bills
-
త్వరలో రూ.400 కోట్లు విడుదల
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీల్లో అప్పులు చేసి అభివృద్ధి పనులు చేసిన అప్పటి సర్పంచులకు త్వరలోనే రూ.400 కోట్లు విడుదల చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. గత ప్రభుత్వం వారితో అభివృద్ధి పనులు చేయించి.. నిధులు విడుదల చేయకుండా వారిని రోడ్డుపై వదిలేసిందని మండిపడ్డారు. అందువల్ల పంచాయతీ బకాయిలపై బీఆర్ఎస్ నాయకులు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని హితవు పలికారు. రూ.10 లక్షలలోపు పెండింగ్లో ఉన్న ప్రజాప్రతినిధుల బిల్లులు దాదాపు రూ.400 కోట్లు ఉంటాయని అంచనా వేశామని, వాటిని త్వరలోనే విడుదల చేస్తామని మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో భట్టి చెప్పారు. సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వంటి ప్రజాప్రతినిధులు చేసిన అభివృద్ధి కార్యక్రమాల పెండింగ్ బిల్లులు గత సంవత్సరం డిసెంబర్ 7 నాటికి ఉన్న బకాయిలు రూ.1,300 కోట్లు అని వెల్లడించారు. సర్పంచులు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పడుతున్న ఇబ్బందులను సీఎం రేవంత్రెడ్డి, తాను గమనించి రూ.10 లక్షల లోపు ఉన్న బకాయిలను త్వరలోనే విడుదల చేయాలన్న నిర్ణయానికి వచి్చనట్లు చెప్పారు. ప్రజా ప్రతినిధుల ఇబ్బందులకు కారణమైన బీఆర్ఎస్ నేతలు పెండింగ్ బిల్లుల కోసం ధర్నాలు చేస్తామని ప్రకటించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. పంట పొలాల్లో సౌర విద్యుత్ ప్లాంట్లు ప్రధాన మంత్రి కిసాన్ ఊర్జా సురక్షా ఏవం ఉత్థాన్ మహాభియాన్ (పీఎం–కుసుమ్) పథకం కింద రాష్ట్రంలో రైతుల పంట పొలాల్లో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. 0.5– 2 మెగావాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్ ప్లాంట్లను ఎండిపోయిన, పాడుబడిన వ్యవసాయ భూముల్లో రైతులతో ఏర్పాటు చేయిస్తామన్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసే విద్యుత్కు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు యూనిట్కు రూ.3.13 చొప్పున ధర చెల్లిస్తాయన్నారు. రైతులు, రైతు బృందాలు, సహకార సొసైటీలు, పంచాయతీలు, రైతు సంఘాలు, నీటి వినియోగ సంఘాలు ఈ పథకం కింద అర్హులన్నారు. -
లోక్సభలో జమిలి బిల్లులు
కీలక ఎన్నికల వాగ్దానాన్ని నిలబెట్టుకునే దిశగా మోదీ ప్రభుత్వం ముందడుగు వేసింది. లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల శాసనసభలకూ ఏక కాలంలో ఎన్నికలు జరిపేందుకు ఉద్దేశించిన రెండు జమిలి బిల్లులను కేంద్రం మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టింది. దీన్ని రాజ్యాంగంపైనే దాడిగా విపక్షాలు అభివర్ణించాయి. మోదీ సర్కారుది ఫక్తు నియంతృత్వ ధోరణి అంటూ మండిపడ్డాయి.అధికార, విపక్షాల ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభలో యుద్ధ వాతావరణం నెలకొంది. చివరికి వ్యవహారం ఓటింగ్ దాకా వెళ్లింది. జమిలి బిల్లులపై జేపీసీలో కూలంకషంగా చర్చిద్దామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించినా విపక్షాలు శాంతించలేదు. రాజ్యాంగ సవరణ బిల్లుల ఆమోదానికి పార్లమెంటులో మూడింట రెండొంతుల మెజారిటీ లేదని తెలిసీ మోదీ సర్కారు విఫలయత్నం చేస్తోందని ఎద్దేవా చేశాయి.న్యూఢిల్లీ: జమిలి ఎన్నికలపై కేంద్రం మరో కీలక ముందడుగు వేసింది. లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల శాసనసభలకూ ఒకేసారి ఎన్నికలు జరిపేందుకు ఉద్దేశించిన రెండు బిల్లులను మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టింది. విపక్షాల ఆందోళనల మధ్యే కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్రాం మేఘ్వాల్ రాజ్యాంగ (129వ సవరణ) సవరణ బిల్లును సభ ముందుంచారు. ఇది ఫక్తు నియంతృత్వ చర్య అంటూ కాంగ్రెస్ తదితర విపక్షాలు దుయ్యబట్టాయి. వాటి అభ్యంతరాలను మంత్రి కొట్టిపారేశారు. రాష్ట్రాలు అనుభవిస్తున్న ఏ అధికారాలనూ ఈ బిల్లు తగ్గించబోదని స్పష్టం చేశారు.దాదాపు 90 నిమిషాల పాటు అధికార, ప్రతిపక్షాల నడుమ వాడివేడి చర్చ జరిగింది. కాంగ్రెస్తో పాటు డీఎంకే, తృణమూల్, సమాజ్వాదీ, ఎన్సీపీ (ఎస్పీ), శివసేన (యూబీటీ), మజ్లిస్ తదితర పార్టీలు బిల్లులను తీవ్రంగా వ్యతిరేకించాయి. వాటిపై ఓటింగ్కు పట్టుబట్టాయి. దాంతో ఎల్రక్టానిక్, పేపర్ స్లిప్ పద్ధతిన ఓటింగ్ జరిగింది. 269 మంది అనుకూలంగా ఓటేయడంతో బిల్లులను ప్రవేశపెట్టారు. దానికి వ్యతిరేకంగా ఏకంగా 198 మంది ఓటేయడం విశేషం. నూతన పార్లమెంటు భవనంలో ఎల్రక్టానిక్ ఓటింగ్ వ్యవస్థను ఉపయోగించడం ఇదే తొలిసారి. కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లును కూడా మంత్రి సభలో ప్రవేశపెట్టారు.పుదుచ్చేది, ఢిల్లీ, జమ్మూ కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికలను కూడా లోక్సభతో పాటే నిర్వహించేందుకు వీలు కల్పించడం దీని ఉద్దేశం. ప్రతిపాదిత బిల్లులు మౌలిక నిర్మాణ సూత్రానికి గొడ్డలిపెట్టన్న విపక్షాల ఆరోపణలు నిరాధారాలని మేఘ్వాల్ అన్నారు. రాజ్యాంగ సార్వభౌమత్వం, దాని సమాఖ్య–లౌకిక స్వభావాలు, కేంద్ర–రాష్ట్రాల మధ్య అధికారాల విభజన, న్యాయసమీక్ష వంటి కీలక సూత్రాలకు ఈ బిల్లుల ద్వారా అణుమాత్రం కూడా మార్పులు చేయబోవడం లేదని స్పష్టం చేశారు. విపక్షాల ఆరోపణలన్నీ రాజకీయ దురుద్దేశపూరితాలని విమర్శించారు.వాటిని విపక్ష సభ్యులు తీవ్రంగా ఖండించారు. బిల్లుపై తమ అభ్యంతరాలను వారంతా సభ ముందుంచారు. వాటిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. జమిలి బిల్లుపై ప్రతి దశలోనూ లోతైన చర్చ జరగాలన్నదే ప్రధాని నరేంద్ర మోదీ ఉద్దేశమని తెలిపారు. ‘‘జమిలి బిల్లులు కేంద్ర మంత్రివర్గం ముందుకు వచ్చినప్పుడు మోదీ అదే చెప్పారు. లోతైన చర్చ నిమిత్తం సంయుక్త పార్లమెంటరీ సంఘం పరిశీలనకు పంపాలని అభిప్రాయపడ్డారు’’ అని మంత్రి వెల్లడించారు. డీఎంకే సభ్యుడు టీఆర్ బాలు కూడా వాటిపై జేపీసీ పరిశీలన కోరారని గుర్తు చేశారు.‘‘రాజ్యాంగ (129వ సవరణ) బిల్లుపై జేపీసీలో విస్తృతంగా చర్చ చేపట్టవచ్చు. అనంతరం జేపీసీ ఇచ్చే నివేదికను కేంద్ర కేబినెట్ ఆమోదిస్తుంది. తదనంతరం బిల్లుపై పార్లమెంటులో మరోసారి మనమంతా చర్చించుకోవచ్చు’’ అని విపక్షాలకు సూచించారు. రెండు బిల్లులను జేపీసీకి నివేదిస్తూ సభలో తీర్మానం ప్రవేశపెడతానని మేఘ్వాల్ ప్రకటించారు. ఆ మేరకు బుధవారం తీర్మానం లోక్సభ ముందుకు వచ్చే అవకాశముంది. ఈ రాజ్యాంగ సవరణ బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు సాధారణ మెజారిటీ చాలు.కానీ అవి గట్టెక్కాలంటే ఉభయ సభల్లోనూ మూడింట రెండొంతుల మెజారిటీతో ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రస్తుతం రెండు సభల్లోనూ అంతటి మెజారిటీ లేదు. జమిలి ఎన్నికలపై ఏర్పాటైన మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ ముందు 32 పార్టీలు ప్రతిపాదనకు మద్దతివ్వగా 15 పార్టీలు వ్యతిరేకించడం తెలిసిందే.మూడొంతుల మెజారిటీ ఏదీ?జమిలి బిల్లులు రాజ్యాంగ వ్యతిరేకమని, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా విమర్శించారు. పార్లమెంటు ఆవరణలో ఆమె మీడియాతో మాట్లాడారు. బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు పునరుద్ఘాటించారు. రాజ్యాంగ సవరణలకు కావాల్సిన మూడింట రెండొంతుల మెజారిటీ బీజేపీకి లేదని లోక్సభలో ఓటింగ్తో తేలిందని కాంగ్రెస్ ఎంపీ శశీ థరూర్ అన్నారు. ‘‘కేంద్రంలో ప్రభుత్వం పడిపోతే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎందుకు కుప్పకూలాలి? ఇందులో ఏమన్నా అర్థముందా?’’ అని ప్రశ్నించారు. సభలో రాజ్యాంగాన్ని ఖూనీ చేసేందుకు మోదీ సర్కారు ప్రయతి్నంచిందని మనీశ్ తివారీ మండిపడ్డారు. ఓటింగ్ వ్యవహారం బీజేపీకే బెడిసికొట్టిందని పార్టీ ఎంపీ మాణిక్కం ఠాగూర్ అన్నారు. పాలనలో స్థిరత్వానికే: కేంద్రంజమిలి ఎన్నికలు భారత్కు కొత్తేమీ కాదని కేంద్రం పేర్కొంది. 1951 నుంచి 1967 దాకా అన్ని రాష్ట్రాల శాసనసభలకూ లోక్సభతో పాటే ఎన్నికలు జరిగాయని గుర్తు చేసింది. ‘‘పలు రాష్ట్రాల్లో అసెంబ్లీలు గడువుకు ముందే రద్దవడం వల్ల 1968, 1969 నుంచి జమి లికి బ్రేక్ పడింది’’ అని మంగళవారం ఉదయం లోక్సభలో జమిలి బిల్లులను ప్రవేశపెట్టడానికి ముందు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. నాలుగో లోక్సభ కూడా 1970లో గడువుకు ముందే రద్దయింది. దాంతో 1971లో సాధారణ ఎన్నికలు జరిగి ఐదో లోక్సభ కొలువుదీరింది. ఎమర్జెన్సీ నేపథ్యంలో దాని గడువును ఆర్టీకల్ 352 సాయంతో 1977 దాకా పొడిగించారు.అనంతర కాలంలో ఆరో, ఏడో, తొమ్మిదో, 11వ, 12వ, 13వ లోక్సభలు కూడా అర్ధాంతరంగానే ముగిశాయి. ‘‘పలు రాష్ట్రాల్లో శాసనసభలకూ అదే పరిస్థితి ఎదురవుతూ వస్తోంది. దాంతో తరచూ ఎక్కడో ఒకచోట ఎన్నికలు జరిగే పరిస్థితి నెలకొంది. దాంతో పార్టీలు, నేతలు, చట్టసభ్యులు, అధికారులు పాలనను పక్కన పెట్టి ఎన్నికలను ఎదుర్కోవడంలో గడపాల్సి వస్తోంది. అందుకే కోవింద్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా దేశ ప్రయోజనాల రీత్యా జమిలి ఎన్నికలను తిరిగి పట్టాలపైకి తేవాలని సంకల్పించాం. పాలనలో స్థిరత్వానికి అది వీలు కల్పిస్తుంది’’ అని కేంద్రం వివరించింది. రాజ్యాంగంపై దాడి: కాంగ్రెస్జమిలి బిల్లులను రాజ్యాంగ మౌలిక నిర్మాణంపై దాడిగా కాంగ్రెస్ సభ్యుడు మనీశ్ తివారీ అభివర్ణించారు. వాటిని తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. రాజ్యాంగంలోని ఇటువంటి కీలకాంశాలను సవరించే అధికార పరిధి పార్లమెంటుకు లేదని ఆయన గుర్తు చేశారు. ‘‘జమిలి ఎన్నికలు జరపాలంటే కేంద్ర, రాష్ట్రాల చట్టసభలకు నిర్ణిత కాలావధి కల్పించే ఆర్టీకల్ 83, 172లను కూడా సవరించాల్సి ఉంటుంది. కనుక సమాఖ్య వ్యవస్థ మౌలిక లక్షణమైన ప్రజాస్వామ్య నిర్మాణపు పునాదులనే ఈ బిల్లులు కదిలిస్తాయి’’ అని వాదించారు. దేశంలో నియంతృత్వాన్ని తేవడమే బీజేపీ ఉద్దేశమని సమాజ్వాదీ పార్టీ సభ్యుడు ధర్మేంద్ర యాదవ్ ఆరోపించారు.అసెంబ్లీల గడువును లోక్సభతో ముడిపెట్టడం ప్రజా తీర్పును న్యూనతపరచడమేనని తృణమూల్ సభ్యుడు కల్యాణ్ బెనర్జీ విమర్శించారు. తమకు నచి్చన ప్రభుత్వాన్ని ఐదేళ్ల కాలానికి ఎన్నుకునే హక్కు ప్రజలకు ఉంటుందని టీఆర్ బాలు గుర్తు చేశారు. జమిలి ద్వారా దానికి గండికొట్టే అధికారం కేంద్రానికి లేదన్నారు. బిల్లులపై మాట్లాడేందుకు అధికార పక్ష సభ్యులకే స్పీకర్ ఓం బిర్లా ఎక్కువగా అవకాశమిస్తున్నారని విపక్ష సభ్యులు అభ్యంతరం వెలిబుచ్చడం ఉద్రిక్తతకు దారితీసింది.‘‘పార్లమెంటుకు మీరు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారా? ఆ హక్కు ప్రతి పార్టీకీ ఉంది’’ అంటూ రిజిజు దుయ్యబట్టారు. బిల్లులకు బేషరతుగా మద్దతిస్తున్నట్టు బీజేపీ మిత్రపక్షాలు శివసేన (షిండే), టీడీపీ ప్రకటించాయి. బిల్లులను జేపీసీకి పంపాలని సుప్రియా సులే (ఎన్సీపీ–ఎస్పీ) కోరారు. ఈ బిల్లులు ప్రాంతీయ పార్టీలకు మరణ శాసనమని అసదుద్దీన్ ఒవైసీ (మజ్లిస్) ఆరోపించారు. -
అన్న క్యాంటీన్లు నిర్మించా... నాకు అన్నం లేకుండా చేస్తున్నారు
పిఠాపురం: ‘రూ.40లక్షలు అప్పు తెచ్చి అన్న క్యాంటీన్లు నిర్మించాను. లంచం ఇవ్వలేదని అధికారులు ఆరు నెలలుగా బిల్లులు చెల్లించకుండా నిలిపివేసి నాకు అన్నం లేకుండా చేస్తున్నారు. ఐదుసార్లు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(గ్రీవెన్స్)లో ఫిర్యాదు చేశా. అయినా ప్రయోజనం లేదు. అలాంటప్పుడు ఈ పరిష్కార వేదికలు ఎందుకు?’ అంటూ కాకినాడ జిల్లా కలెక్టర్తోపాటు అధికారులను ఓ కాంట్రాక్టర్ నిలదీశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని అంబేడ్కర్ భవన్లో సోమవారం కలెక్టర్ షణ్మోహన్ ఆధ్వర్యాన నియోజకవర్గ స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు.పిఠాపురానికి చెందిన మున్సిపల్ కాంట్రాక్టర్ సూరవరపు దివాణం తాను చేసిన పనులకు బిల్లులు ఇవ్వడం లేదని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. తనకు రావాల్సిన బిల్లుల గురించి కలెక్టర్, అధికారులను గట్టిగా నిలదీయడంతో ఆయన్ను పోలీసులు బయటకు గెంటేశారు. ఈ సందర్భంగా దివాణం మాట్లాడుతూ గొల్లప్రోలు, పిఠాపురం, ఏలేశ్వరం, తుని పట్టణాల్లో తాను కాంట్రాక్టు తీసుకుని అన్న క్యాంటీన్లు నిర్మించానని తెలిపారు. అప్పులు చేసి రూ.40 లక్షల పెట్టుబడి పెట్టానని, వడ్డీల మీద వడ్డీలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. జిల్లా అధికారులకు, పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావుకు ఎన్ని వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం లేదన్నారు. పిఠాపురం మున్సిపాలిటీకి సంబంధించిన బిల్లు ఇవ్వాలంటే కౌన్సిల్లో తీర్మానం చేయాలని, దానికి 5 శాతం కమీషన్ ఇవ్వాలంటున్నారని ఆరోపించారు. తాను 30 శాతం తక్కువకు టెండర్ వేసి పనులు చేశానని, అయినా తనకు బిల్లు ఇవ్వడానికి లంచాలు డిమాండ్ చేస్తూ ఏడిపిస్తున్నారని చెప్పారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వినతిపత్రం ఇస్తే న్యాయం జరుగుతుందని భావించి ఐదుసార్లు ఫిర్యాదు చేసినా... ఇక్కడ కూడా అన్యాయమే జరుగుతోందన్నారు. కాలువల్లో పూడికలు తీశానని, వాటికి కూడా బిల్లులు రావాల్సి ఉందన్నారు. తన బిల్లుల గురించి కలెక్టర్ను గట్టిగా అడిగితే ‘నీ దిక్కున్న వాడితో చెప్పుకో..’ అని అంటున్నారని దివాణం చెప్పారు. పేదలకు అన్నం పెడుతున్నారని తన భార్య పుస్తెలతాడు తాకట్టు పెట్టి, అప్పులు చేసి అన్న క్యాంటీన్లు కట్టించానని, చెప్పారు. ఈ ప్రభుత్వం కంటే గత ప్రభుత్వం చాలా మంచిదని ఆయన చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో డబ్బులు ఉంటేనే పనులు చేయించి బిల్లులు చెల్లించేవారని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వంలో పనులు చేయించుకుని లంచాల కోసం బిల్లులు చెల్లించకుండా ఏడిపిస్తున్నారని ఆరోపించారు. కాగా, దివాణంకు త్వరలో బిల్లులు చెల్లించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. -
మీరు వెళ్లిపోండి.. లేదంటే..
