేక ఆ దేశ అధ్యక్షుడు పంతం నెరవేర్చడం కోసం వెనుతిరగలేక ఉక్రెయిన్తో పోరాడుతోంది. ఇలాంటి సమయంలో వాగ్నర్ గ్రూప్ రష్యాలో విధ్వంసం సృష్టించేందుకు రెడీ అవ్వడం పుండమీద కారం చల్లినట్టయింది. ఇదిలాఉంచితే.. రష్యాలో జరిగినట్లుగానే చరిత్రలో తిరుబాటు బాట పట్టి.. అధికారాన్ని చేజిక్కించుకున్న వాళ్లు ఉన్నారు. ఆ వివరాలు చూద్దాం.. తిరుగుబాటు జెండా ఎగరువేసి వెన్నుపోటు పొడిచిన నాటి నాయకులు.. ముమ్మర్ గడ్డాఫీ: పేద బెడౌయిన్ కుటుంబంలో జన్మించిన ముమ్మర్ గడ్డాఫీ లిబియ రాచరికం, దాని పాశ్చాత్య మద్దతుదారులను అసహ్యించుకుంటూ పెరిగాడు. సరిగ్గా ఆ రాచరికంలో పెరుగుతున్న బలహీనతను ఆసరాగా చేసుకుని అప్పటి జూనియర్ ఆర్మీ అధికారి కింగ్ ఇద్రిస్ దేశం వెలుపల ఉన్న సమయంలో తిరుగబాటు చేసి అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. అతను 42 సంవత్సారాల పాటు లిబియాను పాలించాడు. నెపోలియన్ బోనపార్టే నెపోలియన్ కూడా ఆ బాటలోనే నడిచాడు. అతను 1799లో ఫ్రెంచ్ విప్లవ సమయంలో తిరుగుబాటు బాటపట్టి ప్రముఖంగా ఎదిగాడు. ఈ క్రమంలోనే 1804 వరకు రిపబ్లిక్ మొదటి కాన్సుల్ అయ్యాడు. ఆ తర్వాత 1815 వరకు ఫ్రాన్స్ చక్రవర్తిగా పాలించాడు. ఫిడేల్ కాస్ట్రో క్యూబా విప్లవకారుడు జనరల్ ఫుల్జెన్సియో బాటిస్టాకు వ్యతిరేకంగా జూలై 26న మొదలైన గెరిల్లా యుద్ధంలో.. ఉద్యమానికి నాయకత్వం వహించడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత 1959లో బాటిస్టాను పడగొట్టి.. క్యాస్ట్రో క్యూబా నాయకుడిగా అధికారాన్ని దక్కించుకున్నాడు. ఫుల్జెన్సియో బాటిస్టా క్యూబా అధ్యక్షుడిగా ఎన్నికై బాటిస్టా 1940 నుంచి 1944 వరకు పాలించాడు. అతను ప్రారంభంలో 1933 సార్జెంట్ల తిరుగుబాటులో భాగంగా అధికారంలోకి వచ్చాడు. అలాగే 1952 నుంచి 1959 వరకు క్యూబా విప్లవ సమయంలో ఓడిపోవడానికి ముందు యూఎస్ మద్దతు ఉన్న సైనిక నియంతగా కూడా పనిచేశాడు. పోల్పాట్ 1975లో, ఖైమర్ రూజ్ గెరిల్లాలు కంబోడియాలోని జనరల్ లోన్ నోల్ సైనిక ప్రభుత్వాన్ని పడగొట్టారు. ఆ సమయంలో పోల్ పాట్ నేతృత్వంలో ఒక మిలియన్ మందికి పైగా ప్రజలను చంపే తీవ్రవాద పాలన ప్రారభమయ్యింది. పోల్పాల్ 1976 నుంచి 1979 మధ్య కాలం వరకు ప్రధానమంత్రిగా చేశాడు. ఆ తర్వాత 1997లో తనని నాయకుడిగా తొలగించేంత వరకు కంబోడియాకు మార్గనిర్దేశం చేస్తూనే ఉన్నాడు. వ్లాదిమిర్ లెనిన్ బోల్షెవిక్ పార్టీ నాయకుడు వ్లాదిమిర్ లెనిన్ నేతృత్వంలో వామపక్ష విప్లవకారులు రష్యాలోని అసమర్థమైన తాత్కాలిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటును ప్రారంభించారు. అతను 1917 నుంచి 1924 వరకు సోవియట్ రష్యాకు, అలాగే 1922 నుంచి 1924 వరకు సోవియట్ యూనియన్కు మొదటి ప్రభుత్వ అధిపతిగా పనిచేశాడు. ఫ్రాన్సిస్కో ఫ్రాంకో ఫ్రాన్సిస్కో ఫ్రాంకో స్పానిష్ అంతర్యుద్ధం సమయంలో రెండవ స్పానిష్ రిపబ్లిక్ను పడగొట్టడంలో జాతీయవాద దళాలకు నాయకత్వం వహించిన స్పానిష్ జనరల్. ఆ తర్వాత అతను 1939 నుంచి 1975 వరకు స్పెయిన్ను నియంతగా పరిపాలించాడు. కేథరీన్ ది గ్రేట్ కేథరీన్ ది గ్రేట్ 1762 నుంచి 1796 వరకు రష్యా చివరి ఎంప్రెస్ రెగ్నెంట్, అలాగే దేశంలో ఎక్కువ కాలం పాలించిన మహిళా నాయకురాలు. ఆమె భర్త పీటర్ III పదవీచ్యుతుడైన తర్వాత ఆమె అధికారంలోకి వచ్చింది. (చదవండి: రష్యాకి తగిలిన వాగ్నర్ సైన్యం షాక్కి..ప్రపంచ నాయకుల రియాక్షన్ ఎలా ఉందంటే..) -
విమానం టేకాఫ్ అవుతున్న టైంలో ఉన్నారా? అంతే సంగతి..
విమానం టేకాఫ్ అవుతుండగా సమీపంలో ఎవరూ ఉండరు. ఎందుకంటే దాని ఇంజన్ నుంచి వచ్చే గాలి ఫోర్స్కి తాళ్లలేం. అందుకే ఎయిర్ పోర్ట్ అధికారులు విమానం టేకాఫ్ అవుతుందనంగా ఎవర్నీ రానీయరు, వారు ఉండరు. కానీ ఇక్కడో బృందం విమానం టేకాఫ్ అవుతుండగా అక్కడే ఉంది. ఆ విమానం ఇంజిన్ దెబ్బకు ఒక్కసారిగా వారంతా చెల్లా చెదురుగా అయిపోతారు. ఏదో పెద్ద గాలి తుఫానులా ..వారందర్నీ పడగొడుతున్నట్లు ఉంటుంది. నిజానికి వారంతా ఆ విమానం రన్వేకి సరిహద్దు సమీపంలో ఉండి ఫోటోలు తీసుకుంటున్నారు. సరిగ్గా ఆ సమయంలో విమానం ఆకాశంలోకి ఎగిరేందుకు సిద్ధం అవుతుంది. ఇక అంతే ఆ విమానం వెనుక ఉన్న ఇంజన్ నుంచి వచ్చే శక్తివంతమైన గాలికి అక్కడున్నవారంతా నిలబడటమే కష్టమైంది. ఏమవుతుందో తెలుసుకునేలోపే చెదిరిపోయారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి. Just downloaded my Skiathos videos from last week, here’s a small preview of the absolute chaos when people underestimate the power of aircraft engines! pic.twitter.com/ll2g9nY8AA — Callum Hodgson (@avgeekcal) June 21, 2023 (చదవండి: స్టీలు ఇల్లు..ఈజీగా మడతేసి తీసుకుపోవచ్చు!) -
ఏటా వంద మిలియన్ టన్నులు..
గోదావరిఖని: సింగరేణి సంస్థ ఏటా వంద మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే 78 మిలియన్ టన్నుల ఉత్పత్తికి ప్రణాళికలను రూపొందించిన సంస్థ, నూతన ప్రాజెక్టుల్లో ఉత్పత్తి ప్రారంభిస్తూ.. ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులను విస్తరించేందుకు సన్నాహాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఐదు ప్రాజెక్టుల ద్వారా సుమారు 26 మిలియన్ టన్నుల బొగ్గును వెలికి తీయాలని భావిస్తోంది. ఈ ఐదు ప్రాజెక్టుల్లో నైనీ బ్లాక్ కొత్త ప్రాజెక్టు కాగా, మిగతా నాలుగు ప్రాజెక్టుల జీవితకాలం పొడిగింపునకు వెళ్తున్నాయి. దీంతో ఒక్కో ప్రాజెక్టుకు 11నుంచి 43 ఏళ్ల వరకు జీవితకాలం పెరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఆర్థిక సంవత్సరంలో ఐదు ప్రాజెక్టుల్లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభించాలని యాజమాన్యం కృత నిశ్చయంతో ఉంది. ఈ మేరకు శనివారం సింగరేణి డైరెక్టర్లు వెంకటేశ్వర్రెడ్డి, ఎన్వీకే శ్రీనివాస్ సంస్థ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. అన్ని ఏరియాల నుంచి ప్రాజెక్టు నివేదికలు పంపించాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఒడిశాలోని నైనీబ్లాక్ కోల్మైన్ ద్వారా ఏటా 10 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అదనంగా పెరగనుంది. నాలుగు పాత ప్రాజెక్టుల విస్తరణ వల్ల మరో 16.60 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతుందని చెపుతున్నారు. అలాగే 2024–25 ఆర్థిక సంవత్సరంలో మరో 4.50 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. డిమాండ్కు అనుగుణంగా ముందుకు విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తి చేయాలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. ప్రస్తుతం బొగ్గు నిల్వలు ముగిసిన ప్రాజెక్టులకు ఎక్స్టెన్షన్ పేరుతో అనుమతులు పొందాం. వచ్చే ఏడాది మరో రెండు ప్రాజెక్టుల్లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభించనున్నాం. పర్యావరణ, అటవీ శాఖ అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నాం. – వెంకటేశ్వర్రెడ్డి, ప్రాజెక్టు అండ్ ప్లానింగ్ డైరెక్టర్, సింగరేణి సంస్థ -
ఆ రాతల్లో అంతా రోతే.. ఇదేంటి రామోజీ!
సాక్షి, అమరావతి: పిడుగులు పడనీ, పెనుగాలులు రానీ, వానలతో చెట్లు కూలనీ, వరదలతో ట్రాన్స్ఫార్మర్లు కుప్పకూలనీ.. అగ్ని ప్రమాదాలు సంభవించనీ.. విద్యుత్ సరఫరా మాత్రం ఆగడానికి వీల్లేదు.. వైర్లు తెగి, స్తంభాలు కూలినా కరెంటును ఆపడం కుదరదు. ప్రాణాలుపోతే మాకేంటి.. ఎవరేమైపోతే మాకేంటి.. అన్నట్లుగా ఉంది ఈనాడు రామోజీరావు తీరు. అందుకేనేమో వాతావరణంలో అకస్మాత్తుగా వస్తున్న మార్పులతో అక్కడక్కడా కొద్దిసేపు విద్యుత్ సరఫరా నిలిపితే రాష్ట్రమంతటా విద్యుత్ కోతలు విధిస్తున్నారంటూ అడ్డగోలు రాతలు రాస్తోంది. ఆ క్రమంలోనే విద్యుత్ ‘కోతలు బాబోయ్’ అంటూ సోమవారం ‘ఈనాడు’ ప్రచురించిన కథనంలో ఎలాంటి వాస్తవం లేదని గుంటూరు టౌన్–2, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సీహెచ్ రమేష్ స్పష్టంచేశారు. బలమైన ఈదురుగాలులవల్లే.. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో శనివారం, ఆదివారం వాతావరణంలో జరిగిన మార్పులు దృష్ట్యా ఉరుములు మెరుపులతో కూడిన బలమైన ఈదురు గాలులు వచ్చాయి. దీంతో అక్కడక్కడ తీగలు తెగి, విద్యుత్ స్తంభాలు విరిగాయి. ఈ నేపథ్యంలో.. పడిపోయిన వాటిని యథాస్థితికి తీసుకొచ్చి, లోడ్ను సరిచేయడానికి విద్యుత్ సరఫరాను కొంతసేపు నిలపాల్సి వచ్చింది. విద్యుత్ పునరుద్ధరించి వినియోగదారులకు అందించే క్రమంలోనే ఇలా జరిగింది. అంతేగానీ ఎటువంటి అధికారిక కోతలు విధించటంలేదని ఏఈ వెల్లడించారు. చదవండి: బాధితులకు అండగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ -
ఆంధ్రప్రదేశ్ లో పుష్కలంగా కరెంట్
-
లాభాల్లోకి టొరెంట్ పవర్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ విద్యుత్ దిగ్గజం టొరెంట్ పవర్ 2022–23 చివరి త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నష్టాలను వీడి లాభాల్లోకి ప్రవేశించింది. రూ. 484 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో రూ. 487 కోట్లకుపైగా నికర నష్టం ప్రకటించింది. కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి రూ. 4 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది. ఇక మొత్తం ఆదాయం సైతం భారీగా ఎగసి రూ. 6,134 కోట్లను తాకింది. అంతక్రితం క్యూ4లో రూ. 3,841 కోట్ల టర్నోవర్ నమోదైంది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం రూ. 2,165 కోట్లకు జంప్చేసింది. 2021–22లో కేవలం రూ. 479 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 14,493 కోట్ల నుంచి రూ. 26,076 కోట్లకు ఎగసింది. ఒకేసారి లేదా దశలవారీగా మార్పిడిరహిత డిబెంచర్ల(ఎన్సీడీలు) జారీ ద్వారా రూ. 3,000 కోట్ల సమీకరణకు బోర్డు అనుమతించినట్లు వెల్లడించింది. టొరెంట్ పవర్ షేరు ఎన్ఎస్ఈలో 0.6 శాతం బలపడి రూ. 556 వద్ద ముగిసింది. -
100 కిలోవాట్ ఉంటే ‘ఓపెన్’ కరెంట్
సాక్షి, హైదరాబాద్: బహిరంగ విపణి (ఓపెన్ యాక్సెస్) నుంచి నేరుగా గ్రీన్ ఎనర్జీ కొనుగోళ్లకు ఉన్న నిబంధనలను కేంద్ర ప్రభుత్వం మరింత సరళతరం చేసింది. ఒకే విద్యుత్ సబ్ డివిజన్ (రెవెన్యూ డివిజన్తో సమానం) పరిధిలో ఒకటి/అంతకు మించిన సంఖ్యలో విద్యుత్ కనెక్షన్లు కలిగిన సాధారణ విద్యుత్ వినియోగదారులు ఎవరైనా ఇకపై ఓపెన్ యాక్సెస్ విధానంలో సౌర/పవన/పంప్డ్ స్టోరేజీ విద్యుత్ వంటి గ్రీన్ ఎనర్జీని కొనుగోలు చేసుకోవచ్చు. అయితే సదరు వినియోగదారుకు విద్యుత్ కనెక్షన్ల కాంట్రాక్ట్ లోడ్/శాంక్షన్డ్ లోడ్ కలిపి కనీసం 100 కిలోవాట్లు, ఆపైన ఉండాలి. సొంత విద్యుత్ ప్లాంట్లు కలిగిన భారీ పరిశ్రమల వంటి కాప్టివ్ విద్యుత్ వినియోగదారులైతే.. ఓపెన్ యాక్సెస్లో ఎలాంటి పరిమితులు లేకుండా గ్రీన్ ఎనర్జీని కొనుగోలు చేసుకోవచ్చు. ఈ మేరకు ‘ది ఎలక్ట్రిసిటీ (ప్రమోటింగ్ గ్రీన్ ఎనర్జీ త్రూ గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్) రెండో సవరణ నిబంధనలు–2023’ను అమల్లోకి తెస్తూ కేంద్ర విద్యుత్ శాఖ తాజాగా గెజిట్ నోటిఫికేషన్ వెలువరించింది. ఇప్పటివరకు 1000 కిలోవాట్స్ (ఒక మెగావాట్తో సమానం), ఆపై లోడ్ కలిగినవారు మాత్రమే ఓపెన్ యాక్సెస్లో విద్యుత్ కొనుగోలు చేసుకోవడానికి అవకాశం ఉంది. డిస్కంల టారిఫ్తో పోల్చితే ఓపెన్ యాక్సెస్లో తక్కువ ధరకు విద్యుత్ లభ్యత ఉన్నప్పుడు.. భారీ పరిశ్రమలు ఆ విద్యుత్ను కొంటూ బిల్లుల భారం తగ్గించుకుంటున్నాయి. ఇకపై ఈ అవకాశం 100 కిలోవాట్ల లోడ్ కలిగిన వినియోగదారులకు సైతం లభించనుంది. చిన్న పరిశ్రమలకు ప్రయోజనం! ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ రంగ దక్షిణ/ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల (ఎస్పీడీసీఎల్ / ఎన్పీడీసీఎల్) నుంచే చాలావరకు వినియోగదా రులకు విద్యుత్ సరఫరా అవుతోంది. హెచ్టీ విద్యుత్ కనెక్షన్లు కలిగిన భారీ పరిశ్రమలు మాత్రమే ఇప్పటివరకు ఓపెన్ యాక్సెస్లో బయటి నుంచి విద్యుత్ కొనుక్కుంటున్నాయి. ఇలా ఓపెన్ యాక్సెస్ కొనుగోళ్లకు సంబంధించి డిస్కంలు ప్రతి యూనిట్పై 50 పైసల వరకు అదనపు సర్చార్జి వసూలు చేస్తున్నాయి. ఇకపై 100 కిలోవాట్లు, ఆపై లోడ్ కలిగిన వినియోగదారులు దేశంలో ఎక్కడి నుంచైనా గ్రీన్ ఎనర్జీని ఓపెన్ యాక్సెస్ విధానంలో కొనుగోలు చేసుకోవచ్చు. సాధారణ గృహ విద్యుత్ వినియోగదారుల శాంక్షన్డ్/కాంట్రాక్ట్ లోడ్ 10 కిలో వాట్ల లోపే ఉంటుంది. 100 కిలోవాట్ లోడ్ కలిగి ఉన్న భారీ నివాస భవనాలు, వాణిజ్య, పారిశ్రామి క వినియోగదారులకు కొత్త విధానంతో ప్రయోజ నం ఉండనుంది. ఇక 2032 డిసెంబర్ నాటికి నిర్మా ణం పూర్తి చేసుకోనున్న సముద్ర తీర పవన విద్యుత్ ప్రాజెక్టుల నుంచి ఓపెన్ యాక్సెస్ విద్యుత్ కొనే వినియోగదారులపై అదనపు సర్చార్జి విధించవద్ద ని కేంద్రం తాజా నిబంధనల్లో స్పష్టం చేసింది. -
‘వెలుగు’తోంది ఇండియా!
సాక్షి, అమరావతి: మన దేశంలో 1996 నాటికి కేవలం 7 కోట్ల విద్యుత్ సర్వీసులుండేవి. ఇప్పుడు దాదాపు 26 కోట్ల సర్వీసులతో ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద విద్యుత్ వినియోగదారులున్న దేశంగా అవతరించింది. వీటిలో 41 శాతం పరిశ్రమలు, 26 శాతం గృహావసరాలకు వినియోగిన్నారు. కేవలం ఈ లెక్కలే కాదు.. విద్యుత్ రంగంపై జరుగుతున్న అధ్యయనాలు సైతం భారత్ విద్యుత్ వెలుగులు విరజిమ్ముతోందని స్పష్టం చేస్తున్నాయి. అయితే, దేశంలో 13 శాతం గృహాలకు మాత్రం ఇప్పటికీ విద్యుత్ అందుబాటులో లేదు. విద్యుత్ వినియోగదారులు, డిస్కంపై రాక్ఫెల్లర్ ఫౌండేషన్, నీతి ఆయోగ్తో కలిసి స్మార్ట్ పవర్ ఇండియా జరిపిన సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. దేశ జనాభాలో దాదాపు 87 శాతం మందికి గ్రిడ్ ఆధారిత విద్యుత్ అందుబాటులో ఉందని సర్వే వెల్లడించింది. సగటున 17 గంటల సరఫరా దేశంలో విద్యుత్ అందుబాటులో లేని 13 శాతం మంది ఇతర మార్గాల్లో విద్యుత్ను పొందడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ 13 శాతంలో ఎక్కువగా 62 శాతం మంది వ్యవసాయదారులు ఉండటం గమనార్హం. కేవలం 4 శాతం గృహాలకు మాత్రమే గ్రిడ్ ఆధారిత విద్యుత్ లేదు. 92 శాతం మంది కస్టమర్లకు కేవలం 50 మీటర్ల లోపుగానే విద్యుత్ మౌలిక సదుపాయాలు లభిస్తున్నాయి. వ్యవసాయ కేటగిరీ సర్వీసులకు ఇది 75 శాతంగా ఉంది. మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్న వినియోగదారులకు కనెక్షన్ రేటు 86 శాతం, వ్యవసాయ వినియోగదారులకు కనెక్షన్ రేటు 70 శాతం, సంస్థాగత వినియోగదారులకు కనెక్షన్ రేటు 81 శాతంగా ఉంది. విద్యుత్ అందుబాటులో లేకపోవడానికి కారణాలివీ కొందరికి విద్యుత్ అందుబాటులో లేకపోవడానికి కారణాలను కూడా అధ్యయనం వెల్లడించింది. కస్టమర్కు దూరంగా విద్యుత్ స్తంభం ఉండటం 47 శాతం, విద్యుత్ ఖర్చులు, వినియోగదారు చార్జీలు 35 శాతం, పేలవమైన సేవల నాణ్యత 20 శాతం కారణంగా ఉన్నాయి. వాణిజ్య కస్టమర్లలో దాదాపు సగం మంది సర్వీసు తీసుకోకపోవడానికి ప్రధాన కారణం ఖర్చులు భరించలేకపోవడం అని అధ్యయనంలో వెల్లడించారు. గ్రిడ్ ఆధారిత విద్యుత్ కనెక్షన్ ఉన్న గృహ వినియోగదారులలో 92 శాతం మంది తక్కువ మంజూరైన లోడ్ 0–1 కిలోవాట్ పరిధిలోనే ఉన్నారు. విద్యుత్ సరఫరా సగటున రోజుకు సుమారు 17 గంటలు ఉంటోంది. 70 శాతం మంది గృహ వినియోగదారులు వారంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విద్యుత్ కోతలను ఎదుర్కొంటున్నారు. దాదాపు 75 శాతం మంది గృహ వినియోగదారులకు విద్యుత్ కోతల గురించి ముందస్తు నోటిఫికేషన్ అందటం లేదు. 63 శాతం మంది వినియోగదారులు వారంలో ఒకటి కంటే ఎక్కువ వోల్టేజి సమస్యలకు గురయ్యారు. 16 శాతం మంది వినియోగదారులు విద్యుత్ ప్రమాదాలను చవిచూశారు. -
త్రైమాసిక నివేదికలివ్వండి
సాక్షి, అమరావతి: విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఇకపై ప్రతి మూడు నెలలకు ఒకసారి త్రైమాసిక నివేదికలు సమర్పించాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. వివిధ పథకాల ద్వారా రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు ఇస్తున్న రాయితీ విద్యుత్కు సంబంధించిన ఆడిట్ వివరాలు, బిల్లుల లెక్కలను ఏపీఈఆర్సీకి ఇవ్వాల్సిందిగా మన రాష్ట్ర డిస్కంలకు సూచించింది. అక్కడి నుంచి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (సీఈఆర్సీ) సేకరిస్తుందని తెలిపింది. ఒకవేళ డిస్కంలు చెబుతున్న లెక్కల్లో తేడాలున్నట్టు తేలితే కేంద్రం నుంచి ప్రస్తుతం డిస్కంలకు అందుతున్న రీవాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం స్కీమ్ (ఆర్డీఎస్ఎస్) ప్రోత్సాహకాలను నిలిపివేస్తామని, జరిమానాలు కూడా విధిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు డ్రాఫ్ట్ ఎలక్ట్రిసిటీ రూల్స్ 2005కి సవరణ చేయాలని నిర్ణయించిన కేంద్రం రాష్ట్రాలకు సమాచారం పంపింది. ఈ నిబంధనల ప్రకారం.. విద్యుత్ సబ్సిడీ, దాని అకౌంటింగ్ను క్రమబద్ధీకరించాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. విద్యుత్ సబ్సిడీ పంపిణీ వివరాలను డిస్కంల నుంచి తీసుకోనుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన యూనిట్ సబ్సిడీకి సబ్సిడీ కేటగిరీ, వినియోగదారుల కేటగిరీ వారీగా వినియోగించే విద్యుత్కు సంబంధించిన కచ్చితమైన లెక్కల ఆధారంగా డిస్కం సబ్సిడీ డిమాండ్ను పెంచారా లేదా అనే వివరాలు నివేదికలో ఉండాలని పేర్కొంది. విద్యుత్ చట్టంలోని సెక్షన్–65 ప్రకారం సబ్సిడీకి సంబంధించిన వాస్తవ చెల్లింపు వివరాలు, ఇతర సంబంధిత వివరాల్లాగే చెల్లించాల్సిన సబ్సిడీ, చెల్లింపులో అంతరం వివరాలు కూడా నివేదికలో ఉండాలని చెప్పింది. దీనిపై అభిప్రాయం తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ‘టైమ్ ఆఫ్ డే’ విధానానికీ సవరణ రోజులో గంటల లెక్కన విద్యుత్ ధరల ప్రకారం బిల్లులు విధించే ‘టైమ్ ఆఫ్ డే’ విధానంలోనూ సవరణలు చేయాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతానికి కొన్ని పరిశ్రమలకే పరిమితమైన ఈ పద్ధతిని అన్ని పరిశ్రమలు, వాణిజ్య సర్విసులకు వర్తింపజేసేలా ముసాయిదా విద్యుత్ (వినియోగదారుల హక్కులు) సవరణ నిబంధనలు–2023 పేరిట కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసి.. రాష్ట్రాలు, విద్యుత్ సంస్థల నుంచి అభిప్రాయాలు తీసుకుంది. ఈ నిబంధనలు అమలులోకి వస్తే విద్యుత్ డిమాండ్ గరిష్టంగా (పీక్) ఉండే వేళల్లో వాడిన విద్యుత్కు అధిక చార్జీలు విధించే అవకాశం ఉంది. అదే సమయంలో డిమాండ్ తక్కువగా ఉండే వేళల్లో వినియోగించిన విద్యుత్ చార్జీల్లో 20 శాతం వరకూ రాయితీ లభించనుంది. అయితే, ఇందుకోసం స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని కేంద్రం ఆదేశించింది. -
విద్యుత్ కోతలు ఉండకూడదనే తరచూ సీఎం జగన్ సమీక్షలు
-
ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు
ముంబై: ఐటీ, ఫైనాన్స్, విద్యుత్ షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో స్టాక్ సూచీలు మూడోరోజూ నష్టాలను చవిచూశాయి. ఇప్పటివరకు వెల్లడైన కార్పొరేట్ క్యూ4 ఆర్థిక ఫలితాలు మార్కెట్ వర్గాలను మెప్పించలేకపోయాయి. అలాగే అంతర్జాతీయ బలహీన సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు సెంటిమెంట్ను బలహీనపరిచాయి. ఉదయం సెన్సెక్స్ 19 పాయింట్ల స్వల్ప లాభంతో 59,746 వద్ద, నిఫ్టీ ఏడు పాయింట్లు నష్టపోయి 17,653 వద్ద మొదలయ్యాయి. రోజంతా పరిమిత శ్రేణిలో కదలాడాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 292 పాయింట్ల పరిధిలో సెన్సెక్స్ 59,453 వద్ద కనిష్టాన్ని, 59,745 గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 159 పాయింట్లు నష్టపోయి 59,568 వద్ద నిలిచింది. నిఫ్టీ 17,580 – 17,666 శ్రేణిలో ట్రేడైంది. ఆఖరికి 41 పాయింట్లు పతనమై 17,619 వద్ద నిలిచింది. మెటల్, ఫార్మా, రియల్టీ, ఇంధన షేర్లకు చెందిన మధ్య తరహా షేర్లకు కొనుగోళ్లకు మద్దతు లభించడంతో బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ స్వల్పంగా 0.12 శాతం పెరిగింది. కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు, ఆయా కేంద్ర బ్యాంకులు ద్రవ్య విధాన వైఖరిపై ఎదురుచూపుల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు లాభ, నష్టాల మధ్య ట్రేడవుతున్నాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ► నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాల వెల్లడి(గురువారం)కి ముందు హెచ్సీఎల్ టెక్ షేరు అమ్మకాల ఒత్తిడికి లోనైంది. బీఎస్ఈలో రెండున్నర శాతం నష్టపోయి రూ.1,038 వద్ద స్థిరపడింది. ► రియల్టీ సంస్థ ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ షేరు రెండున్నర శాతం లాభపడి రూ.450 వద్ద ముగిసింది. ఆర్థిక సంవత్సరం(2022–23)లో వార్షిక ప్రాతిపదికన రూ. 12,930 కోట్ల విలువైన ఆస్తులను విక్రయించడంతో ఈ షేరుకు డిమాండ్ పెరిగింది. మ్యాన్కైండ్ @ రూ. 1,026–1,080 ఈ నెల 25–27 మధ్య ఐపీవో రూ. 4,326 కోట్ల సమీకరణకు రెడీ న్యూఢిల్లీ: హెల్త్కేర్ రంగ కంపెనీ మ్యాన్కైండ్ ఫార్మా పబ్లిక్ ఇష్యూలో భాగంగా షేరుకి రూ. 1,026–1,080 ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 25న ప్రారంభమై 27న ముగియనుంది. ఐపీవోలో భాగంగా కంపెనీ మొత్తం 4 కోట్లకుపైగా ఈక్విటీ షేర్లను ఆఫర్ చేస్తోంది. కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు వీటిని విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా రూ. 4,326 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. -