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో కట్టబెట్టిన కాంట్రాక్టులను ఇప్పుడు తన అస్మదీయులకు కట్టబెట్టేందుకు సామదానభేద దండోపాయాలు ఉపయోగిస్తున్న టీడీపీ కూటమి సర్కారు బాగోతాల్లో మరొకటి వెలుగులోకి వచ్చి0ది. రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కాలపరిమితి ఉన్నప్పటికీ ఉన్నఫళంగా రద్దుచేసుకుని వెళ్లిపోవాలని అల్టిమేటం జారీచేస్తూ రాష్ట్రంలో కాంట్రాక్టు సంస్థలను బెంబేలెత్తిస్తోంది. పైగా.. నెలల తరబడి బిల్లులు చెల్లించకుండా పొగపెడుతూ ‘మీ అంతట మీరు వెళ్లిపొండి’ అన్నట్లుగా వ్యవహరిస్తోంది. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా ఉన్నతాధికారుల ద్వారా హెచ్చరిస్తోంది. 108 అంబులెన్సులు, 104 మొబైల్ మెడికల్ యూనిట్ (ఎంఎంయూ)ల నిర్వహణ విషయంలో ఇప్పుడిదే జరుగుతోంది. గత ప్రభుత్వంలో ఈ రెండు సర్వీసుల నిర్వహణ కాంట్రాక్టును అరబిందో సంస్థ దక్కించుకుంది. 2027 వరకూ ఈ కాంట్రాక్టు కాలపరిమితి ఉంది. కానీ, ఉన్నఫళంగా ఎంఓయూను రద్దుచేసుకుని వెళ్లిపోవాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. పైసా విదల్చని ప్రభుత్వం.. 104, 108 వాహనాల నిర్వహణను తన అస్మదీయులకు కట్టబెట్టేందుకు ప్రస్తుత నిర్వహణ సంస్థ అరబిందోను రాష్ట్ర ప్రభుత్వం పలు రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు వైద్యశాఖ వర్గాల్లోనే పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వహణ సంస్థకు నయాపైసా చెల్లించలేదు. సాధారణంగా ప్రతి మూడునెలలకు ఒకసారి ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయాల్సి ఉంటుంది. కానీ, ఏప్రిల్ నుంచి అక్టోబరు మధ్య రెండు క్వార్టర్లకు సంబంధించిన బిల్లులను ప్రభుత్వం ఇప్పటివరకూ మంజూరు చేయలేదు. ‘సిబ్బందికి మూడునెలల వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. పైగా.. వాహనాలను నడపాలంటే రోజుకు రూ.20 లక్షలు డీజిల్ కోసం ఖర్చుచేయాల్సి ఉంటుంది. డీజిల్ కొనుగోలుకు కూడా ఇబ్బంది పడుతున్నాం’.. అని ప్రభుత్వానికి సంస్థ తెలియజేసినా చంద్రబాబు సర్కారు కనికరించడంలేదు. వీలైనంత త్వరగా రద్దుచేసుకోండి.. ప్రభుత్వం తమపట్ల విముఖత వ్యక్తపరుస్తుండటంతో చేసేదేమీ లేక మీరెలా చెబితే అలా చేస్తామని సంస్థ యాజమాన్యం తెలియజేసింది. ఎంఓయూలోని నిబంధనల ప్రకారం సబ్ కాంట్రాక్టు ఇచ్చి మీరు పక్కకు తప్పుకోవాలని ప్రభుత్వం సూచించింది. దీంతో.. ప్రభుత్వ పెద్దలు చెప్పిన జేవీ కంపెనీ ఆఫ్ ఎమర్జెంట్ మెడికల్ సర్వీసెస్, యునైటెడ్ హెల్త్కేర్ సంస్థలకు సబ్ కాంట్రాక్టు ఇవ్వాలని అరబిందో సంస్థ కూడా వైద్యశాఖకు ప్రతిపాదించింది.అయితే, ఆయా సంస్థలకు సబ్ కాంట్రాక్టు ఇచ్చినప్పటికీ అరబిందో సంస్థ పేరిటే కార్యకలాపాలన్నీ నడుస్తాయి కాబట్టి అరబిందో ప్రస్తావనే లేకుండా చేయాలనే ఉద్దేశ్యంతో సబ్ కాంట్రాక్టు ప్రస్తావనను ప్రభుత్వం విరమించుకున్నట్లు తెలుస్తోంది. ఎంఓయూను మీరే రద్దుచేసుకుని వెళ్లిపోండని అరబిందోకు తేల్చిచెప్పినట్లు సమాచారం. ఎలాగైనా ఎంఓయూ రద్దుచేసి తీరాలని ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఉండటంతో వైద్యశాఖ ఉన్నతాధికారులు సైతం ఈ విషయంలో మల్లగుల్లాలు పడుతున్నారు. వీలైనంత త్వరగా ఎంఓయూ రద్దు చేసుకోండని సంస్థ ప్రతినిధులతో ఇప్పటికే పలుమార్లు చర్చించారు. అంతేకాక.. ప్రభుత్వానికి విస్తృతమైన అధికారులున్నాయని, కాంట్రాక్టును రద్దుచెయ్యొచ్చని బెదిరించినట్లు కూడా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ‘యునైటెడ్ కింగ్డమ్ నేషనల్ హెల్త్ సర్వీసెస్ (యూకే ఎన్హెచ్ఎస్) నిర్వహణ కాంట్రాక్టులో భాగస్వామిగా ఉందని.. ఇక్కడి పరిస్థితులపై సమాచారం ఇచ్చామని.. ఆ సంస్థ స్పందన ఆధారంగా ఎంఓయూ రద్దుపై తుది నిర్ణయం తెలియజేస్తాం’.. అని అరబిందో చెప్పినట్లు సమాచారం. సిబ్బందిలో ఆందోళన మరోవైపు.. ఇప్పటికే మూడు నెలలుగా వేతనాల్లేక 104, 108లో పనిచేసే 6,500 మంది సిబ్బంది తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. దసరా, దీపావళి ఇలా పండుగలన్నీ పస్తులతోనే గడిపారు. ఈ పరిస్థితుల్లో నిర్వహణ సంస్థ మారుతోందంటూ ప్రభుత్వమే ఎల్లో మీడియాలో లీకులిచ్చి కథనాలు రాయిస్తుండడంతో సిబ్బంది కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. నిర్వహణ సంస్థ మారితే తమకు రావాల్సిన బెని్ఫట్స్ రాకుండా పోతాయేమోనని వారు ఆవేదన చెందుతున్నారు. పెండింగ్ వేతనాలు చెల్లించండిరాష్ట్రవ్యాప్తంగా 104 సిబ్బంది నిరసనపెండింగ్లో ఉన్న మూడు నెలల వేతనాలను తక్షణమే చెల్లించడంతో పాటు, ఉద్యోగ భద్రత సహా పలు డిమాండ్ల పరిష్కారం ఎజెండాగా 104 మొబైల్ మెడికల్ యూనిట్ (ఎంఎంయూ) సిబ్బంది నిరసన బాట పట్టారు. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా మండలాల్లో మెడికల్ ఆఫీసర్లకు తమ సమస్యలపై డీఈవోలు, డ్రైవర్లు వినతి పత్రాలు అందజేశారు. బుధవారం డీఎంహెచ్వోలు, ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలోనూ నోడల్ అధికారులకు వినతి పత్రాలు అందజేస్తామని ఏపీ 104 ఎంఎంయూ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఫణికుమార్ తెలిపారు. 8వ తేదీ తహసీల్దార్లు, ఎంపీడీవోలకు, 10న జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేస్తామని వెల్లడించారు. 11న గ్రీవెన్స్లో వినతులిస్తామని, 14వ తేదీన డ్రైవర్లు, డీఈవోలు అధికారిక గ్రూప్ల నుంచి లెఫ్ట్ అయి పనులు నిలుపుదల చేస్తామన్నారు. నిరసన చేస్తున్నన్ని రోజులూ నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతామన్నారు. -
బాబూ.. బేల మాటలేల?
‘విశాఖ స్టీల్ప్లాంట్ గురించి నేను ఒకటే చెబుతున్నాను.. ఇది ఆంధ్రుల మనోభావాలకు చెందిన ప్రాజెక్టు. ఉద్యోగులు, యాజమాన్యం ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. మంచి మేనేజ్మెంట్ ఏర్పాటు చేసుకోవాలి. సమర్థవంతంగా ప్లాంట్ని నడిపించాలి. సెయిల్ మాదిరిగా విశాఖ స్టీల్ప్లాంట్ను లాభాల బాట పట్టించాలి? ఇవీ.. పరవాడ పర్యటనలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు. స్టీల్ప్లాంట్కు సొంత గనులు కేటాయింపులో చొరవ తీసుకోవల్సిన ముఖ్యమంత్రి ఇలా మాట్లాడడంపై స్టీల్ప్లాంట్ ఉద్యోగ కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సాక్షి, విశాఖపట్నం: ఇటీవల పరవాడ పర్యటనలో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు సెయిల్కు, విశాఖ స్టీల్ప్లాంట్కు ఉన్న తేడా తెలియదా అంటూ కార్మిక సంఘాలు ప్రశి్నస్తున్నాయి. సెయిల్కు సొంత గనులు ఉండటం వల్లే లాభాల బాటలో పయనిస్తోంది. సెయిల్కు, స్టీల్ప్లాంట్కు ఉత్పత్తి వ్యయంలో చాలా తేడా ఉంది. సెయిల్తో పోలిస్తే స్టీల్ప్లాంట్కు మూడు రెట్లు ఉత్పత్తి వ్యయం అవుతోంది. సొంత గనులు లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. ప్లాంట్కు గనులు కేటాయించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పలుమార్లు విన్నవించినా పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ కార్మిక సంఘాలు చంద్రబాబు, పవన్ దృష్టికి సొంతగనుల కేటాయింపు విషయాన్ని పలుమార్లు విన్నవించినా.. కేంద్రంతో ఒక్కసారి కూడా సంప్రదింపులు జరపలేదు. ఇప్పుడు మాత్రం.. లాభాల బాట నడిపించాల్సిన బాధ్యత ఉద్యోగులు, కార్మికులదే అన్నట్లుగా చంద్రబాబు మాట్లాడటంపై ఉక్కు పోరాట కమిటీ నాయకులు మండిపడుతున్నారు. మేనేజ్మెంట్ బాధ్యత ఎవరిది బాబూ.? స్టీల్ప్లాంట్కు మంచి మేనేజ్మెంట్ ఏర్పాటు చేసుకోవాలంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపైనా కార్మికులు మండిపడుతున్నారు. ప్లాంట్కు ఉన్నతాధికారుల నియామకం, సీఎండీ నియామకం మొదలైన బాధ్యతలన్నీ కేంద్రం పరిధిలో ఉంటాయి. కేంద్రంలో ఉన్న ప్రభుత్వంతో జతకట్టిన టీడీపీ, జనసేన ఈ విషయంపై ఎప్పుడూ చర్చించిన పాపానపోలేదు. అలాంటిది.. మంచి మేనేజ్మెంట్ను ఉద్యోగులు ఏర్పాటు చేసుకోవాలని చంద్రబాబు అనడమేంటని ప్రశి్నస్తున్నారు. ఐదు నెలల్లో ఉక్కు కోసం ఏం చేశారు.? ప్లాంట్ను కాపాడుకుంటామంటూ ప్రగల్భాలు పలికిన కూటమి నేతలు ఈ ఐదు నెలల్లో పట్టించుకున్న పాపానపోలేదు. ఉద్యోగులు, కార్మికులకు ఉన్న సదుపాయాల్ని యాజమాన్యం కోత విధించినా స్పందించలేదు. ఉద్యోగుల వీఆర్ఎస్, మరో ప్లాంట్కు బదిలీలకు పూనుకున్నా.. ఉద్యోగుల హెచ్ఆర్ఏ తొలగించినా నోరెత్తిలేదు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా స్టీల్ప్లాంట్ క్వార్టర్స్లో యూనిట్కి రూ.8 చొప్పున విద్యుత్ చార్జీలు పెంచి వసూలు చేసినా మాట్లాడలేదు. లీవ్ ఎన్క్యా‹మెంట్, ఎల్టీఏ(లాంగ్ ట్రావెల్ అలవెన్స్), లాంగ్లీవ్ ట్రావెల్ కన్సెషన్(ఎల్ఎల్టీసీ), ఎల్టీసీ(లీవ్ ట్రావెల్ కన్సెషన్) కూడా నిలిపేశారు. దీనికి తోడు చంద్రబాబు ప్రభుత్వం గోరుచుట్టుపై రోకలిపోటులా రూ.80 కోట్ల విద్యుత్ బిల్లుల బకాయిల చెల్లించకపోతే సరఫరా నిలిపేస్తామంటూ నోటీసులు జారీ చేసింది. అలాగే స్టీల్ప్లాంట్కు ప్యాకేజీ ఇస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం మొదట ఇచ్చిన రూ.500 కోట్లలో రూ.237 కోట్లు జీఎస్టీకి చెల్లించగా మిగిలిన ధనంతో ముడి పదార్థాలు కొనుగోలు చేశారు. రెండోసారి ప్యాకేజీ పేరుతో రూ.1140 కోట్లు ఇచ్చినట్టే ఇచ్చి.. బ్యాంకులకు రుణాల పేరిట తిరిగి తీసేసుకుంది. ఇలా ప్రతి విషయంలోనూ ప్లాంట్ని నిర్వీర్యం చేసేందుకు యతి్నస్తుంటే కూటమి నేతలు నోరుమెదపకపోవడం ఏంటని కార్మిక సంఘాలు ప్రశి్నస్తున్నాయి.నక్కపల్లిలో ప్రైవేట్ ప్లాంట్కు సొంత గనులా? అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో మిట్టల్ ప్రైవేట్ స్టీల్ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు చంద్రబాబు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పైగా దానికి సొంత గనుల కేటాయింపులోనూ రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఉన్న స్టీల్ప్లాంట్కు సొంత గనులు కేటాయించకుండా ప్రైవేట్కు కొమ్ము కాస్తుండడం చూస్తే.. చంద్రబాబు, పవన్ కల్యాణ్కు విశాఖ ఉక్కుపై ఉన్నది కపట ప్రేమ అని తేటతెల్లమవుతోందంటూ ఉద్యోగ సంఘ ప్రతినిధులు విమర్శిస్తున్నారు.గనుల కేటాయింపులో వివక్ష కారణంగా..? గతంలో వరుసగా సాధించిన లాభాలతో 6.3 మిలియన్ టన్నుల సామర్థ్యానికి, ఆ తర్వాత 7.3 మిలియన్ టన్నుల సామర్థ్యానికిప్లాంట్ విస్తరణ జరిగింది. ఒక రకంగా విస్తరణ స్టీల్ప్లాంట్కు నష్టం తెచ్చిందని చెప్పవచ్చు. విస్తరణ పూర్తయ్యే నాటికి ఉన్న వనరులన్నీ కరిగిపోగా రుణాలకు వెళ్లాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా దేశంలోని ప్రైవేటు ప్లాంట్లకు గనులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ప్లాంట్కు కేటాయించడంలో వివక్ష చూపుతూ వస్తుంది. దీని వల్ల ఇతర ప్లాంట్లలో టన్నుకు 40 శాతం ముడి పదార్థాలకు వ్యయం అవుతుండగా సొంత గనులు లేని విశాఖ స్టీల్ప్లాంట్కు 65 శాతం వ్యయం అవుతోంది. కొన్నిసార్లు ఉత్పత్తి వ్యయం కంటే తక్కువకే ఉత్పత్తులను స్టీల్ప్లాంట్ అమ్ముకోవాల్సి వస్తోంది. దీంతో గత నాలుగున్నరేళ్ల కాలంలో మూడేళ్ల పాటు నష్టాలను చవిచూసింది. ఈ పరిస్థితుల్లో ప్లాంట్ రుణాలు రూ.20 వేల కోట్లకు మించిపోయాయి. అయితే స్టీల్ప్లాంట్ ఈ 30 ఏళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ పన్నుల రూపేణా రూ. 40 వేల కోట్లు చెల్లించడం గమనార్హం. వీటిని వద్దని చెప్పినా ప్లాంట్ సజీవంగా బతికేది.ఉద్యోగులపై నిందలు వేయడం సరికాదు స్టీల్ప్లాంట్కు సొంత గనులు ఉంటే సెయిల్ కంటే ఎక్కువ లాభాలు సాధించేది. ఉక్కు యాజమాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది కానీ ఉద్యోగులు కాదు. కేంద్ర ప్రభుత్వం ప్లాంట్ను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నంలో చేస్తున్న సహాయ నిరాకరణ వల్ల స్టీల్ప్లాంట్ ఈ పరిస్థితికి చేరింది.. తప్ప ఉద్యోగుల వల్ల కాదు. సీఎం చంద్రబాబుకి అందిన తప్పుడు సమాచారం వల్లే ఆయన అలా మాట్లాడుతున్నారేమో. – మంత్రి రాజశేఖర్, స్టీల్ ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి -
బిల్లు బకాయిలు చెల్లిస్తేనే డయాఫ్రం వాల్!
సాక్షి, అమరావతి: కొత్త డయాఫ్రం వాల్ పనుల సన్నాహాల సాక్షిగా పోలవరంలో 2016–19 మధ్య మరో కమీషన్ల బాగోతం బట్టబయలైంది. అప్పట్లో తాము చేసిన డయాఫ్రం వాల్ పనులకు సంబంధించి రూ.94 కోట్ల బిల్లులు చెల్లించలేదని.. ఇప్పుడు అవి చెల్లిస్తేనే కొత్త డయాఫ్రం వాల్ పనులను చేపడతామని బావర్ సంస్థ ప్రతినిధులు తేల్చి చెప్పినట్లు జలవనరుల శాఖ అధికారవర్గాలు తెలిపాయి. ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్ట్రాయ్కి బిల్లులు చెల్లించామని.. అక్కడి నుంచి బిల్లులు వసూలు చేసుకోవాలంటూ అధికారులు చేసిన సూచనను బావర్ ప్రతినిధులు తోసిపుచ్చుతున్నారు. ఎస్క్రో అకౌంట్ ద్వారా బిల్లులు చెల్లిస్తామని నాటి ప్రభుత్వం 2017 ఫిబ్రవరి 6న ఉత్తర్వులు (జీవో ఆర్టీ నెంబరు 41) జారీ చేస్తేనే తాము పనులు చేశామని స్పష్టం చేస్తున్నారు. కానీ.. ఎస్క్రో అకౌంట్ ద్వారా తమకు బిల్లులు చెల్లించకుండా బకాయిలు పెట్టారని పేర్కొంటున్నారు.ట్రాన్స్ట్రాయ్ను అడ్డుపెట్టుకుని చంద్రబాబు, లోకేష్ సబ్ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి దోచుకున్నారంటూ ఆ సంస్థ అధినేత రాయపాటి రంగారావు 2024 జనవరి 12న మీడియాకు వెల్లడించడం గమనార్హం. కమీషన్ల కోసం పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారంటూ 2019 ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ సైతం ఆగ్రహం వ్యక్తం చేయడం అప్పట్లో సంచలనం కలిగించింది. కమీషన్ల కోసమే ఎస్క్రో అకౌంట్ తుంగలోకి.. పోలవరం ప్రాజెక్టులో వరదను మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్ పనులు పూర్తి చేయకుండానే.. ఎర్త్ కమ్ రాక్ ఫిల్(ఈసీఆర్ఎఫ్) డ్యామ్ గ్యాప్–2లో పునాది డయాఫ్రం వాల్ పనులను బావర్ సంస్థకు సబ్ కాంట్రాక్టు కింద 2016లో టీడీపీ ప్రభుత్వం అప్పగించి చారిత్రక తప్పిదానికి పాల్పడింది. ప్రధాన కాంట్రాక్టర్ ట్రాన్స్ట్రాయ్ ద్వారా కాకుండా ఎస్క్రో అకౌంట్ ద్వారా బిల్లులు చెల్లిస్తామని నాడు హామీ ఇచ్చి తుంగలో తొక్కింది. ఎందుకంటే.. ఎస్క్రో అకౌంట్ ద్వారా బిల్లులు చెల్లిస్తే కమీషన్లు వసూలు చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఈ క్రమంలో 2018 జూన్ నాటికి గ్యాప్–2లో డయాఫ్రం వాల్ను బావర్ సంస్థ పూర్తి చేసింది. చేసిన పనులకు బిల్లుల రూపంలో రూ.56 కోట్లు, జీఎస్టీ రూపంలో రూ.38 కోట్లు వెరసి రూ.94 కోట్ల మేర బిల్లులు బావర్కు టీడీపీ ప్రభుత్వం బకాయిపడింది. బావర్ సంస్థ ఇదే అంశాన్ని అప్పట్లో అనేక మార్లు జలవనరుల శాఖ దృష్టికి తెచ్చి బిల్లులు చెల్లించాలని కోరింది. అయితే తాము ట్రాన్స్ట్రాయ్కు బిల్లులు చెల్లించేశామని, ఆ సంస్థ నుంచి వసూలు చేసుకోవాలని అధికారులు సూచించారు. కానీ.. అప్పటికే ట్రాన్స్ట్రాయ్ దివాలా తీసింది. చంద్రబాబు ప్రభుత్వం చారిత్రక తప్పిదం వల్ల గోదావరి వరదల ఉద్ధృతికి డయాఫ్రంవాల్ ధ్వంసమైంది. డీఆర్ఐకి ఫిర్యాదు చేసినా.. రూ.94 కోట్ల బకాయిలు చెల్లించకపోవడంపై బావర్ సంస్థ అప్పట్లో డీఆర్ఐకి ఫిర్యాదు చేసింది. ఈ అంశంపై 2018 నుంచి అనేక మార్లు డీఆర్ఐ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించినా స్పందించలేదు. 2014 ఎన్నికల్లో ఖర్చుల కోసం చంద్రబాబు, లోకేష్ తమ వద్ద రూ.150 కోట్లు తీసుకున్నారని.. ఆ తర్వాత పనులన్నీ సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించి తమను నాశనం చేశారని ట్రాన్స్ట్రాయ్ అధినేత రాయపాటి రంగారావు మీడియాకు ఎక్కడం అప్పట్లో సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో బావర్ సంస్థకు చెల్లించాల్సిన రూ.94 కోట్ల బిల్లులు ఏ బాబు జేబులోకి చేరాయనే చర్చ కాంట్రాక్టర్లలో జోరుగా సాగుతోంది. -
కాంట్రాక్టర్లకు బిల్లుల కోసమే ‘కాళేశ్వరం’ కార్పొరేషన్!
సాక్షి, హైదరాబాద్: బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు పొంది కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం కోసమే కాళేశ్వరం ఇరిగేషన్ కార్పొరేషన్ ఏర్పాటైందని నీటిపారుదల శాఖ చీఫ్ అకౌంట్స్ అధికారి పద్మావతి, కాళేశ్వరం కార్పొరేషన్ చీఫ్ అకౌంట్స్ అధికారి కొమర్రాజు వెంకట అప్పారావు వెల్లడించారు. కాళేశ్వరం బరాజ్ల నిర్మాణంపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్.. బుధవారం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్న ముగ్గురు అధికారులను వేర్వేరుగా క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. నాటి నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ ఆదేశాలతో కార్పొరేషన్ రుణాలను సమీకరించిందని ఓ ప్రశ్నకు సమాధానంగా కొమర్రాజు వెంకట అప్పారావు తెలిపారు. కాళేశ్వరం కార్పొరేషన్కు స్వతహాగా ఆదాయం ఏమీ లేదన్నారు. రుణా లు మంజూరైన వెంటనే కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరపకుండా బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని.. వాటిపై వచ్చే వడ్డీలతో కార్పొరేషన్ నిర్వహణ జరుగుతోందని చెప్పారు. కాంట్రాక్టర్ల బ్యాంకు డిపాజిట్లపై వచ్చే వడ్డీలను సైతం కార్పొరేషన్ అవసరాలకు వాడుకుంటున్నామని వివరించారు. పూర్తయిన పనులన్నింటినీ కార్పొరేషన్ ఆస్తులుగానే పరిగణిస్తామని తెలిపారు. రామగుండం ఫెర్టిలైజర్, ఎనీ్టపీసీ నుంచి నీటి విడుదలకు సంబంధించిన బిల్లులు 2023 నుంచి వస్తున్నాయని వివరించారు. కొలతలు చూశాకే బిల్లులు ఇస్తారా? అని కమిషన్ ప్రశ్నించగా.. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు సిద్ధం చేసిన బిల్లులను పేఅండ్అకౌంట్స్ విభాగం పరిశీలించి కార్పొరేషన్కు పంపిస్తుందని, తర్వాత చెల్లింపులు చేస్తామని బదులిచ్చారు. కాగ్ అభ్యంతరాలపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపించామన్నారు.మిమ్మల్ని మీరే రక్షించుకోవాలినీటి పారుదల శాఖ బడ్జెట్ రూపకల్పనలో మీ పాత్ర ఏమిటని ఆ శాఖ చీఫ్ అకౌంట్స్ అదికారి పద్మావతిని కమిషన్ ప్రశ్నించగా.. చీఫ్ ఇంజనీర్ల నుంచి వివరాలను సేకరించి ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపిస్తానని ఆమె బదులిచ్చారు. కార్పొరేషన్ రుణాల తిరిగి చెల్లింపు కోసం ప్రభు త్వం బడ్జెట్లో నిధులు కేటాయిస్తోందని తెలిపారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ అభ్యంతరాల విషయంలో మీ అభిప్రాయమేంటి? రుణాలపై నిర్వహించిన సమావేశాల్లో గత ప్రభుత్వంలోని సీఎంఓ అధికారులు పాల్గొన్నారా? ప్రాజెక్టుతో ఆర్థికభారం పడే అవకాశం ఉండటంతో ఆర్థిక క్రమశిక్షణ కోసం సలహాలు ఏమైనా ఇచ్చారా?’ కమిషన్ ప్రశ్నించగా.. ఆమె సమాధానం దాటవేసినట్టు తెలిసింది. ‘కాళేశ్వరం ప్రాజెక్టుతో పడే ఆర్థిక భారం? దీనికి మీ సమర్థన ఉందా? రాష్ట్రంపై ఈ భారం రానున్న రోజుల్లో ఎలా ఉంటుంది? మీ బాధ్యతగా ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారా?’ అన్న ప్రశ్నలకు తాను జవాబు చెప్పలేనని పేర్కొన్నట్టు సమాచారం. ఇక ఆర్థిక క్రమశిక్షణ లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టుపై నిర్ణయం తీసుకున్నదెవరని ప్రశ్నించగా.. అది చాలా విస్తృతమైన అంశమని, దానిపై తానేమీ చెప్పలేనని చెప్పినట్టు తెలిసింది. దీంతో కమిషన్ కొంత ఘాటుగా స్పందిస్తూ.. ‘‘విచారణ సందర్భంగా ఎవరినో రక్షించే ప్రయత్నం చేయవద్దు. మిమ్మల్ని మీరే రక్షించుకోవాలి. విచారణలో వాస్తవాలనే తెలపాలి. దాపరికాలు వద్దు’’ అని పేర్కొన్నట్టు సమాచారం. మరోవైపు బిల్లులను పరిశీలించి చెల్లింపులకు సిఫారసు చేయడమే తన బాధ్యత అని వర్క్ అకౌంట్స్ డైరెక్టర్ ఫణిభూషణ్ శర్మ కమిషన్కు వివరించారు. కాగ్ నివేదికలోని ఒకటి రెండు విషయాలు మాత్రమే వాస్తవాలని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచి్చందని తెలిపారు. -
ఇదెక్కడి రోగం?
సాక్షి, అమరావతి: ఏదైనా ఓ వ్యవస్థను నిర్వీ ర్యం చేయాలనుకుంటే సీఎం చంద్రబాబు తొలుత పథకం ప్రకారం దానిపై దుష్ప్రచారం ప్రారంభిస్తారు. తాను అనుకున్నది సాధించడం కోసం ప్రజల మెదడును ట్యూన్ చేసేలా పార్టీలోనే కొందరు నాయకులతో ప్రకటనలు చేయిస్తారు. అనుకూల మీడియాలో ఈమేరకు కథనాలతోపాటు టీవీ చానళ్లలోనూ తన మనుషుల ద్వారా చర్చలు నిర్వహిస్తారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ విషయంలోనూ అదే పంథాను కొనసాగిస్తున్నారు. మేనిఫెస్టోలో ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెడతానని హామీ ఇచ్చి చివరకు ప్రజల ఆరోగ్యానికి పొగ బెట్టారు. ఇన్నాళ్లూ ఆరోగ్యశ్రీ పథకం ట్రస్టు పర్యవేక్షణలో పకడ్బందీగా కొనసాగుతుండగా అధికారంలోకి వచ్చీ రాగానే ఆ స్థానంలో బీమా ప్రవేశపెట్టడానికి సిద్ధం కావాలంటూ వైద్య శాఖకు హుకుం జారీ చేశారు. మరోవైపు ‘‘ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవు. ఆస్పత్రులకు బిల్లులు రావడం లేదు. రోగులకు చికిత్సలు అందడం లేదు. ప్రజలు వైద్యం కోసం కేంద్రం అమలు చేసే ఆయుష్మాన్ భారత్ కార్డును వెంటబెట్టుకుని ఆస్పత్రులకు వెళ్లాలి..’’ అని టీడీపీకి చెందిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు. మాజీ సీఎంలు వైఎస్సార్, వైఎస్ జగన్ల ముద్రను చెరిపేయాలనే దురుద్దేశంతో ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగారుస్తూ రాష్ట్రంలోని కోట్ల మంది నిరుపేద, మధ్యతరగతి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. అధికారంలోకి వచ్చీ రావడంతోనే ఆరోగ్యశ్రీని నిర్వీ ర్యం చేసే పనికి శ్రీకారం చుట్టారు. మరోవైపు ఆరోగ్యశ్రీ బిల్లుల బకాయిలు చెల్లించకుండా, ప్రజలకు ఉచిత కార్పొరేట్ వైద్యం అందకుండా చేస్తున్నారు. అడ్డుకుని అభాండాలు2019–24 మధ్య ఐదేళ్లలో ఆరోగ్యశ్రీ పథకాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణలతో బలోపేతం చేసింది. అంతకుముందు టీడీపీ హయాంలో బిల్లుల చెల్లింపుల్లో జరిగిన తీవ్ర ఉన్న జాప్యానికి చెక్ పెట్టారు. ప్రజలకు వైద్య సేవలపై ఏ మాత్రం ప్రభావం పడకుండా ఎప్పటికప్పుడు ఆస్పత్రులకు బిల్లులను చెల్లిస్తూ వచ్చారు. ఈ ఏడాది జనవరి వరకూ పెండింగ్ లేకుండా బిల్లులు చెల్లించారు. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలలకు సంబంధించి వైద్య సేవల క్లెయిమ్లను ట్రస్ట్ పరిశీలించి, ఆమోదించడం.. అనంతరం బిల్లులను ట్రస్ట్ ప్రాసెస్ చేసి ఆర్థిక శాఖకు పంపి అక్కడ సీఎఫ్ఎంఎస్ ఐడీలు రావడానికి రెండు నెలల సమయం పట్టింది. సాధారణంగా ప్రతి నెలా ఇదే పద్ధతిలో బిల్లులను ప్రాసెస్ చేస్తారు. ఈ ప్రక్రియలో మార్చిలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో బిల్లులను చెల్లించలేకపోయారు. వాస్తవానికి ప్రజల ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన ఆరోగ్యశ్రీ పథకం ఎన్నికల నియమావళిలోకి రాదు. పథకానికి సంబంధించిన బిల్లులు చెల్లింపులు చేయడానికి వీలుంటుంది. అయితే ఆ సమయంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అప్పటికే అమలులో ఉన్న పథకాలకు ఎలాంటి చెల్లింపులు చేయకుండా చంద్రబాబు ఎన్నికల సంఘానికి పలుమార్లు ఫిర్యాదులు చేసి అడ్డుకున్నారు. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కోడ్ అమలులో ఉంది. దీంతో జనవరి, ఫిబ్రవరి నెలలకు మరో మూడు నెలల బిల్లులు వచ్చి చేరాయి. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఆ బకాయిలను చెల్లించకుండా తాత్సారం చేస్తూ యథావిధిగా గత ప్రభుత్వంపై అభాండాలు వేస్తూ పథకాన్ని నిరీ్వర్యం చేయాలనే లక్ష్యాన్ని అమలు చేస్తోంది. పేదల్లో కలవరపాటు ఓవైపు బకాయిలు చెల్లించకుండా కాలయాపన చేయడం, మరోవైపు బీమా పేరిట ఆరోగ్యశ్రీ పథకానికి చంద్రబాబు సర్కారు పొగబెడుతుండటంతో పేదల్లో కలవరపాటు మొదలైంది. గత ఐదేళ్లలో దురదృష్టవశాత్తూ ఏదైనా జబ్బు చేస్తే ఆరోగ్యశ్రీ కార్డుతో వెళితే ఎంత ఖరీదైన వైద్యమైనా ఉచితంగా లభించే పరిస్థితి ఉండేది. 2019 అనంతరం రూ.5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న వారికి పథకాన్ని వర్తింపజేయడంతో ప్రైవేట్ ఉద్యోగాలు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని జీవించే మధ్యతరగతి కుటుంబాలకు ఆరోగ్యశ్రీ రక్షగా నిలిచింది. అనంతరం చికిత్స వ్యయ పరిమితిని రూ.5 లక్షలు నుంచి దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.25 లక్షలకు వైఎస్ జగన్ పెంచారు. టీడీపీ హయాంలో కేవలం 1,059 ప్రొసీజర్లతో అస్తవ్యస్థంగా ఉన్న ఆరోగ్యశ్రీకి ప్రాణం పోసి ప్రొసీజర్లను ఏకంగా 3,257కి పెంచారు. ఐదేళ్లలో 45.10 లక్షల మందికి ఉచితంగా చికిత్సలు అందించి ఆరోగ్యశ్రీ పథకానికి రూ.13 వేల కోట్లకు పైగా వెచ్చించారు. అంతేకాకుండా శస్త్ర చికిత్సలు జరిగిన 24.59 లక్షల మందికి కోలుకునే సమయంలో వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద రూ.1,465 కోట్లకుపైగా ఆర్థిక సాయం అందించి కష్టకాలంలో గత ప్రభుత్వం అండగా నిలిచింది. మరోవైపు నాడు–నేడు కింద రూ.17 వేల కోట్లకు పైగా నిధులతో ప్రభుత్వాస్పత్రులను సదుపాయాలతో తీర్చిదిద్దడంతోపాటు 17 వైద్య కళాశాలల నిర్మాణం చేపట్టారు. 108, 104 వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు దేశంలోనే ఎక్కడా లేనటువంటి ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష లాంటి వినూత్న కార్యక్రమాలను అమలు చేశారు. తద్వారా గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణ కల్పించారు. ఒక్క ఆరోగ్యశ్రీనే కాకుండా..కేవలం ఒక్క ఆరోగ్యశ్రీనే కాకుండా ప్రభుత్వ వైద్య ఆరోగ్య రంగంలో గత ఐదేళ్లలో చేపట్టిన సంస్కరణలను చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేసేలా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా పేద ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని చేరువ చేయడంతో పాటు మన విద్యార్థులకు వైద్య విద్యను చేరువ చేయడానికి తలపెట్టిన కొత్త వైద్య కళాశాలలకు అనుమతుల విషయంలోనూ కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రజలకు తాముంటున్న చోటే స్పెషాలిటీ వైద్య సేవలను అందించడంతోపాటు నిరంతర వైద్య పర్యవేక్షణ కల్పిస్తూ తెచి్చన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని కూటమి సర్కారు నిలిపివేసింది.కొత్త ప్రభుత్వం ఏర్పాటై రెండు నెలలు కావస్తున్నా ఆస్పత్రుల్లో మందుల సరఫరాపై కనీసం దృష్టి పెట్టలేదు. దీంతో ఆస్పత్రులను మందుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ప్రభుత్వాస్పత్రుల్లో వందకుపైగా రకాల మందుల కొరత ఉంది. గత ప్రభుత్వంలో బోధనాస్పత్రుల్లో 607 రకాల డబ్ల్యూహెచ్వో ప్రమాణాలున్న మందులు అందుబాటులో ఉండేవి. గ్రామ స్థాయిలోని వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్లోనూ 105 రకాల మందులను అందుబాటులో ఉంచిన ఘనత వైఎస్ జగన్ ప్రభుత్వానికే దక్కింది. -
నిధులైనా... విధులైనా...
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీల్లో ప్రథమ పౌరులు గందరగోళంలో పడ్డారు. వారం రోజుల్లో పదవీకాలం ముగియనుండటం.. గతంలో సొంత నిధులతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు ఇంకా రాకపోవడంపై సర్పంచులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పెండింగ్ బిల్లులకు సంబంధించి నిధులైనా ఇవ్వాలని.. లేకుంటే మరో ఆరు నెలలపాటు పదవీకాలమైనా పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పల్లెల్లో ప్రత్యేకాధికారుల పాలన అంటే ప్రజాస్వామ్యానికి విలువే ఉండదని స్పష్టం చేస్తున్నారు. అప్పులు చేసి మరీ గ్రామాల్లో పనులు చేయించామని.. పెండింగ్ బిల్లులు రాకపోతే సమస్యల్లో మునిగిపోతామని వాపోతున్నారు. ఊర్లలో పనులు చేయించి.. రాష్ట్రంలో 12,752 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. పార్టీ రహితంగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆ గ్రామాలకు సర్పంచ్లు ఎన్నికయ్యారు. అందులో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీల సానుభూతిపరులు కూడా ఉన్నారు. గత ఐదేళ్లుగా పంచాయతీలకు నిధులు, ఇతర పనుల విషయంలో ఇబ్బందులు ఉన్నా గ్రామాల అభివృద్ధి కోసం కృషిచేశారు. గ్రామంలో అభివృద్ధి పనులతోపాటు వివిధ పథకాల కింద మంజూరైన ప్రాజెక్టుల పనులూ చేశారు. పంచాయతీల్లో నిధులు లేకున్నా.. చాలా మంది సర్పంచులు సొంత డబ్బుతోనో, అప్పులు తెచ్చో పనులు పూర్తి చేయించారు. గడువు ముగుస్తుండటంతో.. ప్రస్తుతం గ్రామాల్లో సర్పంచులు, పాలకవర్గాల పదవీకాలం ఫిబ్రవరి 1వ తేదీతో ముగుస్తోంది. రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పటికిప్పుడు గ్రామ పంచాయతీ (జీపీ) ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా లేనట్టు సంకేతాలు ఇచ్చింది. ఏప్రిల్, మే నెలల్లో లోక్సభ ఎన్నికలు ఉండటంతో.. అవి ముగిశాక పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది. సర్పంచుల పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో.. వారినే మరో ఆరు నెలలు కొనసాగించేందుకు, లేదా వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బందిని గ్రామాలకు ప్రత్యేక అధికారులుగా నియమించేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుత సర్పంచులలో చాలా వరకు బీఆర్ఎస్కు అనుకూలమైనవారేనన్న ఆలోచనతో ఉన్న కాంగ్రెస్ సర్కారు.. వారినే ఇన్చార్జులుగా కొనసాగించేందుకు సుముఖంగా లేనట్టు సంకేతాలు ఇచ్చింది. వచ్చే ఆరు నెలల పాటు (పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యేదాకా) గ్రామాల్లో పాలన బాధ్యతను ప్రత్యేకాధికారులకు అప్పగించేందుకు మొగ్గుచూపుతోంది. ఇది సర్పంచులలో కలకలం రేపుతోంది. ‘ప్రత్యేక’పాలనతో ఇబ్బందులేనంటూ.. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన మొదలవబోతోందంటూ జిల్లా, మండల స్థాయిలో అధికారులు హడావుడి చేస్తున్నారని సర్పంచులు అంటున్నారు. సొంత నిధులతో కొత్త పంచాయతీ భవనాలు, శ్మశానవాటికలు, క్రీడా మైదానాలు వంటివి నిర్మించామని.. ఉపాధి హామీ, ప్రత్యేక అభివృద్ధి నిధి, రాష్ట్ర ఆర్థిక సంస్థ పరిధిలోని పనులు చేపట్టామని చెప్తున్నారు. తమ పదవీకాలం ముగిసేలోగా పెండింగ్ బిల్లులైనా ఇప్పించాలని, లేదా ఎన్నికలు జరిగేదాకా సర్పంచ్లుగా కొనసాగించాలని సీఎం రేవంత్రెడ్డికి, పంచాయతీరాజ్ మంత్రి సీతక్కకు విజ్ఞప్తి చేస్తున్నారు. తాము రాజకీయ పార్టీల గుర్తులపై ఎన్నికకాలేదని, తమను ఒక రాజకీయపక్షానికే అనుకూలమైనవారిగా పరిగణించవద్దని కోరుతున్నారు. తమను క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై ప్రభుత్వపరంగా అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించేవారిగా గుర్తించాలని అంటున్నారు. ప్రత్యేకాధికారుల పాలన అంటే ఇబ్బందేనని.. గ్రామాల్లో అభివృద్ధి జరగదని సర్పంచులు పేర్కొంటున్నారు. అధికారులు కేవలం ఆఫీస్ వేళల్లోనే అందుబాటులో ఉంటారని.. వారాంతాలు, సెలవు రోజుల్లో వారిని సంప్రదించే అవకాశమే ఉండదని చెప్తున్నారు. దీనితో ప్రజలకు సమస్యలు వస్తాయని పేర్కొంటున్నారు. గ్రాంట్లపై ఆధారపడిన చోట సమస్య ఎక్కువ ఏడాదికిపైగా పెండింగ్ బిల్లుల సమస్య వెంటాడుతోందని.. సొంత నిధులతో చేసిన పనులకు బిల్లులు రాక ఇబ్బందిపడుతున్నామని సర్పంచ్లు చెప్తున్నారు. సొంత ఆదాయ వనరులు అధికంగా ఉన్న పలు మేజర్ గ్రామ పంచాయతీలు, పెద్ద గ్రామాల్లో ఇబ్బంది పెద్దగా లేదని.. ఆదాయ వనరులు అంతగా లేని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు, గ్రాంట్లపై ఆధారపడిన మధ్య, చిన్నతరహా గ్రామాలకు సమస్య ఎక్కువగా ఉందని అంటున్నారు. ఇలాంటి గ్రామ పంచాయతీల్లో రూ.6 లక్షల నుంచి రూ.11 లక్షల దాకా పెండింగ్ బిల్లులు ఉన్నాయని.. మొత్తంగా రూ.1,200 కోట్ల మేర బకాయిలు ఉండొచ్చని సర్పంచుల సంఘాలు అంచనా వేస్తున్నాయి. గతంలో రాష్ట్ర ఆర్థిక సంఘం, ఇతర అభివృద్ధి నిధులు సకాలంలో విడుదలకాకపోవడంతోపాటు నిధుల వ్యయంపై ఫ్రీజింగ్ పెట్టడంతో పెండింగ్ బిల్లుల సమస్య పెరిగిందని అంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి 15వ ఆర్థికసంఘం నిధులు నేరుగా పంచాయతీలకే అందడంతో.. కొందరు సర్పంచులు కొంతమేర బిల్లులు రాబట్టుకోగలిగారని చెప్తున్నాయి. కొనసాగిస్తే భరోసా! గతంలో సకాలంలో బిల్లులు రాక, అభివృద్ధి, ఇతర పనుల కోసం తెచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక, ఇతర కారణాలతో పలువురు సర్పంచ్లు ఆత్మహత్య చేసుకున్నారని సర్పంచుల సంఘాలు గుర్తు చేస్తున్నాయి. అందువల్ల పెండింగ్ బిల్లులపై ప్రభుత్వం వెంటనే ఏదైనా హామీ ఇవ్వాలని కోరుతున్నాయి. లేకుంటే పంచాయతీలకు ఎన్నికలు జరిగేదాకా ఇప్పుడున్నవారినే కొనసాగిస్తే పెండింగ్ బిల్లుల రాకపై సర్పంచులకు భరోసా ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి. పెండింగ్ బిల్లుల సమస్యను వెంటనే పరిష్కరించాలి: యాదయ్యగౌడ్ ఫిబ్రవరి 1న తమ పదవీకాలం ముగుస్తున్నందున పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని సీఎం రేవంత్రెడ్డిని తెలంగాణ సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ ఒక ప్రకటనలో కోరారు. సర్పంచులు అప్పులు తెచ్చి గ్రామాభివృద్ధికి పాటుపడ్డారని, అలాంటి వారి సమస్యలకు రాజకీయ రంగు రుద్దవద్దని విజ్ఞప్తి చేశారు. వివిధ పనులు చేసిన బిల్లులు రాక, తెచి్చన అప్పులకు వడ్డీలు కట్టలేక ఇబ్బందిపడుతున్నామని.. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. -
అన్నీ అమ్ముకుని నౌకపై దేశాలు తిరుగుతూ...
భూమిమీద బతికే మనిషికి అన్నీ సమస్యలే... ఇంటి రెంట్ మొదలుకొని ఇన్స్యూరెన్స్ వరకూ అన్నీ మోయలేనంత భారమే. అందుకే దీనికి పరిష్కారం క్రూయిజ్ షిప్లో బతకడం అంటూ తేల్చిపారేస్తున్నారు జాన్, హెన్సెస్సీ దంపతులు. క్రూయిజ్ షిప్లో నివసించడం అంటూ మొదలుపెడితే మీరు యుటిలిటీ బిల్లులు, ఆటో బీమా, ఆస్తి బీమా మొదలైనవి అస్సలు చెల్లించాల్సిన అవసరం లేదని జాన్, హెన్సెస్సీలు ముక్తకంఠంతో చెబుతున్నారు. క్రూయిజ్ షిప్లో నివసించేందుకు సిద్ధమైన జాన్, హెన్సెస్సీ దంపతులు 2020లో ఫ్లోరిడా(అమెరికా)లోని తమ ఇల్లు, వ్యాపారం, విలువైన వస్తువులను విక్రయించేశారు. రాయల్ కరీబియన్ క్రూయిజ్ లైన్స్లో 274 రోజుల ప్రయాణం కోసం టిక్కెట్లను కొనుగోలు చేశారు..‘ఇప్పుడు మేము టెలిఫోన్ బిల్లు, షిప్పింగ్ బిల్లు చెల్లిస్తే సరిపోతుంది. కొన్ని క్రెడిట్ కార్టు మా దగ్గర ఉన్నాయి. ఇకపై మేము ఇంటి అద్దె, వాహన బీమా, ఆస్తి బీమా, యుటిలిటీ బిల్లులు... ఇలా పెద్ద జాబితాను చెల్లించాల్సిన అవసరం లేదు’ అని ఆ దంపతులు పేర్కొన్నారు. ఈ దంపతులు త్వరలో రెసిడెన్షియల్ క్రూయిజ్ షిప్ ఎక్కనున్నారు. దానిలో వారు క్యాబిన్ను కొనుగోలు చేశారు. ఇందుకోసం వారు ‘విల్లా వీ’ని ఎంచుకున్నారు. ఇది శాశ్వత నివాసాన్ని అందించే తొలి క్రూయిజ్ షిప్లలో ఒకటి. దీనిలోని ప్రయాణికులలో 30శాతం మంది పూర్తి సమయం దీనిలోనే ఉంటారు. మిగిలిన 85శాతం ప్రయాణికులు యూఎస్ పౌరులు. ఈ క్రూయిజ్ షిప్లోని క్యాబిన్ ధర 99 వేల డాలర్లు(ఒక డాలర్ రూ. 83). సీ వ్యూ కలిగిన బాల్కనీ విల్లాల ధర 249 వేల డాలర్లు. క్యాబిన్లలో కిచెన్, అతిథుల కోసం లివింగ్ రూమ్లో పుల్ డౌన్ బెడ్ ఉంటాయి. ఇందులో నివాసం కల్పించుకున్నవారు పోర్ట్ ఛార్జీలు చెల్లించాక తమ కుటుంబాలను ఉచితంగా ఆన్బోర్డ్లోకి తీసుకువచ్చేందుకు అనుమతివుంటుంది. ‘విల్లా వీ’ సీఈఓ మైకేల్ పెటర్సన్ మీడియాతో మాట్లాడుతూ తమ షిప్లోని దాదాపు సగం క్యాబిన్లలో వ్యాపార యజమానులు, ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉన్నారన్నారు. కాగా జాన్, హెన్సెస్సీ దంపతులు క్రూయిజ్లో ఉంటూనే తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వీలైనంత వరకు నడుస్తుంటారు. ఈ భారీ షిప్ ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి భూగోళాన్ని చుట్టుముడుతుంది. వెచ్చని వాతావరణంలో ఉండేందుకు సూర్యుడిని అనుసరిస్తుంది. జాన్, హెన్సెస్సీ దంపతులు తమకు కనిపించినవారందరికీ ఈ భూమిమీద నివసించడం కన్నా ఇలా క్రూయిజ్ షిప్లో బతకడమే చౌకైనదని, అదే ఉత్తమమని సలహా ఇస్తుంటారు. ఇది కూడా చదవండి: పాక్ రాజకీయాల్లో పెను సంచలనాలు! -
ఇది విజయమా... వైఫల్యమా?