అనిశ్చితిలోనూ ఎకానమీ శుభ సంకేతాలు
న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల్లోనూ భారత్ ఎకానమీ తగిన సానుకూల గణాంకాలను చూస్తోంది. ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం, ఫిబ్రవరిలో పారిశ్రామిక ఉత్పత్తికి సంబంధించిన సూచీ (ఐఐపీ) వృద్ధి రేటు 5.6 శాతంగా (2022 ఫిబ్రవరితో పోల్చి) నమోదయ్యింది. విద్యుత్, మైనింగ్, తయారీ రంగాలు మంచి పనితీరును ప్రదర్శించినట్లు జాతీయ గణాంకాల కార్యాలయం లెక్కలు వెల్లడించాయి. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన సమీక్షకు ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం మార్చిలో 5.66 శాతం పెరిగింది. అంటే 2022 ఇదే నెలతో పోల్చితే ఈ ఉత్పత్తుల బాస్కెట్ ధర 5.66 శాతమే పెరిగిందన్నమాట. గడచిన 15 నెలల్లో ఇంత తక్కువ స్థాయిలో రిటైల్ ద్రవ్యోల్బణం నమోదుకావడం ఇదే తొలిసారి. ఆర్బీఐకి కేంద్రం నిర్దేశాల ప్రకారం, రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం లోపు ఉండాలి. అయితే 2022 నవంబర్, డిసెంబర్ మినహా 2022 జనవరి నుంచి 6 శాతం ఎగువనే కొనసాగుతోంది. కూరగాయల ధరలు కూల్... వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత గణాంకాల ప్రకారం మార్చిలో కూరగాయలు, ప్రొటీన్ రిచ్ ఆహార పదార్థాల ధరలు తగ్గాయి. కూరగాయల ధరలు 8.51 శాతం తగ్గాయి (2022 ఇదే నెలతో పోల్చి). ఆయిల్ అండ్ ఫ్యాట్స్ ధరలు 7.86 శాతం దిగిరాగా, చేపల ధర 1.42 శాతం దిగివచ్చింది. అయితే సుగంధ ద్రవ్యాల ధరలు మాత్రం భారీగా 18.2 శాతం ఎగశాయి. తృణ ధాన్యాలు–ఉత్పత్తుల ధరలు 15.27 శాతం ఎగశాయి. పండ్ల ధరలు కూడా పెరిగాయి. ఫుడ్ బాస్కెట్ ద్రవ్యోల్బణం 2023 ఫిబ్రవరిలో 5.95 శాతం వద్ద ఉంటే, మార్చిలో 4.79 శాతానికి తగ్గింది. 2022 ఇదే నెల్లో ఈ ద్రవ్యోల్బణం రేటు 7.68 శాతంగా ఉంది. -
కరెంట్కు ‘సెంట్రల్’ ఆంక్షలు!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ అదీనంలోని ‘సెంట్రల్ పూల్’నుంచి కరెంట్ను రాష్ట్రాలకు కేటాయించే విషయంలో కేంద్ర విద్యుత్ శాఖ కొత్త ఆంక్షలు తెచ్చింది. విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు సబ్సిడీ బకాయిలను చెల్లించకపోయినా, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులపై పన్నులు విధించినా, అంతర్రాష్ట్ర విద్యుత్ క్రయవిక్రయాలకు అడ్డంకిగా మారినా ఆయా రాష్ట్రాలకు ‘సెంట్రల్ పూల్’నుంచి కరెంట్ కేటాయించబోమని ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ గత నెల 31న ఉత్తర్వులు జారీ చేసింది. రెగ్యులేటరీ ఆస్తులు కలిగిన రాష్ట్రాలకు సైతం సెంట్రల్ పూల్ నుంచి కరెంట్ కేటాయించబోమని తేల్చి చెప్పింది. ఓ ఆర్థిక సంవత్సరంలో వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేసేందుకు అయ్యే మొత్తం వ్యయాన్ని వారి నుంచి బిల్లుల రూపంలో వసూలు చేసుకునేందుకు వీలుగా విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్లు టారీఫ్ను నిర్ణయించాల్సి ఉంటుంది. దీనికి విరుద్ధంగా ఈఆర్సీలు తక్కువ టారీఫ్ను నిర్ణయిస్తే డిస్కంలకు మిగిలే నష్టాలను విద్యుత్ రంగ పరిభాషలో రెగ్యులేటరీ అసెట్స్గా పేర్కొంటారు. ఏటేటా రెగ్యులేటరీ అసెట్స్ రూపంలో డిస్కంల నష్టాలు రూ.వేల కోట్లకు పేరుకుపోతుండటంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధనను తీసుకొచ్చింది. డిస్కంలకు నష్టాలు మిగలకుండా పెరిగే వ్యయానికి తగ్గట్టూ ఏటేటా విద్యుత్ చార్జీలను పెంచాలని ఈ నిబంధన ద్వారా కేంద్రం స్పష్టం చేస్తోంది. జల, సౌర విద్యుత్ వంటి గ్రీన్ఎనర్జీ, అంతర్రాష్ట్ర క్రయవిక్రయాలపై పన్నులు, సెస్లను విధించే రాష్ట్రాలకు సెంట్రల్ పూల్ నుంచి కరెంట్ను కేంద్రం కేటాయించదు. ఇకపై షరతులు పాటిస్తేనే కరెంట్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన ఎన్టీపీసీ, ఇతర కంపెనీలు ఉత్పత్తి చేసే విద్యుత్లో 80 శాతం మేర దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాల ద్వారా రాష్ట్రాలకు కేంద్రం విక్రయిస్తోంది. మిగిలిన 20 శాతాన్ని ఎవరికీ కేటాయించని విద్యుత్ పేరుతో ‘సెంట్రల్ పూల్’కింద తమ వద్దే ఉంచుకుంటుంది. ఉదాహరణకి రామగుండంలో ఎన్టీపీసీ నిర్మిస్తున్న 1,600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రానికి సంబంధించిన విద్యుత్లో రాష్ట్రానికి 1,280 మెగావాట్ల(80 శాతం) విద్యుత్ను మాత్రమే రాష్ట్రానికి కేంద్రం కేటాయించింది. మిగిలిన 320 మెగావాట్ల(20 శాతం) విద్యుత్ను సెంట్రల్ పూల్ కింద తన వద్దే ఉంచుకుంది. రాష్ట్రాల నుంచి విజ్ఞప్తుల ఆధారంగా ఈ విద్యుత్ను తాత్కాలిక కేటాయింపులు చేస్తుంది. ఇకపై ఏదైనా రాష్ట్రం సెంట్రల్ పూల్ నుంచి విద్యుత్ కావాలని విజ్ఞప్తి చేస్తే ఆ రాష్ట్రం సంబంధిత అంశాలను పాటిస్తుందా? లేదా ? అని కేంద్రం పరిశీలిస్తుంది. ఒక వేళ పాటించడం లేదని గుర్తిస్తే సెంట్రల్ పూల్ నుంచి ఆయా రాష్ట్రాలకు విద్యుత్ కేటాయింపులు జరపదు. -
రాష్ట్రంలో పుష్కలంగా విద్యుత్
సాక్షి, అమరావతి: రానున్న రోజుల్లో రాష్ట్రంలో మరింత విద్యుత్ అందుబాటులోకి వచ్చి వినియోగదారులకు పుష్కలంగా సరఫరా అవుతుందని, ఈ మేరకు కొత్త విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ప్రారంభం కానున్నాయని ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (ఏపీజెన్కో) లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కె.వి.ఎన్.చక్రధర్బాబు తెలిపారు. ఆయన శుక్రవారం ఏపీజెన్కో ఎండీగా విద్యుత్ భవన్లో బాధ్యతలు స్వీకరించారు. సంస్థ డైరెక్టర్లు, విద్యుత్ ఉద్యోగసంఘాల నాయకులు, పలువురు ఉద్యోగులు ఆయన్ని అభినందించారు. అనంతరం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న ఇంధన డిమాండ్ను తీర్చడానికిగాను థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని వేగవంతం చేయడానికి ప్లాంట్ల ఆధునికీకరణకు ప్రాధాన్యతనిస్తామని చెప్పారు. వ్యవసాయానికి పగటిపూట 9 గంటల విద్యుత్ సరఫరా చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చడానికి సిబ్బంది కలిసి పనిచేయాలని కోరారు. రానున్న నెలల్లో ఇంధన డిమాండ్ రోజుకి 250 మిలియన్ యూనిట్లను దాటుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. దాన్ని అందుకోవడానికి ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఇంధన డిమాండ్ పెరగడం చాలా మంచి సంకేతమని, ఇది రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాల పెరుగుదలను సూచిస్తుందని చెప్పారు. విద్యుత్ ఉత్పత్తి, అత్యధిక ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ నిర్వహణలో జాతీయస్థాయిలో అత్యుత్తమ సంస్థగా అవతరించేందుకు ఏపీజెన్కో అన్ని ప్రయత్నాలు చేస్తుందన్నారు. శ్రీదామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (ఎస్డీఎస్టీపీఎస్) స్టేజ్–2 (1,600 మెగావాట్లు) ప్రస్తుతం పనిచేస్తోందని, వేసవి డిమాండ్ను తీర్చేందుకు ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు. డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్టీటీపీఎస్)లో మరో 800 మెగావాట్ల యూనిట్ ఈ ఏడాదిలోనే ప్రారంభమవుతుందని వెల్లడించారు. ప్రస్తుతం గ్రిడ్ డిమాండ్లో 40 నుంచి 45 శాతం వరకు ఏపీజెన్కో ద్వారానే అందుతోందన్నారు. పోలవరం వద్ద ఒక్కొక్కటి 80 మెగావాట్ల సామర్థ్యమున్న 12 హైడ్రో ఎలక్ట్రిక్ యూనిట్లను (మొత్తం 960 మెగావాట్లు) కూడా జెన్కో ఏర్పాటు చేస్తోందని చెప్పారు. దశల వారీగా ప్రాజెక్టుతో పాటు ఇవి కూడా అందుబాటులోకి వస్తాయన్నారు. గ్రీన్ ఎనర్జీలో భాగంగా దిగువ సీలేరు వద్ద 115 మెగావాట్ల రెండు అదనపు యూనిట్ల నుంచి వచ్చే ఏడాది జూలైలో ఉత్పత్తి మొదలుపెట్టాలని ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. -
డిస్కంల నష్టాలు 5.49 లక్షల కోట్లు!
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్ : దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఏకంగా రూ. 5.49 లక్షల కోట్ల మేర నష్టాల్లో కూరుకుపోయినట్లు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ స్వయంగా ప్రకటించింది. ఈ నష్టాలకు తోడు విద్యుత్ ఉత్పాదన సంస్థలకు మరో రూ. 1.20 లక్షల కోట్ల మేర డిస్కంలు బకాయిపడ్డట్లు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం గత జూన్లో తీసుకొచ్చిన కొత్త విద్యుత్ విధానం ప్రకారం పంపిణీ సంస్థలకు ఉత్పాదన సంస్థలు విద్యుత్ సరఫరా చేసిన 45 రోజుల్లోగా బిల్లులు చెల్లించాలి. సకాలంలో బిల్లులు చెల్లించకుంటే ఉత్పత్తి సంస్థలు డిస్కంల నుంచి అధిక వడ్డీ వసూలు చేస్తాయి. ఈ గడువు దాటినా బిల్లులు చెల్లించకపోతే సంబంధిత డిస్కంలకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తాయి. కానీ ఈ నిబంధనను కూడా బేఖాతరు చేస్తూ విద్యుత్ పంపిణీ సంస్థలు సకాలంలో బిల్లులు చెల్లించకుండా బకాయిలు పెంచుకుంటూ పోతూనే ఉన్నాయి. గతేడాది జూన్ 3కు ముందు విద్యుత్ బకాయిలు రూ. 91,061 కోట్లుగా ఉండగా కొత్త నిబంధన అమల్లోకి వచ్చాకఉత్పాదన సంస్థలకు డిస్కంలు మరో రూ. 25, 470 కోట్లు బాకీ పడ్డాయి. నిర్లక్ష్యం ఫలితం... విద్యుత్ పంపిణీ వ్యవస్థలోని లొసుగులు, లెక్కాపత్రంలేని విద్యుత్ వాడకం, వసూళ్లలో నిర్లక్ష్యం, పంపిణీ అవుతున్న విద్యుత్కు.. వస్తున్న ఆదాయానికి కూడా పొంతనలేకపోవడం డిస్కంల నష్టాలకు ఓ కారణం. అదే విధంగా డి్రస్టిబ్యూషన్ కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ కింద చెల్లించాల్సిన నిధులు సకాలంలో విడుదల చేయకపోవడం కూడా ఈ నష్టాల పెరుగుదలకు కారణంగా భావిస్తున్నారు. నష్టాల్లో అగ్రస్థానం తమిళనాడు... కేంద్రం లెక్కల ప్రకారం అత్యధిక నష్టాలు మూటగట్టుకుంటున్న రాష్ట్రాల్లో తమిళనాడు తొలి స్థానంలో నిలిచింది. అక్కడి విద్యుత్ పంపిణీ సంస్థలు ఏకంగా రూ. 1.25 లక్షల కోట్ల మేరకు నష్టాల్లో ఉన్నాయి. 2022–23 లెక్కలు పూర్తిగా వస్తే ఈ నష్టాలు మరింత పెరిగే అవకాశం ఉంది. రెండో స్థానంలో రాజస్తాన్లోని డిస్కంలు రూ. 89,556 కోట్ల నష్టాలను మూటగట్టుకోగా రూ. 77,937 కోట్లతో యూపీ, రూ. 59,546 కోట్లతో మధ్యప్రదేశ్, రూ. 49,816 కోట్లతో తెలంగాణకు చెందినడిస్కంలు తరువాతి స్థానాల్లో ఉన్నాయి. పెద్ద రాష్ట్రాల్లోనే డిస్కంలబకాయిలు అధికంగా ఉండగా బెంగాల్ సహా దాదాపు 20 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల విద్యుదుత్పాదన సంస్థలకు పెద్దగా బకాయిలు లేవు. సంస్కరణలతోనే డిస్కంల బాగు.. విద్యుత్ పంపిణీ సంస్థలు జవాబుదారీగా వ్యవహరిస్తే నష్టాలు తగ్గించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. నష్టాలు తగ్గించుకొని ఆర్థికంగా డిస్కంలు బాగుపడాలంటే యుద్ధప్రాతిపదికన ప్రీపెయిడ్ మీటర్ల ఏర్పాటు, ఉత్పత్తి, సరఫరా, పంపిణీకి ఆటోమేటిక్ మీటరింగ్ వ్యవస్థ అమలుఅవసరమని సూచిస్తోంది. -
విద్యుత్ పాదుపు..ప్రగతికి మలుపు
-
ఔను! మేము అధికారం కోసమే కలిశాం!
ప్రధాని మోదీ డిగ్రీల వివరాలను అడిగినందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు గుజరాత్ హైకోర్టు రూ.25 వేలు జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శివసేన నాయకుడు ఉద్ధవ్ థాకరే ప్రధాని మోదీ డిగ్రీ వివాదంపై పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. డిగ్రీలు చదివి ఉద్యోగాలు లేని యువకులు ఎంతమందో ఉన్నారని వ్యంగ్యంగా మాట్లాడారు. కానీ ఈ ప్రధాని మోదీని డిగ్రీ చూపించమని అడిగితే జరిమానా విధిస్తారేంటి? అని సెటైర్లు వేశారు. అయినా మా కాలేజిలోనే మోదీ చదువుకున్నాడని గర్వంగా ఫీలవుతూ ఏ కాలేజీ చెప్పేందుకు ముందుకు రావడకపోవడం ఆశ్చర్యంగా ఉందంటూ విమర్శించారు. నిజానికి అసలు ప్రధాని చదువకున్నారా అంటూ అనుమానం లేవనెత్తారు. ముఖ్యమంత్రి కావలనే ఉద్దేశ్యంతోనే సైద్ధాంతికంగా భిన్నమైన నేషనలిస్ట్ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారంటూ బీజేపి చేస్తున్న ఆరోపణలకు థాకరే గట్టి బదులు ఇచ్చారు. ఔను మేము అధికారం కోసమే కలిశాం. కానీ దానిని కోల్పోయినప్పటికీ ఇంకా కలిసే ఉన్నాం, మరింత బలంగా ఉన్నాం అని థాకరే అన్నారు. అలాగే సేన నాయకుడు ఏక్నాథ్ షిండే 40 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేసి బీజేపీతో కొత్త ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేశారో ప్రస్తావిస్తూ..అవకాశం కుదరినప్పుడల్లా బీజేపీ ప్రజలను లోబర్చుకుంటుందని, సరిగ్గా ఎన్నికల సమయంలో మరింతగా మాయమాటలతో మోసం చేస్తోందని ఆరోపించారు. కాగా, బీజేపీ తనను హిందూత్వాన్ని విడిచిపెట్టానని నిందలు వేస్తోంది. నేను హిందూత్వాన్ని విడిచిపెడుతున్నాను అనడానికి ఒక్క ఉదాహరణ చెప్పగలారా?. రాజ్యంగంపై ప్రమాణం చేసేందుకు నేను సిద్దమే మీరు ధృవీకరించగలరా అని ప్రశ్నిస్తే..అదిగో రాజ్యంగాన్ని అవమానిస్తున్నారంటూ ఆరోపిస్తూ..బీజేపీ వితండ వాదన చేస్తోందన్నారు. న్యాయవ్యవస్తను సైతం బీజేపీ నియంత్రించడానికి ప్రయత్నించింది కానీ అదృష్టవశాత్తు న్యాయవ్యవస్థ అందుకు అంగీకరించ లేదన్నారు. లేదంటే ఇజ్రాయెల్ మాదిరి పరిస్థితి మన దేశంలో కూడా తల్లెత్తేది అంటూ బీజేపీకి గట్టి కౌంటరిచ్చారు. (చదవండి: శ్రీ రామనవమి శోభా యాత్రలో ఉద్రిక్తత.. బీజేపీ ఎమ్మెల్యేకి గాయాలు) -
తెలంగాణ చరిత్రలోనే ఇవాళ అత్యధిక విద్యుత్ వినియోగం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ చరిత్రలోనే ఇవాళ అత్యధిక విద్యుత్ వినియోగం జరిగింది. మార్చి నెలలో అనుకున్న విధంగానే 15000 మెగా వాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. మంగళవారం ఉదయం 10.03 నిమిషాలకు 15254 మెగా వాట్ల విద్యుత్ అత్యధిక ఫీక్ డిమాండ్ నమోదు అయ్యింది. రాష్ట్రంలో రోజురోజుకు విద్యుత్ వినియోగం పెరుగుతోంది. సాగు విస్తీర్ణం పెరగడం, పారిశ్రామిక అవసరాలు పెరగడంతో రాష్ట్రంలో విద్యుత్ వినియోగం పెరుగుతుందని ట్రాన్స్ కో, జెన్కో సీఎండీ ప్రభాకర్రావు వెల్లడించారు. మొత్తం విద్యుత్ వినియోగంలో 37 శాతం వ్యవసాయ రంగానికే వినియోగింపబడుతోంది. దేశంలో వ్యవసాయ రంగానికి అత్యధిక విద్యుత్ వినియోగం చేస్తున్న రాష్ట్రం తెలంగాణ. మొత్తం విద్యుత్ వినియోగంలో దక్షిణ భారతదేశంలో తమిళనాడు మొదటి స్థానం కాగా, రెండో స్థానంలో తెలంగాణ ఉంది.నిన్న 14 138 మెగా వాట్లు కాగా రాష్ట్రం ఏర్పడిన తరువాత అత్యధిక విద్యుత్ డిమాండ్ 15254 మెగా వాట్లు రికార్డ్ స్థాయిలో నమోదు ఇదే. గత సంవత్సరం మార్చి నెలలో 14160 మెగా వాట్ల అత్యధిక విద్యుత్ వినియోగం కాగా, ఈసారి డిసెంబర్ నెలలోనే గత సంవత్సరం రికార్డ్ను అధిగమించి ఈ నెలలోనే 14750 మెగా వాట్ల ఫీక్ విద్యుత్ వినియోగం దాన్ని అధిగమించి 15254 మెగా వాట్ల ఫీక్ డిమాండ్ నమోదైంది. ఈ ఏడాది వేసవి కాలంలో 16 వేల మెగా వాట్ల డిమాండ్ వచ్చే అవకాశం ఉంది. ఎంత డిమాండ్ వచ్చిన సరఫరాకు అంతరాయం లేకుండా సరఫరా చేస్తామని ప్రభాకర్రావు తెలిపారు. మార్చి నెలలో 15000 మెగా వాట్ల విద్యుత్ డిమాండ్ నమోదు అవుతుందని ముందే ఉహించాం. అందుకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు విద్యుత్ సరఫరా కు ఏర్పాట్లు చేశాం. రాష్ట్ర రైతాంగంకు,అన్ని రకాల వినియోగదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని సీఎండీ అన్నారు. చదవండి: TSPSC: మరో సంచలనం.. గ్రూప్-1 ప్రిలిమ్స్ రాసిన ప్రవీణ్.. ఆ పేపర్ కూడా లీక్ అయ్యిందా? -
ఏపీలో సోలార్ ప్రాజెక్టు పెడతాం
సాక్షి ప్రతినిధి: ఇంధన రంగంలో రాష్ట్ర ప్రభుత్వ పాలసీ.. పరిశ్రమలను ప్రోత్సహించడంలో ఇక్కడి పాలకులు అనుసరిస్తున్న విధానాలు పారిశ్రామిక దిగ్గజాలను రాష్ట్రానికి రప్పిస్తున్నాయి. ఇప్పటికే ఈ రంగంలో రూ. 9,57,139 కోట్ల పెట్టుబడులతో 42 ప్రాజెక్టుల ద్వారా 1,80,918 మందికి ఉద్యోగాలు కల్పించేందుకు దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక సంస్థలు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ వేదికగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆ జాబితాలోకి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా (ఎన్ఎల్సీఐ) లిమిటెడ్ కూడా చేరింది. రాష్ట్రంలో సౌర విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులను స్థాపించడానికి ఈ సంస్థ ఆసక్తి కనబరుస్తోంది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసేందుకు ఎన్ఎల్సీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) ప్రసన్నకుమార్ మోటుపల్లి విజయవాడ వచ్చారు. ఈ సందర్భంగా ‘సాక్షి ప్రతినిధి’కి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. పునరుత్పాదక విద్యుత్కు ఏపీలో అవకాశాలు.. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ‘నైవేలీ’ సిద్ధంగా ఉంది. పునరుత్పాదక శక్తి (రెన్యూవబుల్ ఎనర్జీ) విభాగంలో.. ముఖ్యంగా సౌర, పవన విద్యుదుత్పత్తి ప్రాజెక్టుల స్థాపనకు ఏపీలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రానున్న నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా 6 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయడమే మా కార్పొరేషన్ లక్ష్యం. ఇందుకు అనుకూలమైన రాష్ట్రాలేమిటని చూసినప్పుడు మాకు మొదట ఏపీ కనిపించింది. దీంతో వెంటనే ప్రభుత్వానికి మేం ప్రతిపాదించాలని నిర్ణయించాం. అందులో భాగంగానే ఏపీ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్తో భేటీ అయ్యాం. రాష్ట్రంలో ఎన్ఎల్సీ విస్తరణ, పవర్ ప్రాజెక్ట్లు నెలకొల్పడానికి ఉన్న అవకాశాలపై చర్చించాం. ప్రభుత్వం వైపు నుంచి మాకు అత్యంత సానుకూల వాతావరణం కనిపించింది. లిగ్నైట్ ద్వారా విద్యుదుత్పత్తి.. లిగ్నైట్ (గోధుమ బొగ్గు) ద్వారా విద్యుదుత్పత్తి చేయడం మా కార్పొరేషన్ ప్రత్యేకత. తమిళనాడు, రాజస్థాన్, గుజరాత్లలో మాత్రమే ఈ బ్రౌన్ కోల్ అందుబాటులో ఉంది. ఎన్ఎల్సీఐ ద్వారా లిగ్నైట్ మైనింగ్ చేసి నైవేలీలోనే విద్యుదుత్పత్తి చేస్తాం. అలా ఉత్పత్తి అయిన విద్యుత్ 8 వేల మెగావాట్లు కాగా అందులో థర్మల్ పవర్ 6 వేల మెగావాట్లు ఉంటుంది. ఇక దక్షిణాది రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాలకి కార్పొరేషన్ ద్వారా విద్యుత్ సరఫరా చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్కి దాదాపు 310 మెగావాట్ల థర్మల్ విద్యుత్ సరఫరా చేస్తున్నాం. ఏపీలో రూ.3 వేల కోట్ల పెట్టుబడితో.. దేశంలోనే తొలిసారిగా నైవేలీలో రూ.12 వేల కోట్లతో 1,320 మెగావాట్ల లిగ్నైట్ అల్ట్రా సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్ని ఏర్పాటుచేయబోతున్నాం. దీనికి సంబంధించి ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఒడిశా రాష్ట్రం తాలబిరలో రూ.22 వేల కోట్ల వ్యయంతో 3,200 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ని నిర్మించబోతున్నాం. అన్నీ అనుకూలిస్తే ఏపీలో రూ.3 వేల కోట్లతో 500–1000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును నెలకొల్పడానికి సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు నచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నాం. 2025లోగా ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించగలిగితే ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ (ఐఎస్టీఎస్) చార్జీల నుంచి కూడా కేంద్రం ద్వారా మినహాయింపు లభిస్తుంది. ఈ ప్రాజెక్టువల్ల ప్రత్యక్షంగా 200 మందికి పరోక్షంగా 1000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. విద్యుత్ కూడా తక్కువ ధరకే దొరుకుతుంది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) లిమిటెడ్తో ఏపీ ఇప్పటికే 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ పొందడానికి ఒప్పందం చేసుకుంది. వారి ధర యూనిట్ రూ.2.49గా నిర్ణయించారు. మేం కూడా ఇంచుమించు అదే ధరకు సౌర విద్యుత్ను అందిస్తాం. -
AP: ఈ వేసవిలో విద్యుత్ కోతలు లేకుండా చర్యలు: విజయానంద్
సాక్షి, విజయవాడ: ఈ వేసవిలో విద్యుత్ కోతలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ అన్నారు. గురువారం ఆయన సాక్షి మీడియాతో మాట్లాడుతూ, వేసవిలో విద్యుత్ కోతలు లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని తెలిపారు. సీఎం ఆదేశాలతో ప్రణాళికాబద్దంగా వేసవి డిమాండ్ని అధిగమిస్తామన్నారు. ‘‘గత ఏడాది కంటే ఈ వేసవిలో విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉంది. గత ఏడాది ఫిబ్రవరిలో సరాసరిన రోజుకి 202 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటే ఈ ఏడాది ఫిబ్రవరిలోనే 227 మిలియన్ యూనిట్లకి పెరిగింది. గత ఏడాది మార్చి నెలలో రోజుకి 212 మిలియన్ యూనిడ్ల డిమాండ్ ఉంటే ఇపుడు 232 మిలియన్ యూనిట్లకి డిమాండ్ పెరిగింది. గత ఏడాది ఏప్రిల్ నెలలో పీక్ డిమాండ్ 232 మిలియన్ యూనిట్ల కాగా.. ఈ ఏడాది మార్చి రెండవ వారంలోపే 232 మిలియన్ యూనిట్లు దాటాం. గడిచిన ఏడాది కాలంలో ఏపీలో పెరిగిన పరిశ్రమల కారణంగా వాణిజ్య అవసరాలకి 18 శాతం, పరిశ్రమలకి 20.31 శాతం విద్యుత్ వినియోగం పెరిగింది’’ అని విజయానంద్ వివరించారు. ‘‘ఈ కారణంగానే విద్యుత్ డిమాండ్ ఊహించని విధంగా రికార్డు స్ధాయికి పెరిగింది. మార్చి నెలాఖరుకి 240 మిలియన్ యూనిట్లు.. ఏప్రిల్ నెలకి 250 మిలియన్ యూనిట్లకి డిమాండ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నాం. ఏప్రిల్ నెలలో ఒక్క వ్యవసాయానికే సరాసరిన 50 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉంటుంది. పెరిగిన డిమాండ్ కి తగ్గట్లుగా విద్యుత్ కోతలు లేకుండా చర్యలు చేపడుతున్నాం. పరిశ్రమలకి, గృహావసరాలకి నిరంతరాయ విద్యుత్ సరఫరా ఉంటుంది. వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ సరఫారా కొనసాగిస్తాం’’ అని ఆయన తెలిపారు. చదవండి: సీఎం జగన్ మాటల్లో కాదు.. చేతల్లో చూపిస్తున్నారు: సజ్జల కృష్ణపట్నం మూడవ యూనిట్ ద్వారా 800 మెగా వాట్ల విద్యుత్ నేటి నుంచి పూర్తిగా అందుబాటులోకి వచ్చింది. సెమ్ కాబ్ ద్వారా 500 మెగా వాట్ల విద్యుత్ అందుబాటులోకి వచ్చింది. మార్కెట్లో యూనిట్ ధర 12 రూపాయిలుంటే వేసవి అవసరాలను దృష్డిలో పెట్టుకుని ముందుగానే మార్చి, ఏప్రిల్ నెల కోసం యూనిట్ 7.90 రూపాయలకు విద్యుత్ కొనుగోలుకి ఎంఓయు చేసుకున్నాం. అదే విధంగా ఇతర రాష్ట్రాలతో 300 మెగా వాట్ల విద్యుత్కి బ్యాంకింగ్ ఒప్పందాలు చేసుకున్నాం’’ అని విజయానంద్ వెల్లడించారు. -
ఆర్ఎస్ఎస్ ఓ రహస్య సమాజం: రాహుల్ గాంధీ
కాంగ్రెస్ మాజీ నాయకుడు, వాయ్నాడ్ ఎంపీ రాహుల్ గాంధీ అధికార బీజేపీపై మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ మేరకు రాహుల్ పర్యటన ముగింపు సందర్భంగా లండన్లోని చతం హౌస్ థింక్ ట్యాంక్లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. బీజేపీ భారతదేశంలో శాశ్వతంగా అధికారంలో ఉంటుందని భావిస్తోంది. కానీ అందులో నిజం లేదని, అలాని కాంగ్రెస్ పోతుందని అర్థం కాదు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కాలాన్ని పరిశీలిస్తే ఎక్కువ కాలం కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంది. బీజేపీ అధికారంలోకి రాకమునుపే మేము పదేళ్లు అధికారంలో ఉన్నాం." అని అన్నారు. అలాగే మరోసారి ఇజ్రాయెల్ సాఫ్ట్వేర్ పెగాసెస్ గురించి మరోసారి ప్రస్తావించారు. అంతేగాదు భారత ప్రజస్వామ్యానికి మరమత్తులు చేపట్టడానికి ప్రతిపక్షాలన్ని కలిసి రావాలని పిలుపునిచ్చారు. భారత్లో జరుగుతున్న మార్పులను ఎత్తిచూపారు. తాము అధికారంలో ఉంటే గ్రామీణ ప్రాంతాలపైనే దృష్టిసారిస్తాం అన్నారు. బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పోయిదనేది అవాస్తవం అని నొక్కి చెప్పారు. అలాగే కాంగ్రెస్ తోపాటు విదేశీ మీడియా సైతం భారత ప్రజాస్వామ్యంలో తీవ్ర సమస్య ఉందని హైలెట్ చేసి మరీ చెబుతోందన్నారు. అలాగే ఆర్ఎస్ఎస్ని ఫండమెంటలిస్ట్ ఫాసిస్ట్ సంస్థగా లక్ష్యం చేసుకుని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదీ దేశంలోని సంస్థలను స్వాధీనం చేసుకుంటోందని, దీన్ని ఒక రహస్య సమాజం అని పిలవచ్చని అన్నారు. ముస్లీం బ్రదర్ హుడ్ తరహాలో నిర్మితమైందన్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని వినియోగించుకుని అధికారంలోకి వచ్చి ఆ తర్వాత ప్రజాస్వామ్యాన్నే అణిచేస్తుందని ఆరోపణలు చేశారు. ప్రస్తుతం పత్రికా, న్యాయవ్యవస్థ, పార్లమెంటు, ఎన్నికల సంఘం తదితరాలు ఒత్తిడికి గురవుతున్నాయని, ప్రమాదంలో ఉన్నాయని చెప్పుకొచ్చారు రాహుల్. అలాగే భారత విదేశాంగ విధానంపై, భారత్ చైనా సంబంధాలపై కూడా పలు వ్యాఖ్యలు చేశారు. కాగా, విదేశీ గడ్డపై రాహుల్ భారత్ని దూషించారంటూ బీజేపీ ఆరోపించింది. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి అనురాగ్ ఠాగూర్ లండన్లో రాహుల్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. భారత్కు ద్రోహం చేయకండి, భారత విదేశాంగ విధానంపై మీరు చేసిన వ్యాఖ్యలు మీ అవగాహనలేమికి నిదర్శనం అంటూ కొట్టిపారేశారు. విదేశీ గడ్డపై మీరు చేస్తున్న వ్యాఖ్యలను ఎవరూ నమ్మరన్నారు. ఆయన ఎంతసేపు తనను తాను హైలెట్ చేసుకునేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారని ఎద్దేవా చేశారు అనురాగ్ ఠాగూర్. (చదవండి: కూతుళ్ల కోసం మళ్లీ పెళ్లి చేసుకుంటున్న జంట..ఓ తండ్రి గొప్ప నిర్ణయం..) -
నమ్మకం ఉంటే చాలు: ఆనంద్ మహీంద్ర మోటివేషనల్ వీడియో
సాక్షి, ముంబై: మహీంద్ర అండ్ మహీంద్ర చైర్మన్, పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర మరో స్ఫూర్తి దాయకమైన వీడియోను షేర్ చేశారు. ఎపుడూ సోషల్ మీడియాలో చురుకుగా ఉండే ఆయన విజ్ఞాన, వినోద, ఆధునిక టెక్నాలజీ.. ఇలా ఒకటేమిటి ఎన్నో ఆసక్తికరమైన వీడియోను, విషయాలను తన ఫోలోవర్స్తో పంచుకోవడం అలవాటు. తాజాగా ఆయన చేసిన వీడియో ఒకటి వైరల్గా మారింది. (మహీంద్రా ఇ-రిక్షా నడిపిన బిల్ గేట్స్ వీడియో వైరల్, ఆనంద్ మహీంద్ర స్పందన) నీటిపై ఒక గుర్రం శరవేగంతో పరుగులు తీస్తున్న అందమైన వీడియోను ఆనంద్ మహీంద్ర ట్విటర్లో పోస్ట్ చేశారు. ఏ పని చేయాలన్నా మన మీద మనకి నమ్మకం ఉండాలి. విశ్వాసం ఉంటే మీరు నీటిపై కూడా నడవవచ్చు. అంతా మన సంకల్పంలోనే ఉంది. మన మనసులోనే ఉంది. సో.. మీ కలసాకారం కోసం ఆత్మ విశ్వాసంతో అడుగు ముందుకేయండి అంటూ మండే మోటివేషన్ సందేశాన్ని తన అభిమానులతో పంచుకున్నారు. అయితే దీనిపై కొంతమంది విభిన్నంగా స్పందించారు. అలాంటి ఒక యూజర్ కమెంట్, వీడియోకు స్పందించిన ఆయన నీటిపై నడవడానికి ప్రయత్ని స్తున్నప్పుడు మల్టీ టాస్కింగ్ చేయవద్దు అంటూ చురకలంటించారు. You too can walk on water if you believe you can. It’s all in the mind. 😊 Start your week believing in yourself and your aspirations. #MondayMotivation pic.twitter.com/qh6h3mEVtw — anand mahindra (@anandmahindra) March 6, 2023 😄 Moral of the story: Don’t Multi-task when trying to walk on water. https://t.co/pHLTrHQhTZ — anand mahindra (@anandmahindra) March 6, 2023 -
ఐక్యత పవర్ అంటే ఇది!..హర్ష గోయెంకా ట్వీట్
ఐక్యమత్యమే మహాబలం అని చిన్నప్పుడు కథలు కథలుగా చదువుకున్నాం. కానీ దానికి ఉన్న పవర్ ఏంటో ఈ ప్రకృతిలోని కొన్ని జీవాలు మనుషులకు చెప్పకనే చెబుతున్నాయి. అందుకు సంబంధించి ఒక వీడియోను పారిశ్రామిక వేత్త హర్ష గోయెంకా నెట్టింట పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో..గొంగళి పురుగులు గుంపులు గుంపులుగా స్పీడ్గా వెళ్లిపోతున్నట్లు కనిపిస్తుంది. సాధారణంగా గొంగళిపురుగులు చాలా నిదానంగా వెళ్తాయి. అవి విడిగా..ఒక్కొక్కటి అంత తొందరగా భూమ్మీద పాకవు. అలాంటిది అవి ఒక దానిపై ఒకటి గుంపుగా స్పీడ్గా పాకుతూ వెళ్తున్నాయి. ఐక్యతగా ఉంటే ఏ పనైనా సులభంగా చేయోచ్చు అని చెబుతుంది. ఐక్యతకు ఉన్న శక్తిని కూడా తెలియజేసింది. "ఆ గొంగళి పురుగులు విడిగా కంటే సముహంగా ఉంటే వేగంగ వెళ్లగలవు, ఇదే ఐక్యత బలం అంటూ ట్వీట్ చేశారు హర్ష గోయెంకా. దీనికి నెటిజన్లు ఎంతో మంచి విషయాన్ని గుర్తు \ చేశారంటూ ధన్యవాదాలు చెప్పారు. అంతేగాదు కలిసి ఉంటే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగలమని, టీమ్గా ఉంటే ఎన్నో అద్భుతాలు చేయగలం అంటూ మరికొందరూ నెటిజన్లు ట్వీట్ చేశారు. It’s a group of caterpillars, moving in a formation known as a rolling swarm. This rolling swarm of caterpillars moves faster than any single caterpillar. Power of unity…pic.twitter.com/TibW70GP9n — Harsh Goenka (@hvgoenka) February 24, 2023 (చదవండి: వెరైటీ వంట: ప్లాస్టిక్ కవర్లో చేపల పులుసు, ఈ బామ్మ ఎలా చేసిందో చూడండి!) -
తెలంగాణలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం
-
రష్యా భీకర దాడులు.. ఉక్రెయిన్ రాజధానిలో నీటి సరాఫరా బంద్
కీవ్: ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్య నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. రష్యా యుద్ధంతో ఉక్రెయిన్ పూర్తిగా ధ్వంసమవుతోంది. శత్రువు దాడి నుంచి తమ దేశాన్ని కాపాడుకునేందుకు ఉక్రెయిన్ సేనికులు తీవ్రంగా పోరాడుతున్నారు. ఉక్రెయిన్ దేశ రాజధాని కీవ్పై రష్యా బలగాలు మరోసారి దృష్టి సారించాయి. రాజధాని ప్రాంతాన్ని చేజిక్కించుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నాయి. తాజాగా కీవ్ను లక్ష్యంగా చేసుకొని రష్యా భీకర దాడులు చేపట్టింది. శుక్రవారం తెల్లవారుజామున కీవ్ బాంబుల మోతతో దద్దరిల్లింది. రష్యా చర్యతో మౌలిక సదుపాయాలు దెబ్బతినడం వల్ల కీవ్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడిందని కీవ్ మేయర్ విటాలీ క్విచ్కో వెల్లడించారు. మెట్రో సర్వీస్లు నిలిపివేయడంతో స్టేషన్లను షెల్టర్స్గా వినియోగించుకోవాలని తెలిపారు. కీవ్లోని సెంట్రల్ జిల్లాలు, డెస్న్యాన్ జిల్లాలో పేలుళ్ల మోత వినిపించిందని, స్థానిక ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని పేర్కొన్నారు. కాగా రష్యా వరుస దాడుల దాడులతో ఉక్రెయిన్ విద్యుత్ నెట్వర్క్ ఇప్పటికే తీవ్రంగా దెబ్బతింది. విద్యుత్ అంతరాయం కారణంగా లక్షలాది ఉక్రెనియన్లు అంధకారంలో చిక్కుకుపోయారు. ఉక్రెయిన్ విద్యుత్, ఇంధన, మౌలిక సదుపాయాల వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని రష్యా ఈ దాడులు చేపట్టింది. చదవండి: కొండచరియలు విరిగిపడి 50 మంది గల్లంతు -
పారిశ్రామిక రంగానికి ‘సెప్టెంబర్’ ఊరట
న్యూఢిల్లీ: పారిశ్రామిక రంగం సెప్టెంబర్లో కొంత సానుకూల ఫలితాన్ని సాధించింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) సమీక్షా నెల్లో 3.1 శాతం (2021 ఇదే నెలతో పోల్చి) పెరిగింది. తయారీ, మైనింగ్, విద్యుత్ రంగాలు సెప్టెంబర్లో మంచి ఫలితాలను అందించినట్లు గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ పే ర్కొంది. ఆగస్టులో ఐఐపీలో అసలు వృద్ధిలేకపోగా 0.7% క్షీణతను నమోదుచేసుకుంది. జూలై లో వృద్ధి కేవలం 2.2%. అయితే 2021 సెప్టెంబర్లో పారిశ్రామిక వృద్ధి 4.4 శాతంకన్నా, తాజా వృద్ధి రేటు తక్కువగానే ఉండడం గమనార్హం. ► తయారీ: మొత్తం ఐఐపీలో దాదాపు దాదాపు 70 శాతం వెయిటేజ్ కలిగిన తయారీ రంగం సమీక్షా నెల్లో 1.8 శాతం పురోగమించింది. 2021 ఇదే నెల్లో వృద్ధి 4.3 శాతం. ► విద్యుత్: ఈ రంగం వృద్ధి రేటు 11.6%గా ఉంది. 2021 ఇదే నెల్లో ఈ రేటు కేవలం 0.9%. ► మైనింగ్: వృద్ధి 8.6% నుంచి 4.6%కి తగ్గింది. ► క్యాపిటల్ గూడ్స్: ఉత్పత్తి 10.3 శాతం పెరిగింది. 2021 ఇదే నెల్లో ఈ రేటు 3.3 శాతం. ► కన్జూమర్ డ్యూరబుల్స్: 4.5% క్షీణించింది. గతేడాది ఈ నెల్లో 1.6% వృద్ధి జరిగింది. ఆరు నెలల్లో 7 శాతం పురోగతి కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో (2022–23, ఏప్రిల్–సెప్టెంబర్) ఐఐపీ వృద్ధి రేటు 7 శాతంగా నమోదైంది. -
అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదం
-
మంచి మాట: కాలం మహత్తరం శక్తిమంతం
భగవంతుని సృష్టిలో అంతర్భాగమైన కాలానికి ఉన్న శక్తి అద్భుతమైనది, అమోఘమైనది. కష్ట సుఖాలని, మంచి–చెడులని, కలతలని, కన్నీళ్ళని ఇలా అన్నిటిని తనలో లీనం చేసుకుంటూ, వాటి తాలూకు జ్ఞాపకాలని మాత్రమే మిగులుస్తూ, కాలచక్రం గిర్రున తిరిగిపోతుంటుంది.. మన కళ్ళ ఎదుటే ఎంతోమంది మృత్యు ఒడిలోకి జారిపోతున్న వారిని చూస్తున్నా, ఆ దుఖాన్ని అనుభవిస్తున్నా, ఆ క్షణంలో ఎంతో విరక్తిని కల్గించి, కాలక్రమేణా ఆ దుఃఖభారాన్ని మరపింపచేసి, మన జీవితమే శాశ్వతమన్నంతగా మనసు మరల్చి మాయ చేస్తుంది. ఇంతకన్నా విచిత్రం ఏముంటుంది కనుక. ఇంతటి మహత్తరమైన, శక్తిమంతమైన కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం ప్రతి ఒక్కరికీ అవసరం. ప్రయోగించే విధానాన్నిబట్టి కాలం అర్థం మారిపోతుంటుంది. ఏదో ఆలా కాలక్షేపం చేస్తున్నామండీ అని పెద్దలు అంటుంటారు. అంటే ‘రోజులు గడుపుతున్నాము’ అని అర్థం. ఏదైనా విచిత్ర సంఘటన కళ్ళబడితే ‘కలికాలం’,’పిదపకాలం’ అంటుంటారు. పురాణ పఠనం చేస్తుంటే దాన్ని ‘సత్కాలక్షేపం’ అంటుంటారు. ఇలా అర్థాలు ఎన్ని మారినా, కాలప్రభావంలో మాత్రం ఎటువంటి మార్పు ఉండదు. కాలం గడపటం అంటే ‘పొద్దుపుచ్చటం’ అని మాత్రమే కాదు. నిజానికి సద్వినియోగం చేసుకున్నా,దుర్వినియోగం చేసుకున్నా కాలం మాత్రం ఎవరికోసమూ ఆగదు. ఆటపాటలతో బాల్యం గడచిపోతుంది. అది సహజం. ఆశలు, ఆశయసాధనాలు, వివాహం, సంతానం, ఇలా ప్రౌఢ, యుక్తవయస్సులు గడచిపోతాయి. అది అప్పటికవసరం. ఇక మిగిలేది బాధ్యతలు తీరిన జీవితం, అలసిపోయిన శరీరం. మొదటి మూడు దశలలోనూ గిర్రున తిరిగిన కాలం, నాల్గవ దశలో, వయసు మీద పడేసరికి కొంత భారంగా గడుస్తున్నట్టనిపిస్తుంది. ఇంటి పెద్దగా ఎన్నో బాధ్యతలతో తలమునకలై, జీవనపోరాట ప్రవాహంలో కొట్టుకుపోతూ, ఒక్కసారిగా విశ్రాంతి లభించటంతో కాలం స్తంభించినట్టుగా భావిస్తాం. కాని ఆలోచిస్తే ఈ విశ్రాంతి పెద్దలకు ఒక వరమనే చెప్పవచ్చు. ఎందుకంటే, నిబద్ధతతో కూడిన లక్ష్యసాధన, ఏ వయసు వారినైనా కాలాన్ని సద్వినియోగపరచుకునేలా చేస్తుంది. సక్రమంగా ఉపయోగించుకోలేక పోతే, సమయం వృథా అయిపోయి, జీవితం నిస్సారం గా తయారవుతుంది. వయస్సులో ఉన్నవారు తమ ఆశయసిద్ధి కోసం అవిరామంగా కృషి చేయాలి. వయసు మీరిన వారు తమకు వయసు నేర్పిన పాఠాలు, అనుభవాలు భావితరాలకు పంచవచ్చు. తమలోని మరుగుపడిపోయిన కళలను, సృజనాత్మక శక్తిని వెలికి తీసే అవకాశం పొందవచ్చు. చక్కని గ్రంథ పఠనం చేసుకోవచ్చు. వృద్ధాశ్రమాలకి వెళ్లి, అక్కడి వారి యోగక్షేమాలని విచారిస్తూ, వారి అనుభవాలను పంచుకుంటూ, తగిన సలహాలు, సూచనలు అందించవచ్చు. ఎదుటివారికి చేతనైనంత సహాయం చేస్తూ, హాయిగా కాలాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అయితే కాస్త వయసు మీరాక, వీటికన్నిటికీ కాలాన్ని సక్రమంగా ఉపయోగించాలంటే శారీరక ఆరోగ్యం చాలా ముఖ్యం. కాబట్టి యోగసాధన జీవితంలో ఒక భాగం కావాలి. యోగసాధన శారీరక, మానసిక రుగ్మతలని దూరం చేస్తుంది. ఏ ఋతువులో ఆ పువ్వు పూస్తుంది. ఆ కాయ కాస్తుంది. సకల జీవరాసులు, కాలానికి అనుగుణంగా తమ తమ జీవనశైలిని మార్చుకుంటూ, కాలానికి కట్టుబడి జీవిస్తాయి. కాలాన్ని సద్వినియోగపరచుకోవటంలో తన మేధస్సును మరింత చక్కగా ఉపయోగించుకోవాలి కదా. కర్మసిద్ధాంతం ప్రకారం జరగాల్సిందేదో అదే జరుగుతుందిలే అని వదిలి వేయకుండా మానవ ప్రయత్నం చేయాలి. భూత భవిష్యత్ ప్రభావాలని రంగరించుకుంటూ జీర్ణించుకుంటూ మెరుగులు దిద్దుకుంటూ సాగాలి. ‘గతాన్ని తలచుకుని వగచవద్దు.. భవిష్యత్ గురించి భయపడవద్దు... వర్తమానంలో జీవించు’ అంటారు పెద్దలు. మనసుని కలచి వేసే సంఘటనలు, మధుర స్మృతులు– రెండూ ప్రతి వ్యక్తి జీవితంలో ఉంటాయి. అయితే ఆ సంఘటనల వల్ల కలిగిన గాయం మనకు నేర్పుతున్న పాఠాలు ఏమిటి అని తరచి చూసుకోవాలి. దానిద్వారా మనల్ని మనం సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది. అంతేకాని దాని గురించి అతిగా వ్యధపడ కూడదు.అలాగే మనసుని సంతోషపెట్టే సంఘటనలను తలచుకోవడం వల్ల మానసిక ఉత్సాహం ఇనుమడిస్తుంది. ఉదాహరణకి బాల్యస్మృతులు ఇంచుమించు అందరికీ ఆనందం కలిగించేవే. ఇక భవిష్యత్తు గురించి కలలు కనడం తప్పు కాదు కానీ అంతకే పరిమితమైపోకుండా, ఆ కలని సాకారం చేసుకోవడానికి తగిన కృషి చేయాలి. – అడవి అన్నపూర్ణ -
అంధకారంలో బంగ్లాదేశ్...10 గంటల పాటు పవర్ కట్
ఢాకా: 130 మిలయన్ల మందికి పైగా ప్రజలు అంధకారంలోనే ఉన్నారని బంగ్లాదేశ్ ప్రభుత్వం పేర్కొంది. మంగళవారం మధ్యహ్నాం నుంచే విద్యుత్ సరఫరా నిలచిపోయినట్లు తెలిపింది. సుమారు 80 శాతం దేశంలో మధ్యాహ్నం రెండు గంటల నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు బంగ్లాదేశ్ పవర్ డెవలప్మెంట్ బోర్డు వెల్లడించింది. వాయువ్య ప్రాంతాల మినహ మిగతా ప్రాంతాలకు పవర్ సప్లై నిలిచిపోయినట్లు బంగ్లాదేశ్ ప్రతినిధి షమీమ్ ఎహ్సాన్ తెలిపారు. ఎందువల్ల ఈ పరిస్థితి తలెత్తిందనేది తెలియరాలేదని, బహుశా సాంకేతిక సమస్య అయ్యిండొచ్చని ఎహ్సాన్ అన్నారు. ఐతే బంగ్లాదేశ్ కేంద్ర సాంకేతిక మంత్రి జునైద్ పాలక్ రాజధాని ఢాకాలో రాత్రి 8 గం.ల కల్లా విద్యుత్ పునరుద్ధరింపబడుతుందని ఫేస్బుక్లో తెలిపారు. ఉక్రెయిన్ రష్య యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరిగాయి, అందువల్లే బంగ్లాదేశ్ ఈ విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇటీవల కాలంలో గత కొద్ది నెలలుగా ఈ సంక్షోభం మరింత ఎక్కువైంది. అదీగాక విద్యుత్కి సరఫరాకు సరిపడా డీజిల్, గ్యాస్ల దిగుమతి చేసేకునేందుకే బంగ్లాదేశ్ ఇబ్బందులు పడటంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బంగ్లాదేశ్ చివరిసారిగా 2014 నవంబర్లో ఇంత పెద్ద విద్యుత్ సంక్షోభాన్ని చవివచూసింది.ఏదిఏమైన దేశంలో దాదాపు 70 శాతం మంది సుమారు 10 గంటలపాటు విద్యుత్ లేకుండా గడిపారు. (చదవండి: రెస్టారెంట్ సిబ్బంది నిర్వాకం...వాటర్ బాటిళ్లలో యాసిడ్ అందించి...) -
ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి.. ఫ్యాన్లు గిరాగిర, కూలర్లు, ఏసీలు ఆన్
సాక్షి, హైదరాబాద్: ఇటీవల విస్తారంగా కురిసిన వర్షాలకు బ్రేక్ పడింది. కానీ.. పక్షం రోజులుగా పొడి వాతావరణం, ఎండలు మండుతుండటంతో నగరవాసులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. చిరుజల్లులు, మబ్బులతో ఆహ్లాదంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భానుడి భగభగలతో పగలే కాదు రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. ఫలితంగా ఉక్కపోతకు తట్టుకోలేక సిటీజనులు అల్లాడిపోతున్నారు. ఉపశమనం కోసం మళ్లీ ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఆన్ చేస్తున్నారు. దీంతో నగరంలో విద్యుత్ డిమాండ్ అన్యూహ్యంగా పెరిగింది. వారం రోజుల క్రితం వరకు గ్రేటర్ సగటు విద్యుత్ డిమాండ్ 52–55 మిలియన్ యూనిట్లుగా ఉండగా, తాజాగా 61 ఎంయూలకు పైగా నమోదవుతుండటం విశేషం. ఉక్కపోత కారణంగా కరెంట్ వినియోగం రెట్టింపవడంతో మీటర్లు గిర్రున తిరుగుతూ స్లాబ్రేట్లు మారి భారీగా బిల్లులు చేతికి అందుతుండటంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు. హీటెక్కుతున్న పీటీఆర్లు ఒక్కసారిగా విద్యుత్ డిమాండ్ పెరగడం, పగటి ఉష్ణోత్రలు కూడా భారీగా నమోదవుతుండటంతో సబ్ స్టేషన్లలోని పవర్ ట్రాన్స్ఫార్మర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు హీటెక్కుతున్నాయి. ఒత్తిడిని తట్టుకోలేక ఫీడర్లు తరచూ ట్రిప్పవుతుండటంతో సరఫరాలో అంతరాయం తప్పడంలేదు. ఒకవైపు ఉక్కపోత.. మరోవైపు ఇంట్లో కరెంట్ కూడా లేకపోవడం, బహుళ అంతస్తుల సముదాయాల్లో ఏర్పాటు చేసిన జనరేటర్లు కూడా చాలా వరకు వినియోగంలో లేకపోవడంతో వినియోగదారులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. మంచినీటి మోటార్లు, లిఫ్ట్లు పని చేయకపోవడంతో మీటర్ రీడింగ్ నమోదు, బిల్లుల జారీ కోసం ఆయా నివాసాలకు వెళ్లిన సిబ్బంది ప్రజాగ్రహానికి గురికావాల్సి వస్తోంది. ఈ సీజన్లో అత్యధికం విద్యుత్ వినియోగం సాధారణంగా వేసవిలో మాత్రమే 60 ఎంయూలు దాటుతుంది. వర్షాకాలం, చలికాలంలో చాలా తక్కువ వాడకం నమోదవుతుంది. కానీ ఇటీవల వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా గత రెండు రోజుల నుంచి డిమాండ్ అనూహ్యంగా పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. గత ఏడాది ఇదే రోజు 2392 మెగావాట్ల డిమాండ్ నమోదు కాగా తాజాగా శుక్రవారం 2984, శనివారం 2998 మెగావాట్లు నమోదు కావడం గమనార్హం. ప్రస్తుతం నగరంలో డెంగీ కారక దోమలు విజృంభిస్తున్నాయి. రాత్రి పూట కరెంట్ లేకపోవడంతో ఉక్కపోతకు తోడు దోమలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఆకస్మిక విరామం వల్లే శుక్రవారం నగరంలో 32.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, శనివారం 34 డిగ్రీలకు చేరింది. రుతుపవనాల మధ్య విరామమే ఆకస్మిక ఉక్కపోతకు కారణం. ప్రస్తుతం వర్షాకాలమే అయినా రుతుపవనాలు బలహీన పడటం వల్ల అల్పపీడనాలు ఏర్పడడం లేదు. పూర్తిగా పొడి వాతావరణం ఏర్పడి వేడి పెరిగింది. గాలిలో తేమ తగ్గిపోవడం వల్ల అధిక ఉక్కపోత నమోదవుతోంది. రుతుపవనాల మధ్యలో ఆకస్మిక విరామం వస్తే ఈ తరహా పరిస్థితి ఉత్పన్నమవుతుంది. – కె. నాగరత్న, ఐఎండీ డైరెక్టర్ -
కరెంట్ను మోసుకుపోవచ్చు!
ఆరుబయట పిక్నిక్లకు వెళ్లేటప్పుడు, రాత్రివేళల్లో ఆరుబయటే బస చేయాల్సి వచ్చినప్పుడు తాత్కాలికంగా టెంట్లు వేసుకుని గడుపుతుంటారు. అయితే, టెంట్లలో విద్యుత్ సౌకర్యం ఉండక నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అలాంటి ఇబ్బందులను తప్పించుకోవాలంటే, భారీ జనరేటర్లను మోసుకుపోవాల్సి వస్తుంది. జనరేటర్లు చేసే ధ్వనికి నిద్ర కరువవుతుంది. ఈ పోర్టబుల్ పవర్స్టేషన్ మీ వద్ద ఉంటే, అలాంటి సమస్యలేవీ ఉండవు. ఎక్కడకు వెళ్లినా, విద్యుత్ సరఫరా మీ వెంటే ఉంటుంది. ఇది పోర్టబుల్ పవర్ స్టేషన్. జనరేటర్ల కంటే చాలా తేలిక. ఆన్ చేసుకున్నాక దీని నుంచి వెలువడే చప్పుడు కూడా నామమాత్రంగానే ఉంటుంది. దీని బరువు 16 కిలోలు మాత్రమే. ఎక్కడికైనా మోసుకుపోవడానికి చాలా అనువుగా ఉంటుంది. ‘లిపవర్ మార్స్–2000’ పేరిట ఇది మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇది ఎల్ఎఫ్పీ బ్యాటరీల సాయంతో పనిచేస్తుంది. ఈ బ్యాటరీలను చార్జింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆరుబయట ఎండ నుంచి విద్యుత్తు పొందేందుకు వీలుగా దీనికి సోలార్ ప్యానల్స్ కూడా ఉండటంతో, బ్యాటరీలను రీచార్జ్ చేసుకోవలసిన పరిస్థితులు చాలా అరుదుగానే తలెత్తుతాయి. దీని ధర 1489 డాలర్లు (రూ.1.18 లక్షలు). -
ఏపీలో విద్యుత్ కొనుగోలుకు సమస్య లేనట్టే..