చరిత్ర సృష్టించటం మంచిదే. కానీ ఆ చరిత్ర తరతరాలు చెప్పుకొనేలా వుండాలి. ఈ నెల 4న ప్రారంభమై ఎజెండా అంశాలన్నీ పూర్తికావటంతో ఒకరోజు ముందు గురువారం నిరవధిక వాయిదా పడిన పార్లమెంటు సమావేశాలు ఫలవంతమయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి. లోక్సభ వరకూ చూస్తే ఈ సమావేశాలు దాదాపు 62 గంటలు సాగాయి. అత్యంత కీలకమైన 18 బిల్లులు చర్చల అనంతరం ఆమోదం పొందాయి. ఇందులో భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ), నేర శిక్షాస్మృతి (సీఆర్పీసీ), సాక్ష్యాధారాల చట్టం స్థానంలో కొత్త చట్టాలుగా వస్తున్న భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య బిల్లులున్నాయి. టెలికమ్యూనికేషన్ల బిల్లువుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకాల బిల్లుంది. వార్తాపత్రికల, మేగజిన్ల కొత్త రిజిస్ట్రేషన్ చట్టం తాలూకు బిల్లు కూడావుంది. మొత్తంగా లోక్సభ 74 శాతం ఉత్పాదకతను చూపింది. రాజ్యసభ సైతం 17 బిల్లుల్ని ఆమోదించింది. సమావేశాలు 65 గంటల పాటు సాగాయి. దాని ఉత్పాదకత రేటు 79 శాతం వుంది. ఈ 17వ లోక్సభకు సంబంధించిఇవి 14వ సమావేశాలు. వీటన్నిటా ఈ సమావేశాలే అత్యంత ఫలవంతమైనవని గణాంకాలు వివరి స్తున్నాయి. వచ్చే సాధారణ ఎన్నికల్లోగా మరో సమావేశం మాత్రమే జరుగుతుంది. అందులో తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టడం మినహా మరే ఇతర కార్యకలాపాలూ వుండకపోవచ్చు. అయితే బాధాకరమైన అంశమేమంటే... ఈ ప్రధాన బిల్లుల చర్చల్లో దాదాపుగా విపక్షం లేదు. ఇరవైరెండేళ్ల నాటి చేదు అనుభవాన్ని గుర్తుకు తెస్తూ ఈనెల 13న యువకులు పదడుగుల ఎత్తునున్న ప్రేక్షకుల గ్యాలరీ నుంచి కిందకు దూకి పొగగొట్టాలు వదిలి దిగ్భ్రమపరిచారు. పార్లమెంటువెలుపల సైతం అదే సాగింది. అమెరికాలో వున్న ఖలిస్తానీ తీవ్రవాది పన్నూ పార్లమెంటుపై దాడిచేస్తామని అంతకు చాలారోజులముందే బెదిరించాడు. అప్రమత్తంగా వుండాలని ఇంటెలిజెన్స్ వర్గాలు సైతం సూచించాయి. అయినా పార్లమెంటు భద్రత వ్యవహారాలు చూసే వ్యవస్థ నిద్రాణమై వుంది. దాడి జరిగి పదిరోజులు గడుస్తున్నా దానికి సూత్రధారులెవరో ప్రజలకు తెలియలేదు. 2001 దాడినుంచి భద్రతా వ్యవస్థలు ఏ గుణపాఠమూ నేర్చుకోలేదని ఈ పరిణామం తెలియజేసింది. ఇదిగాక దేశాన్ని ఆశ్చర్యపరిచిన ఘటన మరొకటుంది. అది తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా సభా బహిష్కరణ. ఇన్ని చేదు ఉదంతాల మధ్య సమావేశాలు ఫలవంతంగా జరిగాయని అనుకోగలమా? విపక్షాలు పాలకులను నిలదీయటం, అర్థవంతమైన చర్చల ద్వారా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో సర్వసాధారణం. తమ సూచనలనూ, సలహాలనూపట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించే ప్రభుత్వానికి మూకుమ్మడిగా తమ అసమ్మతిని తెలియ జేయటానికి వాకౌట్ ఒక ఆయుధం. తగిన జవాబిచ్చినా విపక్ష సభ్యులు ఉద్దేశపూర్వకంగా సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నారని, నినాదాలు చేస్తున్నారని, ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారని, అధ్యక్ష స్థానాన్ని కించపరుస్తున్నారని, దురుద్దేశాలు ఆపాదిస్తున్నారని భావించినప్పుడు అందుకు కారకులైనవారిపై సస్పెన్షన్ వేటు వేయటం కూడా కొత్తేమీ కాదు. కానీ అటువంటి ఉదంతాలు రాను రాను పెరుగుతుండటం, రివాజుగా మారటం ఆందోళన కలిగిస్తోంది. ఈసారి ఉభయ సభలనుంచీ 146 మంది ఎంపీలు సస్పెండయ్యారు. లోక్సభలోకి యువకులు చొరబడటంపై ప్రధాని, హోంమంత్రి ప్రకటన చేయాలంటూ సభలో ఆందోళన నిర్వహించటం, వెల్లోకి వెళ్లి ప్లకార్డులు ప్రదర్శించటం కారణంగా ఈ సస్పెన్షన్లు చోటుచేసుకున్నాయి. కొందరు ఎంపీలపై సభాహక్కుల కమిటీకి ఫిర్యాదు వెళ్లింది. దేశం మొత్తాన్ని దిగ్భ్రమలో పడేసిన ఉదంతంపై ప్రకటన చేసే విషయంలోకేంద్రం ఎందుకంత పట్టుదలకు పోయిందో ఆశ్చర్యం కలిగిస్తుంది. లోక్సభలో దాడిచేసిన ఉదంతంపై ప్రకటన చేసినంత మాత్రాన విపక్షాలకు లొంగిపోయినట్టు కాదు... సంప్రదాయ విరుద్ధం అసలే కాదు. ఈ ఉదంతం వెనక ఏ శక్తులున్నాయో, వారి ఉద్దేశాలేమిటో వివరించటం వల్ల, తదనంతరం తీసుకున్న పటిష్ట చర్యలేమిటో చెప్పటంవల్ల దేశ ప్రజలకు సాంత్వన కలుగుతుంది. ఈ సస్పెన్షన్ల పర్యవసానంగా అత్యంత కీలకమైన బిల్లులపై విపక్షం ఆలోచనలేమిటో తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది. ఉదాహరణకు ఐపీసీ స్థానంలో వచ్చిన భారతీయ న్యాయసంహిత బిల్లు పోలీసులకు తగినంత జవాబుదారీతనం ఇవ్వకుండానే వారికి విస్తృతాధి కారాలు కట్టబెడుతున్నదని నిపుణులంటున్నారు. సీఆర్పీసీ స్థానంలో తెచ్చిన భారతీయ నాగరిక్ సురక్షా సంహితలో ఏ చర్య ఉగ్రవాదమో, ఏది కాదో నిర్ణయించే అధికారాన్ని పోలీసులకు ఇచ్చారు. దీన్ని న్యాయస్థానాల్లో సవాలు చేస్తామని విపక్షాలంటున్నాయి. ఇక టెలికాం బిల్లు అంశానికొస్తే జాతీయ భద్రతా ప్రయోజనాల కోసమంటూ తాత్కాలికంగా టెలికాం సర్వీసుల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకొనేందుకు అది వీలుకల్పిస్తోంది. సీఈసీ, ఈసీల నియామకం సంగతి సరేసరి. వీటన్నిటిపైనా లోతైన చర్చ సాగొద్దా? పౌరుల్లో తలెత్తిన సందేహాలకు సమాధానాలు దొరకాల్సిన అవసరం లేదా? కనీసం అందుకోసమైనా విపక్షాల సస్పెన్షన్లు ఎత్తివేసివుంటే పాలకపక్షం పెద్ద మనసు వెల్లడయ్యేది. గత దశాబ్దం వరకూ రాజీవ్గాంధీ హయాంలో 66 మంది ఎంపీల సస్పెన్షనే రికార్డుగా నమోదైతే, ఈసారి ఆ సంఖ్య 146కి ఎగబాకటం ఆందోళనకరం. సమావేశాల అంతరా యానికి కారకులెవరన్న అంశాన్నలా వుంచితే... సమన్వయంతో, సదవగాహనతో మెలగి పార్లమెంటరీ వ్యవస్థ ఔన్నత్యాన్ని నిలబెట్టడం ఇరుపక్షాల బాధ్యత కాదా? -
Winter Parliament Session 2023: క్రిమినల్ చట్టాలకు ఆమోదం
న్యూఢిల్లీ: బ్రిటిష్ వలస పాలన నాటి క్రిమినల్ చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న మూడు కీలక బిల్లులకు గురువారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లులను లోక్సభ బుధవారం మూజు వాణి ఓటుతో ఆమోదించిన విషయం తెలిసిందే. భారతీయ న్యాయ సంహిత బిల్లు, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత బిల్లు, భారతీయ సాక్ష్య బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్సభలో ప్రవేశ పెట్టారు. ఇండియన్ పీనల్ కోడ్–1860, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ యాక్ట్–1898, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్–1872 స్థానంలో ఈ మూడు బిల్లులను తీసుకొచ్చారు. ‘ఈ బిల్లులు చట్ట రూపం దాల్చితే ఎఫ్ఐఆర్ నమోదు ప్రక్రియ మొదలుకొని తీర్పు వరకు అన్నీ ఆన్లైన్ అవుతాయి. దేశ విద్రోహ చట్టం రద్దయి పోయింది. రాజద్రోహాన్ని దేశద్రోహంగా మార్చారు. దేశ సార్వభౌమాధికారం, సమగ్రతకు భంగం కలిగించే చర్యలకు కొత్త చట్టం ప్రకారం శిక్షలుంటాయి’అని అమిత్ షా వివరించారు. దేశంలోని అన్ని పోలీస్ స్టేషన్లు, కోర్టులు డిజిటైజ్ అవుతాయని చెప్పారు. వీటిల్లో చండీగఢ్ మొట్టమొదటగా డిజిటైజ్ అవుతుందన్నారు. బ్రిటిష్ పాలనలో గాంధీజీ, తిలక్, సావర్కర్ వంటి వారిని జైళ్లకు పంపిన నిబంధనలను తొలగించడం సంతోషాన్నిచ్చిందని మంత్రి చెప్పారు. బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ సభ్యులు సభలో లేనప్పటికీ మంత్రి ఆ పార్టీపై విమర్శలు చేశారు. ఇటాలియన్ అద్దాలు ధరించిన వారు భారత పార్లమెంట్ కొత్త క్రిమినల్ చట్టాలను రూపొందించడాన్ని సగర్వంగా భావించరంటూ కాంగ్రెస్ నేత సోనియానుద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. -
కాంగ్రెస్కు ‘కౌన్సిల్’ కష్టాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మూడో శాసనసభలో అధికారం చేపడుతున్న కాంగ్రెస్ పార్టీ శాసన మండలిలో మాత్రం విచిత్రమైన స్థితిని ఎదుర్కోనుంది. 40 మంది సభ్యులున్న మండలిలో 37 మంది ప్రతిపక్షాలకు చెందిన వారు కాగా కేవలం ముగ్గురు (బీఆర్ఎస్ను వీడిన ఇద్దరితో కలిపి) మాత్రమే కాంగ్రెస్ సభ్యులుగా ఉన్నారు. ప్రస్తుతం గవర్నర్ కోటాలో రెండు స్థానాలు మాత్రమే ఖాళీగా ఉండగా, ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ముగ్గురు సభ్యులు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. దీంతో ప్రస్తుతం కేవలం ఐదు స్థానాలు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. అయితే మూడు ఖాళీలు మాత్రమే స్వల్ప సమయంలో భర్తీ అయ్యే అవకాశం ఉంది. 2025 మార్చి లోపు ఏ కోటాలోనూ రిటైర్ అయ్యే సభ్యులు ఎవరూ లేకపోవడంతో కాంగ్రెస్ తరఫున పెద్ద సంఖ్యలో సభ్యులు మండలిలో అడుగు పెట్టేందుకు ఏడాదిన్నర వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. స్థానిక సంస్థల కోటాలో 14 స్థానాలు ఉండగా 2028లో 18 మంది రిటైర్ అవుతారు. ప్రస్తుతం మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ సహా ఎక్కువమంది బీఆర్ఎస్కు చెందిన వారే ఉండటంతో శాసనస భ ఆమోదించే తీర్మానాలు, బిల్లులు మండలిలో నెగ్గడం బీఆర్ఎస్పైనే ఆధారపడి ఉంటుంది. ముగ్గురు తోడయ్యే చాన్స్ శాసనమండలిలో గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు స్థానాలకు ఈ ఏడాది ఆగస్టులో దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ పేర్లను కేసీఆర్ ప్రభుత్వం సిఫారసు చేసింది. అయితే వీరు రాజకీయ పార్టీల సభ్యులుగా ఉన్నారనే కారణంతో గవర్నర్ తిరస్కరించారు. దీంతో ఈ రెండు ఖాళీల్లో ఇద్దరిని గవర్నర్ కోటాలో నామినేట్ చేసే అవకాశం కొత్త ప్రభుత్వానికి ఉంటుంది. ఎమ్మెల్సీ టి.జీవన్రెడ్డి జగిత్యాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినా ఓటమి పాలు కావడంతో ఎమ్మెల్సీగా కొనసాగనున్నారు. మహబూబ్నగర్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి (కల్వకుర్తి), కూచుకుళ్ల దామోదర్రెడ్డి ఆయన కుమారుడు రాజేశ్రెడ్డి (నాగర్కర్నూల్) కాంగ్రెస్ టికెట్ కోసం బీఆర్ఎస్ను వీడారు. కసిరెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ప్రస్తుతం మండలిలో జీవన్రెడ్డి, దామోదర్రెడ్డి మాత్రమే కాంగ్రెస్ సభ్యులుగా కొనసాగనున్నారు. మరోవైపు కసిరెడ్డితో పాటు ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి (జనగామ), కడియం శ్రీహరి (స్టేషన్ ఘనపూర్) కూడా ప్రస్తుత ఎన్నికల్లో శాసనసభకు ఎన్నికవడంతో మండలిలో 3 సీట్లు ఖాళీ కానున్నాయి. వీరిలో పల్లా రాజేశ్వర్రెడ్డి గ్రాడ్యుయేట్స్, కసిరెడ్డి స్థానిక సంస్థల కోటా నుంచి ఎన్నికైన నేపథ్యంలో వీరి స్థానంలో కొత్తగా వచ్చే వారు ప్రత్యక్ష ఎన్నిక ద్వారానే మండలిలో అడుగు పెట్టాల్సి ఉంటుంది. కడియం శ్రీహరి ఎమ్మెల్యే కోటాలో ఎన్నిక కావడంతో కాంగ్రెస్కు ఉన్న సంఖ్యా బలం ప్రకారం పార్టీ ఎంపిక చేసిన వారికి ఎమ్మెల్సీగా అవకాశం దక్కుతుంది. అంటే ఇప్పటికిప్పుడు గవర్నర్ కోటాలో ఇద్దరు, ఎమ్మెల్యే కోటాలో ఒకరే కాంగ్రెస్ తరఫున మండలికి ఎన్నికయ్యేందుకు అవకాశం ఉందన్నమాట. బీఆర్ఎస్ తరహాలో వలసలు? తొలిసారి 2014లో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ఇలాంటి పరిస్థితిని అధిగమించేందుకు కాంగ్రెస్, టీడీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకుని మండలిలో బలోపేతమైంది. ఇప్పుడదే తరహా వ్యూహాన్ని కాంగ్రెస్ కూడా అనుసరిస్తుందా? అన్న అంశంపై చర్చ ప్రారంభమైంది. -
పార్లమెంట్ సమావేశాల్లో 18 బిల్లులను ప్రవేశపెట్టనున్న కేంద్రం
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 4 నుంచి 22 వరకు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో 18 బిల్లులను ప్రవేశ పెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో రెండు జమ్మూకశ్మీర్, పుదుచ్చేరిలలో మహిళా రిజర్వేషన్ల వర్తింపు బిల్లులు, ఐపీసీ స్థానంలో తెచ్చే మూడు నేర శిక్షాస్మృతి బిల్లులు ఉన్నాయి. ఈ మేరకు లోక్సభ సెక్రటేరియట్ బులెటిన్ విడుదల చేసింది. శీతాకాల సమావేశాల్లో జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో ఉన్న సీట్ల సంఖ్యను 107 నుంచి 114కు పెంచే బిల్లు పార్లమెంట్ ముందుకు రానుంది. దీనివల్ల కశ్మీర్ నుంచి వలస వెళ్లినవారికి, శరణార్థులకు, ఎస్టీలకు చట్టసభలో ప్రాతినిథ్యం లభించనుంది. ఈ బిల్లులతోపాటు 2023-24కు సంబంధించి సప్లిమెంటరీ గ్రాంట్లపై సమావేశాల్లో చర్చ, ఓటింగ్ జరగనుంది. ఐపీసీ చట్టాల స్థానంలో ద భారతీయ న్యాయ సంహిత, ద భారతీయ నాగరిక సురక్ష సంహిత, ద భారతీయ సాక్ష్య బిల్లును కేంద్రం తీసుకొస్తుంది. మరోవైపు సమావేశాల ప్రారంభానికి ముందు డిసెంబర్ 2న అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. చదవండి: దంపతుల పోట్లాట దెబ్బకు.. దారి మళ్లిన విమానం! -
తమిళనాడు పిటిషన్పై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీస్
న్యూఢిల్లీ: రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లుల ఆమోదంలో గవర్నర్ తాత్సారం చేస్తున్నారంటూ తమిళనాడు ప్రభుత్వం వేసిన పిటిషన్పై కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు స్పందన కోరింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జే/బీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం ఈ మేరకు నోటీసు జారీ చేసింది. రాజ్యాంగ బద్ధమైన ఒక అధికారం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వ విధులను అడ్డుకుంటోందని తమిళనాడు ప్రభుత్వం పిటిషన్లో ఆరోపించింది. జోక్యం చేసుకోవాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన 12 బిల్లులు గవర్నర్ ఆర్ఎన్ రవి వద్ద పెండింగ్లో ఉన్నాయని విచారణ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణ ఈ నెల 20న చేపడతామని తెలిపింది. -
కీలక బిల్లులకు అసెంబ్లీ ఆమోదం
-
నేటి నుంచి పార్లమెంట్ ప్రత్యేక భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఐదు రోజుల పాటు జరుగనున్న ఈ సమావేశాలు పాత భవనంలో మొదలై మంగళవారం గణేశ్ చతుర్ధి సందర్భంగా కొత్త భవనంలోకి మారనున్నాయి. సమావేశాల్లో తొలిరోజు పార్లమెంట్లో 75 ఏళ్ల ప్రయాణంపై చర్చతో పాటు పలు కీలక బిల్లులు సభ ముందుకు రానున్నాయి. ప్రత్యేక చర్చ సహా కీలక బిల్లులు... సమావేశాల్లో ప్రధానంగా డిసెంబర్ 9, 1946న తొలిసారి పార్లమెంట్ సమావేశమైంది. అది మొదలు 75 ఏళ్ల ప్రయాణంపై తొలిరోజు చర్చ జరుగనుంది. ఈ 75 ఏళ్ల ప్రస్థానంలో పార్లమెంట్ విజయాలు, అనుభవాలు, జ్ఞాపకాలపై సభ్యులు మాట్లాడనున్నారు. దీంతో పాటే ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఇతర ఎన్నికల కమిషనర్ల (ఈసీ) నియామకానికి సంబంధించిన బిల్లును కూడా ప్రభుత్వం సభ ముందుకు తేనుంది. గత వర్షాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ïదీంతో పాటే లోక్సభలో ’ది అడ్వొకేట్స్ (సవరణ) బిల్లు, 2023’, ’ది ప్రెస్ అండ్ రిజి్రస్టేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు, 2023’ఉన్నాయి. ’ది పోస్టాఫీస్ బిల్లు, 2023’నూ లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. ‘వన్ నేషన్–వన్ ఎలక్షన్’, మహిళా రిజర్వేషన్ బిల్లు, ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) బిల్లులు సైతం ఈ సమావేశాల్లోనే తెస్తారనే ప్రచారం జరుగుతున్నా కేంద్ర వర్గాలు ధ్రువీకరించడం లేదు. నిరుద్యోగం..ద్రవ్యోల్బణంపై విపక్షాల పట్టు.. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో పాల్గొనేందుకు ఇండియా బ్లాక్కు చెందిన మొత్తం 24 పారీ్టలు అంగీకరించాయి. చైనా దురాక్రమణ, కుప్పకూలుతున్న ఆర్ధిక వ్యవస్థ, పెరుగుతున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, అదానీ కంపెనీ అక్రమాలు సహా పలు కీలక అంశాలను సమావేశాల్లో చర్చించాలని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియా గాం«ధీ ఇదివరకే ప్రధాని మోదీకి లేఖ రాశారు. పార్లమెంట్ నూతన భవనంపై జాతీయ జెండా పార్లమెంట్ నూతన భవనం గజద్వారంపై ఆదివారం సాయంత్రం ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆయన వెంట లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఉన్నారు. అంతకుముందు ధన్ఖడ్, బిర్లాలకు సీఆర్పీఎఫ్ పార్లమెంట్ డ్యూటీ గ్రూప్ బలగాలు వేర్వేరుగా గౌరవవందనం సమరి్పంచాయి. రేపు ఎంపీల ఫొటో సెషన్ ఎంపీలందరికోసం మంగళవారం ప్రత్యేక ఫొటో సెషన్ ఏర్పాటు చేశారు. పార్లమెంట్ సభ్యులంతా మంగళవారం ఉదయం 9.30 గంటలకు జరిగే గ్రూప్ ఫొటో సెషన్కు రావాల్సిందిగా లోక్సభ సెక్రటేరియట్ కోరింది. మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టాల్సిందే అఖిలపక్షం భేటీలో రాజకీయ పార్టీల పట్టు సోమవారం నుంచి మొదలయ్యే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని పలు రాజకీయ పార్టీలు ప్రభుత్వాన్ని గట్టిగా కోరాయి. అయితే, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రత్యేక సెషన్ నేపథ్యంలో ఆదివారం ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిల పక్షం భేటీకి పలు రాజకీయ పార్టీల నేతలు హాజరయ్యారు. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును ఈ సమావేశంలోనే సభ ముందుంచాలని పలువురు నేతలు కోరారు. బిల్లు ఏకాభిప్రాయంతో ఆమోదం పొందుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, కొన్ని ప్రాంతీయ పార్టీలు మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీలు, ఎస్సీలకు ప్రత్యేక కోటా కావాలంటూ డిమాండ్ చేస్తుండటం అడ్డంకిగా మారింది. -
ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఏ ఏ బిల్లులు ప్రవేశపెడతారు?
-
సగం సమయం కూడా పని చెయ్యలేదు
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు షెడ్యూల్ సమయంలో సగం కూడా పని చెయ్యలేదు. అయినప్పటికీ రికార్టు స్థాయిలో 23 బిల్లులు పాసయ్యాయి. మణిపూర్లో జాతుల ఘర్షణ ఈ సారి ఉభయసభల్ని కుదిపేసింది. లోక్సభ కార్యకలాపాలు 43% జరిగితే, రాజ్యసభ 55% సమయం కార్యకలాపాలు కొనసాగించింది. పాలసీ రీసెర్చ్ స్టడీస్ (పీఆర్ఎస్) అందించిన డేటా ప్రకారం లోక్సభ 17 రోజులు సమావేశమైంది. అవిశ్వాస తీర్మానంపై 20 గంటల సేపు చర్చ జరిగింది. ఈ చర్చలో 60 మంది సభ్యులు పాల్గొన్నారు. పార్లమెంటు ఆమోదించిన బిల్లుల్లో ఢిల్లీలో పాలనాధికార బిల్లు, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటక్షన్ బిల్లు, అటవీ సంరక్షణ సవరణ బిల్లు, మైన్స్ అండ్ మినరల్స్ సవరణ బిల్లు ప్రధానమైనవి. ఈసారి సభలో ప్రవేశ పెట్టిన బిల్లుల్లో 56% కేవలం ఎనిమిది రోజుల్లో పార్లమెంటు ఆమోదాన్ని పొందాయి. మరో 17% బిల్లుల్ని కమిటీల పరిశీలనకు పంపారు. -
అసెంబ్లీ సమావేశాలకు తెర
సాక్షి, హైదరాబాద్: నాలుగు రోజుల పాటు కొనసాగిన తెలంగాణ శాసనసభ ఎనిమిదో విడత సమావేశాలు ఆదివారం ముగిశాయి. తెలంగాణ రెండో శాసనసభ (2018–23)కు ఇవే చివరి విడత సమావేశాలు కావడంతో సభ్యులు భారంగా వీడ్కోలు పలికారు. చివరి రోజు సమావేశంలో ‘ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల సేవల విలీనం’బిల్లు తీవ్ర ఉత్కంఠ నడుమ సభ ముందుకు వచ్చి ఆమోదం పొందింది. ఆదివారం ఉదయం ప్రశ్నోత్తరాలు లేకుండా నేరుగా జీరో అవర్తో ప్రారంభమైన సభ ఆ తర్వాత ‘తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం – స్వరాష్ట్రంలో సాధించిన ప్రగతి’అనే అంశంపై జరిగిన లఘు చర్చకు సీఎం కె.చంద్రశేఖర్రావు 2.30 గంటల పాటు సవివరంగా సమాధానం ఇచ్చారు. అనంతరం మూడు ప్రభుత్వ బిల్లుల ఆమోదం, గద్దర్కు సంతాపం ప్రకటించిన తర్వాత సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ప్రకటించారు. ఉభయ సభలు హుందాగా సాగాయి: వేముల అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రజాస్వామ్య బద్ధంగా, సభ్యుల సస్పెన్షన్లు లేకుండా సాఫీగా జరిగాయని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. దేశంలోనే నంబర్వన్ అనే రీతిలో నడిపాం: పోచారం 2019 జనవరి 18న శాసనసభ స్పీకర్గా బాధ్యతలు స్వీకరించిన తాను అందరి సహకారంతో దేశంలోనే నంబర్ వన్ అనే రీతిలో సభను నడిపానని పోచారం శ్రీనివాస్రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఉద్యోగులను ప్రభుత్వ సేవల్లోకి తీసుకోవడం) బిల్లు 2023 శానసభ ఆమోదించడం పట్ల స్పీకర్ పోచారం, సీఎం కేసీఆర్కు టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ అసెంబ్లీలోని వారి చాంబర్లలో కలిసి ధన్యవాదాలు తెలిపారు. సురవరం ప్రతాపరెడ్డిపై వెలువరించిన ‘ససురవరం–తెలంగాణం’ మూడు సంకలనాలను శాసనసభలో సీఎం కేసీఆర్కు వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అందజేశారు. 4 రోజుల పాటు జరిగిన సమావేశాల్లో శాసనసభ 26.45 గంటలు, శాసన మండలి 23.10 గంటల పాటు సమావేశమైంది. -
నేడు అసెంబ్లీ ముందుకు మరో మూడు బిల్లులు
-
శాసనసభ ముందుకు 10 కీలక బిల్లులు
-
‘అవిశ్వాసం’ పూర్తయ్యేదాకా సభలో బిల్లులు ఆమోదించొద్దు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత ఇతర బిల్లులను ఆమోదించడం సరైంది కాదని కాంగ్రెస్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి మనీశ్ తివారీ అభిప్రాయపడ్డారు. అవిశ్వాసంపై చర్చ, ఓటింగ్ జరిగి ఫలితం తేలిన తర్వాతే ఇతర బిల్లును ప్రవేశపెట్టడం లేదా ఆమోదించడం చేయాలని అన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వంపై లోక్సభలో విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. నిబంధనల ప్రకారం దీనిపై 10 రోజుల్లోగా చర్చ, ఓటింగ్ నిర్వహించాల్సి ఉంది. బిల్లులను ఇష్టారాజ్యంగా ఆమోదింపజేసుకోవడానికి ఈ గడువును వాడుకోవద్దని మనీశ్ తివారీ హితవు పలికారు. అలా చేయడం పార్లమెంటరీ సంప్రదాయాలకు, నైతిక విలువలకు విరుద్ధమన్నారు. -
మరుగుదొడ్ల నిర్మాణంలో రూ.కోటి స్వాహా!
చింతపల్లి : మరుగుదొడ్డి నిర్మాణానికి ప్రభుత్వం మంజూరు చేసే బిల్లుల్లో అధికారులు చేతివాటం ప్రదర్శించారు. ఆన్లైన్లో లబ్ధిదారులకు బిల్లు చెల్లించినట్లుగా చూపించి.. ఏకంగా సుమారు రూ.కోటికి పైగా స్వాహా చేశారు. చింతపల్లి మండలంలో అధికారులు మరుగుదొడ్ల బిల్లుల్లో మొదటి విడత చెల్లించి.. రెండో విడతలో మొండి చేయి చూపించారు. మరి కొందరికి అసలు బిల్లులే చెల్లించలేదు. పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, అధికారులు వాటిని పంచుకు తిన్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిధులు స్వాహా చేసినట్లు తెలియడంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. రూ.6వేల చొప్పున రెండు విడతల్లో.. స్వచ్ఛ భారత్ మిషన్ కింద చింతపల్లి మండలంలోని 34 గ్రామాల్లో 3,874 మందిని మరుగుదొడ్లు లేనివారిని లబ్ధిదారులుగా గుర్తించారు. మరుగుదొడ్ల నిర్మాణానికి రెండు విడతల్లో రూ.6వేల చొప్పున రూ.12 వేలను లబ్ధిదారుడికి ప్రభుత్వం అందిస్తుంది. మరుగుదొడ్డి నిర్మాణ దశలను ఫీల్డ్ అసిస్టెంట్లు తనిఖీ చేసి నిర్మాణంలో ఉన్న మరుగుదొడ్డి వద్ద లబ్ధిదారుడిని ఉంచి ఫొటో తీసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. తర్వాత పంచాయతీ కార్యదర్శి, సంఘబంధం అధ్యక్షురాలు, సర్పంచ్ సంతకం చేసి పరిశీలించి రెండు విడతల్లో రూ.6 వేల చొప్పున లబ్ధిదారులకు చెక్కులు అందజేస్తారు. మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి అయిన తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్లు ధ్రువీకరణ అనంతరం గ్రామపంచాయతీ ఖాతాలో డబ్బులు జమ చేస్తారు. ఈ వెసులుబాటును అవకాశంగా చేసుకుని అంతా కుమ్మకై ్క బిల్లులు కాజేశారని ఆరోపణలు వస్తున్నాయి. అక్రమాలకు తెరలేపిన అధికారులు.. మరుగుదొడ్ల బిల్లులు బిల్లు ఇవ్వకుండానే ఇచ్చినట్లుగా ఉండడం ఏమిటని అధికారులను ఇటీవల కొందరు లబ్ధిదారులు నిలదీయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. 2018 సంవత్సరంలో మరుగుదొడ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు 2019లోపే కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో బిల్లులు చెల్లించింది. అయితే మొదటి విడత రూ.6 వేలు లబ్ధిదారులకు ఇచ్చి, మరో రూ.6 వేలు కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్టు మింగేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమకు అనుకూలంగా ఉన్న వారు మరుగుదొడ్లు నిర్మించుకోకున్నా నిర్మాణం జరిగినట్లుగా ఆన్లైన్ చేసి నిధులు స్వాహా చేశారని తెలుస్తోంది. పలు గ్రామాల్లో సొంతంగా మరుగుదొడ్లు నిర్మించుకున్న వారి సొమ్మును సైతం మింగేశారు. అసలైన లబ్ధిదారులు డబ్బుల గురించి అడిగితే ఆర్థిక సంవత్సరం ముగియడంతో నిధులు మురిగిపోయాయని చెబుతూ వస్తున్నారు. పైసా ఇవ్వలేదు స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా నా తల్లి పిల్లి యాదమ్మ పేరు మీద 2019లో మరుగుదొడ్డి నిర్మించుకున్నా. ఇందుకు సంబంధించి బిల్లు ఇవ్వాలని ఎన్నిసార్లు ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులను కలిసినా పట్టించుకోవడం లేదు. మరుగుదొడ్డి నిర్మించుకొని నాలుగేళ్లు కావస్తున్నా పైసా ఇవ్వలేదు. ఉన్నతాధికారులు విచారణ జరిపి న్యాయం చేయాలి. – పిల్లి లింగం, చింతపల్లి బిల్లులు ఇప్పించేలా చూస్తాం మరుగుదొడ్డి నిర్మించుకొని బిల్లు అందని కొందరు ఎంపీడీఓ కార్యాలయంలో సంప్రదించారు. స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా మరుగుదొడ్డి నిర్మించుకుని బిల్లులు పొందని వారిని ఏపీఓను సంప్రదించాలని సూచించాం. బిల్లులు అందని వారికి బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకుంటాం. – రాజు, ఎంపీడీఓ, చింతపల్లి బిల్లులు అందలే.. చింతపల్లి మండల కేంద్రంలోనే 180 మంది లబ్ధిదారులకు మొదటి విడత బిల్లు రూ.6 వేలు అందగా.. రెండో విడతకు సంబంధించి రూ.6 వేలు రావాల్సి ఉంది. కుర్మేడు గ్రామంలో 130, కుర్రంపల్లిలో 130 మందికి రెండు విడతలకు సంబంధించి బిల్లులు రావాల్సి ఉంది. వెంకటంపేట, నసర్లపల్లి గ్రామాల్లో మరుగుదొడ్డి నిర్మించుకోని వారి పేరిట బిల్లులు స్వాహా చేయగా మరుగుదొడ్డి నిర్మించుకున్న వారికి మాత్రం బిల్లులు అందించలేదు. నెల్వలపల్లి, ఉప్పరపల్లి, గడియగౌరారం, మల్లారెడ్డిపల్లి, హోమంతాలపల్లి, వింజమూరు గ్రామాల్లో కూడా లబ్ధిదారులకు బిల్లులు అందాల్సి ఉంది. -
అంగన్వాడీ కేంద్రాలకు బిల్లులు ఎప్పుడిస్తారో..?
కొత్తగూడెంటౌన్: అంగన్వాడీ కేంద్రాలకు బిల్లులు చెల్లించకపోవడంతో టీచర్లపై ఆర్థికభారం పడుతోంది. బిల్లుల మంజూరు కోసం ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సివస్తోంది. ప్రతి నెలా వచ్చిన వేతనంలో సగానికి పైగా ఖర్చు పెట్టాల్సి వస్తోందని అంగన్వాడీ టీచర్లు వాపోతున్నారు. కేంద్రాల నిర్వహణకు అద్దె చెల్లింపులు, గ్యాస్, ఈవెంట్, కూరగాయలు, పోషణ్ అభియాన్, స్టేషనరీ తదితర ఖర్చులు నెలకు సుమారు రూ. 6 వేలకు పైగా వస్తున్నాయని పేర్కొంటున్నారు. జిల్లాలో 11 ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో మెయిన్ అంగన్వాడీ కేంద్రాలు 1,434, మినీ కేంద్రాలు 626.. మొత్తం 2,060 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో కేంద్రానికి గ్యాస్ బిల్లు రూ.1200, ప్రతి నెలా 15 రోజులకు ఒక ఈవెంట్ చొప్పున రెండు ఈవెంట్లకు రూ.500, నెలకు సరిపడా కూరగాయలు రూ.600, మీటింగ్కు రూ.300, స్టేషనరీ ఖర్చులు ఏడాదికి రూ.1000తో పాటు పోషణ్ అభియాన్కు రూ.100ల చొప్పున నెలకు మొత్తం రూ.6,200 ఖర్చవుతోందని అంగన్వాడీ టీచర్లు పేర్కొంటున్నారు. అద్దె భవనాల్లో 785 కేంద్రాలు కొనసాగుతుండగా అద్దె బకాయి విడుదల చేయడం లేదు. ప్రతి అంగన్వాడీ కేంద్రం నిర్వహణకు అద్దె నెలకు ప్రాంతాన్ని బట్టి రూ. 600, రూ.1500, రూ.2 వేలు. రూ.3 వేల వరకు చెల్లించాల్సి ఉంది. కేంద్రాల నిర్వహణపై ప్రభావం అంగన్వాడీ కేంద్రాల్లో గ్యాస్కు సంబంధించి రూ.1,200 చొప్పున మూడు నెలల బిల్లు పెండింగ్లో ఉంది. ఈవెంట్ బిల్లులు 5 నెలకు రూ.2,500 చెల్లించాల్స ఉంది. ఆరోగ్యలక్ష్మి బిల్లు 3 నెలలుగా చెల్లించడంలేదు. కూరగాయల బిల్లు నెలకు రూ.600 చొప్పున ఏడాది నుంచి చెల్లించడంలేదు. జిల్లాలో 785 కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఒక్కో సెంటర్కు ఏరియాను బట్టి రూ.600 నుంచి రూ.3 వేల వరకు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం 8 నెలలుగా అద్దె బకాయి చెల్లించడంలేదు. మీటింగ్ ఖర్చులు కూడా ఏడాది నుంచి ఇవ్వడం లేదని టీచర్లు వాపోతున్నారు. ఏడాదికాలంగా బకాయిలు చెల్లించకుండా ఉంటే తాము కేంద్రాలను ఎలా నడపాలని అంగన్వాడీ టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్వహణపై ప్రభావం పడుతోందని చెబుతున్నారు. -
10,783 కనెక్షన్లకు ‘జీరో’ బిల్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అసలే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లను కొందరు అధికారులు, సిబ్బంది మరింతగా ముంచుతున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. నాగర్కర్నూల్ డివిజన్ పరిధిలో ఏకంగా 10,783 విద్యుత్ కనెక్షన్లకు జీరో యూనిట్ల వినియోగంతో బిల్లులు జారీ చేస్తున్నట్లు సంస్థ విజిలెన్స్ విభాగం విచారణలో తేలింది. దీంతో సంస్థ ప్రతి నెలా రూ. లక్షల్లో ఆదాయాన్ని నష్టపోయినట్లు వెల్లడైంది. అయితే ఆయా బిల్లుల వాస్తవ మొత్తాలను వినియోగదారుల నుంచి కొందరు అధికారులు, సిబ్బంది వసూలు చేసుకొని జేబులో వేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) చైర్మన్ తన్నీరు శ్రీరంగారావుకు జి.సత్యనారాయణ అనే న్యాయవాది చేసిన ఫిర్యాదుతో ఈ అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. సాధారణంగా ప్రతి విద్యుత్ కనెక్షన్కు ఒక మీటర్, ఆ మీటర్కు ఒక విశిష్ట సంఖ్య ఉంటుంది. కానీ ఒకే మీటర్ నంబర్తో 10,783 సర్విసు కనెక్షన్లు ఉన్నట్లు విజిలెన్స్ తేల్చినట్లు సమాచారం. 2,788 కనెక్షన్లపైనే విచారణ.. ఈఆర్సీ సూచనలతో టీఎస్ఎస్పీడీసీఎల్ విజిలెన్స్ విభాగంతో విచారణ జరిపించింది. 10,783 సర్వీసు కనెక్షన్లలో 2,788 కనెక్షన్లను మాత్రమే విజిలెన్స్ విభాగం తనఖీ చేయగలిగింది. సిబ్బంది కొరతతో మిగిలిన కనెక్షన్లను తనిఖీ చేయలేకపోయింది. తనఖీ చేసిన 2,788 కనెక్షన్లలో కేవలం 687 కనెక్షన్లకే మీటర్లున్నాయని, మిగిలిన 2101 కనెక్షన్లకు మీటర్లు లేవని గుర్తించింది. తనిఖీ చేసిన కనెక్షన్లకు సంబంధించి తప్పుడు మీటర్ రీడింగ్ను నమోదు చేసి బిల్లులు జారీ చేయడంతో సంస్థ రూ. 9.32 లక్షల ఆదాయాన్ని నష్టపోయినట్టు నిర్ధారించింది. 10,783 కనెక్షన్లలో ఏకంగా 4,842 కనెక్షన్లకు మీటర్లే లేవని నాగర్కర్నూల్ డీఈ మరో నివేదికలో టీఎస్ఎస్పీడీసీఎల్కు తెలియజేశారు. ఒక్క నాగర్కర్నూల్ డివిజన్ పరిధిలోనే ఈ పరిస్థితి బయటపడగా రాష్ట్రవ్యాప్తంగా ఈ తరహా అవకతవకతలతో డిస్కంలు రూ. వందల కోట్ల మేర ఆదాయాన్ని నష్టపోతున్నాయని ఆరోపణలున్నాయి. 41 మందిపై చర్యలకు ఆదేశం.. నాగర్కర్నూల్ డివిజన్లో వెలుగు చూసిన భారీ అక్రమాల్లో స్థానికంగా పనిచేసే 41 మంది ఓఅండ్ఎం విభాగం అధికారులు, సిబ్బంది, మరో ముగ్గురు అకౌంట్స్ విభాగం అధికారులను బాధ్యులుగా విజిలెన్స్ విభాగం తేల్చింది. ఈ నివేదిక ఆధారంగా 14 మంది ఏఈలు, నలుగురు ఏడీఈలు, మరొక డీఈపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సీఎండీ జి.రఘుమారెడ్డి ఆదేశించారు. వారి బాధ్యతారాహిత్యం, విధుల్లో నిర్లక్ష్యంతోనే మీటర్ రీడర్లు అక్రమాలకు పాల్పడ్డారని, వారితోపాటు ప్రైవేటు మీటర్ రీడింగ్ ఏజెన్సీపైనా చర్యలు తీసుకోవాలన్నారు. అయితే ఈ వ్యవహారంలో ఇంకా ఎవరినీ సస్పెండ్ చేయలేదని అధికార వర్గాలు తెలిపాయి. -
టెండర్లకే టెండర్ పెట్టారు