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ డిస్కమ్లు.. జనరేటర్లకు రూ.412 కోట్లు బకాయి ఉన్నట్టు చూపించిన ప్రాప్తి పోర్టల్ తన పొరపాటును సవరించింది. ఈ బకాయిలను ఇప్పటికే డిస్కమ్లు చెల్లించేశాయి. ఈ విషయాన్ని ప్రాప్తి పోర్టల్ దృష్టికి ఏపీ అధికారులు తీసుకెళ్లారు. దీంతో ఏపీలో విద్యుత్ కొనుగోలుకు సమస్య ఇక లేనట్టే.. ఎల్పీఎస్-2002 నిబంధనలను ఏపీ డిస్కమ్లు ఖచ్చితంగా పాటిస్తున్నాయి. ఆగష్టు 5న జనరేటర్లకు రూ.1407 కోట్లు డిస్కమ్లు చెల్లించాయి. ప్రస్తుతం నిబంధనల ప్రకారం డిస్కమ్లకు ఎలాంటి బకాయిలు లేవు. ఏపీ అధికారుల సమాచారాన్ని ప్రాప్తి పోర్టల్ అప్డేట్ చేసింది. చదవండి: చంద్రబాబు పాపం.. డిస్కంలకు శాపం విద్యుత్ మార్కెట్లకు స్వల్పకాలిక యాక్సెస్పై పరిమితి తొలగించినట్లు ఇంధన శాఖ కార్యదర్శి కె విజయానంద్ తెలిపారు. నిన్న అర్థరాత్రి నుండి యథాతథంగా విద్యుత్ ఎక్స్ఛేంజీలపై ట్రేడింగ్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయన్నారు. ఎలాంటి అంతరాయం లేకుండా 18న 211 మిలియన్ యూనిట్ల డిమాండ్ని డిస్కమ్లు రీచ్ అయినట్లు తెలిపారు. రాష్ట్రంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకున్నామని విజయానంద్ పేర్కొన్నారు. -
వేదాంతా చేతికి ఎథేనా చత్తీస్గఢ్
న్యూఢిల్లీ: రుణ సవాళ్లు ఎదుర్కొంటున్న ఎథేనా చత్తీస్గఢ్ పవర్ లిమిటెడ్ను సొంతం చేసుకోనున్నట్లు డైవర్సిఫైడ్ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ తాజాగా పేర్కొంది. ఇందుకు దాదాపు రూ. 565 కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించింది. నగదు రూపేణా చేపట్టనున్న ఈ డీల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23)లో పూర్తయ్యే వీలున్నట్లు వేదాంతా తెలియజేసింది. ఎథేనా చత్తీస్గఢ్ పవర్ లిక్విడేషన్ ప్రక్రియ గతేడాది మార్చిలో ప్రారంభమైంది. కంపెనీలో 100 శాతం వాటాను చేజిక్కించుకోనున్నట్లు వేదాంతా వెల్లడించింది. ఈ కొనుగోలుతో అల్యూమినియం బిజినెస్ విద్యుత్ అవసరాలు తీరనున్నట్లు తెలియజేసింది. ఏథేనా పవర్.. చత్తీస్గఢ్లోని ఝాంజ్గిర్ చంపా జిల్లాలో 1,200 మెగావాట్ల బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంటును కలిగి ఉంది. 2019 మే 15న కంపెనీపై కార్పొరేట్ దివాలా రుణపరిష్కార ప్రాసెస్ ప్రారంభమైంది. గతేడాది మే 13న ఎన్సీఎల్టీ హైదరాబాద్ బెంచ్ లిక్విడేషన్ ప్రాసెస్కు ఆదేశాలు జారీ చేసింది. కంపెనీకి గల రెండు యూనిట్లలలో 80 శాతం, 30 శాతం చొప్పున పనులు పూర్తయ్యాయి. దీంతో వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించలేదు. జాతీయ రహదారులు, రైల్వే స్టేషన్లకు విద్యుత్ ప్లాంటు అనుసంధానమై ఉండటం గమనార్హం! -
వారంతే..! రోడ్డు పై షెడ్డు నిర్మాణం
గంట్యాడ: అధికారంలో ఉన్నప్పుడు కబ్జాలు, అక్రమాలకు పాల్పడిన టీడీపీ నేతలు, అధికారం కోల్పోయినప్పటికీ వారి తీరు కొనసాగిస్తూ కబ్జాల కు పాల్పడుతూనే ఉన్నారు. ప్రభుత్వ భూములు, గ్రామ కంఠాలు కనిపిస్తే వదలడం లేదు. ఆక్రమించిన భూముల్లో సాగు చేపట్టడంతో పాటు, షెడ్డులు కూడా నిర్మిస్తున్నారు. చర్యలు చేపట్టాల్సి న అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నరనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామకంఠం ఆక్రమణ గంట్యాడ మండలంలోని గొడియాడ గ్రామంలో టీడీపీ నేతలు గ్రామకంఠంలో ఉన్న భూమిని ఆక్రమించి ఆ స్థలంలో మామిడి మొక్కలు వేశారు. అంతేకాకుండా షెడ్డు నిర్మించారు. ఆక్రమిత స్థలం చుట్టూ గ్రీన్ మేట్తో కంచె వేశారు. ఆ స్థలంలో వ్యవసాయ గొడౌన్ నిర్మించాలని వ్యవసాయ అధి కారులు నిర్ణయించారు. అయితే ఈ స్థలం ఆక్రమణలో ఉండడంతో గొడౌన్ నిర్మాణం ఎక్కడ చేపట్టాలన్న దానిపై తర్జన, భర్జన పడుతున్నారు. సుమారు ఎకరం స్థలం వరకు భూమి ఆక్రమణ కు గురైంది. దీని విలువ సుమారు రూ. 25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఉంటుంది. సీసీ రోడ్డుపైనే షెడ్డు నిర్మాణం గ్రామానికి చెందిన మరో టీడీపీ నేత ఏకంగా సీసీ రోడ్డును నివాసయోగ్యంగా మార్చేశాడు. సీసీ రోడ్డుపై షెడ్డు వేశాడు. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. సీసీ రోడ్డుపై శాశ్వత నిర్మాణం చేపట్టినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నోటీసులు సిద్ధం చేశాం గ్రామ కంఠంలో భూమిని ఆక్రమించిన వారికి నోటీసులు సిద్ధం చేశాం. సోమవారం నోటీసులు ఇస్తాం. సీసీ రోడ్డుపై షెడ్డు వేసిన వ్యక్తికి నోటీసులు ఇచ్చాం. రెండు, మూడు రోజుల్లో ఖాళీ చేయిస్తాం. –అజయ్, వీఆర్వో, గొడియాడ విచారణ ప్రారంభం గొడియాడలో భూమిని ఆక్రమించినట్లు స్పందన కార్యక్రమంలో గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. దానిపై విచారణ ప్రారంభించాం. ఇప్పటికే డిప్యూటీ తహసీల్దార్, ఆర్ఐ, వీఆర్వోలు స్థలాన్ని పరిశీలించారు. ఆక్రమణపై ప్రొసీజర్ ప్రకారం చర్యలు తీసుకుంటాం. – ప్రసన్న రాఘవ, తహసీల్దార్, గంట్యాడ -
ఆ రైతు వాడకం మాములుగా లేదుగా...దెబ్బకు దిగివచ్చిన అధికారులు
ప్రభుత్వోద్యోగులు కొంతమంది ప్రజలకు సేవలందించే విభాగంలో పనిచేస్తూ కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. కొంతమంది చదువురాక ఎలా అడగలా కూడా తెలియక ఇబ్బందులు పడుతున్న వారికి ఎలా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకోవాలో అధికారులు చెప్పరు. ఒకేవేళ ఏదోరకంగా ప్రభుత్వానికి తమ మొర చెప్పుకునేందకు దరఖాస్తు చేసుకున్న సత్వరమే సిబ్బంది స్పందించరు. అచ్చం అలానే ఇక్కడొక రైతు ప్రభుత్వాధికారులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఎన్నిసార్లు ఆ అధికారులు చుట్టు తిరిగి తన మొర వినిపించిని పట్టించుకున్నవాడే లేడు. దీంతో విసిగిపోయిన ఆ రైతు చేశాడంటే! వివరాల్లోకెళ్తే...కర్ణాటకకు చెందిన ఒక రైతు మసాలు రుబ్బుకోవడానికి, ఫోన్ రీఛార్జ్ చేసుకోవడానికి తదితర పనులన్నింటికీ నేరుగా తన ఇంటికి సమీపంలోని విద్యుత్ కార్యాలయానికి వెళ్తున్నాడు. ఇలా అతను పదినెలలుగా చేస్తున్నప్పటికీ అక్కడ అధికారులు నుంచి ఎటువంటి అభ్యంతరం రాకపోవడం విచిత్రం. అసలేం జరిగిందంటే... హనుమంతప్ప అనే రైతు ఇంటికి 3 నుంచి 4 గంటలు మాత్రమే కరెంట్ ఉంటుంది. మిగతా సమయం మంతా చీకట్లో మగ్గిపోవాల్సిందే. ఐతే వారి చుట్టుపక్కల వాళ్లందరికి కరెంట్ బాగానే ఉంటుంది. ఆ రైతు మంగళూరు విద్యుత్ సరఫరా కంపెనీ లిమిటెడ్ (మెస్కామ్) కార్యాలయంలోని అధికారులకు తన సమస్య చెప్పినా ప్రయోజనం ఉండదు. ఆఖరికి స్థానిక ఎమ్మెల్యేకి చెప్పిన ఫలితం శూన్యం. అయితే ఒకరోజు మోస్కామ్ సీనియర్ అధికారికి ఫోన్ చేసి మసాలాలు రుబ్బుకోవడం, ఫోన్ ఛార్జీంగ్ వంటి ప్రాథమిక అవసరాలకు ప్రతి రోజు పోరుగింటికి వెళ్లలేనని గట్టిగా చెబుతాడు. దీంతో ఆ అధికారి నేరుగా విద్యుత్ కార్యాలయానికి(మెస్కామ్) వెళ్లే చేసుకోండి అంటూ వ్యగ్యంగా ఒక ఉచిత సలహ ఇచ్చి ఫోన్ పెట్టేశాడు. ఇక అప్పటినుంచి ఆ రైతు తన వ్యక్తిగత పనుల కోసం విద్యుత్కార్యాలయాన్నే వాడుకోవడం మొదలు పెట్టాడు. అయితే ఈ విషయంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడంతో విద్యుత్ శాఖ రైతు వ్యక్తిగత పనులకు విద్యుత్ కార్యాలయాన్ని వాడుకునేందుకు అనుమతిచ్చిన సదరు ఉద్యోగులకు నోటీసులు పంపించింది. అంతేకాదు మెస్కామ్ జూనియర్ ఇంజనీర్ విశ్వనాథ్ భారీ వర్షాల కారణంగా ఐపీ సెట్లను ఛార్జ్ చేయడం సాధ్యం కాదని, అందువల్లే ఆ రైతు ఇంటికి విద్యుత్ సరఫరా కావడం లేదని చెప్పారు. ఐతే ఆ రైతుకి మల్లాపుర పంపిణీ కేంద్రం నుంచి విద్యుత్ లైన్ తీసి తాత్కాలికంగా విద్యుత్ సరఫరా చేయవచ్చు అని చెప్పారు. అంతేకాదు ఆ రైతు ఇంటికి నెల రోజుల్లో విద్యుత్ కనెక్షన్ వస్తుందని కూడా అధికారులు చెప్పారు. (చదవండి: చెరువుల తవ్వకాల్లో బయటపడ్డ మౌర్య సామ్రాజ్యపు అవశేషాలు) -
Russia-Ukraine war: రెచ్చిపోతున్న రష్యా
కీవ్: ఇంతకాలం బాగా ఇబ్బంది పెట్టిన ఆయుధ, ఆహార సరఫరాలు భారీగా పుంజుకోవడంతో ఉక్రెయిన్లో రష్యా సైన్యాలు ఇనుమడించిన ఉత్సాహంతో ముందుకు కదులుతున్నాయి. ముఖ్యంగా అధ్యక్షుడు పుతిన్ తాజా లక్ష్యంగా పేర్కొన్న తూర్పు ఉక్రెయిన్లోని డోన్బాస్ను పూర్తిగా స్వాధీనం చేసుకునే ప్రయత్నాలను తీవ్రతరం చేశాయి. అక్కడ దాడుల తీవ్రతను బాగా పెంచుతున్నాయి. డోన్బాస్లో ఉక్రెయిన్ కదలికలకు కీలకమైన పలు బ్రిడ్జీలను రష్యా దళాలు శనివారం పేల్చేశాయి. అక్కడి లుహాన్స్క్ ప్రాంతంలో ఉక్రెయిన్ అధీనంలో ఉన్న చివరి నగరాలైన సెవరోడొనెట్స్క్, లిసిషాన్స్క్పైనా క్రమంగా పట్టు బిగిస్తున్నాయి. పలు అపార్ట్మెంట్ భవనాలపై భారీగా కాల్పులకు దిగాయి. అక్కడ ఉక్రెయిన్ దళాలతో వీధి పోరాటం కూడా సాగుతోంది. సెవరోడొనెట్స్క్లో 90 శాతం రష్యా చేతుల్లోకి వచ్చినట్టు సమాచారం. డోన్బాస్లోని రెండో ప్రధాన ప్రాంతమైన డొనెట్స్క్లో బఖ్ముత్ నగరంపైనా రష్యా దాడుల తీవ్రత పెరిగింది. వీటి ధాటికి ఉక్రెయిన్ సైనికులు భారీ సంఖ్యలో మరణిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దేశంలోని అతి పెద్ద రేవు పట్టణమైన ఒడెసాలో ఓ వ్యవసాయ ప్రాంతంపై రష్యా క్షిపణి దాడిలో చాలామంది తీవ్రంగా గాయపడ్డట్టు సమాచారం. ఒడెసా నుంచి ఆహార ధాన్యాలఎగుమతులను పునఃప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఉక్రెయిన్ ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఈ దాడులు జరిగాయి. ఒడిశా తీరప్రాంతంలో ఉక్రెయిన్ యుద్ధపరికరాల తరలింపు విమానాన్ని తాము కూల్చేశామని రష్యా వెల్లడించింది. డోన్బాస్ ప్రాంతంలో సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నపుడు ఉక్రెయిన్ క్షిపణి దాడిలో రష్యా మేజర్ జనరల్ కనమత్ బొటషెవ్(63) మరణించారని రష్యా ధృవీకరించింది. రష్యా వైమానిక దళంలో మేజర్ జనరల్ స్థాయి అత్యున్నత ర్యాంక్ అధికారి మరణించడం ఇదే తొలిసారి. నాటోలో స్వీడన్, ఫిన్లాండ్ చేరికను వ్యతిరేకిస్తున్న తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగన్తో నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్బర్గ్ ఫోన్లో మాట్లాడారు. (చదవండి: రష్యాపై ఆంక్షలకు ఈయూ ఆమోదం) -
పోలీసులపై కోపం.. టౌన్ మొత్తం కరెంట్కట్
సాక్షి,పలమనేరు(తిరుపతి): ఓ కేసు విచారణలో భాగంగా పోలీసులు అవమానించారని ఆగ్రహించిన ట్రాన్స్కో సిబ్బంది పట్టణం మొత్తానికి విద్యుత్ సరఫరా నిలిపేయడం శుక్రవారం పలమనేరులో చర్చనీయాంశంగా మారింది. వివరాలివీ.. ఇటీవల పట్టణంలో జరిగిన గంగజాతరలో స్థానిక ముత్తాచారిపాళ్యానికి చెందిన రజని(58) కరెంట్ షాక్తో మృతి చెందిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు విచారణలో భాగంగా స్థానిక లైన్మన్ ప్రకాష్, సచివాలయ పరిధిలో సిబ్బందిని శుక్రవారం స్థానిక స్టేషన్కు పిలిపించారు. వారు వెళ్లగానే వారి సెల్ఫోన్లను తీసిపెట్టుకుని అక్కడే వేచిఉండమని చెప్పారు. దీంతో వారు తమకి, కేసుకు ఏంటి సంబంధంమంటూ అడిగినట్టు తెలిసింది. దీంతో పోలీసులు కాస్త దురుసుగా మాట్లాడడంతో, వాగ్వాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. పోలీసులు తమను అవమానించారని భావించిన ట్రాన్స్కో సిబ్బంది పట్టణంలో కరెంట్ సరఫరాను నిలిపేశారు. దీంతో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు పట్టణంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆపై ట్రాన్స్కో ఏడీ చిన్నబ్బ, డీఎస్పీ గంగయ్య చర్చించి, ఈ విషయం పెద్దది కాకుండా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినట్లు తెలిసింది. ఈవిషయమై ట్రాన్స్కో ఏడీ చిన్నబ్బను ‘సాక్షి’ వివరణ కోరగా తమ సిబ్బందిపట్ల పోలీసుల తీరు బాగోలేకనే వారు కరెంటు ఆఫ్ చేసినట్టు తెలిసిందన్నారు. ఇదే విషయమై స్థానిక సీఐ భాస్కర్ స్పందిస్తూ.. విద్యుత్ షాక్తో మహిళ మృతి నేపథ్యంలో విచారణ నిమిత్తం ట్రాన్స్కో సిబ్బందిని పిలిపించిన మాట వాస్తవమేనన్నారు. అయితే నిర్లక్ష్యంగా సమాధానమివ్వడంతో కాసేపు స్టేషన్లోనే కూర్చోబెట్టుకున్నామన్నారు. దీన్ని అవమానంగా భావించి పట్టణం మొత్తానికి విద్యుత్ సరఫరా నిలిపేయడం ఎంత వరకు సమంజసమన్నారు. చదవండి: Indian Paper Currency History: సముద్రం పాలైన ‘హైదరాబాద్’ కరెన్సీ.. నాసిక్లో నోట్ల ముద్రణ -
రాష్ట్రంలో భారీ విద్యుత్ ప్రాజెక్టు
కర్నూలు (సెంట్రల్)/సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో భారీ పవర్ ప్రాజెక్టు ఏర్పాటవుతోంది. ఒకే యూనిట్ నుంచి సోలార్, విండ్, హైడల్ పవర్ (పంప్డ్ స్టోరేజీ) విద్యుత్ ఉత్పాదనకు సంబంధించిన ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు (ఐఆర్ఈపీ.. ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టు) కర్నూలు జిల్లాలో ఏర్పాటవుతోంది. గ్రీన్కో ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించే ఈ ప్రాజెక్టు ద్వారా 5,230 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కానుంది. ప్రపంచంలో మూడు విభాగాల ద్వారా ఒకే యూనిట్ నుంచి ఇన్ని మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిచేసే తొలి ప్రాజెక్టు ఇదే. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 17న శంకుస్థాపన చేయనున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఓర్వకల్, పాణ్యం మండలాల çసరిహద్దులోని పిన్నాపురంలో ఏర్పాటుచేస్తున్న ఈ ప్రాజెక్టు ప్రపంచంలోనే అత్యధికంగా విద్యుత్ను ఉత్పత్తిచేసే పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుగా అవతరిస్తోంది. అంతేకాక.. ఒకే యూనిట్ నుంచి సోలార్, పవన, హైడల్ పవర్ను ఉత్పత్తిచేసే ప్రాజెక్టు కూడా ఇదే కాబోతోంది. ఇందులో సోలార్ విద్యుత్ ఉత్పత్తి 3,000 మెగావాట్లు, విండ్ 550 మెగావాట్లు, హైడల్ పవర్ 1,680 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తిచేసి నేషనల్ గ్రిడ్కు అనుసంధానించి ఓర్వకల్ పీజీసీఐఎల్/సీటీయూ విద్యుత్ సబ్స్టేషన్ ద్వారా దేశంలోని డిస్కమ్లు, పరిశ్రమలకు సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని రాబోయే ఐదేళ్లలో పూర్తిచేసి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం 4,766.28 ఎకరాల భూమిని కేటాయించింది. ఇందులో ఇప్పటికే 2,800 ఎకరాలను కంపెనీకి అప్పగించారు. కర్నూలులో తొలి హైడల్ పవర్ ప్రాజెక్టు ఇంటిగ్రేటేడ్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులో భాగంగా కర్నూలులో తొలి హైడల్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు కాబోతోంది. 1,680 మెగావాట్ల విద్యుదుత్పత్తి అయ్యే హైడల్ వపర్ను పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ అని కూడా అంటారు. హైడల్ పవర్ను పెద్దపెద్ద సాగునీటి ప్రాజెక్టుల్లో మాత్రమే చేపట్టేందుకు వీలుంటుంది. అయితే, కేటాయించిన స్థలంలో పైన, కింద ప్రాజెక్టులు కడతారు. విద్యుత్ వాడకానికి డిమాండ్ లేని సమయంలో నీటిని కింది నుంచి పైకి పంప్ చేస్తారు. విద్యుత్ వాడకం ఎక్కువగా ఉన్న సమయంలో పైనున్న నీటిని కిందికి వదిలి టర్బైన్ల ద్వారా విద్యుత్ను ఉత్పత్తి చేస్తారు. అందువలన దీనిని పంప్డ్ స్టోరేజ్ పవర్ లేదా హైడల్ పవర్ అంటారు. ఇక ఈ ప్రాజెక్టు కోసం గోరుకల్లు రిజర్వాయర్ నుంచి ఒక టీఎంసీ నీటిని కేటాయించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను జారీచేసింది. రూ.15వేల కోట్ల పెట్టుబడి.. ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు కోసం గ్రీన్కో ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.15 వేల కోట్ల పెట్టుబడి పెట్టబోతోంది. ఈ ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని నిరుద్యోగులకు భారీగా ఉపాధి, ఉద్యోగావకాశాలు రానున్నాయి. హైడల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో 15 వేల ఉద్యోగాలొస్తాయి. ఐదేళ్ల పాటు నిర్మాణ పనులు కొనసాగుతాయి. తరువాత ప్రత్యక్షంగా 3 వేల మందికి.. పరోక్షంగా మరో 5 వేల మంది ఉపాధి పొందుతారు. ఇక్కడ విద్యుదుత్పత్తి ప్రారంభమైతే విద్యుత్ కష్టాలు కొంతవరకు తీరుతాయి. ఇక పిన్నాపురంలో స్థాపిస్తున్న ఈ ప్రాజెక్టు కారణంగా, వాతావరణంలో ఏటా కార్బన్ డయా క్సైడ్ 15 మిలియన్ టన్నులు తగ్గుతుందని కంపెనీ అంచనా. 50 లక్షల పెట్రోల్, డీజిల్ కార్ల బదులుగా ఎలక్ట్రిక్ కార్లను ఉపయోగిస్తే, లేదా 25 లక్షల హెక్టార్ల భూమిలో అడవిని పెంచితే వాతావరణంలో ఎంత కార్బన్ డయాౖక్సైడ్ తగ్గుతుందో ఈ ప్రాజెక్టు ద్వారా అంత తగ్గుతుందని కంపెనీ చెబుతోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో 33,240 మెగావాట్ల ప్రాజెక్టులు ప్రైవేటుతో పాటు ప్రభుత్వ ఆధ్వర్యంలోనూ 33,240 మెగావాట్ల భారీ సామర్థ్యంతో పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోంది. వివిధ జిల్లాల్లో అందుబాటులో ఉండే నీటి వనరులను ఉపయోగించుకుని పంప్డ్ హైడ్రో స్టోరేజీ, సౌర, పవన విద్యుత్ల కలయికగా ఈ అధునాతన ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తోంది. రాష్ట్రంలో మొత్తం 29 చోట్ల వీటిని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా.. మొదటి దశలో గండికోట, చిత్రావతి, సోమశిల, ఓక్, కురుకుట్టి, కర్రివలస, యర్రవరంలో శ్రీకారం చుడుతోంది. మొత్తం ఏడుచోట్ల 6,600 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించే ఈ ప్రాజెక్టుల డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) తయారవుతోంది. నేడు సీఎం శంకుస్థాపన ఇక పాణ్యం మండలం పిన్నాపురంలో నిర్మించే ఈ హైడల్ పవర్ ప్రాజెక్టులోని పంప్డ్ స్టోరేజ్ పవర్ యూనిట్కు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం శంకుస్థాపన చేయనున్నారు. ఉ.10 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరి ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి ప్రాజెక్టు వద్దకు చేరుకుని శంకుస్థాపన చేస్తారు. మ.2.05 గంటలకు సీఎం తిరిగి తాడేపల్లికి బయల్దేరుతారు. -
Kurnool: గుమ్మటం తండాలో పర్యటించనున్న సీఎం జగన్
సాక్షి, కర్నూలు (సెంట్రల్): సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 17న జిల్లాకు రానున్నారు. ఓర్వకల్లు మండలం బ్రాహ్మణపల్లి మజరా గ్రామం గుమ్మటం తండాలో పర్యటించనున్నారు. రూ.15 వేల కోట్ల పెట్టుబడితో 5,410 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదనే లక్ష్యంగా గ్రీన్కో ఎనర్జీస్ లిమిటెడ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. దీంతో సీఎం పర్యటన కోసం జిల్లా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. చదవండి: (Konaseema: ఆటే శ్వాస... సాధనే జీవితం.. ఫైనల్స్కు చేరిన భారత జట్టులో) సీఎం పర్యటన వివరాలు.. ►మంగళవారం ఉదయం 9.35 గంటలకు విజయవాడలోని ఆయన నివాసం నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు బయలుదేరుతారు. ►10 గంటలకు గన్నవరం నుంచి ప్రత్యేక విమానం ద్వారా ఓర్వకల్లు ఎయిర్పోర్టుకు బయలుదేరుతారు. ►10.50 గంటలకు ఓర్వకల్లు ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. ►11.15 గంటలకు ఓర్వకల్లు మండలం గుమ్మటం తండా హెలిప్యాడ్కు హెలికాప్టర్లో వస్తారు. ►11.15 నుంచి 11.30 గంటల మధ్య స్థానిక నేతలతో మాట్లాడతారు. ►11.35 గంటలకు ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఎనర్జీ పవర్ ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకుంటారు. ►11.35 నుంచి 12.15 గంటలకు ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఎనర్జీ పవర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు ►12.40 గంటలకు తిరిగి ఓర్వకల్లు ఎయిర్పోర్టుకు చేరుకుంటారు ►12.50 గంటలకు ఓర్వకల్లు ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం బయలుదేరి వెళ్తారు. చదవండి: (నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్ ) -
ఆరుగురితో విద్యుత్ ‘కోర్ కమిటీ’
సాక్షి, అమరావతి: వినియోగదారులకు నమ్మకమైన విద్యుత్ సరఫరా, వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ అందించడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. పరిశ్రమలకు కూడా పరిమితులు తొలగించి, సాధారణ స్థితిలో విద్యుత్ సరఫరా చేయడానికి కృషిచేస్తోంది. దీన్లో భాగంగా బొగ్గు కొరత కారణంగా ఏర్పడిన విద్యుత్ కొరతను అధిగమించడానికి చైర్మన్, ఐదుగురు సభ్యులతో కోర్ మేనేజ్మెంట్ టీమ్ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఇంధనశాఖ కార్యదర్శి బి.శ్రీధర్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇంధనశాఖ కార్యదర్శి చైర్మన్గా ఉండే ఈ కమిటీలో జెన్కో డైరెక్టర్ (బొగ్గు), ట్రాన్స్కో డైరెక్టర్ (గ్రిడ్), ట్రాన్స్కో డైరెక్టర్ (ఫైనాన్స్), ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ సభ్యులుగా ఉంటారు. ఏపీ పవర్ కో ఆర్డినేషన్ కమిటీ మెంబర్ కన్వీనర్ ఈ కమిటీకి కూడా మెంబర్ కన్వీనర్గా వ్యవహరిస్తారు. ఫ్యూయెల్ సప్లై అగ్రిమెంట్స్ (ఎఫ్ఎస్ఏ) ప్రకారం బొగ్గును సక్రమంగా సరఫరాకు సింగరేణి కాలరీస్, మహానది కోల్ఫీల్డ్స్ బొగ్గు క్షేత్రాలతో ఈ కమిటీ నిరంతరం సంప్రదింపులు జరుపుతుంది. కేంద్ర బొగ్గు, విద్యుత్, రైల్వే శాఖలతో మాట్లాడి బొగ్గు రవాణా (ర్యాక్స్)లో పరిమితులను పరిష్కరించేందుకు కృషిచేస్తుంది. అవసరమైన నిధుల కోసం రాష్ట్ర ఆర్థికశాఖకు నివేదిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యుత్ సంస్థలతో సమన్వయం చేస్తూ.. థర్మల్ పవర్ స్టేషన్లకు తగినంత బొగ్గు సరఫరా ఉండేలా చూస్తుంది. క్లిక్: బొండా ఉమ చిల్లర రౌడీ -
తగ్గుతున్న బొగ్గు నిల్వలు..పొంచి ఉన్న విద్యుత్ సంక్షోభం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో బొగ్గు నిల్వలకు సమస్య ఏర్పడుతోందని.. ఇది పొంచి ఉన్న విద్యుత్ సంక్షోభాన్ని సూచిస్తున్నట్టు అఖిల భారత విద్యుత్ ఇంజనీర్ల సమాఖ్య (ఏఐపీఈఎఫ్) ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘రాష్ట్రాల్లో విద్యుత్కు డిమాండ్ పెరిగింది. దీంతో డిమాండ్కు సరిపడా విద్యుత్ను సరఫరా చేయలేకపోతున్నాయి. థర్మల్ ప్లాంట్లలో తగినంత బొగ్గు నిల్వలు లేకపోవడమే సమస్యకు కారణం. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) తాజా రోజువారీ నివేదిక ప్రకారం చూస్తే.. దేశీ బొగ్గును వినియోగించే 150 థర్మల్ ప్లాంట్లకు గాను 81 చోట్ల బొగ్గు నిల్వల పరిస్థితి క్లిష్టంగా ఉంది. 54 ప్రైవేటు ప్లాంట్లలో 28 చోట్ల బొగ్గు నిల్వల పరిస్థితి ఇంతే ఉంది’’అని ఏఐపీఈఎఫ్ అధికార ప్రతినిధి వీకే గుప్తా పేర్కొన్నారు. పెరిగిన బొగ్గు సరఫరా: సీఐఎల్ బొగ్గు ఉత్పత్తిలో అతిపెద్ద సంస్థ అయిన కోల్ ఇండియా (సీఐఎల్) బొగ్గు సరఫరా పెంచినట్టు మంగళవారం ప్రకటించింది. ప్రస్తుత నెల మొదటి 15 రోజుల్లో థర్మల్ ప్లాంట్లకు బొగ్గు సరఫరాను 14.2 శాతం అధికంగా సరఫరా చేసినట్టు తెలిపింది. ఈ కాలంలో సరఫరా రోజువారీ 1.6 మిలియన్ టన్నులుగా ఉందని.. 2021 ఏప్రిల్ మొదటి భాగంలో రోజువారీ సరఫరా 1.43 టన్నులుగానే ఉన్నట్టు వివరించింది. అయితే వేసవిలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలతో విద్యుత్ డిమాండ్ పెరిగిపోయిందని, దీంతో పెరిగిన బొగ్గు సరఫరా ప్రభావం కనిపించడం లేదని పేర్కొంది. బొగ్గు, విద్యుత్, రైల్వే శాఖల మధ్య సమన్వయంతో విద్యుత్ ప్లాంట్ల వద్ద బొగ్గు నిల్వలు పెంచే చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించింది. చదవండి: భారీగా పెరిగిన గ్యాస్ ధరలు..తగ్గనున్న వినియోగం..! -
అధికార కేంద్రంలోనే పుట్టాను...కీలక వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ!
న్యూఢిల్లీ: కేంద్రలో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన్పటికీ తనకు అధికార పగ్గాల పై ఆసక్తి లేదని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. ఆయన న్యూఢిల్లీలో జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ...ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు రాహుల్ గాంధీ మాట్లాడుతూ....."వారంతా అధికారం కోసం ప్రయత్నిస్తున్న రాజకీయ నాయకులు. అధికారాన్ని పొందడం గురించే ఆలోచిస్తారు. నేను అధికార కేంద్రంలోనే పుట్టాను కానీ నాకు నిజాయితీగా దానిపై ఆసక్తి లేదు . నేను నా దేశాన్ని అర్థం చేసుకోవడానికే ప్రయత్నిస్తాను అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ అత్యంత ప్రభావంతమైన రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన కీలక కాంగ్రెస్ నాయకుడు. ఆయన తాతయ్య, నానమ్మ, తండ్రి కూడా ప్రధానులుగా సేవలందించిన సంగతి తెలిసిందే. అలాగే రాహుల్ గాంధీ తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంక వాద్రా కూడా భారత రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నవారే. అంతేకాదు ఆ ప్రసంగంలో రాహుల్ గాంధీ యూపీ సీనియర్ రాజకీయ నాయకురాలు అయిన బీఎస్సీ అధినేత్రి మాయవతి పై విరుచుకుపడ్డారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా 2022 అసెంబ్లీ ఎన్నికలలో ఆమె ఎలాంటి ఎఫర్ట్ పెట్టి పనిచేయలేదని ఆరోపించారు. ఈసారి ఆమె దళితుల కోసం పోరాడలేదని విమర్శలు గుప్పించారు. (చదవండి: ఆప్కు భారీ దెబ్బ.. బీజేపీలోకి కీలక చేరికలు! కేజ్రీవాల్ తీరువల్లే..) -
గాలి పటాలతో కరెంటు ఉత్పత్తి..
-
ఇదో అద్భుతమైన ట్రెడ్ మిల్: బరువు తగ్గడం ఖాయం
బుర్ర ఉండాలేగానీ నూతన ఆవిష్కరణలకు కొదవ ఉండదు. తాజాగా ఒక వ్యక్తి పవర్ అవసరం లేకుండా నడిచే ఒక ట్రెబ్మిల్ను రూపొందించారు. చెక్కపలకల సాయంతో విద్యుత్ అవసరం లేకుండానే పనిచేసేలా రూపొందించారు. ఈ ట్రెడ్మిల్పై నడుస్తున్నపుడు దానికి అమర్చిన ప్రత్యేక స్ప్పింగుల ద్వారా దానికదే రోల్ అవ్వడం దీని స్పెషాల్టీ. దీన్ని చూసిన నెటిజన్లు వావ్..వాట్ ఏ ఇన్నోవేషన్ అంటూ అభినందిస్తున్నారు. అలాగే తెలంగాణా ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ దృష్టిని కూడా ఈ మెషీన్ ఆకర్షించింది. దీన్ని పరిశీలించి, సాయం చేయాల్సిందిగా టీఎస్ వర్క్స్ హైదరాబాద్ ట్విటర్ హ్యాండిల్కి ట్యాగ్ చేశారు కేటీఆర్. దీన్ని మరింత మెరుగుపర్చడం అవసరమని ఒక యూజర్, ఇలాంటి ఐరన్తో స్పింగులతో ఒకటి చూశానని మరొకరు వ్యాఖ్యానించారు. ఈ ట్రెడ్మిల్ను ఒకసారి చూడండి అంటూ ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రకు విజ్ఞప్తి చేయడం విశేషం. మరి ఆ అద్భుతం ఏంటో మీరు చూసేయండి ఒకసారి. Wow! 👏👏 @TWorksHyd please connect & help him scale up https://t.co/FVgeHzsQx8 — KTR (@KTRTRS) March 18, 2022 -
AP: విద్యుత్ రంగంలో ‘వెలుగులు’
సాక్షి, అమరావతి: విద్యుత్ రంగం ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడి, అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. 32,244 మంది శాశ్వత ఉద్యోగులున్న అతిపెద్ద వ్యవస్థ అనేక సవాళ్లను ఎదుర్కొని నిలదొక్కుకుంటోంది. ఖర్చులు పెరుగుతున్నా, ఆదాయాన్ని కూడా పెంచుకుంటోంది. కొనుగోళ్లలో ఆదా చేస్తోంది. విద్యుత్ అంతరాయాలు, పంపిణీ నష్టాలు తగ్గించుకుంటోంది. పునరుత్పాదక ఇంధన వనరులకు పెద్దపీట వేస్తూ, విద్యుత్ పొదుపు, వాతావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ దిశగా అడుగులు వేస్తోంది. జాతీయ, రాష్ట్ర లక్ష్యాలకు అనుగుణంగా పురోభివృద్ధి చెందుతోంది. సామాజిక ఆర్థిక సర్వే ఈ విషయాలను వెల్లడించింది. పెరిగిన ఆదాయం, ఖర్చులు 2014–15 నుంచి 2020–21 కి మధ్య డిస్కంల ఆదాయం 7.95 శాతం నుంచి 9.10 శాతానికి పెరిగింది. అదే సమయంలో డిస్కంల ఖర్చులు రూ.24,211 కోట్ల నుంచి రూ.41,088 కోట్లకు పెరిగాయి. ఇందులో 65 శాతం విద్యుత్ కొనుగోళ్ల ఖర్చే. ఏటా కొనుగోళ్ల ఖర్చు రూ.8 వేల కోట్లు పెరుగుతోంది. ఈ ఏడేళ్లలో ఆర్థిక నష్టాలు రూ.9,026 కోట్ల నుంచి రూ.28,599 కోట్లకు చేరాయి. డిస్కంలకు అందిన ప్రభుత్వ సబ్సిటీలు రూ.2,525 కోట్ల నుంచి రూ.13,250 కోట్లకు చేరాయి. రాష్ట్ర విభజన అనంతరం సింగరేణి కాలరీస్ నుంచి బొగ్గు కొని థర్మల్ స్టేషన్లకు అందిస్తోంది. ఇందుకోసం ఏటా రూ.2500 కోట్లు సింగరేణి కాలరీస్కి చెల్లిస్తోంది. పునరుత్పాదక విద్యుత్కు ఏటా రూ.3 వేల కోట్లు వెచ్చిస్తోంది. సెంట్రల్ ట్రాన్స్మిషన్ లైన్ల వినియోగానికి నెలకు మెగావాట్కు రూ.3.49 లక్షలు కడుతోంది. కొత్త ప్రాజెక్టులు రాష్ట్రంలో స్థాపిత విద్యుత్ సామర్ధ్యం 18,509.71 మెగావాట్లు కాగా దీనిలో పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 8,826.363 మెగావాట్లు. 4 గిగావాట్ల రివర్స్ పంప్డ్ హైడ్రో పవర్ సామర్ధ్యం కూడా ఉండటంతో 7 చోట్ల 29 స్థలాలను గుర్తించారు. ఈ ప్రదేశాల్లో ప్రాజెక్టులకు రూ.47.30 కోట్లతో అంచనాలు సిద్ధమయ్యాయి. చిత్రకొండ డ్యామ్పై పవర్ ప్రాజెక్టుకు ఒడిశాతో 2020 అక్టోబర్ 23న ఒప్పందం కుదుర్చుకుంది. పోలవరంలో రూ.5,339 కోట్లతో నిర్మించే 960 మెగావాట్ల హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. 2024 జూలైకి 3 యూనిట్లు, 2026 కి మిగిలిన 9 యూనిట్లు ప్రారంభించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. లోయర్ సీలేరులోనూ రూ.571 కోట్లతో 230 మెగావాట్ల సామర్ధ్యంతో ప్రాజెక్టును మొదలుపెట్టారు. దీనిని రెండేళ్లలో పూర్తి చేయనున్నారు. ఉచితం, సబ్సిడీలు 2018–19 నుంచి 2021–22 (నవంబర్ 2021) వరకూ 2,73,362 వ్యవసాయ విద్యుత్ సర్వీసులను మంజూరు చేశారు. దీంతో ఈ సర్వీసుల సంఖ్య 19.24 లక్షలకు చేరింది. వీటన్నింటికీ ఉచితంగా 9 గంటలు పగటిపూట విద్యుత్ ఇస్తున్నారు. 25 ఏళ్ల పాటు దానిని కొనసాగించడానికి సెకీ నుంచి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం కుదిరింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో (డిసెంబర్ 2021వరకు) సబ్సిడీల కోసం రూ.6,801.14 కోట్లు ప్రభుత్వం ఇచ్చింది. ఆక్వా సబ్సిడీకి రూ.477.55 కోట్లు, ఎస్సీ, ఎïస్టీలకు సబ్సిడీ విద్యుత్ కోసం రూ.214.79 కోట్లు విడుదల చేసింది. నర్సరీలు, చేనేత, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, బంగారం దుకాణాలకు 100 యూనిట్ల వరకు, దోభీఘాట్లు, లాండ్రీలు, సెలూన్లు, రోల్డ్గోల్డ్ దుకాణాలకు 150 యూనిట్ల వరకూ సబ్సిడీ అందిస్తోంది. ఇంధన సామర్థ్యంపై దృష్టి రాష్ట్రంలో ఏటా 15 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా చేసే అవకాశం ఉందని ఇంధన శాఖ అంచనా వేసింది. దీనిని సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థలతో కలిసి ఇంధన పొదుపు, సామర్థ్యం పెంపు చర్యలు చేపట్టింది. సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిపైనా దృష్టి సారించింది. 13,065 గ్రామ పంచాయతీల్లో 23.64 లక్షల ఎల్ఈడీ బల్బులు ఏర్పాటు చేసింది. దీని ద్వారా ఏటా రూ.156 కోట్ల విలువైన 260 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుంది. భవన నిర్మాణాల్లో విద్యుత్ పొదుపు చర్యలు తప్పనిసరి చేసింది. 32 వేల సోలార్ పంపుసెట్లను అందించింది. తగ్గుతున్న నష్టాలు ఆగ్రిగేట్ టెక్నికల్, కమర్షియల్ (ఏటీసీ) నష్టాలు 2018–19లో 16.36 శాతం ఉంటే 2019–20 నాటికి 13.36 శాతానికి తగ్గించుకొంది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో రూ.4,752.50 కోట్లు సబ్సిడీలకు కేటాయిస్తూ మొత్తం రూ.6,103.50 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. సాంకేతికత ద్వారా ఖచ్చితమైన అంచనాలు వేస్తుండటంతో విద్యుత్ కొనుగోళ్లలో ఏటా కనీసం రూ.2 వేల కోట్లు ఆదా అవుతోంది. -
గతేడాది తగ్గిన విద్యుత్ వినియోగం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో వరుసగా ఆరేళ్లపాటు విద్యుత్ వినియోగం పెరగ్గా, 2020–21లో స్వల్పంగా తగ్గింది. 2014–15లో 39,519 మిలియన్ యూనిట్లు (ఎంయూ) ఉన్న విద్యుత్ వినియోగం, క్రమంగా పెరుగుతూ 2019–20 నాటికి 58,515 ఎంయూలకు చేరింది. 2020–21లో 57,006 ఎంయూలకు పడిపోయింది. కరోనా నియంత్రణకు లాక్డౌన్ విధించడంతో పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలు మూతపడటమే ఇందుకు కారణం. -
వార్నీ.. ఇదేం స్నానంరా బాబూ? తేడాలొస్తే మాత్రం..
కాస్త వేడిగానో, చల్లగానో నీళ్లతో స్నానం ఎవరైనా చేస్తారు.. మరి కరెంట్తో స్నానం చేస్తారా?.. వామ్మో ఇదేం పిచ్చి? ప్రాణాలు తీసే కరెంట్తో స్నానం చేయడం ఏమిటి? అంటారా.. ఇది నిజమే! జపాన్లో చాలా మంది అప్పుడప్పుడూ ఇట్లా కరెంట్ స్నానాలు చేస్తూనే ఉంటారు. దానికి ప్రత్యేకంగా ‘డెంకి బురో (ఎలక్ట్రిక్ బాత్)’ అని పేరు కూడా ఉంది. దీని సంగతేంటో తెలుసుకుందామా?.. నీళ్లకు, కరెంట్కు లింకు పెట్టొద్దని చిన్నప్పటి నుంచీ వింటూనే ఉన్నాం. వాటర్ హీటర్లు, గీజర్లు వంటివాటితో ప్రమాదాలు జరగడాన్ని చూస్తూనే ఉన్నాం. కానీ అదంతా హైఓల్టేజీ (ఎక్కువ తీవ్రత ఉన్న) కరెంట్. మరి డెంకి బురో స్నానాలకు వాడేది లోఓల్టేజీ కరెంట్. అంటే కొద్దిగా షాకి చ్చినట్టు అనిపిస్తూ.. మరీ పెద్దగా ఇబ్బంది కలగని కరెంట్ అన్నమాట. మన ఇళ్లలో వాడే ఫ్రిజ్లు, వాషింగ్ మెషీన్లు వంటి ఉపకరణాలకు సరఫరా అయ్యే విద్యుత్ 220 నుంచి 240 వోల్టుల మధ్య ఉంటుంది. డెంకి బురోలో 5 నుంచి 15 వోల్టేజీల మధ్య తీవ్రత ఉండే కరెంటును ఉపయోగిస్తారు. ఇంటా, బయటా.. ప్రత్యేక పూల్స్.. జపాన్లో డెంకి బురో స్నానాల కోసం ప్రత్యేకంగా బాత్టబ్లు, చిన్నపాటి స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి. వాటిలో రెండు వైపులా లోహపు పట్టీలను అమర్చి.. విద్యుత్ వైర్లో ఉండే రెండు తీగలను వాటికి అనుసంధానం చేస్తారు. ఆ లోహపు పట్టీలు మునిగేదాకా నీటిని నింపి, విద్యుత్ సరఫరా చేస్తే.. ఓ వైపు నుంచి మరోవైపునకు కరెంటు సరఫరా అవుతుంది. కొందరు వీటిని ఇళ్లలో ఏర్పాటు చేసుకుంటారు. బయట పబ్లిక్ బాత్ హౌజ్లలో కూడా డెంకి బురో సౌకర్యం ఉంటుంది. మనం బయటికి వెళ్లినప్పుడు ఏదో హోటల్కు వెళ్లి కాఫీ, చాయ్ తాగుతుంటాం కదా. అలా జపాన్లో కొందరు రిలాక్సేషన్ కోసం బాత్హౌజ్లకు వెళ్లి కరెంట్ స్నానాలు చేస్తుంటారు. జపాన్లో ఇలా కరెంట్ స్నానాల అలవాటు 18వ శతాబ్దం నుంచే ఉందట. ఎందుకిలా.. ఏమిటి లాభం? ఈ బాత్టబ్, మినీ స్విమ్మింగ్ పూల్స్లో స్నానం చేసేవారికి స్వల్పంగా కరెంట్ షాక్ తగులుతూ ఉంటుంది. ఇది నాడుల ద్వారా వ్యాపిస్తూ.. కండరాల్లో సన్నగా వణుకు (జలదరింపు) పుట్టిస్తుంది. అలసిపోయిన కండరాలు దీనితో రిలాక్స్ అవుతాయని.. ముఖ్యంగా కీళ్లు, వెన్ను, మెడ నొప్పి (రుమాటిజం, స్పాండిలైటిస్) వంటి సమస్యలున్న వారికి మంచి రిలీఫ్ను ఇస్తుందని చెప్తారు. ► అమెరికా రెండో ప్రపంచ యుద్ధ సమయంలో గాయపడిన సైనికులకు ఉపశమనం కోసం డెంకి బురో తరహాలో ఎలక్ట్రోథెరపీ ఇవ్వడం గమనార్హం. ► ఇప్పటికీ పలు రకాల వైద్య చికిత్సల్లో వివిధ వోల్టేజీల్లో విద్యుత్ షాక్ను ఇస్తుంటారు. స్వల్ప స్థాయి కరెంట్ షాక్ వల్ల శరీరంలో నాడులు స్పందించి మెదడుకు సిగ్నల్స్ పంపుతాయని, ఈ క్రమంలో నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుం దని కొందరు వైద్య నిపుణులు చెప్తున్నారు. ► మరో పరిశోధన ప్రకారం.. స్వల్పస్థాయి కరెంట్ ప్రవాహంతో శరీరంలో ఎండార్ఫిన్లుగా పిలిచే సహజ పెయిన్ కిల్లర్లు విడుదలవుతాయి. దానితో కీళ్లు, వెన్ను, మెడ నొప్పుల వంటి వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది. ► కరెంట్ వోల్టేజీని తట్టుకునే సామర్థ్యం ఒక్కొక్క రిలో ఒక్కోలా ఉంటుంది. ఉదాహరణకు కొంద రిలో 10 వోల్టుల కరెంటు షాక్ను, నొప్పిని కలి గిస్తే.. మరికొందరికి మాత్రం హాయిగా, విశ్రాం తిగా ఉంటుంది. అందుకే అవసరమైనట్టుగా ఓల్టేజీని తగ్గిస్తూ, పెంచుకుంటూ ఉంటారు. దయచేసి ఇళ్లల్లో ప్రయత్నించకండి అసలే కరెంటు, నీళ్ల జోడీ డేంజర్. వోల్టేజీలో తేడా వచ్చిందంటే ప్రాణాలకు ప్రమాదమే. అంతేకాదు.. మనకు ఎంత వోల్టేజీ అవసరమన్నది కూడా తెలియదు. పైగా సర్జరీలు జరిగినవారు, శరీరంలో రాడ్లు, ప్లేట్లు వంటివి అమర్చుకున్నవారు, గుండె జబ్బులున్నవారి విషయంలో మరింత అప్రమత్తత అవసరమని.. మొదట వైద్యులను సంప్రదించాకే డెంకి బురోకు వెళ్లాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జపాన్లో కొందరు డాక్టర్లు ప్రత్యేకంగా డెంకి బురో కోసం సలహాలు కూడా ఇస్తుంటారట. ఇది కేవలం సమాచారం ఇచ్చిన కథనం. దయచేసి ఎవరూ ఇంటా బయట ఇలాంటివి ప్రయత్నించకండి. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
స్త్రీ శక్తి.. మరో అడుగు
సెంట్రల్ రిజర్వ్ పోలిస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్) స్త్రీసాధికారత, శక్తియుక్తులకు సంబంధించి మూడు చారిత్రక అద్భుతాలకు వేదిక అయింది. కొన్ని నెలలు వెనక్కి వెళితే... నక్సల్స్ను ఎదుర్కోవడం కోసం ఏర్పాటు చేసిన ‘కోబ్రా కమాండో’లో మహిళల ప్రాతినిధ్యం లేదు. అయితే 34 మంది మహిళలతో ‘కోబ్రా’ దళాన్ని ఏర్పాటు చేసి మహిళలు లేని లోటును పూరించారు. ‘కోబ్రా’కు ఎంపికైన వారియర్స్ మూడు నెలల పాటు అడవుల్లో కఠినమైన శిక్షణ తీసుకున్నారు. గుర్గ్రామ్ కదార్పుర్లో కోబ్రా వుమెన్ వారియర్స్ ప్రదర్శించిన యుద్ధవిన్యాసాలు అబ్బురపరిచాయి. వారి మాటల్లోని ఆత్మవిశ్వాసం ఆకట్టుకుంది. శిక్షణ పూర్తి చేసుకున్నవారికి అభినందనలు తెలియజేస్తూ ‘హిస్టరీ ఇన్ మేకింగ్’ అని ట్విట్ చేసింది సీఆర్పీఎఫ్. 2012లో వరల్డ్స్ ఫస్ట్ ‘ఆల్– ఉమెన్ పారామిలటరీ పైప్బ్యాండ్’ను ఏర్పాటు చేసింది సీఆర్పీఎఫ్. ఇక తాజా విషయానికి వస్తే... సీఆర్పీఎఫ్ జడ్–ప్లస్ కేటగిరి కోసం విధులు నిర్వహించడానికి ఎంపికైన 32 మంది ఉమెన్ వారియర్స్ వివిధ విభాగాల్లో పదివారాల పాటు శిక్షణ పొందారు. ఈ నెలలోనే కొత్త బాధ్యతల్లోకి వెళ్లనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్... మొదలైన వారికి రక్షణగా నిలవనున్నారు. రాబోయే అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో వీఐపీ రాజకీయ నాయకుల రక్షణ బాధ్యతల్లో పాలుపంచుకోనున్నారు. గతంలో జడ్–ప్లస్ కమాండో విభాగంలో పురుషులు మాత్రమే ఉండేవారు. తాజా అడుగుతో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది సీఆర్పీఎఫ్. -
Power Saving Tips: ఈ టిప్స్ పాటిస్తే కరెంట్ బిల్లులు తక్కువ రావడం ఖాయం!