ఎక్కడైనా ఏవైనా పనులు చేపట్టాలంటే ముందుగా ఎంత ఖర్చవుతుందని అంచనా (ఎస్టిమేషన్) వేసుకోవాలి... ♦ ఆ తర్వాత ప్రభుత్వం నుంచి పరిపాలనాపరమైన అనుమతులు తీసుకోవాలి. ♦ అటు తర్వాత అంచనాకు అనుగుణంగా టెండర్లను ఆహ్వానించాలి. ♦ ఈ మేరకు నిర్దేశిత తేదీతో టెండర్ నోటిఫికేషన్ వేయాలి. ♦ దాఖలైన టెండర్లను పరిశీలించి కాంట్రాక్ట్ సంస్థను ఖరారు చేయాలి. ♦ అనంతరం వారితో ఒప్పందం కుదుర్చుకోవాలి. అప్పుడు పనులు మొదలెట్టాలి ♦ ఆ తర్వాత దశల వారీగా బిల్లులు చెల్లించుకుంటూ పోవాలి. ఏమిటీ నమ్మశక్యంగా లేదా.... అయితే ఒక్కసారి ఈ ఫొటో చూడండి.. ఇది వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని మర్రికుంట చెరువు. పైన చెప్పిన నిబంధనలేవీ పాటించకుండానే,టెండర్లు పిలవకుండానే దీన్ని ట్యాంక్ బండ్గా అభివృద్ధి చేయడంతోపాటు సుందరీకరణ పనులు కొనసాగించేస్తున్నారు. ఇలా అభివృద్ధి పనుల పేరిట నిబంధనలకు నీళ్లొదిలి.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ దోపిడీ పర్వానికి తెరలేపిన తీరుపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. ఎక్కడైనా.. ఏ ఊళ్లో అయినా ఇదే లెక్క.. అయితే వనపర్తి జిల్లాలోని మంత్రి ఇలాకాలో మాత్రం లెక్క వేరేగా ఉంటుంది. ♦ ముందుగానే పనులు చేపడతారు. ♦ పనులు పూర్తయ్యే దశలో అంచనాలు రూపొందిస్తారు. ♦ ఆ తర్వాత ప్రభుత్వం నుంచి పరిపాలనా అనుమతులుపొందుతారు. పోటీ లేకుండా గుట్టుచప్పుడు కాకుండాటెండర్ ప్రక్రియ ముగిస్తారు. ♦ బిల్లులు చేయించి.. డబ్బులు తీసేసుకుంటారు. ‘బినామీ’ కాంట్రాక్టర్లు..? నిబంధనల ప్రకారం ఒక్కోవర్క్ రూ.5 లక్షల వరకు అయితే నామినేషన్ పద్ధతిన కేటాయింపులు చేయాలి. అంతకంటే మించి అయితే టెండర్ పద్ధతిన కాంట్రాక్ట్లు అప్పగించాలి. కానీ వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన నాలుగు చెరువుల సుందరీకరణకు సంబంధించి ఒక్కో దానికి సుమారు రూ.30 లక్షలకు పైబడి వ్యయమవుతుందని అంచనా. ఈ మేరకు టెండర్ తప్పనిసరి కాగా.. పిలిస్తే పోటీ ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతో గుట్టుచప్పుడు కాకుండా కానిచ్చినట్లు తెలుస్తోంది. లోలోపల టెండర్ దక్కించుకున్న ప్రముఖ కాంట్రాక్టర్లు అధికార పారీ్టకి చెందిన నాయకులేనని తెలుస్తోంది. వీరంతా ఓ ముఖ్య నేతకు ప్రధాన అనుచరులుగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. నోరు మెదపని అధికారులు.. ప్రభుత్వం నుంచి అనుమతులు రాకుండానే పనులు ప్రారంభించడం.. పర్యవేక్షించాల్సిన ఇరిగేషన్, పంచాయతీరాజ్, అటవీ, మున్సిపల్ అధికారులు నోరు మెదపకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యనేత ఆదేశాల నేపథ్యంలో వారు నిబంధనలకు నీళ్లు వదిలినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. పనులు పూర్తయి న క్రమంలో వ్యయానికి మించి అంచనాలు రూపొందించి.. ఎక్కువ మొత్తంలో దండుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది లక్షి్మకుంట. 20వేల క్యూసెక్కుల నీటి సామర్థ్యంతో కూడిన ఈ చెరువు సుందరీకరణ పనులు 2021లో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత సుమారు ఎనిమిది నెలల అనంతరం రూ.31.75 లక్షల వ్యయం అవుతుందని అంచనా వేశారు. 2022 సెప్టెంబర్లో పరిపాలనా అనుమతులు రాగా.. గత నెల 14న రూ.29.59 లక్షలు మంజూరయ్యాయి. పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో పనులు కొనసాగగా.. అటవీ శాఖ కు సంబంధించి కంపా నిధులు వెచ్చించారు. ఇది రాజనగరం చెరువు. ట్యాంక్ బండ్ నిర్మాణంతో పాటు సుందరీకరణ పనులు గత ఏడాది జనవరిలో ప్రారంభమయ్యాయి. సుమారు రూ.49 లక్షల వ్యయంతో అదే ఏడాది ఫిబ్రవరిలో ఎస్టిమేషన్ (అంచనా) వేయగా.. అదే నెలలో పరిపాలనాపరమైన అనుమతులు లభించాయి. మార్చిలో కాంట్రాక్ట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోగా.. జూన్లో కొంత మేర బిల్లులు మంజూరయ్యాయి. 2021 ఆగస్టులో తాళ్లచెరువు సుందరీకరణ పనులు ప్రారంభం కాగా..గత ఏడాది ఫిబ్రవరిలో అంచనా వేసి ప్రభుత్వానికి పంపించారు.అనుమతులు రాగా.. మార్చిలో టెండర్ ప్రక్రియ పూర్తయి ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాత జూన్లో బిల్లులు మంజూరయ్యాయి. -
గవర్నర్ తమిళిసై తీరుపై సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ పంచాయతీ సుప్రీంకోర్టుకు చేరింది. తమిళిసై సౌందరరాజన్ 10 బిల్లులను ఆపడంతో తాడోపేడో తేల్చుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆమె వ్యవహరశైలిపై సుప్రీంలో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. బిల్లులను గవర్నర్ ఆమోదించేలా ఆదేశించాలని చీఫ్ సెక్రెటరీ పటిషన్లో కోరారు. ప్రతివాదిగా గవర్నర్ పేరును చేర్చారు. ఇది సుప్రీంకోర్టులో రేపు( శుక్రవారం) విచారణకు వచ్చే అవకాశముంది. 'గవర్నర్ బిల్లులను ఆపడం రాజ్యాంగ విరుద్ధం. ఆలస్యం అవ్వడం వల్ల బిల్లుల ప్రయోజనాలు దెబ్బతింటాయి. పది బిల్లులుపై ఆమోదమ ? కాదా ? చెప్పడం లేదు. సహేతుక కారణాలు లేకుండా పెండింగ్ సరికాదు. సంబంధిత మంత్రులు గవర్నర్ను కలిసి వివరణలు కూడా ఇచ్చారు. త్వరలోనే ఆమోదిస్తామని గవర్నర్ చెప్పినా ఆచరణలో లేదు. ఆర్టికల్ 163 ప్రకారం మంత్రిమండలి సలహా మేరకే విధులు నిర్వర్తించాలి. స్వతంత్రంగా వ్యవహరించాలని భావించరాదు.' అని తెలంగాణ సీఎస్ పటిషన్లో పేర్కొన్నారు. నాటి రాజ్యాంగ సభ డిబేట్లను కూడా ప్రస్తావించారు. కాగా.. హైకోర్టు జోక్యంతో బడ్జెట్ -గవర్నర్ ప్రసంగం ఇష్యూ సమసి పోయిన విషయం తెలిసిందే. చదవండి: నార్సింగి శ్రీచైతన్య కాలేజీ వద్ద ఉద్రిక్తత.. ఎంపీ కోమటిరెడ్డి దీక్ష -
‘ట్విటర్ సంస్థ పాత అప్పులకు నాకు ఏమాత్రం సంబంధం లేదు’
ట్విటర్లో ఖర్చులు తగ్గించేందుకు సీఈవో ఎలాన్ మస్క్ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే సగానికి పైగా సిబ్బందిని తొలగించారు. బ్లూ టిక్ సబ్స్క్రిప్షన్ను అందుబాటులోకి తేనున్నారు. వరుస ఆర్ధిక ఇబ్బందులతో సంస్థ దివాలా తీయకుండా నివారించడమే లక్ష్యంగా మరిన్ని పెయిడ్ సర్వీసుల్ని యూజర్లకు పరిచయం చేయనున్నారు. తాజాగా తాను బాస్గా ట్విటర్ను కొనుగోలు చేయకముందు ఉన్న అప్పులతో తనకు ఏమాత్రం సంబంధం లేదని అంటున్నారు. వాటిని చెల్లించేందుకు మస్క్ తిరస్కరిస్తున్నట్లు తెలుస్తోంది. సంస్థ మాజీ ఎగ్జిక్యూటివ్లు ట్రావెల్ ఇన్వాయిస్ల గురించి అడిగే అధికారం పాత యాజమాన్యం ఎలాన్ మస్క్కు ఇవ్వలేదు. కాబట్టే పాత బకాయిల్ని చెల్లించేందుకు మస్క్ నిరాకరిస్తున్నారంటూ ప్రస్తుతం ట్విటర్లో పనిచేస్తున్న ఉద్యోగులు, మాజీ ఉద్యోగులు న్యూయార్స్ టైమ్స్కు చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ అంశం చర్చాంశనీయంగా మారింది. -
ఆంధ్రజ్యోతి కథనం అవాస్తవం
సాక్షి, అమరావతి: డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు చెల్లింపులు సరిగా జరగడంలేదంటూ ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురించిన కథనం అవాస్తవమని ఆరోగ్యశ్రీ సీఈవో హరేంధిరప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఏడాది జూలై వరకు నెట్వర్క్ ఆస్పత్రులకు క్లెయిమ్స్ చెల్లించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 2022–23 సంవత్సరానికి విడుదల చేసిన ఆయుష్మాన్ భారత్ నిధుల్ని నెట్వర్క్ ఆస్పత్రులకు వినియోగించారనేది సత్యదూరమని పేర్కొన్నారు. ఇప్పటివరకు నేషనల్ హెల్త్ ఏజెన్సీ నుంచి ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదని స్పష్టం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1,790 కోట్లు ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించిందని తెలిపారు. ఈహెచ్ఎస్కు సంబంధించి నెట్వర్క్ ఆస్పత్రులకు రూ.199.5 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు. ఈహెచ్ఎస్ కింద ఈ ఏడాది ఇప్పటివరకు 3,25,390 మంది చికిత్స పొందారని వివరించారు. చదవండి: (గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు మరో గుడ్న్యూస్) -
3 బిల్లులకు అసెంబ్లీ ఆమోదం
సాక్షి, అమరావతి: శాసనసభ సోమవారం మూడు బిల్లులను ఆమోదించింది. కార్పొరేట్, ఇతర పెద్ద కంపెనీలు రాష్ట్రంలో తమ ఫ్రాంచైజీలు, డీలర్లకు లైసెన్సు ఇచ్చేటప్పుడు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజులకు సంబంధించిన భారత (ఏపీ) స్టాంపు చట్ట సవరణ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. విశ్వవిద్యాలయాల్లో బోధనా సిబ్బంది నియామకంలో ఏకరూపత ఉండేలా సంబంధిత కమిటీల్లో ఉన్నత విద్య, ఆర్థిక శాఖాధికారులను నియమించేందుకు ఉద్దేశించిన ఏపీ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లును, క్యాంపస్ల వారీగా ఉన్న నియామక ప్రక్రియ, రోస్టర్ నిర్ణయాన్ని యూనివర్సిటీ ప్రాతిపదికగా చేసే అధికారాన్ని రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయానికి దఖలుపరిచే సవరణ బిల్లును సభ ఆమోదించింది. కాగా, మరో ఐదు బిల్లులను మంత్రులు సభలో ప్రవేశపెట్టారు. ఏపీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ చట్ట సవరణ బిల్లును ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టారు. ఏపీ సర్వే, సరిహద్దుల చట్ట సవరణ బిల్లు, ఏపీ భూమి హక్కులు, పట్టాదార్ పాస్ పుస్తకాల చట్ట సవరణ బిల్లు, ఏపీ కౌలుదారీ (ఆంధ్ర ప్రాంత) రద్దు చట్ట సవరణ బిల్లును రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఏపీ కో–ఆపరేటివ్ సొసైటీల చట్ట సవరణ బిల్లును వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి ప్రవేశపెట్టారు. మండలిలో నాలుగు బిల్లులు ఆమోదం అసెంబ్లీలో ఆమోదించిన నాలుగు బిల్లులను శాసన మండలిలో సభ్యులు ఆమోదించారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ (సవరణ) బిల్లు–2022, ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (సవరణ) బిల్లు–2022, ఆంధ్రప్రదేశ్ సివిల్ సరీ్వసెస్ (డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ ట్రిబ్యునల్) (రద్దు) బిల్లు–2022, ఆంధ్రప్రదేశ్ (వ్యవసాయ ఉత్పత్తి, పశువుల) మార్కెట్లు (సవరణ) బిల్లు–2022లను మండలి ఆమోదించింది. ఇదీ చదవండి: ఏపీ అసెంబ్లీకి ఫోన్ ట్యాపింగ్ హౌస్ కమిటీ నివేదిక -
సభ ముందుకు ఏడు బిల్లులు.. ఈటెలపై చర్యలకు పట్టు?
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 6న సమావేశమై వాయిదా పడిన తెలంగాణ శాసనసభ, శాసన మండలి వానాకాలం సమావేశాలు సోమవారం తిరిగి ప్రారంభం కానున్నాయి. ఆరో తేదీన జరిగిన బీఏసీ సమావేశంలో ఈ నెల 12, 13 తేదీల్లో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. సోమవారం ఏడు బిల్లులు, పలు పత్రాలు సభ ముందుకు రానున్నాయి. ఉదయం 10 గంటలకు శాసనసభ ప్రారంభమైన వెంటనే 6న జరిగిన బీఏసీ సమావేశం నివేదికను సీఎం కేసీఆర్ సభకు సమర్పిస్తారు. అనంతరం తెలంగాణ సదరన్ డిస్కమ్, ట్రాన్స్కో, టీఎస్ రెడ్కో వార్షిక నివేదికలు, తెలంగాణ సమగ్ర శిక్షా 2020–21 ఆడిట్ రిపోర్ట్, స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ రెగ్యులేషన్స్ పత్రాలను సంబంధిత శాఖల మంత్రులు సభకు సమర్పిస్తారు. పాలేరు మాజీ ఎమ్మెల్యే భీమపాక భూపతిరావు మృతిపై స్పీకర్ స్థానం నుంచి సంతాప ప్రకటన ఉంటుంది. జీఎస్టీ సవరణ బిల్లుతో పాటు.. తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లు 2022, ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా బిల్లు 2022, తెలంగాణ మున్సిపల్ చట్టాలు 2022 సవరణ బిల్లు సభ ముందుకు వస్తాయి. వీటితో పాటు తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ సవరణ బిల్లు, తెలంగాణ ఫారెస్ట్ యూనివర్సిటీ బిల్లు, తెలంగాణ యూనివర్సిటీల కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లు, తెలంగాణ మోటారు వాహనాల టాక్సేషన్ సవరణ బిల్లులను సంబంధిత శాఖల మంత్రులు సమర్పిస్తారు. శాసనసభ, మండలిలో ‘కేంద్ర విద్యుత్ బిల్లు.. పర్యవసానాలు అంశం’పై స్వల్ప కాలిక చర్చ జరుగుతుంది. ఈటలపై చర్యలకు అధికార పక్షం పట్టు? బీఏసీ సమావేశానికి బీజేపీ సభ్యులను ఆహ్వానించక పోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్పీకర్పై ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను టీఆర్ఎస్ సభ్యులు ప్రస్తావించే అవకాశం ఉంది. సభ్యుల ప్రవర్తనా నియమావళికి ఈటల వ్యాఖ్యలు విరుద్ధంగా ఉన్నాయని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈటలపై చర్యలు తీసుకోవాలంటూ టీఆర్ఎస్ సభ్యులు పట్టుపట్టే అవకాశాలు ఉన్నాయి. ఇదీ చదవండి: Krishnam Raju: రారాజు ఇకలేరు -
ఒక్క రూపాయి కూడా వదలకుండా..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు వినియోగదారుల నుంచి ముక్కుపిండి మరీ విద్యుత్ బిల్లులను వసూలు చేస్తున్నాయి. ఒక్క రూపాయిని కూడా వదలకుండా తీసుకుంటున్నాయి. ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి విద్యుత్ చార్జీల పెంపు అమల్లోకి రాగా అప్పుడు ఏప్రిల్ 15లోపు ఏ తేదీ వరకైతే బిల్లు వేశారో దానికి పాత టారిఫ్నే అమలు చేశారు. అయితే ఏప్రిల్లో ఎన్ని రోజులకైతే పాత చార్జీలు వసూలు చేశారో ఆ రోజులకు తాజాగా కొత్త చార్జీలు వర్తింపజేసి మరీ రావాల్సిన అదనపు సొమ్మును వసూలు చేస్తున్నారు. టారిఫ్ డిఫరెన్స్ పేరుతో.. ప్రస్తుతం ప్రతి నెలా 1 నుంచి 15వ తేదీలోగా మునుపటి నెల వినియోగానికి సంబంధించిన మీటర్ రీడింగ్ తీసి విద్యుత్ బిల్లులను జారీ చేస్తూ వస్తున్నారు. ఇదే తరహాలో గత మార్చి నెల విద్యుత్ బిల్లులను ఏప్రిల్ 1 నుంచి 15వ తేదీలోగా జారీ చేశారు. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపు అమల్లోకి వచ్చినా బిల్లులు జారీ చేసిన తేదీ వరకు పాత టారీఫ్నే వర్తింపజేశారు. అంటే మార్చి 1–15 నుంచి ఏప్రిల్ 1–15 కాలాన్ని ఒక నెలగా పరిగణించి ఏప్రిల్లో బిల్లు జారీ చేశారు. ఒకే నెలలో రెండు వేర్వేరు టారిఫ్లు వర్తింపజేసి బిల్లు వసూలు చేయడం సాధ్యం కాదు కాబట్టి ఈ రకంగా చేయాల్సి వచ్చింది. అయితే ప్రస్తుత మే నెలలో జారీ చేస్తున్న గత ఏప్రిల్ నెలకు సంబంధించిన విద్యుత్ బిల్లుల్లో మాత్రం ‘ఏప్రిల్ 1–15’కాలానికి సైతం పెరిగిన విద్యుత్ టారిఫ్ను వర్తింపజేసి ‘టారిఫ్ డిఫరెన్స్’పేరుతో చార్జీలను డిస్కంలు విధిస్తున్నాయి. ఉదాహరణకు మార్చి 1–15 నుంచి ఏప్రిల్ 1–15 మధ్య కాలంలో ఓ వినియోగదారుడు 200 యూనిట్లు వినియోగిస్తే అందులో ఏప్రిల్ 1–15 మధ్యన ఎన్ని యూనిట్లు వాడి ఉంటాడో సగటున లెక్క వేసి ఆ మేరకు యూనిట్లకు పెరిగిన విద్యుత్ చార్జీలను వర్తింపజేసి అదనంగా రావాల్సిన మొత్తాన్ని మే బిల్లులో వేస్తున్నాయి. ‘ఏప్రిల్ 1, 2022 నుంచి కొత్త టారిఫ్ ప్రకారం రావాల్సిన మొత్తాన్ని మే బిల్లులో వేయడం జరిగింది’అని బిల్లు కింద ముద్రిస్తున్నారు. వాస్తవానికి ఏప్రిల్ 1–15 కాలానికి పాత విద్యుత్ చార్జీల ప్రకారం ఇప్పటికే వినియోగదారులు బిల్లులు చెల్లించారు. కొత్త విద్యుత్ చార్జీల ప్రకారం అదనంగా రావాల్సిన బిల్లులను ఇప్పుడు వసూలు చేసుకుంటున్నాయి. గతంలో విద్యుత్ చార్జీలు పెరిగిన సందర్భాల్లో ఇలా అదనపు చార్జీలు వసూలు చేసిన దాఖలాల్లేవని అధికారులు పేర్కొంటున్నారు. -
‘నెల తక్కువ’ బిల్లులపై ఈఆర్సీ నజర్
సాక్షి, హైదరాబాద్: నెల పూర్తికాకముందే విద్యుత్ బిల్లులు జారీ చేసే క్రమంలో బిల్లులు భారీగా పెరిగిపోతున్నాయని.. ఈ నెల 9న ‘నెల తక్కువ.. మోత ఎక్కువ’ శీర్షికతో ‘సాక్షి’ ప్రచురించిన కథనంపై ఈఆర్సీ స్పందించింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని డిస్కంలను తాజాగా ఆదేశించింది. డిస్కంల నుంచి వివరణ అందాక పరిశీలించి తగిన ఆదేశాలు జారీ చేస్తామని ఈఆర్సీ చైర్మన్ తన్నీరు శ్రీరంగారావు ‘సాక్షి’కి తెలిపారు. నిబంధనల ప్రకారం నెల రోజులకు మీటర్ రీడింగ్ తీసి బిల్లులు జారీ చేయాలి. కానీ ఆచరణలో అది సాధ్య మవట్లేదు. నెల దాటాక కాని, లేదా నెల పూర్తికాక ముందే బిల్లులు జారీ చేస్తున్నారు. అయితే నెల గడిచాక బిల్లులు జారీ చేస్తే వినియోగం పెరిగి బిల్లు శ్లాబులు మారిపోతున్నాయి. దీంతో బిల్లులు బాగా పెరుగుతున్నాయని గతంలో వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. దీంతో నెల రోజుల సగటు వినియోగాన్ని అంచనా వేసి సంబంధిత శ్లాబు కిందే బిల్లులు జారీ చేయాలని డిస్కంలను ఈఆర్సీ ఆదేశించింది. ఈ ఉత్తర్వులను అడ్డుగా పెట్టుకుని, నెల పూర్తికాకుండానే జారీ చేసే బిల్లుల శ్లాబులను మార్చి అధిక బిల్లులు జారీ చేస్తున్నాయి. సకాలంలో మీటర్ రీడింగ్ తీయకపోవడం డిస్కంల పొరపాటైనా వినియోగదారులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని ‘సాక్షి’ కథనాన్ని ప్రచురించింది. ఈ విషయంలో డిస్కంల చర్యలు ఈఆర్సీ టారీఫ్ ఉత్తర్వులకు విరుద్ధంగా ఉన్నాయని నిపుణులు ఆరోపిస్తున్నారు. డిస్కంల చర్యలను తప్పుబడుతూ ఈఆర్సీ ఆదేశాలు జారీ చేస్తే ఏటా రూ.కోట్ల భారం వినియోగదారులకు తప్పనుంది. -
ప్రజలకు షాక్.. ఎవర్నీ వదల్లే..!
సాక్షి, హైదరాబాద్: ఐదేళ్లుగా పొంచి ఉన్న విద్యుత్ చార్జీల బాంబు ఒక్కసారిగా పేలనుంది. పేద, మధ్య తరగతి, ధనిక అనే తేడా లేకుండా అన్ని వర్గాలపై బాదుడుకు రంగం సిద్ధమైంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి విద్యుత్ చార్జీలు పెరగనుండగా, మే నుంచి కరెంటు బిల్లులు షాక్ కొట్టబోతున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా రూ.6,831 కోట్ల విద్యుత్ చార్జీల పెంపును రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు ప్రతిపాదించాయి. ఎల్టీ కేటగిరీలోని గృహ వినియోగంపై యూనిట్కు 50 పైసలు చొప్పున, ఎల్టీ కేటగిరీలోని గృహేతర వినియోగంతో పాటు హెచ్టీ కేటగిరీలోని అన్ని రకాల వినియోగంపై యూనిట్కు రూ.1 చొప్పున విద్యుత్ చార్జీలు పెంచుకో వడానికి అనుమతి కోరా యి. ప్రతిపాదనలు అమల్లోకి వస్తే ఏటా.. ఎల్టీ విభాగంలోని 1.10 కోట్ల గృహాలు, 44 లక్షల గృహేతర కేటగిరీల వినియోగదారులపై 2,110 కోట్లు, హెచ్టీ విభాగంలోని అన్ని కేటగిరీలు కలిపి 13,717 మంది వినియోగదారులపై రూ.4,721 కోట్ల అదనపు భారం పడనుంది. ఈ మేరకు 2022–23కు సంబంధించిన విద్యుత్ చార్జీల పెంపు (టారిఫ్ సవరణ) ప్రతిపాదనలను దక్షిణ/ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల (టీఎస్ఎస్పీ డీసీఎల్/టీఎస్ఎన్పీడీసీఎల్) సీఎండీలు జి.రఘుమారెడ్డి, ఎ.గోపాల్రావు సోమవారం రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి సమర్పించారు. ఈఆర్సీ చైర్మన్ టి.శ్రీరంగారావు, సభ్యులు ఎండీ.మనోహర్రాజు, బండారు కృష్ణయ్యకు ప్రతిపాదనలు అందజేసిన అనంతరం విలేకరులకు వివరాలు వెల్లడించారు. వచ్చే ఏడాది ఏప్రిల్లో వినియోగం తర్వాత మేలో జారీ చేసే బిల్లుల్లో చార్జీల పెంపు ప్రభావం వినియోగదారులకు కనిపించనుంది. ఆర్థిక లోటు రూ.16,580 కోట్లు రాష్ట్రంలోని అన్ని వర్గాల వినియోగదారులకు 2022–23లో నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు రూ.53,054 కోట్ల వ్యయం కానుందని, ఆమేరకు వార్షిక ఆదాయ అవసరాలుండనున్నట్టు డిస్కంలు అంచనా వేశాయి. ప్రస్తుత విద్యుత్ చార్జీలను యధాతథంగా అమలు చేస్తే రూ.36,474 కోట్ల ఆదాయం మాత్రమే రానుందని, దీంతో రూ.16,580 కోట్ల ఆదాయ లోటు ఉంటుందని నివేదించాయి. రాష్ట్ర ప్రభుత్వం రూ.5,652 కోట్ల మేర సబ్సిడీ సొమ్ము ఇవ్వనుందని, దీంతో మొత్తం ఆదాయం రూ.42,126 కోట్లకు పెరిగి, ఆదాయ లోటు రూ.10,928 కోట్లకు తగ్గుతుందని అంచనా వేశాయి. విద్యుత్ చార్జీల పెంపు ద్వారా రూ.6,831 కోట్ల అదనపు ఆదాయాన్ని సమకూర్చుకుంటామని, ఇంకా మిగిలే రూ.4,097 కోట్ల ఆదాయ లోటును అంతర్గత సమర్థత చర్యలు/ ప్రభుత్వ అదనపు మద్దతుతో పూడ్చుకుంటామని ఈఆర్సీకి నివేదించాయి. ఉచితం, సబ్సిడీ పథకాలు యధాతథం వ్యవసాయానికి ఉచిత విద్యుత్తో పాటు ఎస్సీ, ఎస్టీల గృహాలకు నెలకు ఉచితంగా 101 యూనిట్లు వంటివి యధాతథంగా కొనసాగనున్నాయి. నాయి బ్రాహ్మణుల హెయిర్ సెలూన్లు, రజకుల లాండ్రీ షాపులు, దోభీ ఘాట్లకు నెలకు ఉచితంగా 250 యూనిట్లు, పవర్ లూమ్స్, పౌల్ట్రీలు, స్పిన్నింగ్ మిల్లులకు యూనిట్పై రూ.2 చొప్పున సబ్సిడీ వంటి పథకాలు కూడా కొనసాగుతాయని రఘుమారెడ్డి వెల్లడించారు. ఐదేళ్ల గ్యాప్ తర్వాత 18.72 శాతం పెంపు తెలంగాణ వచ్చాక తొలిసారిగా 2015–16లో, తర్వాత 2016–17లో విద్యుత్ చార్జీలు పెంచారు. ఆ తర్వాత ఐదేళ్లుగా ఎలాంటి చార్జీలు పెంచలేదు. ప్రస్తుత చార్జీలతో 2022–23లో రూ.36,474 కోట్ల ఆదాయం రానుండగా, రూ.6,831 కోట్ల మేర విద్యుత్ చార్జీలు పెంచాలని డిస్కంలు ప్రతిపాదించాయి. అంటే వినియోగదారులపై 18.72 శాతం అదనపు భారం పడనుందన్నమాట. విద్యుత్ టారిఫ్లోని ఎనర్జీ చార్జీల పెంపును మాత్రమే సోమవారం బహిర్గతం చేయగా, ఫిక్స్డ్ చార్జీలు ఎంత పెంచబోతున్నారన్న అంశాన్ని ఇంకా బయటపెట్టలేదు. ఫిక్స్డ్ చార్జీలతో సహా మొత్తం రిటైల్ టారిఫ్ షెడ్యూల్ను ప్రకటించిన తర్వాతే వినియోగదారులకు సంబంధించిన బిల్లులు ఏ మేరకు పెరగబోతున్నాయన్న అంశంపై స్పష్టత రానుంది. కొత్తగా లోడ్ చార్జీలు! కిలోవాట్కు రూ.15 ఎనర్జీ చార్జీలు, ఫిక్స్డ్/డిమాండ్ చార్జీలు కలిపి వినియోగదారులకు బిల్లులను జారీ చేస్తారు. ఇప్పటివరకు గృహ వినియోగదారులపై ఎనర్జీ చార్జీలే విధిస్తుండగా, కొత్తగా వారి లోడ్ సామర్థ్యం ఆధారంగా కిలోవాట్కు రూ.15 చొప్పున ఫిక్స్డ్/ డిమాండ్ చార్జీలను వసూలు చేయాలని డిస్కంలు ప్రతిపాదించాయి. వాణి జ్య, పరిశ్రమల కేటగిరీలో ఫిక్స్డ్ చార్జీల పెంపు నకు కూడా అనుమతి కోరినట్టు తెలిసింది. -
Parliament : ముగిసిన శీతాకాల సమావేశాలు.. ఎన్నిగంటలు వృథా చేశారంటే..
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిశాయి. కరోనా పరిస్థితులతో పాటుగా ఎజెండాలో చర్చించాల్సిన అంశాలు పూర్తయిన నేపథ్యంలో వింటర్ సెషెన్ను ఒకరోజు ముందుగానే కేంద్ర ప్రభుత్వం ముగించింది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబరు 29 న ప్రారంభమయ్యాయి. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 23 వరకు జరగాల్సి ఉండగా.. ఒక రోజు ముందుగానే డిసెంబరు 22)న ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. శీతాకాల సమావేశంలో భాగంగా లోక్సభ ముందుకు 13 బిల్లులు రాగా, 11 బిల్లులు ఆమోదం పొందాయి. దీనిలో కీలకమైన సాగుచట్టాల రద్దు బిల్లు, ఎన్నికల చట్టాల సవరణల బిల్లులు ఇందులో ఉన్నాయి. అదే విధంగా యువత వివాహా వయసు పెంపుదలకు సంబంధించిన బిల్లును కేంద్రం స్టాండింగ్ కమిటీకి పంపించింది. In the #WinterSession, 11 bills have been passed by both the Houses and 6 bills have been sent to Standing Committee. Opposition's conduct throughout the session was unfortunate and they repeatedly resorted to creating ruckus and disturbing the proceedings. — Pralhad Joshi (@JoshiPralhad) December 22, 2021 ఎంపీల నిరసనల కారణంగా శీతాకాల సమావేశాల్లో 18 గంటలు వృథా అయినట్లు స్పీకర్ ఓంబిర్లా ప్రకటించారు. అదే విధంగా రాజ్యసభను కూడా వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు. కాగా, లఖీంపూర్ ఖేరీ ఘటన, 12 మంది ఎంపీల సస్పెన్షన్ పార్లమెంట్ను కుదిపేసిన సంగతి తెలిసిందే. చదవండి: ఎస్సై పరీక్షల్లో అభ్యర్థి హైటెక్ ఛీటింగ్.. ట్వీట్ చేసిన ఐపీఎస్ ఆఫీసర్ -
14 సవరణ బిల్లులకు శాసనసభ ఆమోదం
సాక్షి, అమరావతి: రాష్ట్ర శాసనసభ మంగళవారం 14 సవరణ బిల్లులను మూజువాణి ఓటుతో ఆమోదించింది. వీటిలో ఉద్యాన మొక్కల పెంపకం నియంత్రణ బిల్లు నుంచి మున్సిపల్ కార్పొరేషన్ల సవరణ బిల్లు వరకు ఉన్నాయి. మరో రెండు బిల్లులు.. ఏపీ మోటార్ వెహికల్ ట్యాక్సేషన్ (సవరణ) బిల్లును, సీఎం వైఎస్ జగన్ తరఫున ఏపీ సినిమా (నియంత్రణ), సవరణ బిల్లు–2021ను మంత్రి పేర్ని నాని సభలో ప్రవేశపెట్టారు. శాసనసభ ఆమోదించిన బిల్లులు.. మంత్రి కన్నబాబు ప్రవేశపెట్టిన ఏపీ హార్టికల్చర్ నర్సరీల నియంత్రణ సవరణ బిల్లు–2021 మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తరఫున మంత్రి బొత్స సత్యనారాయణ ప్రవేశపెట్టిన ఏపీ పంచాయతీరాజ్ (సవరణ) బిల్లు–2021, ఏపీ సెల్ఫ్హెల్ప్ గ్రూప్ (ఎస్హెచ్జీ) ఉమెన్ కో– కంట్రిబ్యూటరీ పెన్షన్ (సవరణ) బిల్లు–2021; మున్సిపల్ కార్పొరేషన్స్ (సవరణ) బిల్లు–2021. పశు సంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ప్రవేశపెట్టిన ఏపీ బొవైన్ బ్రీడింగ్ (పశు సంతతి) (ఉత్పత్తి నియంత్రణ, పశు వీర్య అమ్మకం, కృత్రిమ గర్భోత్పత్తి సేవలు) బిల్లు–2021 ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ప్రవేశపెట్టిన ఏపీ భూహక్కుల, పట్టాదార్ పాస్ పుస్తకాల (సవరణ) బిల్లు–2021, ఏపీ అసైన్డ్ భూముల (బదిలీల నిషేధం) సవరణ బిల్లు–2021, ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి తరఫున ప్రవేశపెట్టిన ఏపీ రెగ్యులేషన్ ఆఫ్ ట్రేడ్ ఇన్ ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్, విదేశీ మద్యం (సవరణ) బిల్లు–2021 ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ప్రవేశపెట్టిన శ్రీ వేంకటేశ్వర వైద్య శాస్త్రాల సంస్థ (సవరణ) బిల్లు–2021.మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ప్రవేశపెట్టిన ఏపీ ధర్మాదాయ, హిందూ మత సంస్థల, దేవదాయ (సవరణ) బిల్లు–2021, ఏపీ ధర్మాదాయ, హిందూ మతసంస్థల, ధర్మాదాయ (రెండో సవరణ) బిల్లు–2021 మంత్రి సురేష్ తరఫున మంత్రి కన్నబాబు ప్రవేశపెట్టిన ఏపీ విద్యా (సవరణ) బిల్లు–2021, ఏపీ ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ (సవరణ) బిల్లు–2021, ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి ప్రవేశపెట్టిన ఏపీ ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటు, నియంత్రణ (సవరణ) బిల్లు. -
మహిళా సాధికారతపై స్వల్పకాలిక చర్చ
Live Updates Time: 04:15 Pm ► మహిళా సాధికారతపై స్వల్పకాలిక చర్చలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. మాది అక్కాచెల్లెమ్మలకు మంచి చేసే ప్రభుత్వమని అన్నారు. అమ్మ ఒడి పథకం ద్వారా అండగా నిలుస్తున్నామని పేర్కొన్నారు. ► రాష్ట్రంలో 61 లక్షా 73 వేల పెన్షన్లు అందిస్తున్నాం. అందులో 36 లక్షల 70వేల మంది మహిళలకు పెన్షన్ ఇస్తున్నామన్నారు. త్వరలోనే ఈబీసీ నేస్తం అనే కొత పథకానికి శ్రీకారం చుడతామని, వచ్చే జనవరి 9 నుంచి ఈబీసీ నేస్తం అమలు చేయనున్నట్లు తెలిపారు. ►కేబినెట్లో మహిళా సాధికారతకు పెద్ద పీట వేయడంతో పాటు చరిత్రలో తొలిసారిగా ఎస్ఈసీగా మహిళను నియమించామన్నారు. మహిళలపై నేరం జరిగిన వెంటనే చర్యలు తీసుకుంటున్నామని, మహిళల భద్రతపై ఇతర రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. Time: 03:05 Pm ► హోంమంత్రి మేకతోటి సుచరిత మాట్లాడతూ.. నామినేటెడ్ పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టాలను చేశామని అన్నారు. గుంటూరులో జరిగిన రమ్య హత్య కేసులో నిందితుడిని 24 గంటల్లో అరెస్టు చేసి ఆరు రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేసినట్లు తెలిపారు. ఈ ప్రభుత్వంలో ఎఫ్ఐఆర్లు చాలా వేగంగా నమోదు చేస్తున్నామన్నారు. దిశ చట్టాన్ని కొంత మంది అవహేళన చేస్తూ చట్టానికి సంబంధించిన కాపీలను తగల పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. Time: 02:30 Pm ► మహిళా సాధికారతపై ఎమ్మెల్యే ఉష శ్రీ చరణ్ మాట్లాడుతూ.. అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వచ్చేలా సీఎం జగన్ చర్యలు చేపట్టారని అన్నారు. Time: 02:15 PM ► ఏపీ శాసన మండలి సమావేశం రేపటికి వాయిదా పడింది. Time: 01: 55 PM ► మహిళా సాధికారతపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విడదల రజని మాట్లాడుతూ.. సీఎం జగన్ మహిళా పక్షపాతి అని కొనియాడారు. దిశ యాప్ ద్వారా మహిళలకు భద్రత కల్పిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. Time: 01:15 PM ► అమ్మ జన్మనిస్తే.. జగనన్న జీవితాన్నిచ్చాడని ఎమ్మెల్యే రోజా అన్నారు. మహిళల తలరాతను మార్చే పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇది మహిళా పక్షపాతి ప్రభుత్వమని ఎమ్మెల్యే రోజా తెలిపారు. Time: 12:57 PM ► మహిళా సాధికారతపై నగరి ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. గర్భంలో ఉన్న ఆడపిల్ల నుంచి వృద్ధాప్యంలో ఉన్న అవ్వ వరకు.. ప్రతి దశలో మహిళలకు వైఎస్ జగన్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే రోజా అన్నారు. Time: 12:40 Pm ► వైఎస్ఆర్ కాపునేస్తం పథకం ద్వారా ఏటా రూ.75 వేలు, జగనన్న వసతి దీవెన ద్వారా రూ. 2 వేల కోట్ల సాయం లబ్దిదారులకు అందనుందని మంత్రి తానేటి వనిత తెలిపారు. Time: 12: 30 PM ► రుణమాఫీ పథకం వల్ల స్వయం సహాయక సంఘాలకు ఊతం లభిస్తుందని మంత్రి వనిత తెలిపారు. వైఎస్ఆర్ చేయూతతో మహిళల ఆర్థికాభ్యున్నతి సాధ్యమవుతుందని మంత్రి వనిత పేర్కొన్నారు. Time: 12:24 PM ► ఏపీ అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి. సమావేశాల్లో మహిళా సాధికారతపై స్వల్ప కాలిక చర్చ కొనసాగుతోంది. మంత్రి తానేటి వనిత మాట్లాడుతున్నారు. Time: 10:20 AM ► ఏపీ అసెంబ్లీలో రేపు(శుక్రవారం) బీసీ జనగణనపై తీర్మానం చేయనున్నారు. బీసీ జన గణన చేపట్టాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేయనున్నారు. ఈ తీర్మానంను సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టనున్నారు. Time: 10: 10 AM ► ఈ నెల 26 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయం తీసుకుంది. Time: 09:50 AM ► అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో బీఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎం వైఎస్ జగన్, మంత్రులు బుగ్గన, అనిల్ కుమార్ యాదవ్, కన్నబాబు హాజరు కాగా టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు హజరయ్యారు. Time: 09: 09 AM ► ఏపీలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై అత్యవసరంగా చర్చించాలన్న టీడీపీ వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. ► ఇటీవల మరణించిన ఎంఎ అజీజ్, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి, ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్యే రంగనాయకులు, మాజీ ఎమ్మెల్యే టీ.వెంకయ్య, మాజీ ఎమ్మెల్యే వంకా శ్రీనివాసరావు మృతికి ఏపీ అసెంబ్లీ సంతాపం ప్రకటించింది. సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదటిగా బద్వేలు ఎమ్మెల్యేగా ఇటీవల గెలిచిన డాక్టర్ దాసరి సుధ ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం 14 బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. దివంగతులైన 10 మంది మాజీ సభ్యులకు సభ నివాళి అర్పించనున్నారు. మహిళా సాధికారత మీద స్వల్పకాల చర్చ జరగనుంది. -
Telangana Assembly: నేడు రెండు బిల్లులపై చర్చ
సాక్షి, హైదరాబాద్: రెండు రోజుల విరామం తర్వాత రాష్ట్ర శాసనసభ ఎనిమిదో విడత నాలుగో రోజు సమావేశాలు సోమ వారం తిరిగి ప్రారంభమవుతాయి. నాలుగో రోజు సమావేశాల్లో భాగంగా ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపడతారు. అనంతరం ఉభయ సభల్లో తెలంగాణ ప్రైవేటు యూనివర్సిటీ నిబంధనలు–2019కి సవరణలకు సంబంధించిన పత్రాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమర్పిస్తారు. శాసనసభలో ‘రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమ కార్యక్రమాలు’, ‘హైదరాబాద్ పాత నగరంలో అభివృద్ధి’పై స్వల్పకాలిక చర్చ జరుగుతుంది. స్వల్పకాలిక చర్చ అనంతరం గత శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టిన రెండు ప్రభుత్వ బిల్లుల ఆమోదం కోసం చర్చ జరుగుతుంది. శాసనమండలిలో హరితహారంపై స్వల్పకాలిక చర్చతోపాటు ఈ నెల 1న శాసనసభ ఆమోదించిన నాలుగు ప్రభుత్వ బిల్లులపై చర్చ జరుగుతుంది. -
ఏపీ: రెండు కీలక బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన రెండు కీలక బిల్లులకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గురువారం ఆమోదముద్ర వేశారు. ఒకటి ఎస్సీ కమిషన్ ఏర్పాటు బిల్లు అయితే మరొకటి విద్యుత్ సుంకం (సవరణ) బిల్లు. వివరాలివీ.. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ ఏర్పాటుకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ సీఎం వైఎస్ జగన్ వేర్వేరు కమిషన్లను ఏర్పాటుచేస్తూ బిల్లును తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 2019లో అసెంబ్లీలో ఆమోదించిన బిల్లును మండలిలో టీడీపీ సభ్యులు వెనక్కి పంపించారు. దీంతో గతేడాది జనవరిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం మరోమారు బిల్లును యథాతథంగా ప్రవేశపెట్టి ఆమోదించింది. అసెంబ్లీ ఆమోదం పొందిన బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపించడంతో గత నెల 27న రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి వీకే పట్నాయక్ అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణామాచార్యులకు పంపిన అధికారిక సమాచారం గురువారం చేరింది. దీంతో ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్లు ఏర్పాటుచేయాలని ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ను సీఎం నెరవేర్చినట్లయింది. ఇప్పటివరకు ఒకే కమిషన్ పరిధిలో ఉన్న ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్లు ఏర్పాటుచేయడంవల్ల అవి మరింత సమర్థవంతంగా పనిచేసే వీలు కలుగుతుంది. ఏపీ విద్యుత్ సుంకం సవరణ బిల్లుకూ.. ఇక రెండోదైన ఏపీ విద్యుత్ సుంకం (సవరణ) బిల్లు–2020కు కూడా రాష్ట్రపతి ఆమోదం లభించింది. గతేడాది డిసెంబర్ 2న ఈ బిల్లును విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దశాబ్దాల క్రితం నిర్ణయించిన విద్యుత్ సుంకంతో వస్తున్న ఇబ్బందులను అధిగమించేందుకు చట్టంలో స్వల్ప మార్పుచేసి అటు ప్రజలకు, ఇటు ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా ఈ బిల్లు రూపొందించారు. దీంతో ఇక రాష్ట్రంలో వేర్వేరు కేటగిరీల వినియోగదారులకు, వేర్వేరు సమయాల్లో వేర్వేరుగా విద్యుత్ సుంకం విధిస్తారు. నష్టాలు తగ్గించి.. నాణ్యమైన విద్యుత్ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలోని రైతులకు తొమ్మిది గంటలపాటు ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. అదే విధంగా పదివేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పుతున్నారు. ప్రజలకు 24 గంటలూ నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేయాలనే ఉద్దేశంతోనే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సుంకం (సవరణ) బిల్లు–2020ను తీసుకొచ్చారు. గత టీడీపీ ప్రభుత్వంలో అవసరానికి మించి విద్యుత్కు రేటు చెల్లించారు. కేవలం రెండు, మూడు రూపాయలకే యూనిట్ విద్యుత్ను ఇస్తామని అమ్మకందారులు ముందుకొచ్చినప్పటికీ ఉద్దేశపూర్వకంగా రూ.4.80 చెల్లించి టీడీపీ పాలకులు కొనుగోలు చేశారు. తద్వారా రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టారు. దీని నుంచి బయటపడటానికి ఈ బిల్లు దోహదం చేస్తుంది. ఇప్పటివరకు యూనిట్కు 6పైసల చొప్పున సుంకం విధిస్తున్నారు. ఈ బిల్లుతో కేటగిరీల బట్టి, విద్యుత్ వాడే సమయాలను బట్టి సుంకం విధిస్తారు. -
ఏపీ: రైతు ఖాతాల్లోకి విద్యుత్ బిల్లుల సొమ్ము