Power Saving Tips For House: ఎండా కాలం, చలి కాలం, వానా కాలం.. ఇలా సీజన్లతో సంబంధం లేకుండా కరెంట్ బిల్లులు సామాన్యుడికి గుబులు పుట్టిస్తున్నాయి. ఈమధ్య కాలంలో బిల్లులు ఎక్కువగా వస్తున్నాయంటూ చాలామంది గగ్గోలు పెడుతూ.. కరెంట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతుండడం చూస్తున్నాం. మరి కరెంట్ వినియోగం కూడా అదే స్థాయిలో ఉంటోంది కదా!. అందుకే ఆదా చేసే మార్గాలు ఉన్నప్పుడు.. కరెంట్ బిల్లులను తగ్గించుకోవడం మన చేతల్లోనే ఉంటుందని గుర్తు చేస్తున్నారు నిపుణులు. పైగా అవి సింపుల్ చిట్కాలే!. వ్యాంపైర్ అప్లియెన్సెస్.. కరెంట్ను జలగల్లా పీల్చేస్తాయి ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్. కాబట్టే వీటికి వ్యాంపైర్ అని పేరు పెట్టారు. విశేషం ఏంటంటే.. ఆఫ్లో ఉన్నా కూడా ఇవి ఎంతో కొంత కరెంట్ను లాగేస్తుంటాయి కూడా. సెల్ఫోన్ ఛార్జర్ల మొదలు.. వైఫై రూటర్లు, టీవీలు, కంప్యూటర్లు, ఐరన్బాక్స్లు, వాషింగ్మెషీన్, ల్యాప్ట్యాప్లు.. ఇలా ఫ్లగ్గులో ఉండి కూడా ఆఫ్లో ఉన్నప్పుడు కరెంట్ను తీసుకుంటాయి. అందుకే వినియోగించనప్పుడు వాటిని ఫ్లగ్ల నుంచి తొలగించాల్సి ఉంటుంది. ఈరోజుల్లో స్టాండ్బై మోడ్ ఆప్షన్తో వస్తున్నా.. అవి ఎంతో కొంత వాట్లలో పవర్ను లాగేస్తున్నాయి. కాబట్టి, వీటి విషయంలో ఈ చిన్న సలహా పాటిస్తే బెటర్. సంబంధిత కథనం: ఆఫ్ చేసినా ఇవి కరెంట్ లాగేస్తాయని తెలుసా? కెపాసిటీకి తగ్గట్లు.. వాషింగ్ మెషిన్, గ్రీజర్-వాటర్ హీటర్, ఏసీలు.. ఇలా హెవీ అప్లయెన్సెస్ ఏవి వాడినా కరెంట్ బిల్లు ఎక్కువగానే వస్తుంటుంది. కానీ, వాటిని వాడే విధానంలో తేడాల వల్లే బిల్లులు అంతలా వస్తుంటాయని తెలుసా?. కాబట్టి, ఒక పద్దతిలోనే వాటిని వాడాల్సి ఉంటుంది. ఉదాహరణకు వాషింగ్ మెషిన్ను ఫుల్ కెపాసిటీతో కాకుండా తక్కువ కెపాసిటీతో ఉపయోగించడం. అంటే తక్కువ బట్టలు వేసి.. రెగ్యులర్గా ఉతకడం. దీనివల్ల ఫుల్ కెపాసిటీ టైంలో పడే లోడ్ పడి కరెంట్ ఎక్కువ ఖర్చు అవుతుంది. వాషింగ్ మెషిన్లు మాత్రమే కాదు.. ఏసీలు, హీటర్లు, గ్రీజర్లు.. ఇలా ఏవైనా సరే వాటి లెవల్కు తగ్గట్లుగా స్మార్ట్గా ఉపయోగించడం వల్ల కరెంట్ బిల్లులను తగ్గించుకున్న వాళ్లు అవుతాం. ఇక కొత్తగా అప్లియెన్సెస్ కొనాలనుకుంటే.. వాటి రేటింగ్ను పరిగణనలోకి తీసుకోవడం అస్సలు మరవద్దు. తద్వారా కరెంట్ కన్జంప్షన్ తగ్గుతుంది. కరెంట్ సేవింగ్లో ఇదే ముఖ్యం బల్బులు, సీలింగ్ ఫ్యాన్లు ఇంటి ప్రాథమిక అవసరాలు. అలాగే కరెంట్ బిల్లుల విషయంలో వీటి భాగస్వామ్యం కూడా ఎక్కువే!. చివరికి కరెంట్ తక్కువ లాగుతాయనుకునే.. సీఎల్ఎఫ్, ఎల్ఈడీ బల్బులు సైతం ఆఫ్ కరెంట్ను ఎక్కువే తీసుకుంటాయి. కాబట్టి, అవసరం లేనప్పుడు వాటిని ఆఫ్ చేయడం, తక్కువ స్పేస్లో పని చేస్తున్నప్పుడు ఫోర్టబుల్ ల్యాంపులు, స్టడీ ల్యాంపులు ఉపయోగించడం బెటర్. పాతవి ఎక్కువే.. పాత అప్లియెన్సెస్.. కొత్తగా వస్తున్నవాటికన్నా ఎక్కువ ఎనర్జీని లాగేస్తాయి. అందుకు కారణం.. ఆప్టియం ఏజ్. అంటే కాలం చెల్లడంలాంటిదన్నమాట. అందుకే పాత అప్లియెన్సెస్ను మార్చేసి.. మంచి రేటింగ్ ఉన్న అప్లియెన్సెస్ను ఉపయోగించాలి. మాటిమాటికీ అక్కర్లేదు.. మొబైల్ ఫోన్, ల్యాప్టాప్, దోమల బ్యాట్లు, ఛార్జింగ్ లైట్లు.. అవసరం లేకున్నా ఛార్జింగ్ పెట్టడం కొందరికి ఉండే అలవాటు. ముఖ్యంగా సెల్ఫోన్ ఛార్జింగ్ల విషయంలో ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది. కానీ, దీనివల్ల కరెంట్ అడ్డగోలుగా కాలుతుంది. అందుకే అత్యవసం అయితేనే ఛార్జింగ్ పెట్టాలి. అవసరం లేనప్పుడు ఫ్లగ్ల నుంచి ఛార్జర్లను తొలగించాలి మరిచిపోవద్దు. కరెంట్ బిల్లులు మోగిపోవడానికి, మీటర్ గిర్రున తిరగడం ఒక్కటే కారణం కాదు. ఎంత ఉపయోగిస్తున్నామనేది మన చేతుల్లోనే ఉంటుంది. కానీ, చిన్న చిన్న జాగ్రత్తలు, టిప్స్ పాటిస్తూ కరెంట్ను ఆదా చేయడంతో పాటు జేబుకు చిల్లుపడకుండా చూసుకోవచ్చు. -
AP: ఇక ‘పవర్’ పోలీస్స్టేషన్లు
సాక్షి, అమరావతి: విద్యుత్ సంస్కరణల అమలులో భాగంగా మరో విప్లవాత్మక మార్పు రానుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ‘పంపిణీరంగ పునరుద్ధరణ పథకం, సంస్కరణల ఆధారిత, ఫలితాలతో అనుసంధానించిన పథకం (రీవాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్, ఏ రిఫార్మ్ బేస్డ్ అండ్ రిజల్ట్ లింక్డ్ స్కీమ్)’ ప్రకారం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కరెంటు పోలీసులు రానున్నారు. ఈ మేరకు ప్రత్యేక పోలీస్స్టేషన్లను ఏర్పాటు చేయాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. విద్యుత్ పంపిణీని పూర్తిగా ప్రైవేటీకరించడమే లక్ష్యంగా కేంద్రం ఈ పథకాన్ని రూపొందించింది. దీనిలో భాగంగా అన్ని నగరాలు, పట్టణాల్లోని మొత్తం పంపిణీ వ్యవస్థను ప్రైవేటు సంస్థలకు, ఫ్రాంచైజీలకు అప్పగిస్తారు. ఇళ్లకు ప్రీపెయిడ్ మీటర్లను బిగిస్తారు. ఇప్పటిలా ఇంటింటికి తిరిగి విద్యుత్ వినియోగాన్ని నమోదు చేసి బిల్లు ఇచ్చే పరిస్థితి ఉండదు. సెల్ఫోన్ల రీచార్జ్లా మీటర్ రీచార్జ్ చేయించుకుంటేనే కరెంట్ సరఫరా జరుగుతుంది. ఈ మొత్తం పథకం అమలుకు దేశవ్యాప్తంగా 2021–22 నుంచి 2025–26 వరకు రూ.3,03,758 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. దీనిలో రూ.97,631 కోట్లను కేంద్రం బడ్జెట్ ద్వారా రాష్ట్రాలకు సమకూర్చనుంది. దీనికోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల డిస్కమ్లు ఒప్పందాన్ని కుదుర్చుకోవాలి. దీనికోసం తప్పనిసరిగా చేపట్టాల్సిన చర్యల్లో విద్యుత్ పోలీస్స్టేషన్ల ఏర్పాటు ఒకటి. వీటిని ఏర్పాటు చేస్తేనే కేంద్రం నిధులు విడుదల చేస్తుంది. దీంతో తప్పనిసరిగా 2003 నాటి విద్యుత్ చట్టం ఆధారంగా పవర్ పోలీస్లు రానున్నారు. పర్యవేక్షణకు ప్రత్యేక ఏర్పాటు పథకం అమలుకు కేంద్రంతో ఒప్పందం చేసుకున్నాక వివిధ మంత్రిత్వ శాఖలతో పర్యవేక్షణ కమిటీని కేంద్రం ఏర్పాటు చేస్తుంది. దీనికి కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి చైర్మన్గా ఉంటారు. రాష్ట్రాలు పంపే అన్ని సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్)లను ఈ కమిటీ పరిశీలిస్తుంది. ఇదికాకుండా మరో నోడల్ ఏజెన్సీని కూడా ఏర్పాటు చేసి సలహాదారులను నియమిస్తుంది. వీరు రాష్ట్రాలు, ప్రాంతాలవారీగా అవసరమైన పథకాలను రూపొందించి కేంద్రానికి నివేదిస్తారు. విద్యుత్ శాఖలో ప్రస్తుతం విజిలెన్స్ విభాగం ఉంది. విజయవాడలోని ఏపీ ట్రాన్స్కో ప్రధాన కార్యాలయంలో ఐపీఎస్ స్థాయి అధికారి జాయింట్ ఎండీగా ఉన్నారు. రాష్ట్రంలో మూడు డిస్కమ్లపై ఫిర్యాదులపై విజిలెన్స్ స్పందిస్తుంటుంది. తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థకు విశాఖలో, మధ్యప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థకు విజయవాడలో, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థకు తిరుపతిలో విజిలెన్స్ విభాగాలున్నాయి. చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్, ఎస్ఐలు, కానిస్టేబుళ్లు ఉన్నారు. ప్రస్తుతం వీరు డిస్కమ్లలో ఉద్యోగులపై వచ్చిన వివిధ రకాల ఫిర్యాదులపై దర్యాప్తు చేస్తున్నారు. వీరు కాకుండా ప్రతి సర్కిల్ కార్యాలయంలోనూ విద్యుత్ చౌర్య నిరోధక విభాగం (డీపీఈ) అధికారులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రతిపాదించిన పవర్ పోలీస్స్టేషన్లు వస్తే.. వాటి ద్వారా ఎటువంటి కార్యకలాపాలు నిర్వర్తించాలి? ఆ పోలీసుల విధి, విధానాలేమిటనే అంశాలపై కేంద్రం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. విజిలెన్స్ వ్యవస్థను దానిలో అనుసంధానించి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిస్తారా లేక విలీనం చేస్తారో తేలాల్సి ఉంది. -
గిరిజన గూడేల్లో వెలుగులు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీలో అనేక గిరిజన ఆవాసాల్లో మొన్నటివరకు కరెంటంటే ఏమిటో తెలియని పరిస్థితి. కొన్ని ఆవాసాల్లో సోలార్ ప్యానల్స్ ద్వారా గతంలో కరెంటు సరఫరా ఇచ్చామనిపించారు. అయితే ఇక్కడ కేవలం రాత్రి సమయాల్లో మాత్రమే కరెంటును వినియోగించుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు అలాకాకుండా రెగ్యులర్గా విద్యుత్ స్తంభాలు వేసి రోజంతా విద్యుత్ సరఫరా అయ్యే విధంగా పనులు చేపడుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏజెన్సీ ప్రాంతంపై ప్రత్యేకశ్రద్ధ పెట్టారు. ఇప్పటికే అన్ని గిరిజన ఆవాసాలకు రోడ్డు వసతికి రూ.కోట్లు ఖర్చు చేస్తున్నారు. అదేవిధంగా ప్రతి గిరిజన గూడేనికి విద్యుత్ సరఫరా ఉండాలనే లక్ష్యంతో పనులు ప్రారంభించారు. మొదటి విడతలో 85 గిరిజన ఆవాసాల్లో విద్యుత్ సరఫరా పనులు చేపట్టారు. కొన్ని ఆవాసాల్లో పనులు పూర్తయ్యాయి. వచ్చే ఏడాది మిగిలిన ఆవాసాల్లో కూడా విద్యుత్ పనులు చేపట్టనున్నారు. విశాఖ ఏజెన్సీలో 3,574 ఆవాసాలు ఏజెన్సీలో గ్రామాల సంఖ్య, వాటికి సంబంధించిన సమగ్ర సమాచారం మొన్నటివరకు ఎవరివద్దా లేవు. ప్రభుత్వశాఖలు ఒక్కొక్కటి ఒక్కో సమాధానం చెప్పేవి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీపై పూర్తిసమాచారం కోసం ప్రత్యేకంగా సర్వే చేసింది. ఈ సర్వే ద్వారా ఆవాసాల సంఖ్య, అక్కడి సమస్యలు, సౌకర్యాల సమాచారం అందింది. విశాఖ ఏజెన్సీలో 3,574 ఆవాసాలున్నాయని, 1,21,727 కుటుంబాలకు చెందిన 6,04,047 మంది నివసిస్తున్నారని తేలింది. ఇంకా 149 ఆవాసాలకు కరెంటు సదుపాయం లేదని తెలిసింది. దీంతో వెంటనే 85 ఆవాసాల్లో కరెంటు సదుపాయం కల్పించే మొదటివిడత పనులను ప్రభుత్వం రూ. 50 కోట్లతో చేపట్టింది. విద్యుత్శాఖ కేవలం 85 ఆవాసాల్లో మాత్రమే కరెంటు సదుపాయం లేదని, వాటికి డిసెంబర్ నాటికి కరెంటు వసతి కల్పిస్తామని చెబుతోంది. ఒకవేళ తాజా సర్వే ప్రకారం మరిన్ని ఆవాసాలకు అవసరమైతే అక్కడ కూడా విద్యుత్ సరఫరా పనులు చేపడతామని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. కేంద్రాన్ని తప్పుదారి పట్టించిన నాటి చంద్రబాబు ప్రభుత్వం దేశంలోని అన్ని కుటుంబాలకు విద్యుత్ సౌకర్యాన్ని కల్పించాలని 2014లో కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం రాష్ట్రాలతో ఒప్పందం చేసుకుని ‘పవర్ ఫర్ ఆల్’ పేరుతో కార్యక్రమం ప్రారంభించింది. 2014 డిసెంబర్లో చంద్రబాబు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. దశలవారీగా రాష్ట్రంలోని అన్ని ఆవాసాలకు, ఇళ్లకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని నిర్దేశించింది. మార్చి 2017 నాటికి రాష్ట్రంలోని అన్ని ఇళ్లకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఒప్పందంలో పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగా మారుమూల గ్రామాలకు అవసరమైన విద్యుత్ సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు కేంద్రం వివిధ పథకాల ద్వారా నిధులు విడుదల చేసింది. నేరుగా విద్యుత్ స్తంభాల ద్వారా తీగలను లాగి విద్యుత్ను సరఫరా చేసేందుకు అవకాశం లేని ఏజెన్సీ ప్రాంతాల్లో సౌరఫలకల ద్వారా సౌర విద్యుత్ కూడా సరఫరా చేసేందుకు కేంద్రం నుంచి అప్పటి చంద్రబాబు ప్రభుత్వం నిధులు తీసుకుంది. అంతిమంగా మార్చి 2017 నాటికి రాష్ట్రంలోని అన్ని ఆవాసాలకు విద్యుత్ సౌకర్యం కల్పించామని ఘనంగా ప్రకటించేసింది. వాస్తవ పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఇప్పటికీ విశాఖపట్నం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో 149 ఆవాసాలకు కరెంటు సౌకర్యం లేదంటే చంద్రబాబు ప్రభుత్వం కేంద్రాన్ని తప్పుదారి పట్టించిందని అర్థమవుతోంది. అన్ని ఇళ్లకు కరెంటు సౌకర్యం కల్పించామని కేంద్రం నుంచి చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిధులను ఏంచేశారనే విషయం తేలాల్సి ఉంది. ► అరకు నియోజకవర్గం హుకుంపేట మండలంలోని మందబుద్ది గ్రామానికి మొన్నటివరకు కరెంటు లేదు. కొండకోనల్లో ఉండే ఈ ఆవాసానికి కరెంటు పోల్స్ తీసుకెళ్లి.. తీగలు లాగి వెలుగులు నింపింది వైఎస్సార్సీపీ ప్రభుత్వం. ఇప్పుడు ఈ ఊళ్లో విద్యుత్ వెలుగులు నిండాయి. ► అనంతగిరి మండలంలోని దాయార్తి గ్రామ ప్రజలు.. మా ఊరికి కరెంటివ్వాలని గతంలో అనేకసార్లు నిరసనలు చేశారు. పొద్దుపోయాక కనీసం గూడెం నుంచి బయటకురాలేని దుస్థితి. పురుగుపుట్రతో ఇబ్బందులు. కొద్దిరోజుల కిందట ఈ గిరిజన గూడెంలో కరెంటు బల్బులు వెలిగాయి. ఇన్నాళ్లూ చీకట్లోనే.. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా మా గ్రామానికి విద్యుత్ సౌకర్యం లేదు. కటిక చీకట్లోనే కాలం వెల్లదీశాం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా ఊరికి కరెంటొచ్చింది. – కొర్ర మల్లన్న, బందబుద్ది గ్రామం, హుకుంపేట మండలం దశాబ్దాల కల నెరవేరింది దశాబ్దాలుగా అటవీ ప్రాంతంలో నివాసం ఏర్పరచుకుని జీవిస్తున్నాం. ఇన్నాళ్లు గుడ్డి దీపాలే దిక్కు. జగనన్న సీఎం అయ్యాక మా గ్రామంలో విద్యుత్ సౌకర్యం కల్పించారు. దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న సమస్య తీరింది. – సీదరి మల్లేష్, రీడబంద గ్రామం, హుకుంపేట మండలం కరెంటివ్వమన్నా ఇన్నాళ్లు ఇవ్వలేదు మండల కేంద్రం అనంతగిరి నుంచి మా గ్రామానికి 125 కిలోమీటర్ల దూరం. మా గ్రామంలో 25 కుటుంబాలున్నాయి. రాత్రిళ్లు జంతువుల బెడద ఎక్కువ. కరెంటు లేకపోవడంతో బయటకు వచ్చేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఎన్నోసార్లు నిరసన చేపట్టినా మా సమస్యను పట్టించుకోలేదు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక మా సమస్య పరిష్కారమైంది. రెండు నెలల కిందటే మా గ్రామానికి కరెంటు వచ్చింది. – కొర్ర సోమన్న, దాయార్తి గ్రామం, అనంతగిరి మండలం -
మరో మైలురాయిని దాటిన సింగరేణి
సాక్షి, హైదరాబాద్: సోలార్ విద్యుత్ ఉత్పాదనలో 200 మెగావాట్ల లక్ష్యాన్ని దాటడం ద్వారా సింగరేణి సంస్థ మరో రికార్డును అందుకుంది. బుధవారం కొత్తగూడెంలో ప్రారంభించిన 37 మెగావాట్ల యూనిట్తో ఆ సంస్థ సోలార్ విద్యుత్ ఉత్పత్తి 219 మెగావాట్లకు చేరింది. సింగరేణి ఆధ్వర్యంలో 300 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 13 ప్లాంట్లను సంస్థ పరిధిలోని 8 ఏరియాల్లో నెలకొల్పాలని నిర్ణయించారు. మూడు దశల్లో ఈ పాంట్ల ఏర్పాటు కోసం పలు కాంట్రాక్టు సంస్థలకు బాధ్యతలు అప్పజెప్పింది. మొదటిదశలో భాగంగా 129 మెగావాట్ల సామర్థ్యం గల నాలుగు ప్లాంట్లను బీహెచ్ఈఎల్ చేపట్టింది. ఆర్జీ–3లో 40, ఇల్లెందులో 39, మణుగూరులో 30, ఎనీ్టపీసీ ఆవరణలో 10 మెగావాట్ల ప్లాంట్ల నిర్మాణాలు పూర్తయి ఇప్పటికే విద్యుత్ ఉత్పాదన చేస్తున్నారు. ఆర్జీ–3 ఏరియాలోని మరో 10 మెగావాట్ల ప్లాంటు వచ్చే నెలలో పూర్తి కానుంది. ఇక, రెండో దశలో భాగంగా కొత్తగూడెంలో 37, మందమర్రి ఏ బ్లాక్లో 28, బి బ్లాక్లో 15, భూపాలపల్లిలో 10 మెగావాట్ల ప్లాంట్లు కూడా ఉత్పత్తి ప్రారంభించాయి. ఇప్పుడు కొత్తగూడెం ప్లాంటు కూడా ప్రారంభం కావడంతో సింగరేణి సోలార్ విద్యుదుత్పాదన సామర్థ్యం 219 మెగావాట్లకు చేరింది. ఇక, మూడోదశలోని 81 మెగావాట్ల ప్లాంట్ల ఏర్పాట్లను అదానీ, నోవాస్గ్రీన్ సంస్థలకు సింగరేణి అప్పగించింది. ఇందులో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని జలాశయంపై నీటితో తేలియాడే 15 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణ పనులను నోవాస్గ్రీన్ ప్రారంభించింది. ఆర్జీ–3 ఓపెన్కాస్ట్ డంప్పై 22, డోర్లీ ఓపెన్కాస్ట్ డంప్పై 10 మెగావాట్లు, కొత్తగూడెం, చెన్నూరు ఏరియాల్లో నేలపై రెండు ప్లాంట్ల (34 మెగావాట్లు)ను నిర్మిస్తున్నారు. వీటి పనులు ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేసి ఉత్పాదన ప్రారంభించాలని సంస్థ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇప్పటికే 122.3 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి వాస్తవానికి దేశంలో బొగ్గు ఉత్పత్తి చేస్తున్న ఏ ప్రభుత్వరంగ సంస్థ కూడా ఇప్పటివరకు సోలార్ విద్యుదుత్పత్తి చేయడం లేదు. థర్మల్తో పాటు సోలార్ విధానంలో విద్యుత్ ఉత్పత్తిని చేస్తోంది సింగరేణి సంస్థ మాత్రమే. ఈ సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటికే గ్రిడ్కు అనుసంధానమైన సోలార్ ప్లాంట్ల ద్వారా సెప్టెంబర్ 21 నాటికి 122.3 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అయింది. ఈ విద్యుత్ను ట్రాన్స్కో లైన్లకు అనుసంధానం చేసి తనకు అవసరమైన మేర వినియోగించుకోవడంతో సంస్థకు రూ.75 కోట్ల మేర ఆదా అయింది. మొత్తం సంస్థ నిర్దేశించుకున్న 300 మెగావాట్ల లక్ష్యం పూర్తయితే ప్రతియేటా రూ.120 కోట్లు ఆదా అవుతాయని సింగరేణి వర్గాలు చెబుతున్నాయి. చదవండి: Dr Jnanesh Thacker: 500కు పైగా ఊపిరితిత్తులు, గుండె మార్పిడి సర్జరీలు -
ఆంధ్రప్రదేశ్లో పవర్ ‘ఫుల్ ఆదా’
సాక్షి, అమరావతి: విద్యుత్ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అనుసరిస్తున్న విధానాలతో సత్ఫలితాలు వస్తున్నాయి. ప్రజాధనం వృథా కాకుండా నివారిస్తూ ప్రతి పైసాను ఆదా చేయడంతో విద్యుత్ సంస్థలు బలోపేతం అవుతున్నాయి. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా చిన్న ప్రాజెక్టులపైనా ప్రత్యేకంగా దృష్టి సారించడంతో పాటు ఉత్తమ ప్రమాణాలు పాటించడం, బహిరంగ మార్కెట్లో చౌకగా విద్యుత్ను కొనుగోలు చేయడంతో విద్యుత్ సంస్థలు రూ.2,342 కోట్ల మేర ఆదా చేయగలిగాయి. విద్యుత్ సంస్థల్లో సాంకేతిక, వాణిజ్య నష్టాలు (ఏటీ,సీ) 2018–19లో 13.79 శాతం ఉండగా 2019–20లో 10.95 శాతానికి తగ్గాయి. రీ టెండర్తో రూ.15.96 కోట్లు మిగులు చౌక విద్యుత్, పొదుపు చర్యల్లో భాగంగా ఏపీ ట్రాన్స్కో సిస్టం అప్లికేషన్స్ అండ్ ప్రొడక్టస్(ఎస్ఏపీ), హన (హై పెర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లయన్స్) ఎంటర్ప్రైజెజ్ క్లౌడ్ సర్వీసుల టెండర్ ఖరారులో రూ.15.96 కోట్లు ఆదా చేసింది. వాస్తవానికి ఎస్ఏపీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో ఏపీ ట్రాన్స్కో ఐదేళ్ల కిందట ఒప్పందం కుదుర్చుకుంది. ఐదేళ్ల కాలానికి క్లౌడ్ సర్వీసులకు రూ.20.22 కోట్లతో నామినేషన్ పద్ధతిలో ఈ ఒప్పందం జరిగింది. ఇదే కంపెనీ మరో ఐదేళ్ల పాటు ఒప్పందాన్ని పునరుద్ధరించాలని కోరింది. ఈ ప్రతిపాదనను ఏపీ ట్రాన్స్ కో తిరస్కరించింది. రీ టెండర్ ద్వారా ఐదేళ్ల క్లౌడ్ సర్వీసుల కోసం రూ.3.94 కోట్లకు, వన్ టైం మైగ్రేషన్ కోసం రూ.31.22 లక్షలకు టెండరు ఖరారు చేసింది. ఫలితంగా రూ.15.96 కోట్లు ఆదా అయ్యాయి. విద్యుత్ కొనుగోళ్లలో రూ.2,342 కోట్లు ఆదా చౌక విద్యుత్ లక్ష్యాలను చేరుకోవడంలో భాగంగా విద్యుత్ సంస్థలు అత్యాధునిక సాంకేతికత పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నాయి. ఒక రోజు ముందే విద్యుత్ వినియోగాన్ని అంచనా వేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీని అమలు చేస్తున్నాయి. ఫలితంగా విద్యుత్ కొనుగోలు ఖర్చును గణనీయంగా తగ్గించగలుగుతున్నాయి. ఈ విషయంలో రాష్ట్ర విద్యుత్ సంస్థలు దేశానికే రోల్ మోడల్గా నిలిచాయి. 2019 – 20, 2020 – 21లో ఉత్తమ ప్రమాణాలు పాటించడం, చౌక విద్యుత్ పవర్ ఎక్సే ్చంజీల ద్వారా విద్యుత్ కొనుగోలు చేయడం ద్వారా మొత్తం రూ.2,342 కోట్లు ఆదా చేశారు. విద్యుత్ సంస్థల సాంకేతిక, వాణిజ్య నష్టాల వివరాలు శాతాల్లో సంస్థ 2018–19 2019–20 ఏపీఈపీడీసీఎల్ 6.68 6.64 ఏపీఎస్పీడీసీఎల్ 8.45 8.30 ఏపీసీపీడీసీఎల్ 7.93 7.99 సాంకేతిక నష్టాల సగటు 7.70 7.62 డిస్కంల వాణిజ్య నష్టాలు 6.09 3.33 ఏటీ అండ్ సీ నష్టాల మొత్తం 13.79 10.95 అందుబాటు ధరల్లో నాణ్యమైన విద్యుత్ ‘‘వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయటంతో పాటు అందుబాటు ధరల్లోనే అందించే ప్రయత్నాలను కొనసాగించాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యం. విద్యుత్ వ్యవస్థలు ఈ విధానాలను పాటిస్తూ ప్రజాధనాన్ని ఆదా చేస్తున్నాయి’’ – నాగులాపల్లి శ్రీకాంత్. ఇంధనశాఖ కార్యదర్శి ఇతర రాష్ట్రాలకు ఏపీ ఆదర్శం ‘‘ఉత్తమ విధానాల అమలు, చౌక విద్యుత్లో ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. విద్యుత్ రంగాన్ని సుస్థిరం చేయాలన్న ప్రభుత్వ ఆకాంక్షకు అనుగుణంగా విద్యుత్ సంస్థలు పనిచేస్తున్నాయి. దానిలో భాగంగానే ఎస్ఏపీ టెండర్లలో రూ.15.96 కోట్లు ఆదా చేయగలిగాం’’– కర్రి వెంకటేశ్వరరావు, ఏపీ ట్రాన్స్కో విజిలెన్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ -
ఆఫ్ చేసినా ఇవి కరెంట్ లాగేస్తాయని తెలుసుకోండి
టెక్ ఏజ్లో సాంకేతికతకు పవర్ తోడైతేనే రోజువారీ పనులు జరిగేది. విచ్చల విడిగా వాడేస్తూ.. నెల తిరిగే సరికి కరెంట్ బిల్లును చూసి కళ్లు పెద్దవి చేసేవాళ్లు మనలో బోలెడంత మంది. అయితే మనకు తెలియకుండానే కరెంట్ను అదనంగా ఖర్చు చేస్తున్నామని తెలుసా?.. అదీ ఆఫ్ చేసినప్పటికీ!. యస్.. మొత్తం పవర్ బిల్లులలో మినిమమ్ 1 శాతం.. పవర్ ఆఫ్ చేసిన ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ వల్ల వస్తుందని ఇండియన్షెల్ఫ్ ఓ కథనం ప్రచురించింది. టెలివిజన్ సెట్స్.. చాలామంది టీవీలు చూస్తూ రిమోట్ ఆఫ్ చేసి వేరే పనుల్లో మునిగిపోతారు. లేదంటే రాత్రిళ్లు పడుకునేప్పుడు టీవీలను స్విచ్ఛాఫ్ చేయకుండా వదిలేస్తారు. ఇలా చేయడం స్టాండ్బై మోడ్లోకి వెళ్లే టీవీ.. రోజుకి 24 వాట్ల పవర్ను తీసుకుంటుంది. ఇది తక్కువే అనిపించినా.. రోజుల తరబడి లెక్క ఎక్కువేగా అయ్యేది!. సెల్ఫోన్ ఛార్జర్.. చాలామంది నిర్లక్క్ష్యం వహించేది దీని విషయంలోనే. ఫోన్ ఛార్జింగ్ అయ్యాకో, మధ్యలో ఫోన్ కాల్ వస్తేనో స్విచ్ఛాఫ్ చేయకుండా ఫోన్ నుంచి పిన్ తీసేస్తుంటారు. కానీ, పవర్ బటన్ను ఆఫ్ చేయడమో, సాకెట్ నుంచి ఛార్జర్ను తీసేయడమో చేయరు. ఛార్జర్ సగటున రోజుకి 1.3 వాట్ల పవర్ను లాగేసుకుంటుంది. అంతేకాదు ఛార్జర్ పాడైపోయే అవకాశం.. ఒక్కోసారి పేలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. వైఫై మోడెమ్.. స్విచ్ఛాఫ్ చేయకుండా ఉంచే ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్లో ఫస్ట్ ప్లేస్లో ఉండేది ఇదే. ఇంటర్నెట్ను ఉపయోగించినా లేకున్నా, వైఫై పరిధి నుంచి మొబైల్స్, తదితర డివైజ్లు దూరంగా వెళ్లినా సరే.. 24/7 వైఫైలు ఆన్లోనే ఉంటాయి. ప్రత్యేకంగా ఇది ఎంత కరెంట్ కాలుస్తుందనేది ప్రత్యేకంగా చెప్పలేకపోయినా.. ఉపయోగించనప్పుడు, బయటికి వెళ్లినప్పుడు ముఖ్యంగా రాత్రిళ్లు పడుకునేప్పుడు ఆఫ్ చేసి ఫ్లగులు తీసేయడం బెటర్. మైక్రో ఓవెన్స్.. ఇది తక్కువ మంది ఇళ్లలో ఉండొచ్చు. కానీ, చాలామంది వీటిని పూర్తిగా ఆఫ్ చేయకుండా వదిలేస్తుంటారు. కానీ, మైక్రో ఓవెన్స్, ఓవెన్స్లు ఒకరోజులో 108 వాట్ల పవర్ను లాగేస్తాయి. సో.. వాడనప్పుడు వాటిని అన్ఫ్లగ్ చేయడం ఉత్తమం. మరికొన్ని.. పెద్దసైజులో ఉండే ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్లు వాషింగ్ మెషిన్స్, ఫ్రిడ్జ్(పెద్దగా పాడయ్యే సామాన్లు లేనప్పుడు)లతో పాటు డ్రైయర్స్, మిక్సర్లు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, టేబుల్ ఫ్యాన్లు, బ్లూటూత్ స్పీకర్లు ఆఫ్ చేయడం ముఖ్యంగా అన్ఫ్లగ్ చేయడం మంచిది. వర్క్ ఫ్రమ్ హోంలో చాలామంది ల్యాప్టాప్లను సిచ్ఛాఫ్ చేసినా అన్ఫ్లగ్ చేయరు. అడిగితే చాలామంది టైం ఉండదంటూ సాకులు చెప్తుంటారు. లేదంటే పరధ్యానంలో మరిచిపోతుంటారు. ఇంకొందరు ఓస్ అంతే కదా అని బద్ధకిస్తుంటారు. కానీ, పవర్సేవింగ్ను ఒక బాధ్యతగా గుర్తిస్తే.. కరెంట్ను ఆదా చేయడం, అప్లయన్సెస్ను పాడవకుండా కాపాడుకోవడంతో పాటు ఖర్చుల్ని తగ్గించుకున్నవాళ్లు అవుతారు. -సాక్షి, వెబ్డెస్క్ -
ఇదొక్కటి ఉంటే చాలు, 80 వేల ఇళ్లకు కరెంట్ సప్లయ్ చేసుకోవచ్చు
ఫొటోలో కనిపిస్తున్నది కొత్త తరహా ఓడ కాదు, ఓ గాలిమర. పైగా ఇది నీటిలో తేలుతుంది. సాధారణంగా గాలిమరలను ఎల్తైన ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు. అక్కడ గాలి బాగా వీస్తుంది కాబట్టి. అయితే ఎత్తయిన ప్రాంతాల కంటే సముద్రాల మీదే గాలి బాగా వీస్తుంది. మరి ఆ గాలిని ఇప్పటి వరకు ఉపయోగించుకోకపోవడానికి కారణం.. అక్కడ వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతుండడమే. పైగా అక్కడ వీచే పెనుగాలులకు గాలిమర ఫ్యాను రెక్కలు, దానికి ఆధారంగా ఉండే స్తంభం విరిగిపోతాయి. అందుకే నార్వేకు చెందిన ఓ కంపెనీ డబ్ల్యూసీఎస్ (విండ్ క్యాచింగ్ సిస్టం) టెక్నాలజీ ఉపయోగించి దీనిని రూపొందించింది. చతురస్రాకారంలో ఉండే ఈ నిర్మాణం వెయ్యి అడుగుల ఎత్తు ఉంటుంది. ఇందులో వందల సంఖ్యలో చిన్న చిన్న ఫ్యాన్లు అమర్చి, డివైడ్ అండ్ రూల్ పద్ధతిని అమలు చేశారు. వీటికి ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు. కానీ అవి ఉత్పత్తి చేసే విద్యుత్ మాత్రం ఒకే చోట నిల్వ అవుతుంది. దీనివల్ల ఏదైనా ఒక ఫ్యాను పనిచేయక పోయినా, ఇతర ఫ్యాన్లు ఉత్పత్తి చేసే విద్యుత్ ఉపయోగించుకునే వీలుంటుంది. సముద్రంలో ఏర్పాటు చేసిన ఈ గాలిమర ఒకేసారి సుమారు 80 వేల ఇళ్లకు కావల్సిన విద్యుత్ను సరఫరా చేయగలదు. ఇది నేల మీద ఉండే 25 గాలిమరల సామర్థ్యానికి సమానం. వీటి మన్నికా ఎక్కువే. సాధారణ గాలిమర మన్నిక 30 సంవత్సరాలు ఉంటే, సముద్రంలోని ఈ గాలిమర 50 సంవత్సరాల వరకు నిరంతరాయంగా పని చేయగలుగుతుంది. త్వరలోనే ఇలాంటి మరిన్ని గాలిమరలను సముద్రంలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది డబ్ల్యూసీఎస్ కంపెనీ. -
వైరల్: అరెరే.. పాక్కుంటూ వెళ్లినా, అడ్డంగా బుక్కయ్యావ్ కదా!
కొంతమంది పవర్ బిల్ కట్టకుండా ఎగ్గొట్టేందుకు నానా వేషాలు వేస్తుంటారు. అధికారులకు తెలియకుండా పోల్ నుంచి దొంగతనంగా వైర్లను ఏర్పరుచుకొని కరెంట్ వినియోస్తుంటారు. చదువుకోని వారు, అవగాహన లేని వాళ్లే ఇలాంటి దొంగ పనులు చేస్తారనుకుంటే పొరపాటే. చదువుకున్నవారు సైతం తెలివిగా కరెంట్ దొంగతనాలు చేయడానికి అలవాటుపడుతున్నారు. ఉత్తర ప్రదేశ్లోని ఘజియాబాద్కు చెందిన ఓ వ్యక్తి అచ్చం ఇలాగే విద్యుత్ చౌర్యానికి అలవాటుపడి మూడో కంటికి తెలియకుండా కరెంట్ వాడుకునేవాడు. రోజంతా అక్రమంగా విద్యుత్ వినియోగించుకుంటూ అధికారులు పర్యవేక్షించడానికి వచ్చినప్పుడు మాత్రం వెంటనే కరెంట్ వైర్లను కట్ చేసి తమకు ఏం తెలియదన్నట్లు నటించేవాడు. అయితే విద్యుత్ దొంగతనం జరుగుతుందని ఫిర్యాదు అందడంతో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఈ విషయంపై విచారించడానికి అక్కడికి వెళ్లారు. అధికారుల రాకను గమనించిన వ్యక్తి వెంటనే బాల్కనీపైకి మెల్లగా పాకుతూ వెళ్లి అక్కడున్న లింక్వైర్ను కట్ చేయబోయాడు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ నెలకొంది. టెర్రస్ మీద ఉన్న మెట్లపై ఇటుక రాళ్లతో కప్పి ఉన్న జాయింట్ వైర్లు కట్ చేస్తున్న క్రమంలో అప్పటికే ఓ అధికారి టెర్రస్ మీదకు వెళ్లి ఇదంతా వీడియో తీస్తున్నాడు. వ్యక్తిని గమనిస్తూ వీడియో తీస్తున్న ఎలక్ట్రిసిటీ అధికారి ‘బ్రదర్.. నేనిక్కడే నిల్చొన్నా’ అంటూ బదులిచ్చాడు. ఆ మాట విని అయ్యో దొరికిపోయానా అనే రేంజ్లో కరెంట్ దొంగ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. ఇక దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్లో షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా యూపీలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా నమోదవుతుండటంతో వీటి కోసం పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ग़ाज़ियाबाद में जब एक कटियाबाज़ के यहां बिजली विभाग का छापा पड़ा तो वो रेंगते हुए अपना अवैध कनेक्शन काटने गया,जिससे उसे कोई देख न पाए,लेकिन बिजली विभाग एक कर्मचारी उससे 2 कदम आगे निकला,वो पहले ही बगल वाले कि छत से वीडियो बना रहा था,फिर क्या हुआ देखिये pic.twitter.com/3Gs5rDIneD — Mukesh singh sengar मुकेश सिंह सेंगर (@mukeshmukeshs) July 13, 2021 -
శ్రీవారి సన్నిధిలో భారీగా ఇంధన పొదుపు
సాక్షి, అమరావతి: టీటీడీలోని విద్యుత్ సరఫరాలో విప్లవాత్మక మార్పులు తేబోతున్నారు. సమర్థమైన విద్యుత్ పరికరాలతో ఇంధన పొదుపు చేపట్టబోతున్నారు. టీటీడీ, అనుబంధ ఆలయాలు, ధర్మసత్రాల్లో సమగ్ర ఇంధన ఆడిట్ నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి కేంద్ర సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) సాంకేతిక, ఆర్థిక తోడ్పాటు అందిస్తుందని రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ సీఈవో చంద్రశేఖర్రెడ్డి ఆదివారం చెప్పారు. బీఈఈ నేతృత్వంలో సోమవారం నుంచి టీటీడీలో నీటి పంపుల పనితీరుపై ఆడిట్ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఉపకరణాలన్నీ మారతాయి టీటీడీ పరిధిలో 399 పంపుసెట్లున్నాయి. వీటి సామర్థ్యం 3,500 హెచ్పీ. వీటి స్థానంలో ఇంధన సామర్థ్యం గల పంపుసెట్లు అమరిస్తే ఏటా దాదాపు 1.14 మిలియన్ యూనిట్లు (20 శాతం) ఆదా చేయవచ్చని ప్రాథమిక పరిశీలనలో వెల్లడైందని రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ తెలిపింది. ఇప్పుడున్న 38,000 ఫ్యాన్ల స్థానంలో రూ.9.5 కోట్ల పెట్టుబడితో సూపర్ ఎఫిషియంట్ ఫ్యాన్లను అమర్చబోతున్నారు. దీనివల్ల ఏటా 5.02 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుందని అంచనా వేశారు. ఇలా చేస్తే రూ.4.5 కోట్లు పొదుపు చేయవచ్చని గుర్తించారు. దేవస్థానం పరిధిలో 1,608 ఏసీలనూ మారుస్తున్నారు. రూ.8.4 కోట్ల ఖర్చుతో 5 స్టార్ ఏసీలను అమర్చబోతున్నారు. దీంతో ఏటా రూ.1.85 కోట్ల విలువైన 3.09 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుందని భావిస్తున్నారు. 30 శాతం పవన, సౌర విద్యుత్ టీటీడీ ఏటా 68 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ వినియోగిస్తోంది. ఇందులో 30 శాతం సౌర, పవన విద్యుత్ ఉంటోంది. మిగతా 70 శాతం (435 లక్షల యూనిట్లు) దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ నుంచి తీసుకుంటోంది. టీటీడీకి 7.5 మెగావాట్ల సామర్థ్యం గల పవన విద్యుత్ కేంద్రం, 10 మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రం ఉన్నాయి. ఏటా రూ.కోట్ల విలువైన కోటి యూనిట్ల పవన విద్యుత్, రూ.3 కోట్ల విలువైన 1.45 కోట్ల యూనిట్ల సౌర విద్యుత్ను టీటీడీ ఉత్పత్తి చేసుకుని వాడుకుంటోంది. దేవస్థానం పరిధిలోని కళాశాలల భవనాలపై రూప్టాప్ ద్వారా సౌర విద్యుత్ అందుతోంది. -
శ్రీశైలం జల విద్యుత్ ఉత్పత్తిని ఎవరూ ఆపలేరు: జగదీశ్రెడ్డి
సూర్యాపేట: శ్రీశైలం జల విద్యుత్ ఉత్పత్తి ఆపడం ఎవరి తరం కాదని, నీళ్లు ఉన్నంత కాలం జల విద్యుత్ ఉత్పత్తి చేసి తీరుతామని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి స్పష్టం చేశారు. శ్రీశైలం జల విద్యుత్ ఉత్పత్తిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన తీర్మానంపై జగదీశ్రెడ్డి సూర్యాపేట జిల్లా కేంద్రంలో బుధవారం ఏర్పాటుచేసిన పట్టణ ప్రగతి అవగాహన కార్యక్రమంలో తీవ్రంగా స్పందించారు. ‘తెలంగాణ ప్రభుత్వం ఏమి చేయాలన్నది ఏపీ ప్రభుత్వం తీర్మానిస్తే అమలుపరిచేంత అమాయకులు ఇక్కడ ఎవరూ లేరు. విద్యుత్ ఉత్పత్తి మా హక్కు. దీన్ని ఆపమనే హక్కు ఏ కమిటీకి, కమిషన్లకు లేదు. తెలంగాణ రాష్ట్ర హక్కులు ఏమిటో.. కృష్ణా నదిలో మా వాటాలో ప్రతి నీటి చుక్కను ఎలా వాడుకోవాలో ముఖ్యమంత్రి కేసీఆర్కు బాగా తెలుసు’ అని అన్నారు. రైతులు ఎక్కడైనా రైతులేనని, సముద్రం పాలయ్యే నీళ్లను ఈ పద్ధతిలో వాడుకోండి అంటూ కేసీఆర్ విజ్ఞతతో చెబితే ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా పోతోందని జగదీశ్రెడ్డి మండిపడ్డారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ముమ్మాటికీ అక్రమమేనని, దుర్మార్గంగా పోతిరెడ్డిపాడును వెడల్పు చేసే ప్రయ త్నంలో నిజం లేదా అని ఏపీ సర్కార్ను ప్రశ్నించారు. రాజకీయ చతురత తోటే కేసీఆర్ మహా రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపారు. నాలుగు దశాబ్దాలుగా కాని పరిష్కారాన్ని కేసీఆర్ స్వల్ప వ్యవధిలో తేల్చిపడేశారని, తద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం సులభతరమైందని చెప్పారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ మొట్టమొదటి కేబినెట్ సమావేశంలోనే ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చి ఇక్కడ స్థిరపడిన వారిని అతిథులుగా చూసుకోవాలని చెప్పారన్నారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై .వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ, వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, కమిషనర్ రామానుజులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆర్డీఎస్ కుడి కాల్వ పనులు ఆపించండి.. కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కొనసాగి స్తున్న ఆర్డీఎస్ కుడి కాల్వ పనులను తక్షణమే ఆపించేలా చర్యలు తీసుకోవాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డును తెలంగాణ కోరింది. ఇప్పటికే ఆర్డీఎస్ కింద తెలంగాణకున్న వాటాలో యాభై శాతం దక్కడం లేదని, ఈ పరిస్థితుల్లో ఏపీ చేపడుతున్న ప్రాజెక్టులపై చర్యలు తీసుకొని కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కును కాపాడాలని విన్నవించింది. ఈ మేరకు బుధవారం బోర్డుకు తెలంగాణ ఇరిగేషన్ శాఖ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. లేఖతో పాటు ఆర్డీఎస్ కుడికాల్వ పనులకు సంబంధించిన ఫొటోలను జత చేశారు. బోర్డు ఆదేశాలను ధిక్కరిస్తూ ఆర్డీఎస్ కుడి కాల్వ పనులను ఏపీ కొనసాగిస్తోందని లేఖలో ఫిర్యాదు చేశారు. ఏపీ చేపడుతున్న ఆ పనులను జూన్ 19న జరిగిన కేబినెట్ సమావేశం తీవ్రంగా తప్పుపట్టిందని, రాష్ట్ర పునర్ విభజన చట్టానికి వ్యతిరేకంగా ఏపీ చేపడుతున్న నిర్మాణ పనులను ఆక్షేపించిందని తెలిపారు. కృష్ణా జల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్-2 అవార్డు అమల్లోకి రాకుండానే చేపడుతున్న ఈ పనులను ఆపేలా బోర్డు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుబట్టిందని గుర్తు చేశారు. -
కరెంట్కు కరోనా షాక్!
సాక్షి, హైదరాబాద్: కరోనా కేవలం ఆరోగ్య రంగంపైనే కాదు.. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్)పైనా ప్రభావం చూపింది. కోవిడ్ కారణంగా గత రెండేళ్ల నుంచి అనేక పరిశ్రమలు, హోటళ్లు, సినిమాహాళ్లు, ఐటీ అనుబంధ సంస్థలు, విద్యా సంస్థలు, హాస్టళ్లు మూతపడ్డాయి. విదేశాలకు ఎగుమతి, దిగుమతులు నిలిచిపోవడంతో ఉన్నవి కూడా ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించాయి. పరిశ్రమలో పది యూనిట్లు ఉంటే.. అయిదు యూనిట్లతో సరిపెట్టుకున్నాయి. ఫలితంగా గత ఏడాదితో పోలిస్తే ఈసారి విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గింది. 2019 మే నెల సగటు విద్యుత్ వినియోగం 70 ఎంయూ ఉండగా, 2020లో ఇది 60 ఎంయూకు తగ్గింది. తాజాగా ఈ ఏడాది ఏప్రిల్, మే నెలలో రోజు సగటు కరెంట్ వినియోగం 55 ఎంయూకి పడిపోయింది. ఫలితంగా సంస్థ నెలకు సగటున రూ.25 నుంచి రూ.30 కోట్ల చొప్పున అదనపు రెవెన్యూను కోల్పోవాల్సి వచ్చింది. ఈ రెండు వేసవి కాలాల్లో డిస్కం రూ.400 కోట్ల వరకు నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. కనెక్షన్లు పెరిగినా.. గ్రేటర్లో 50 లక్షలకుపైగా విద్యుత్ కనెక్షన్లు ఉండగా, వీటిలో ఏడు లక్షల వాణిజ్య కనెక్షన్లు, 50 వేల పారిశ్రామిక కనెక్షన్లు ఉన్నాయి. 45 లక్షలకుపైగా గృహ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. నగరంలో నెలకు కొత్తగా రెండు వేల గృహ విద్యుత్ కనెక్షన్లు వచ్చి చేరుతుంటాయి. గృహ వినియోగదారుల కన్నా.. వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులే సంస్థకు కీలకం. గృహ విద్యుత్ చార్జీలతో పోలిస్తే.. వాణిజ్య సంస్థలు వాడే కరెంట్ యూనిట్ చార్జీ ఎక్కువ. లాక్ డౌన్ కారణంగా ఐటీ అనుబంధ కంపెనీలు సహా సినిమా హాళ్లు, హోటళ్లు, ఇతర వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. ఎగుమతి దిగుమతులు నిలిచి పోవడంతో చిన్న, మధ్యతరహా, భారీ పరిశ్రమలు ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా తగ్గించుకున్నాయి. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశం ఇవ్వడంతో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లోనూ ఏసీలు, ఫ్యాన్లు, కూలర్లు పని చేయకపోవడంతో విద్యుత్ వినియోగం తగ్గిపోయింది. వినియోగదారుల నుంచి రావాల్సిన రెవెన్యూ తగ్గిపోయి సంస్థ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. అంచనాలు తలకిందులు సాధారణంగా వర్షాకాలం, శీతాకాలంతో పోలిస్తే వేసవిలో విద్యుత్ వినియోగం ఎక్కువగా నమోదవుతుంది. గృహాల్లోనే కాకుండా వాణిజ్య సంస్థల్లోనూ ఏసీల వినియోగం పెరిగి కరెంట్ ఎక్కువ వినియోగం అవుతుంది. జులై నుంచి ఫిబ్రవరి వరకు నెలకు 150 నుంచి 200 యూనిట్లు వాడే సగటు వినియోగదారులు మార్చి నుంచి జూన్ చివరి వరకు 300 నుంచి 350 యూనిట్ల వరకు ఖర్చు చేస్తుంటారు. ఈ మేరకు డిస్కం ఈ వేసవిలోనూ భారీగా కరెంట్ వినియోగం జరుగుతుందని అంచనా వేసింది. రోజు సగటు వినియోగం 75 ఎంయూలకు చేరుకుంటుందని భావించింది. సెకండ్వేవ్ ఉద్ధృతి కారణంగా ప్రభుత్వం ఈ వేసవిలోనూ లాక్డౌన్ ప్రకటించింది. 2020 మే నెలలో రోజు సగటు వినియోగం 60 ఎంయూలు ఉండగా, 2021 మేలో 55 ఎంయూలే నమోదైంది. లాక్డౌన్ కారణంగా గృహ వినియోగం పెరిగినప్పటికీ.. వాణిజ్య వినియోగం తగ్గడంతో సంస్థకు నష్టాలు తప్పలేదు. వినియోగం తగ్గింది.. ఈ వేసవిలో రోజు సగటు వినియోగం 75 ఎంయులకు చేరుకుంటుందని అంచనా వేశాం. కానీ లాక్డౌన్కు తోడు గత ఏడాదితో పోలిస్తే.. ఈ ఏడాది ఎండ తీవ్రత కూడా తక్కువగా ఉంది. ఉక్కపోత అధికంగా లేకపోవడంతో వినియోగదారులు ఏసీల వినియోగాన్ని తగ్గించడంతో ఆదాయం రాలేదు. – శ్రీనివాసరెడ్డి, డైరెక్టర్, ఆపరేషన్స్, టీఎస్ఎస్పీడీసీఎల్ మినిమం చార్జీ చెల్లిస్తున్నాం కోవిడ్ కారణంగా గత ఏడాది మార్చిలో థియేటర్లు మూతపడ్డాయి. ప్రదర్శనలున్నప్పుడు నెలకు సగటున రూ.60 వేలు కరెంట్ బిల్లు చెల్లించేవాళ్లం. ప్రస్తుతం సినిమాలు లేకపోవడంతో నెలకు మినిమం చార్జీ కింద రూ.30 వేల వరకు చెల్లిస్తున్నాం. – శ్రీనివాసరెడ్డి, మేనేజర్, సుదర్శన్ థియేటర్, ఆర్టీసీ క్రాస్రోడ్స్ -
పేదలపై భారం మోపలేం..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి ప్రజలపై విద్యుత్ భారం వేసేందుకు తాము ఎంతమాత్రం సిద్ధంగా లేమని కేంద్రానికి ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. రైతుకు శాశ్వత ఉచిత విద్యుత్ను అందించడం బాధ్యతగా భావిస్తున్నామని తెలిపింది. విద్యుత్ ఉద్యోగుల భద్రతకు నష్టం కలిగేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోమని పేర్కొంది. విద్యుత్ సంస్కరణలపై రాష్ట్రాలతో కేంద్ర ఇంధన శాఖ మంత్రి ఆర్కే సింగ్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. చట్ట సవరణకు సంబంధించి రాష్ట్రాల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి రాష్ట్ర వాదనను కేంద్రం దృష్టికి తీసుకెళ్ళారు. విద్యుత్ సంస్కరణల దిశగా అడుగేసిన కేంద్ర ప్రభుత్వం గత ఏడాదే ముసాయిదా ప్రతిని రాష్ట్రాలకు పంపింది. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఏపీ ప్రభుత్వం దీనిపై కొన్ని అభ్యంతరాలు లేవనెత్తింది. దీంతో ముసాయిదాలో మార్పులు చేసిన కేంద్రం రాష్ట్రాలతో సంప్రదింపులు చేపట్టింది. ఉచిత విద్యుత్ అందాల్సిందే: ‘పేదల గృహ విద్యుత్కు రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం భారీగా సబ్సిడీ ఇస్తోంది. ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా పేదలకు యూనిట్ రూ.1.45కే (50 యూనిట్లలోపు) ఇస్తోంది. పేద, మధ్యతరగతి వర్గాలకు ప్రభుత్వం గత ఏడాది రూ.1,700 కోట్లు సబ్సిడీగా ఇచ్చింది. రాష్ట్రంలో ప్రస్తుతం 18 లక్షల విద్యుత్ కనెక్షన్లున్నాయి. 9 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు డిస్కమ్లకు ప్రభుత్వం రూ.9 వేల కోట్ల వరకు సబ్సిడీ ఇస్తోంది. మరోవైపు రైతు కోరినన్ని కనెక్షన్లు ఇవ్వాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. సబ్సిడీ విషయంలోనూ వెనకాడబోం. రైతుల కోసమే 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తిని ప్రభుత్వం ప్రారంభించింది. వారికి ఉచిత విద్యుత్ అందాల్సిందే..’ అని రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి తెలిపారు. కేంద్రం విద్యుత్ సంస్కరణలు చేపడితే. వ్యవసాయ విద్యుత్ లైన్లు ఎవరు వేయాలి? ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే ఎవరు కొత్తవి బిగించాలి? అనే అంశాలను ఆయన ప్రస్తావించారు. ఈ విషయాల్లో తమ ప్రభుత్వం ఏమాత్రం రాజీపడబోదని, కచ్చితమైన విధివిధానాలు ఉండాల్సిన అవసరం ఉందని, రైతు ప్రయోజనాలు కాపాడాలని కోరారు. మా ఉద్యోగులకు కష్టం రావొద్దు కేంద్రం ఏ సంస్కరణలు చేపట్టినా రాష్ట్ర విద్యుత్ ఉద్యోగులకు పూర్తి భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని, రాష్ట్ర విద్యుత్ రంగం బలోపేతం దిశగా వారు ప్రభుత్వంతో మమేకమై పని చేశారని శ్రీకాంత్ నాగులాపల్లి తెలిపారు. పవన, సౌర విద్యుత్ను జాతీయ స్థాయిలో లెక్కించి, రాష్ట్రం వాటా కేటాయిస్తే బాగుంటుందని సూచించగా కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. పోటీ ఆపరేటర్లు వచ్చినా డిస్కమ్లు యథాతథంగా పనిచేస్తాయని చెప్పారు. డిస్కమ్ల లైన్లనే ప్రైవేటు ఆపరేటర్లు వాడుకుంటారని, ఉద్యోగులకు ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. విద్యుత్ చౌర్యం, మీటర్ల బిగింపు, రీడింగ్తో పాటు అనేక అంశాలపై చర్చ జరిగింది. కాగా దక్షిణాది ప్రాంతంలో వివాదాల పరిష్కార ట్రిబ్యునల్ ఏర్పాటును కేంద్రం దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్ళింది. చదవండి: అభిమానికి సీఎం జగన్ ఆత్మీయ ఆలింగనం చంద్రబాబుకు భారీ షాక్: కుప్పంలో టీడీపీ ఢమాల్ -
విద్యుత్ సంస్కరణలు: రెండో రాష్ట్రంగా ఏపీ
సాక్షి, న్యూఢిల్లీ: నిర్దేశిత మూడు విద్యుత్ సంస్కరణలు అమలు చేసి, మధ్యప్రదేశ్ తర్వాత విద్యుత్ రంగంలో సంస్కరణలు అమలు చేసిన రెండో రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. తద్వారా జీఎస్డీపీలో 0.15 శాతం మేర.. అంటే రూ.1,515 కోట్ల మేర అదనపు రుణాలు స్వీకరించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ అనుమతి పొందింది. కోవిడ్ మహమ్మారి ఆర్థిక వ్యవస్థపై చూపిన ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు వీలుగా జీఎస్డీపీలో 2 శాతం అదనంగా రుణాలు తీసుకునేందుకు పరిమితిని పెంచింది. అయితే ఇందులో 1 శాతానికి షరతులు విధించింది. పౌర కేంద్రీకృత సంస్కరణలు అమలు చేస్తే ఈ 1 శాతం రుణ పరిమితినీ వాడుకోవచ్చని పేర్కొంది. (చదవండి: టీడీపీ దౌర్జన్యం.. కర్రలతో దాడి..) రేషన్ కార్డు దేశంలో ఎక్కడైనా వినియోగించుకునేలా వ్యవస్థను రూపొందించడం, సులభతర వాణిజ్య సంస్కరణలు, పట్టణ స్థానిక సంస్థల సంస్కరణలు, విద్యుత్ సంస్కరణల్లో ఒక్కో సంస్కరణ అమలు చేస్తే జీఎస్డీపీలో 0.25 శాతం మేర అదనపు రుణాలు తీసుకునేందుకు రాష్ట్రాలకు వీలు కలుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే మూడు సంస్కరణలు అమలు చేసి తాజాగా విద్యుత్ సంస్కరణల అమలు పూర్తి చేసింది. (చదవండి: అపహాస్యం: మాజీ మంత్రి సైతం పచ్చ కండువాతోనే..) విద్యుత్ సంస్కరణలు మూడింటిలో ఒకటైన విద్యుత్ సబ్సిడీల ప్రత్యక్ష నగదు బదిలీని 2020 డిసెంబర్ 31లోపు ఒక్క జిల్లాలోనైనా పూర్తి చేస్తే జీఎస్డీపీలో 0.15 శాతం మేర అదనపు రుణాలకు అర్హత లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సంస్కరణను అమలు చేసింది. 2020 సెప్టెంబర్ నుంచి విద్యుత్ రాయితీలను ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా ఇస్తూ శ్రీకాకుళం జిల్లా నుంచి శ్రీకారం చుట్టింది. ఏప్రిల్ 1 కల్లా అన్ని జిల్లాల్లో ఇలాగే అమలు చేయనుంది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ అమలు చేసిన సంస్కరణల కారణంగా రూ.9,190 కోట్ల మేర అదనపు రుణాలకు అర్హత లభించింది. -
ఫైర్ పవర్ తగినంత ఉంది : శక్తికాంత దాస్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలో ఆర్థిక పరిస్థితిని అదుపులో ఉంచేందుకు తగిన శక్తి సామర్థ్యాలు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వద్ద మెండుగా ఉన్నాయని, మొత్తంమీద భారత బ్యాంకింగ్ వ్యవస్థ ధృఢంగానే ఉందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం వెల్లడించారు. ఈ సంక్షోభం ముగిసిన అనంతరం ఆర్థిక స్థిరీకరణకోసం చాలా జాగ్రత్తగా, నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, సంబంధిత చర్యలను ఆర్బీఐ చేపట్టనుందని స్పష్టం చేశారు. అలాగే బ్యాంకులు తమ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలన్నారు. తద్వారా భవిష్యత్తులో కీలక వడ్డీరేటు కోత లుంటాయనే సంకేతాలందించారు. ఒక వెబ్నార్ సిరీస్ ఈవెంట్ ముఖ్య ప్రసంగంలో గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక వ్యవస్థ రక్షణ చర్యల్ని వెంటనే నిలిపివేయడం లేదని, పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని ఆయన హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆర్బీఐ చర్యల్నినిలిపివేసిందన్నఊహాగానాలకు అర్థం లేదన్నారు. సంబంధిత చర్యలపై ఆర్బీఐ దీర్ఘకాలిక ప్రయోజనాల రీత్యా రేట్లలో మార్పులు చేయాల్సి ఉంటుందన్నారు. కరోనా వ్యాప్తి ఎలా ఉండబోతోందనే దానిపై స్పష్టత రాగానే ద్రవ్యోల్బణం, అభివృద్ధికి సంబంధించిన గణాంకాలను ఆర్బీఐ విడుదల చేస్తుందని శక్తికాంత్ దాస్ పేర్కొన్నారు. రేట్ల కోత అయినా, లేదా ఇతర విధానపరమైన చర్యలయినా ఆర్బీఐ దగ్గర అస్త్రాలు ఇంకా మిగిలే ఉన్నాయంటూ భరోసా ఇచ్చారు. మహమ్మారి కట్టడి అనంతరం ఆర్థిక రంగం సాధారణ స్థితికి చేరుకునేందుకు జాగ్రత్తగా బాటలు వేయాల్సిన అవసరం ఉందని దాస్ ఉద్ఘాటించారు. ఏదేమైనా, ఈ చర్యలను త్వరలోనే ముగిస్తుందని ఏ కోణంలోనూ భావించరాదని ఆయన స్పష్టం చేశారు. అతిగా రక్షణాత్మక వైఖరి అవలంబించడం ద్వారా చివరికి బ్యాంకులకే నష్టం కలుగుతుందని ఆయన చెప్పారు. కరోనా ఒత్తిడిని ఎదుర్కొంటున్న రుణగ్రహీతలకు రిజల్యూషన్ ఫ్రేమ్వర్క్ మంచి ఉపశమనం ఇస్తుందని చెప్పారు. లాక్డౌన్ సందర్భంలోరుణాలపై తాత్కాలిక నిషేధం తాత్కాలిక పరిష్కారం మాత్రమేనన్నారు. ఈ సమయంలో బ్యాంకులు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయనేది స్పష్టం..కానీ, ఈ సవాళ్లకు ఎలా స్పందిస్తాయి, ఎలా ఎదుర్కొంటాయినేది కీలకమని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు మహమ్మారిపై కట్టడిలో కేంద్రం ప్రభుత్వం స్పందించిన తీరునున దాస్ ప్రశంసించారు. -
‘ఆ బిల్లుకు సీఎం కేసీఆర్ వ్యతిరేకం’
సాక్షి, హైదరాబాద్: కేంద్రం తీసుకొస్తున్న విద్యుత్ సవరణ బిల్లు తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపనుందని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇది చట్టరూపం దాల్చితే వ్యవసారంగం, ఎస్సీ,ఎస్టీ కుటుంబాలకు సబ్సిడీ విద్యుత్పై ప్రభావం పడుతుందన్నారు. విద్యుత్ రంగం మొత్తం ప్రైవేటీకరణ కాబోయే సూచనలు కనిపిస్తున్నాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ దీన్ని వ్యతిరేకించారని తెలిపారు. ఈ బిల్లుపై సీఎం పలు సమీక్షలు చేశారని, త్వరలోనే కేంద్రానికి లేఖ రాస్తారని వెల్లడించారు. అనంతరం రాష్ట్రం అభిప్రాయం చెప్పి..ఇతర రాష్ట్రాల అభిప్రాయాలు కూడా తెలుసుకుంటారని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. (రైళ్లను ఇప్పుడే నడపొద్దు: సీఎం కేసీఆర్) -
గాలిలోని తేమతో విద్యుత్తు!
గాల్లోని తేమను నీటిగా మార్చే యంత్రాల గురించి మీరు ఇప్పటికే చాలాసార్లు విని ఉంటారు. ఇవి మారుమూల ప్రాంతాల్లోనూ ఎడారుల్లోనూ ప్రజల దాహార్తిని తీర్చగల సామర్థ్యం ఉన్నవి. అయితే గాల్లోని ఈ తేమను నీటిగా కాకుండా విద్యుత్తుగా మార్చవచ్చునని అంటున్నారు మసాచూసెట్స్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. ఎయిర్ జెన్ అని పిలుస్తున్న ఈ కొత్త టెక్నాలజీలో నానోస్థాయి తీగలున్న పలుచటి పొరలాంటిది ఉంటుంది. మిల్లీమీటర్లో పదివేల వంతులు తక్కువ సైజుండే పొరకు ఇరువైపులా రెండు ఎలక్ట్రోడ్లు ఏర్పాటు చేస్తారు. ఒకవైపున ఉన్న ఎలక్ట్రోడ్ పొరలో కొంతభాగం మాత్రమే ఉంటే మిగిలినది గాల్లో ఉంటుంది. మరోవైపు జియోబ్యాక్టర్ బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే ప్రొటీన్లతో తయారైన నానో తీగలు విద్యుత్తు వాహకాలుగా పనిచేస్తాయి. ఈ యంత్రంలోకి గాలి ప్రవేశించినప్పుడు అందులోని తేమ, నానోతీగలపై ఉండే సూక్ష్మ రంధ్రాల కారణంగా రెండు ఎలక్ట్రోడ్ల మధ్య కరెంటు పుడుతుంది. శాస్త్రవేత్తలు తయారు చేసిన నమూనా పరికరం ద్వారా చిన్న చిన్న ఎలక్ట్రానిక్ పరికరాలను పనిచేయించవచ్చునని, సహారా వంటి ఎడారి ప్రాంతాల్లోనూ ఇది సాధ్యమని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డెరెక్ లవ్లీ తెలిపారు. తాజాగా తాము ఈ–కోలీ బ్యాక్టీరియా ద్వారా మరింత ఎక్కువ ప్రొటీన్ను ఉత్పత్తి చేయగలిగామని, దీనిద్వారా స్మార్ట్ఫోన్లలోని బ్యాటరీలకు ప్రత్యామ్నాయాన్ని తయారు చేయవచ్చునని అంచనా వేస్తున్నట్లు డెరెక్ తెలిపారు. అంతిమంగా భారీసైజున్న విద్యుదుత్పత్తి పరికరాలను తయారు చేయడం తమ లక్ష్యమన్నారు. -
మరో 1,500 మెగావాట్ల సౌర విద్యుత్
సాక్షి, అమరావతి: చౌక విద్యుత్ కొనుగోలు విషయంలో రాష్ట్ర విద్యుత్ సంస్థలు(డిస్కంలు) మరో ముందడుగు వేశాయి. యూనిట్ రూ.2.70కే సౌర విద్యుత్ను కొనుగోలు చేయబోతున్నాయి. ఈ ప్రతిపాదనలు తుది దశలో ఉన్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. కడప, అనంతపురం జిల్లాల్లో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎన్టీపీసీ సంయుక్త భాగస్వామ్యంతో సౌరశక్తి ప్లాంట్లను ఏర్పాటు చేశాయి. ఈ రెండింటి నుంచి 1,500 మెగావాట్ల కరెంటు కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. దీనిపై ఇటీవల విద్యుత్ సమన్వయ కమిటీ సమీక్షించింది. న్యాయపరమైన చిక్కులను పరిష్కరించుకుని, ఈ విద్యుత్ను తీసుకోవడం ఉపయోగకరమని కమిటీ నిర్ణయానికొచ్చింది. 2015లో టీడీపీ ప్రభుత్వ హయాంలో సోలార్ విద్యుత్ను యూనిట్ రూ.6.25 చొప్పున కొనుగోలు చేసేలా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. 2018 వరకూ అధిక రేట్లతోనే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు(పీపీఏ) జరిగాయి. దీనివల్ల విద్యుత్ సంస్థలపై ఆర్థిక భారం పడింది. అందువల్ల చౌకగా లభించే విద్యుత్కే ప్రాధాన్యం ఇవ్వాలని వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం సౌర విద్యుత్ ప్లాంట్ల నుంచి రోజుకు 1.2 మిలియన్ యూనిట్ల విద్యుత్ లభించే వీలుంది. యూనిట్ రూ.2.70 చొప్పున చూస్తే.. దీని ఖరీదు రూ.32 లక్షలు. 2015లోయూనిట్ ధర రూ.6.25 ప్రకారం చూస్తే రోజుకు రూ.75 లక్షలు అవుతుంది. అంటే రోజుకు రూ.43 లక్షలు ప్రభుత్వానికి ఆదా కానుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతోపాటు సోలార్ ప్యానళ్ల ధరలు తగ్గడం వల్ల సోలార్ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి వ్యయం భారీగా తగ్గుతున్నట్టు అధికారులు వివరించారు. -
అధికారంలోకి వస్తే రుణమాఫీ
న్యూఢిల్లీ/చండీగఢ్: హరియాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేదల, రైతుల రుణాలు మాఫీ చేస్తామని ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ కుమారి సెల్జా ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే హామీలను నెరవేరుస్తామని, ఎప్పుడు చేస్తామన్న విషయాన్ని వివరించే టైమ్లైన్ కూడా విడుదల చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ మేనిఫెస్టో పూర్తవుతోందని, త్వరలోనే విడుదల చేస్తామని వెల్లడించారు. తన్వార్ రాజీనామా గురించి మాట్లాడుతూ.. పార్టీ ఆయన్ను స్టార్ క్యాంపెయినర్గా ప్రకటిస్తే ఆయన రాజీనామా చేసి వెళ్లిపోయారన్నారు. తమకు వ్యక్తుల కంటే పార్టీనే ముఖ్యమని తెలిపారు. ఎన్నికల ఫలితాల తర్వాత హరియాణా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తామని తెలిపారు. మనం భారత్మాతా కీ జై అంటే వారు... కాంగ్రెస్ పార్టీ నేతలకు దేశం కంటే అధిష్టానమే ముఖ్యమని, అందుకే వారు సోనియా మాతాకీ జై అంటారని హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వ్యాఖ్యానించారు. గూర్గాన్కు చెందిన కాంగ్రెస్ నామినీ సోనియా గాంధీకీ జై అంటూ నినాదాలు చేసిన వీడియో బయటకు రావడంతో ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే బీజేపీకి దేశం ప్రాధాన్యమని అందుకే తాము భారత్ మాతాకీ జై అంటామని పేర్కొన్నారు. ప్రధాని మోదీ ప్రస్తుతం ప్రపంచ నేతగా ఎదిగారని ఆయన తెలిపారు. -
పవర్ పరిష్కారం.!
ఏళ్ల తరబడి వేధిస్తున్న విద్యుత్ సమస్యలకు పరిష్కారం లభించనుంది. నిత్యం గ్రామాల నుంచి పట్టణాల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, ఇతర సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారు. ఈ సమస్యలకు ప్రభుత్వం చెక్ చెప్పనుంది. జిల్లా వ్యాప్తంగా ఇటీవల ‘పవర్ వీక్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందు లో ప్రజల నుంచి సమస్యల వివరాల ను సేకరించారు. దీనికి అనుగుణం గా 60 రోజుల ప్రణాళిక రూపొందించారు. సాక్షి, పెద్దశంకరంపేట(మెదక్) : విద్యుత్ సమస్యలను ప్రజల భాగస్వామ్యంతో గుర్తించి వాటిని క్షేత్రస్థాయిలో పరిష్కరించేందుకు ట్రాన్స్కో అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో విద్యుత్శాఖ అధికారులు ఈ నెల 19 నుంచి 26 వరకు పవర్ వీక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యుత్శాఖ అధికారులకు సమస్యల వివరాలను పూర్తిగా తెలుసుకొని సమస్యల పరిష్కారానికి ప్రణాళికలను రూపొందించాలని ఏఈలను, సిబ్బందిని ఆదేశించారు. గ్రామాలు, పట్టణాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడడంతో పాటు సబ్స్టేషన్ల మరమ్మతు, శిథిలావస్థలో ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించి కొత్త వాటిని ఏర్పాటు చేయడం. వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలోని సమస్యలను పూర్తిగా పరిష్కరించనున్నారు. వీటిపై పూర్తి వివరాలను నమోదు చేస్తున్నారు. ఇప్పటి వరకు 13,159 స్పాన్స్ (కొత్త స్తంభాల ఏర్పాటు)ను గుర్తించారు. ముందుగా గ్రామాలు, పట్టణాల్లో గృహ, వాణిజ్య అవసరాల తర్వాత వ్యవసాయానికి అందించే విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 17 అంశాలపై సమగ్ర సర్వేపవర్ వీక్లో భాగంగా విద్యుత్శాఖ అధికారులు ప్రధానంగా 17 సమస్యలపై సర్వే చేపట్టారు. ఇందులో 11 కేవీ, ఎల్టీ లూజ్ లైన్లు సరిచేయడం, శిథిలావస్థకు చేరిన, పాడైపోయిన, తుప్పుపట్టిన విద్యుత్ స్తంభాలను గుర్తించడం. పాడైన స్టే వైర్లు, స్టర్డ్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఎర్తింగ్, కాలిపోయిన, పాడైపోయిన విద్యుత్ కేబుల్స్ మార్చడం. ఏబి స్విచ్లను, హెచ్జీ స్విచ్లను బాగు చేయడం, రోడ్డు క్రాసింగ్పై వైర్ల ఎత్తు పెంచడం, అవసరమైన చోట నూతన ఎస్బీ స్విచ్లను ఏర్పాటు చేయడం. వీధి దీపాల పనులు, స్ట్రీట్ లైట్ల కోసం ప్రత్యేకంగా విద్యుత్మీటర్లు ఏర్పాటు చేయడం. ఎంసీబీల ఏర్పాటు, గ్రామాలలో పాడైపోయిన స్ట్రీట్లైట్ల మీటర్లు మార్చడంతో పాటు వీటికి అవసరమైన 3, 5వ వైర్లు లాగడం (దీని వల్ల పగలు విద్యుత్ బల్బ్లు వెలగకుండా ఉంటాయి) వంటి పనులు చేపడుతున్నారు. ప్రతీ సబ్స్టేషన్ను తనిఖీ చేయనున్న ప్రత్యేక బృందాలు ప్రభుత్వ ఆదేశాల మేరకు 60 రోజుల ప్రణాళికను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ప్రతీ సబ్స్టేషన్ను ప్రత్యేక బృందం తనిఖీలు చేస్తుంది. ఆయా సబ్స్టేషన్లలో లోపాలు గుర్తించడంతో పాటు పవర్ ట్రాన్స్ఫార్మర్లు, ఎర్తింగ్ ఆయిల్ లెవల్, బ్రేకర్, బ్యాటరీల పనితీరు, ట్రిప్పింగ్ కాయిల్స్, ఏబి స్విచ్లకు కావలసిన పరికరాలపై నివేదికలను రూపొందిచనున్నారు. ప్రజాప్రతినిధులు భాగస్వామ్యంతో విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాలు, పట్టణాల్లో ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయనున్నారు. వారితో కలిసి గ్రామాల్లో అవసరమైన ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్థంభాల ఏర్పాటు, వీధిలైట్లకు మీటర్లు ఏర్పాటు చేయనున్నారు. దీంతో విద్యుత్ సమస్యలను పూర్తిగా నివారించడమే కాకుండా నాణ్యమైన నిరంతర విద్యుత్ను అందించే వీలుంటుంది. 60 రోజుల్లో.. ‘పవర్వీక్’ కార్యక్రమంలో భాగంగా గ్రామాలు, పట్టణాల్లో గుర్తించిన సమస్యలకు 60 రోజుల్లోగా పరిష్కారం లభించనుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు గృహ, వాణిజ్య, వ్యవసాయానికి అందే విద్యుత్ సరఫరాలో ఎలాంటి లోపాలు లేకుండా, విద్యుత్ వృథా కాకుండా గ్రామాలు, పట్టణాల్లో 3,5వ లైన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రజాప్రతినిధులు, అధికారుల భాగస్వామ్యంతో విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – శ్రీనాథ్, ట్రాన్స్కో, ఎస్ఈ మెదక్ -
అంత డబ్బు మా దగ్గర్లేదు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, ప్రైవేటు విద్యుదుత్పత్తి కంపెనీల నుంచి విద్యుత్ కొనుగోళ్ల కోసం లెటర్ ఆఫ్ క్రెడిట్(ఎల్సీ) తప్పనిసరి చేస్తూ కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ గత నెల 28న జారీ చేసిన ఉత్తర్వులు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆగస్టులో రాష్ట్రానికి అవసరమైన విద్యుత్ కొనుగోళ్ల కోసం తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఆ మేర వ్యయాన్ని బ్యాంకు ఖాతాలో జమ చేసి ముందస్తుగా ఎల్సీ జారీ చేసేందుకు మరో రెండు రోజులే ఉన్నాయి. ఈ నెల 31లోగా డిస్కంలు ఎల్సీ జారీ చేస్తేనే ఆ మేర విద్యుత్ను కేంద్ర, ప్రైవేటు విద్యుదుత్పత్తి కంపెనీల నుంచి రాష్ట్రాలకు సరఫరా చేయాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తేల్చి చెప్పింది. ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న దక్షిణ/ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఎల్సీ జారీ చేసే సత్తా తమకు లేదని చేతులెత్తేశాయి. ఎన్టీపీసీ వంటి కేంద్ర విద్యుదుత్పత్తి కంపెనీలతోపాటు ప్రైవేటు జనరేటర్ల నుంచి విద్యుత్ కొనుగోళ్లకు ప్రతి నెలా రూ.1,089 కోట్లు అవసరమని తెలంగాణ ట్రాన్స్కో సీఎండీ డి.ప్రభాకర్రావు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రస్తుతం డిస్కంల వద్ద రూ.400 కోట్ల నిధులు మాత్రమే ఉన్నాయని, విద్యుత్ కొనుగోళ్లకు ముందస్తు ఎల్సీ జారీ చేసేందుకు రూ.1,000 కోట్లను కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై రాష్ట్ర ఆర్థిక శాఖ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆగస్టులో విద్యుత్ ఉద్యోగులకు జీతాల చెల్లింపుతో పాటు ఇతర ఖర్చులకు డిస్కంల వద్ద ఉన్న రూ.400 కోట్ల నిధులు ఆవిరైపోతాయని, ముందస్తుగా ఎల్సీ జారీ చేసే పరిస్థితి లేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఎల్సీ నిబంధన అమలును కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ వాయిదా వేయని పక్షంలో, నిరంతర విద్యుత్ సరఫరాను కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు అత్యవసరంగా నిధులు విడుదల చేయాల్సి ఉంటుందని ట్రాన్స్కో వర్గాలు పేర్కొంటున్నాయి. డిస్కంల వద్ద నిధులు లేనిపక్షంలో కనీసం వారం, పక్షం రోజులకు అవసరమైన విద్యుత్ కొనుగోళ్లకు అయినా ఎల్సీ జారీ చేయాల్సిందేనని కేంద్రం నిబంధన పెట్టింది. అదీ సాధ్యం కాని పక్షంలో ఏ రోజుకు ఆ రోజు అవసరమైన విద్యుత్ను కొనుగోలు చేసేందుకు ఒక రోజు ముందుగానే విద్యుత్ కంపెనీలకు ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ రూపంలో నిధులను బదిలీ చేయాలని చెప్పింది. ఈ విషయంలో విఫలమైన డిస్కంలకు విద్యుత్ సరఫరాను నిలిపివేయాలని ప్రాంతీయ లోడ్ డిస్పాచ్ సెంటర్లను ఆదేశించింది. మరో రెండు రోజుల్లోగా రాష్ట్ర డిస్కంలు ఎల్సీ జారీ చేయకపోయినా, కనీసం నగదు బదిలీ చేయకపోయినా రాష్ట్రంలో విద్యుత్ సరఫరా సమస్యలు తప్పవని ఆందోళన వ్యక్తమవుతోంది. నేడు దక్షిణాది రాష్ట్రాల భేటీ.. లెటర్ ఆఫ్ క్రెడిట్ నిబంధనలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న దక్షిణాది రాష్ట్రాల విద్యుత్ కమిటీ(ఎస్ఆర్పీసీ) సోమవారం బెంగళూరులో సమావేశమై తదుపరి కార్యాచరణ సిద్ధం చేయాలని నిర్ణయించింది. ఎల్సీ నిబంధనల అమలును వాయిదా వేయాలని మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని కోరే అవకాశాలున్నాయి. రాష్ట్రాల ప్రయోజనాలకు నష్టం కలిగించేలా ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరికాదని ఇప్పటికే తప్పుబడుతూ కేంద్రానికి లేఖ రాసింది. -
ఫీడర్లకూ ఎర్తింగ్ ముప్పు
సాక్షి, సిటీబ్యూరో: విద్యుత్ ఫీడర్లకు ఎర్తింగ్ ముప్పు తప్పడం లేదు. వినియోగదారుల గృహాల్లోనే కాదు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద కూడా సరైన ఎర్తింగ్ సిస్టం లేకపోవడంతో సబ్స్టేషన్లలోని ఫీడర్లు తరచూ ట్రిప్పవుతున్నాయి. నిజానికి లైన్ల పునరుద్ధరణ, నిర్వహణ కోసం దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఏటా రూ.వంద కోట్లకు పైగా ఖర్చు చేస్తుంది. ఈ పునరుద్ధరణ పనుల్లో భాగంగా లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించడం, పాడైన ఇన్సులేటర్లు, కండక్టర్లను తొలగించి, వాటి స్థానంలో కొత్తవి అమర్చడం, లూజు వైర్లను సరి చేయడం, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లలో ఆయిల్ లీకేజీలను అరికట్టడం, విద్యుత్ సరఫరాలో హె చ్చుతగ్గులకు కారణాలు గుర్తించి వాటిని సరి చేయడం వంటి పనులు చేయాల్సి ఉంది. కానీ గ్రేటర్ హైదరాబాద్లోని కోర్సిటీలో మినహా శివారు ప్రాంతాల్లోని సర్కిళ్ల పరిధిలో ఈ పనులను నిర్వహించకపోవడంతో ఫీడర్లలో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తి...విద్యుత్ సరఫరాలో అంతరాయానికి కారణమవుతోంది. ఇదిలా ఉంటే కొంత మంది ఇంజనీర్లు బినామీ కాంట్రాక్టర్లుగా అవతారం ఎత్తి పునరుద్ధరణ పనుల పేరుతో సంస్థ ఖజానాను కొల్లగొడుతుండటం విశేషం. నిర్వహణ లోపం.. తరచూ అంతరాయాలు: ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో 50 లక్షలకుపైగా విద్యుత్ కనెక్షన్లు ఉండగా, ప్రస్తుతం వీటిలో 42 లక్షల గృహ విద్యుత్ కనెక్షన్లు ఉండగా, 7 లక్షలకుపైగా వాణిజ్య కనెక్షన్లు ఉన్నాయి. మరో 50 వేలకుపైగా పారిశ్రామిక కనెక్షన్లు ఉన్నాయి. లక్షకుపైగా వీధి దీపాల కనెక్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో 33/11కేవీ సబ్స్టేష న్లు 306, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ 96882, పవర్ ట్రాన్స్ఫార్మర్స్ 802పైగా, 33కేవీ, 11కేవీ, ఎల్టీలైన్స్ 52142 కిమిపైగా ఉన్నాయి. రాజేంద్రనగర్, హబ్సి గూడ, సరూర్నగర్, సైబర్సిటీ, మేడ్చల్, సికింద్రాబాద్, బంజారాహిల్స్, హైదరాబాద్ సౌత్, హైదరాబాద్ సెంట్రల్ సర్కిళ్లు కొత్తగా ఏర్పడ్డాయి. శివారు ప్రాంతాలు శరవేగంగా విస్తరిస్తుండటం, కొత్త నిర్మాణాలు, పరిశ్రమలు వెలుస్తుండటం వల్ల విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. 2006లో నగరంలో 24.12 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా, 1538 మెగవాట్ల విద్యుత్ వినియోగం ఉండేది. 2019 మే 29న అత్యధికంగా 3391 మెగవాట్ల విద్యుత్ వినియోగం (73.84 ఎంయూ)జరగగా, ఆ తర్వాత రోజుకో ఎంయూ చొప్పున వినియోగం పెరిగిన విషయం తెలిసిందే. పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా కొత్త లైన్లు, డీటీఆర్లు, ఫీడర్లు, సబ్స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నప్పటికీ... వాటికి సరైన ఎర్తింగ్ సిష్టం ఏర్పాటు చేయక పోవడం, ఒక వేళ ఎర్తింగ్ సిష్టం ఏర్పాటు చేసిన ప్పటికీ..నిర్వహణ లోపం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయి. చంపాపేట డివిజన్లో తరచూ కోతలు: చంపాపేట డివిజన్ పరిధిలోని బైరమల్గూడ సెక్షన్ నందనవనం సబ్స్టేషన్లోని 11కేవీ ఫీడర్లు రోజకు కనీసం నాలుగైదు సార్లు ట్రిప్పవుతున్నాయి. ఎవరైనా వినియోగదారులు ఫిర్యాదు చేసినప్పుడు ఫీడర్ ఆన్ చేయడం, ఆ తర్వాత కొద్ది సేపటికే మళ్లీ ట్రిప్పవడం ఇక్కడ పరిపాటిగా మారింది. లోపభూయిష్టమైన లైన్ల పునరుద్ధరణ పనులే ఇందుకు కారణమని తెలిసింది. సరూర్నగర్ డివిజన్, వనస్థలిపురంలోనూ విద్యుత్ కోతలు తప్పడం లేదు. ఎప్పటికప్పుడు ఆయా ఏరియాలకు సంబధించిన లైన్మెన్లు, ఎఫ్ఓసీ సిబ్బందితో క్షేత్రస్థాయిలో పర్యటించి....లైన్ల పనితీరును స్వయంగా పర్యవేక్షించాల్సిన సంబంధిత ఇంజనీర్లు ఇవేవీ పట్టించుకోవడం లేదు. -
పట్టుకుంటే చాలు అవినీతి షాక్!
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిని వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ మంగళవారం విజయవాడ విద్యుత్ సౌధ కార్యాలయంలో భేటీ అయింది. దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్) మాజీ సీఎండీ పి.గోపాల్ రెడ్డి చైర్మన్గా ఏర్పాటైన కమిటీ తొలి సమావేశం రెండు గంటలపాటు సాగింది. 45 రోజుల వ్యవధిలో ప్రభుత్వం సూచించిన ప్రాజెక్టులను ఏ విధంగా పరిశీలించాలి? అవినీతి కోణాన్ని గుర్తించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కమిటీకి కావాల్సిన మౌలిక సదుపాయాలు, సమాచార సేకరణకు అవసరమైన ఏర్పాట్లు.. తదితర అంశాలపై సమావేశంలో చైర్మన్, సభ్యులు రామారావు (ట్రాన్స్కో గ్రిడ్ ఆపరేషన్స్ మాజీ డైరెక్టర్), ప్రొఫెసర్ ఉషా రామచంద్ర (అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్), రాజ్గోపాల్ రెడ్డి (ఆర్థిక నిపుణులు, ఏపీఈఆర్ మాజీ సభ్యుడు), సీహెచ్వీఎస్ సుబ్బారావు (ట్రాన్స్కో ప్లానింగ్ సీజీఎం) సమగ్రంగా చర్చించారు. ఎవరికి ఎంత అందిందో ఆరా.. ట్రాన్స్కోలో అవసరం లేకున్నా కమీషన్ల కోసమే విద్యుత్ ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. అప్పు చేసి మరీ అనుకూలమైన సంస్థలకు కాంట్రాక్టులు ఇచ్చారు. ఇందుకోసం నిబంధనలను ఇష్టానుసారం మార్చారు. కేవలం కొన్ని కంపెనీలు మాత్రమే అర్హత సంపాదించేలా జాగ్రత్త పడటంలో అప్పటి అధికారులు అన్ని విధాల టీడీపీ ప్రభుత్వానికి సహకరించారు. ఈ క్రమంలో కోట్లాది రూపాయలు చేతులు మారాయి. ఏపీ జెన్కోలో రెండు థర్మల్ ప్రాజెక్టుల ఈపీసీ కాంట్రాక్టులను దేశంలో ఎక్కడా లేని విధంగా కొన్ని సంస్థలకు కట్టబెట్టి, విద్యుత్ పంపిణీ సంస్థలను దండుకునే కేంద్రాలుగా గత ప్రభుత్వం మార్చేసింది.డెప్యూటేషన్పై ట్రాన్స్కోకు వచ్చిన ఓ అధికారి అవినీతిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. వీటిపై సమగ్రంగా విచారణ జరపాలని కమిటీ నిర్ణయించింది. విద్యుత్ శాఖలో కీలక పదవుల్లో ఉన్న ఇద్దరు అధికారుల అవినీతి, బినామీ వ్యవహారాలపై కీలక సమాచారం సేకరించినట్టు తెలిసింది. దీన్ని కూడా లోతుగా పరిశీలించే వీలుంది. అతి ముఖ్యమైన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, స్వల్పకాలిక, రోజువారీ విద్యుత్ కొనుగోళ్లలో ఎవరికి ఎన్ని ముడుపులు అందాయనేది ఆరా తీయబోతున్నారు. విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి ఏళ్ల తరబడి అదే విభాగంలో ఉన్న అధికారుల ఆస్తులపై కూడా వివరాలు అందినట్లు తెలిసింది. ప్రతి ప్రాజెక్టులోనూ మాజీ ముఖ్యమంత్రి, ఆయన తనయుడి ప్రమేయం ఉన్నట్టు తెలుస్తోంది. దీన్ని ఆధారాలతో వెలికితీయాలని కమిటీ నిర్ణయించింది. అవినీతిపైనే ప్రధాన దృష్టి.. గత ఐదేళ్లలో విద్యుత్ రంగం పూర్తిగా అవినీతి మయమైంది. ట్రాన్స్కో, జెన్కో ప్రాజెక్టుల విషయంలో భారీగా ముడుపులు చేతులు మారాయి. ఉన్నతాధికారుల దగ్గర్నుంచి, మాజీ ముఖ్యమంత్రి, ఆయన తనయుడికి భారీగా ముడుపులు అందాయనే విమర్శలొచ్చాయి. ఈ అవినీతి వ్యవహారాలను ఐదేళ్లుగా ‘సాక్షి’ ప్రత్యేక కథనాలతో వెలుగులోకి తెచ్చింది. బొగ్గు కొనుగోళ్లు, థర్మల్ ప్రాజెక్టుల కాంట్రాక్టులు, ట్రాన్స్కోలో కొంతమందికే అనుకూలంగా టెండర్ నిబంధనలు రూపొందించిన తీరును ఎప్పటికప్పుడు వెలికితీసింది. దీనిపై అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోనూ, బయట పెద్దఎత్తున పోరాడారు. తాము అధికారంలోకి రాగానే అవినీతిపై సమగ్ర దర్యాప్తు చేస్తామని, బాధ్యులైన వారిని శిక్షిస్తామని చెప్పారు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ కమిటీని ఏర్పాటు చేశారు. -
ఈ భవనానికి విద్యుత్తు తీగలుండవు!
బిల్డింగ్ చూశారుగా.. ఎలా ఉంది? అద్భుతంగా ఉంది అంటున్నారా? ఓకే. నెదర్లాండ్స్కు చెందిన ఆర్కిటెక్చర్ సంస్థ ఫండమెంటల్ ఆర్కిటెక్టస్ సిద్ధం చేశారు ఈ బిల్డింగ్ డిజైన్. చూసేందుకు ఓహో అనేలా ఉండటం ఒక్కటే దీని గొప్పదనం కాదు. ఇంకా చాలా ఉన్నాయి. అన్నింటికంటే ముందుగా చెప్పాల్సింది... ఓ నదిపై కట్టే ఈ బిల్డింగ్... ఆ నీటి నుంచే విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవడం!! అదెలా? అన్న ప్రశ్నకు సమాధానం తెలుసుకునేలోపు కజకిస్తాన్లోని ఆస్తానాలో ఏర్పాటు కానున్న ఈ బిల్డింగ్ వివరాలు కొన్ని తెలుసుకుందాం. ఈ భవనం ఎత్తు 396 అడుగులు కాగా.. మొత్తం ఎనిమిది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం ఉంటుంది. నివాస భవనాలతోపాటు హోటళ్లు, షాపుల్లాంటివీ ఉంటాయి. ద టవర్ ఆఫ్ సన్ పేరుతో డిజైన్ చేశారు దీని దిగువన ఉన్న నదిలోని నీటి ప్రవాహాన్ని అడ్డుకుని జనరేటర్ల ద్వారా విద్యుత్తు ఉత్పత్తి చేస్తారు. భవనం కింది భాగంలో నది వెడల్పు తక్కువగా ఉంటుందని మరింత తగ్గించడం ద్వారా ప్రవాహ వేగాన్ని పెంచి ఆ చలన శక్తిని విద్యుత్తుగా మార్చాలన్నది ఫండమెంటల్ ఆర్కిటెక్ట్స్ ప్రణాళిక. దీంతోపాటు భవనంలోని వేడిని బయటకు పంపేందుకు ఓ హీట్పంప్ను కూడా ఉపయోగిస్తామని, వేసవిలోనూ వేడెక్కకుండా ఉండేలా నైరుతి దిశగా నిర్మాణం ఉంటుందని సంస్థ తెలిపింది. కజకిస్థాన్కు చెందిన బీ1 గ్రూప్ నిర్వహించిన ఆర్కిటెక్చర్ పోటీలో ద టవర్ ఆఫ్ సన్ అందరి ప్రశంసలు అందుకుంది.