సాక్షి, అమరావతి: వైఎస్సార్ ఉచిత విద్యుత్ పథకం కింద శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ పంపుసెట్ల విద్యుత్ బిల్లులకు సంబంధించి 3,97,31,348 రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమచేస్తూ ప్రభుత్వం బుధవారం జీవో జారీచేసింది. శ్రీకాకుళం జిల్లాలో ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రయోగాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే. జూన్ నెలలో జరిగిన విద్యుత్ వినియోగాన్ని లెక్కించిన తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ తమ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపింది. ఈ మొత్తాన్ని రైతు ఖాతాల్లోకి జమ చేస్తున్నట్టు ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి జీవోలో పేర్కొన్నారు. -
రూ.238.15 కోట్ల ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ కింద సేవలందిస్తున్న 640 నెట్వర్క్ ఆస్పత్రులకు జనవరి 15 నాటికి ఉన్న బిల్లులు రూ.238.15 కోట్లు చెల్లించినట్టు ఆరోగ్యశ్రీ సీఈవో డా.ఎ.మల్లికార్జున ఓ ప్రకటనలో తెలిపారు. పేద ప్రజల సంక్షేమం కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న డా.వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద సకాలంలో బిల్లులు ఇస్తున్నామని, దీనివల్ల ఆరోగ్యశ్రీ సేవలు పటిష్టంగా అమలవుతున్నాయన్నారు. రూ.238.15 కోట్ల సొమ్మును రెండు దఫాలుగా వారి ఖాతాలకు జమచేసినట్టు సీఈవో తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు చెల్లింపులు చేస్తున్నట్టు తెలిపారు. చదవండి: ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు కొత్త నమూనాలో టెన్త్ పబ్లిక్ పరీక్షలు -
బడ్జెట్ సమావేశాల్లో 38 బిల్లులు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం 38 బిల్లులను ప్రవేశపెట్టనుంది. వీటిలో కేంద్ర బడ్జెట్ సహా ఐదు ఫైనాన్స్ బిల్లులు ఉన్నాయి. నాలుగు ఆర్డినెన్స్ల స్థానంలో బిల్లులను ప్రతిపాదించనుంది. అలాగే 3 చట్టాల ఉపసంహరణకు సంబంధించిన బిల్లులు ఉన్నాయి. శాసన సంబంధిత బిల్లులు 1. నేషనల్ క్యాపిటల్ రీజియన్, సమీప ప్రాంతాల వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ బిల్లు–2021 (ఆర్డినెన్స్ స్థానంలో.) 2. మధ్యవర్తిత్వం, సయోధ్య (సవరణ) బిల్లు, 2021 (ఆర్డినెన్స్ స్థానంలో) 3. జాతీయ రాజధాని భూభాగం ఢిల్లీ చట్టాలు (ప్రత్యేక నిబంధనలు) రెండవ (సవరణ) బిల్లు, 2021 (ఆర్డినెన్స్ స్థానంలో) 4. జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు, 2021 ( ఆర్డినెన్స్ స్థానంలో) 5. డీఎన్ఏ టెక్నాలజీ (యూజ్ అండ్ అప్లికేషన్) రెగ్యులేషన్ బిల్లు, 2019. 6. తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల సంక్షేమం (సవరణ) బిల్లు, 2019 7. ది ఫ్యాక్టరింగ్ రెగ్యులేషన్ (సవరణ) బిల్లు, 2020 8. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ మేనేజ్మెంట్ బిల్లు, 2019 9. సినిమాటోగ్రాఫ్ (సవరణ) బిల్లు, 2019 10. లోక్సభ ఆమోదించిన ఆనకట్ట భద్రతా బిల్లు, 2019. 11. లోక్సభ ఆమోదించిన మేజర్ పోర్ట్ అథారిటీస్ బిల్లు, 2020 12. పురుగుమందుల యాజమాన్య బిల్లు, 2020 13. నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్కేర్ ప్రొఫెషన్స్ బిల్లు, 2020 14. లోక్సభ ఆమోదించిన 2020 మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (సవరణ) బిల్లు. 15. గనుల (సవరణ) బిల్లు, 2011 (ఉపసంహరణ కోసం) 16. అంతర్రాష్ట్ర వలస కార్మికుల (ఉపాధి నియంత్రణ, సేవా నిబంధనలు) సవరణ బిల్లు, 2011 (ఉపసంహరణ కోసం) 17. భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంబంధిత చట్టాలు (సవరణ) బిల్లు, 2013 (ఉపసంహరణ కోసం) 18. ఎంప్లాయ్మెంట్ ఎక్సే్ఛంజెస్∙(ఖాళీల తప్పనిసరి నోటిఫికేషన్) సవరణ బిల్లు, 2013 (ఉపసంహరణ కోసం) 19. మల్టీ–స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ (సవరణ) బిల్లు, 2021 20. నేషనల్ ఇన్సి్టట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (సవరణ) బిల్లు, 2021 21. చార్టెడ్ అకౌంటెంట్లు, కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంటెంట్లు, కంపెనీ సెక్రటరీలు (సవరణ) బిల్లు, 2021 22. కాంపిటిషన్ (సవరణ) బిల్లు, 2021 23. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (సవరణ) బిల్లు, 2021 24. నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ (నాబ్ఫిడ్) బిల్లు, 2021 25. క్రిప్టోకరెన్సీ, డిజిటల్ కరెన్సీ రెగ్యులేషన్ బిల్లు 2021 26. జాతీయ రాజధాని భూభాగం ఢిల్లీ బిల్లు, 2021 27. మెట్రో రైలు (నిర్మాణం, ఆపరేషన్, నిర్వహణ) బిల్లు, 2021 28. గనులు, ఖనిజాలు (అభివృద్ధి, నియంత్రణ) సవరణ బిల్లు, 2021 29. విద్యుత్ (సవరణ) బిల్లు, 2021 30. మెరైన్ ఎయిడ్స్ టు నావిగేషన్ బిల్లు, 2021 31. ఇన్లాండ్ వెసల్స్ బిల్లు, 2021 32. మాన్యువల్ స్కావెంజర్లుగా ఉపాధి నిషేధం, పునరావాస సవరణ బిల్లు, 2021 33. జువెనైల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ మరియు రక్షణ) సవరణ బిల్లు, 2021 ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన బిల్లులు 1. ఆర్థిక బిల్లు, 2021 2. 2020–21 నిధుల కోసం అనుబంధ డిమాండ్లపై అప్రొప్రియేషన్ బిల్లు 3. 2021–22 నిధుల డిమాండ్లపై చర్చ, ఓటింగ్, సంబంధిత అప్రొప్రియేషన్ బిల్లు 4. 2020–21 ఆర్థిక సంవత్సరానికి జమ్మూ కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాల నిధుల కోసం అప్రొప్రియేషన్ బిల్లు 5. 2021–22 ఆర్థిక సంవత్సరానికి జమ్మూ కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతాల నిధుల కోసం అప్రొప్రియేషన్ బిల్లు -
రైతుల ఆందోళనలపై పాంపియోకు లేఖ
వాషింగ్టన్ : నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ అంశంపై భారత విదేశాంగ శాఖతో చర్చించాలని అమెరికా చట్టసభల్లోని కొంతమంది శానససభ్యులు ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్ పాంపియోకు లేఖ రాశారు. అయితే రైతు నిరసల విషయంలో ఇతర దేశాల జోక్యం అనవసరమని, గతంలోనే భారత్ స్పష్టం చేసింది. ఇది భారత అంతర్గత వ్యవహారాలకు సంబంధించిన అంశమని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ ఇదివరకే చెప్పారు.కానీ ఇది భారత్తో ముడిపడి ఉన్న అందరికీ ఆందోళన కలిగించే అంశమని, భారత అమెరికన్లపై కూడా ఈ ఉద్యమం ప్రభావం చూపుతుందని వారు లేఖలో పేర్కొన్నారు. (‘రైతులను దేశ ద్రోహులని భావిస్తే పాపం చేసినట్లే’ ) ముఖ్యంగా పంజాబ్తో ముడిపడి ఉన్న సిక్కు అమెరికన్లకు ఇది మరింత ఆందోళన కలిగించే అంశమని తెలిపారు. భారత చట్టాలను తాము గౌరవిస్తామని, అయితే రైతుల ఆర్థిక భద్రతపై కూడా తమకు అనుమానం ఉందని పేర్కొన్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని భారత విదేశాంగ శాఖతో చర్చించి, సానుకూలతతో సమస్య పరిష్కరించేలా చూడాలని కోరారు. లేఖ రాసిన వారిలో ప్రవాస భారతీయురాలు ప్రమీలా జయపాల్ కూడా ఉన్నారు. కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా హర్యానా, పంజాబ్ సహా ఇతర రాష్ట్రాల నుండి వేలాది మంది రైతులు నవంబర్26 నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇవి రైతు వ్యతిరేక చట్టాలని, కనీస మద్దతు ధరకు అవకాశం లేకుండా చేస్తాయని, కార్పోరేట్ల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడేలా చేస్తాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరికి దేశంలోని వివిధ వర్గాల నుంచి సహా అమెరికాకు చెందిన పలువురు శాసనసభ్యులు తమ సంఘీభావాన్ని తెలిపిన సంగతి తెలిసిందే. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు రైతులను అనుమతించాలని ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఈ నిరసనను ఒక్క రాష్ట్రానికే పరిమితమైనదిగా కాకుండా జాతీయ నిరసనగా పరిగణించాలని లేఖలో ప్రధానిని కోరారు. (కేంద్రానికి రైతుల హెచ్చరిక ) -
‘ఒకట్రెండు ఎన్నికల్లో గెలిస్తే విర్రవీగడం పనికిరాదు’
సాక్షి, హుజూరాబాద్: కులాలు, మతాలు, ప్రాంతీయ విభేదాలు లేకుండా కలిసిమెలిసి ఉండే తెలంగాణ ప్రజలను బీజేపీ రెచ్చగొడుతోందని, తెలంగాణ ప్రభుత్వ పాలనపై విషం చిమ్ముతోందని రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శనివారం హుజూరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో మాట్లాడారు. బీజేపీ నాయకులు ప్రజల మధ్య చిచ్చుపెట్టే పనులు మానుకోవాలన్నారు. స్థాయిని మించి విమర్శలు చేయొద్దని హితవు పలికారు. ఒకటి, రెండు ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన విర్రవీగడం పనికిరాదన్నారు. బీజేపీ పాలనలో నిరుద్యోగం పెరిగిందన్నారు. పరిశ్రమల రాక తగ్గుతుందని తెలిపారు. ఇప్పటికే బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీ సంస్థలను ప్రైవేటీకరణ చేసిందన్నారు. కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు కార్పొరేట్ సంస్థలకు మేలు చేసేలా ఉన్నాయని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలతో రైతుల ఆత్మహత్యలు తగ్గాయన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు తప్ప, అదనంగా ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదని చెప్పారు. సమావేశంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ కనుమల్ల విజయ, టీఆర్ఎస్ రాష్ట్ర సహయ కార్యదర్శి బండ శ్రీనివాస్, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వరరావు, వీణవంక ఎంపీపీ మునిపట్ల రేణుక, జమ్మికుంట జెడ్పీటీసీ డాక్టర్ శ్రీరామ్శ్యాం, నాయకులు కుమార్యాదవ్, సందమల్ల బాబు పాల్గొన్నారు. -
మీ స్థాయెంత.. మీ లెక్కెంత..?
సాక్షి, నిర్మల్ : ‘పన్నులు కట్టేది ప్రజలు.. పదవులు ఇచ్చేది ప్రజలు. ఢిల్లీకి చేరే డబ్బు ట్రంప్, జిన్పింగ్ది కాదు. రాష్ట్రాల నుంచి ప్రజలు చెల్లించే పన్నులే. నిధులు తీసుకోవడం రాష్ట్రాల హక్కు. కేంద్రం ఒక్క పార్టీ జాగీరా..! నిధులిస్తున్నం ఫొటోలు పెట్టండని దబాయించడమేంది. కేంద్రంతో బాగుపడిన ఒక్క స్కీం కూడా లేదు. ఓ వైపు రాష్ట్రం వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తుంటే.. కేంద్రం కొత్త చట్టాలతో తిరోగమనం పట్టిస్తోంది. రాష్ట్రంలో మీరు చేస్తున్నది ప్రజాస్వామ్యమా..? దాదాగిరా..? సీఎంను, మంత్రులను ఏకవచనంతో పిలుస్తారా..? మీ స్థాయి ఎంత..? లెక్కెంత..?’ అంటూ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పరోక్షంగా బీజేపీపై విరుచుకుపడ్డారు. నిర్మల్ జిల్లాలోని రూరల్ మండలం చిట్యాల, ఖానాపూర్ మండలం దిలావర్పూర్ గ్రామాల్లో అటవీశాఖమంత్రి ఇంద్రకరణ్రెడ్డి, రైతుబంధు రాష్ట్ర కో–ఆర్డినేటర్ పల్లా రాజేశ్వర్రెడ్డితో కలిసి శనివారం రైతు వేదికలను ప్రారంభించారు. వ్యవసాయం పెరిగితేనే పరిశ్రమలు, ఉపాధి, ఉద్యోగాలు, వ్యాపారాలు పెరుగుతాయని, పల్లెల్లో సాగు బాగుంటేనే పట్టణాల్లో వెలుగులు ఉంటాయని, రైతు సమస్యలకు ఆధునిక పరిష్కారాలు చూపుతూ.. రైతువేదికలను ప్రపంచానికే ఆదర్శంగా నిలబెడతామని తెలిపారు. చదవండి: మానవత్వం చాటుకున్న మంత్రి హరీశ్ వేదికల ద్వారా రైతుల ఇంటికే ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహారకాలు డోర్డెలివరీ చేస్తామన్నారు. వ్యవసాయ అభివృద్ధికి రైతుబంధు మొదలు ఉచిత విద్యుత్ వరకు రాష్ట్రం అందిస్తుంటే కేంద్రం మాత్రం రివర్స్గేర్లో పనిచేస్తోందని మండిపడ్డారు. మూడు కొత్త చట్టాలతో వ్యవసాయాన్ని బడావ్యాపారుల చేతుల్లో పెడుతోందని విమర్శించారు. భవిష్యత్తులో రైతులు నష్టపోవద్దనే రాష్ట్రం ఆ చట్టాలను వ్యతిరేకిస్తోందన్నారు. రాష్ట్రంలో బండోడు, గుండోడు, చెండోడు జమయ్యారని, తలాతోక లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. తాము ప్రధాని పీఠానికి విలువనిచ్చి మాట్లాడుతుంటే.. వాళ్లు మాత్రం సీఎం, మంత్రులను ఏకవచనంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని విమర్శిస్తున్న నేతలు కేంద్రంతో ఏం అభివృద్ధి జరిగిందో చెప్పాలన్నారు. పది లక్షల ఎకరాలకు నీరిచ్చే ప్రాజెక్టు కట్టారా..? పది లక్షల మందికి ఉపాధి ఇచ్చారా..? అన్ని ప్రశ్నించారు. రైతువేదికలకు నిధులిస్తున్నాం.. ఫొటోలను పెట్టాలని అడ్డుకోవడమేంటని ప్రశ్నించారు. దమ్ముంటే.. కేసీఆర్ సర్కార్ అమలు చేస్తున్న పథకాలను బీజేపీ పాలితరాష్ట్రాల్లో అమలు చేయాలని హితవు పలికారు. చదవండి: బిగ్బాస్: అతడికే ఓటు వేసిన హిమజ ఊళ్లో ఎవరైనా చనిపోతే అంత్యక్రియల తర్వాత స్నానాల కోసం కాసేపు కరెంటు వేయండని బతిమాలిన రోజుల నుంచి.. మిగులు విద్యుత్ వరకు ఎదిగామని పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. రైతుబంధు రానివారు ఈనెల 20 వరకు నమోదు చేసుకోవాలని సూచించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుబంధు, రైతుబీమా, 24గంటల ఉచిత విద్యుత్, ఇప్పుడు రైతువేదికలు ఇచ్చిన ఘనత కేసీఆర్ సర్కారుదేనని అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. చిట్యాలకు వచ్చేముందు బీజేపీ నాయకులు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి మంత్రుల కాన్వాయ్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. రైతువేదికలపై ప్రధానమంత్రి, ఎంపీల ఫొటోలను పెట్టాలని నినాదాలు చేశారు. పోలీసుల అప్రమత్తమై వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో నిర్మల్ జెడ్పీ చైర్పర్సన్ కొరిపెల్లి విజయలక్ష్మి, ముథోల్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు విఠల్రెడ్డి, రేఖానాయక్, కలెక్టర్ ముషరఫ్అలీ ఫారూఖి, అడిషనల్ కలెక్టర్ హేమంత్ పాల్గొన్నారు. -
రైతులకు మద్దతుగా లండన్లో నిరసనలు..
లండన్ : భారతదేశంలో కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనకు దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. ఈ క్రమంలో యూకేలోని వివిధ ప్రాంతాల నుంచి సెంట్రల్ లండన్లోని భారత హైకమిషన్ భవనం వద్దకు చేరుకొని నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు. ఈ నిరసనలపై స్పందించిన బ్రిటిష్ హైకమిషన్.. ఈ సమస్యపై మెట్రోపాలిటన్ పోలీసులు, అక్కడి భారత బృందంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సోమవారం తెలిపింది. "నిరసనలు మెట్రోపాలిటన్ పోలీసులకు సంబంధించిన విషయం. నిరసన గురించి లండన్లోని భారత హైకమిషన్, మెట్రోపాలిటన్ పోలీసుల నుంచి మేము వివరాలు సేకరిసస్తున్నాం" అని బ్రిటిష్ హైకమిషన్ ప్రతినిధి ఒకరు తెలిపారు. చదవండి: భారత్ బంద్; కాసేపట్లో హైదరాబాద్- బెంగళూర్ హైవే దిగ్భందం కాగా యూకేలో పెద్ద మొత్తంలో ప్రవాస భారతీయులు ఉన్నారు. దీంతో భారత్లో రైతులు చేస్తున్న నిరసనల ప్రభావం యూకేలోని పంజాబీలపై పడుతుందని భావించిన బ్రిటిష్ సిక్కు లేబర్ ఎంపీ తన్మన్జీత్ సింగ్ ధేసీ నేతృత్వంలోని 36 మంది బ్రిటిష్ ఎంపీల బృందం యూకే విదేశాంగ కార్యదర్శి డొమినిక్ రాబ్కు లేఖ రాశారు. అనంతరం రైతులకు మద్దతుగా లండన్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇక భారతదేశంలోని రైతులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలు 2020 కి వ్యతిరేకంగా భారీ ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. కొత్త వ్యవసాయ చట్టాల్లో కనీస మద్దతు ధరకు భద్రతా లేకపోవడం, కార్పొరేట్ సంస్థలకు ఈ చట్టాలు అనుకూలంగా ఉన్నాయన్న కోణంలో రైతులు ఆందోళనలు దిగారు. చదవండి: పాత చట్టాలతో కొత్త శతాబ్దం నిర్మించలేం కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు: 1. రైతుల ఉత్పత్తుల వర్తక, వాణిజ్యం బిల్లు 2020 2. ధరల హమీ వ్యవసాయ సేవాల బిల్లు 2020 3. నిత్యవసర వసస్తువుల(సవరణ) బిల్లు 2020.. సెప్టెంబర్లో అమల్లోకి వచ్చిన ఈ మూడు వ్యవసాయ చట్టాలు వ్యవసాయ రంగంలో ప్రధాన సంస్కరణలుగా ప్రభుత్వం భావించింది. మధ్యవర్తులను తొలగించి, దేశంలో ఎక్కడైనా ధాన్యం విక్రయించడానికి వీలు కల్పించింది. -
కొత్త చట్టాలతో రైతులకు నష్టం లేదు: నిర్మలా
సాక్షి, విజయవాడ : ఎన్నికల హామీలను పూర్తిగా నిలబెట్టుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆలోచన చేస్తున్నారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అందులో భాగంగానే వ్యవసాయ బిల్లులు తీసుకువచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. నిర్మలా సీతారామన్ నేడు (బుధవారం) విజయవాడలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రైతులు, వ్యవసాయ రంగం నిపుణులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు సునీల్ దేవధర్, జీవీఎల్, కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ మాధవ్ హాజరయ్యారు. ఐసోలేషన్లో ఉన్న కారణంగా ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. చదవండి: 'సంస్కరణల ద్వారానే రైతులకు మేలు' ఈ సందర్భంగా నిర్మలా మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్రాల హక్కులను కాలరాస్తుందనేది తప్పుడు ప్రచారమని అన్నారు. మార్కెట్ కమిటీలను తొలగిస్తామని కాంగ్రెస్ చెప్పిందా లేదా అని ప్రశ్నించారు. ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్లి కాయగూరలు, పళ్ళు అమ్ముకుంటే ఏంటి అభ్యంతరం అని నిలదీశారు.మార్కెట్ యార్డుల పన్ను, మధ్యవర్తుల పన్ను రైతులపై భారంగా ఉందని, కొత్త చట్టాలతో మార్కెట్కు వెళ్ళకుండానే సరుకు అమ్ముకోవచ్చని తెలిపారు. కొత్త చట్టాలతో దళారులకే నష్టమని, రైతులకు కాదని స్పష్టం చేశారు. కష్టపడి పంట పండించే రైతుకు మంచి ధర ఇవ్వాల్సిందేనని తెలిపారు. అతి తక్కువ వర్ష పాతం ఉండే ఖచ్ ప్రాంతంలో ఎక్కువ హార్టికల్చర్ పండుతోందని, డ్రిప్ వల్లనే ఇది సాధ్యం అయ్యిందని పేర్కొన్నారు. -
‘వారు దళారులకే దళారులు’
పనాజీ : వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్న రాజకీయ పార్టీలపై కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ విమర్శలతో విరుచుకుపడ్డారు. ఈ బిల్లులను వ్యతిరేకిస్తున్న వారు దళారులకే దళారులుగా వ్యవహరిస్తున్నారని అభివర్ణించారు. ప్రస్తుతం రైతులు తక్కువ ధరకు తమ ఉత్పత్తులను అమ్ముకుంటుండగా, వినియోగదారులు అధిక ధరలు వెచ్చించి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొందని వ్యవసాయ బిల్లులపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు గోవాలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ వివరించారు. దళారులు రైతుల నుంచి కారుచౌకకు కొనుగోలు చేసిన వ్యవసాయ ఉత్పత్తుల ధరలను పెంచేసి లాభాలు దండుకుంటున్నారని , ఈ దళారులను ఏరివేయడం ద్వారా వ్యవసాయ బిల్లులు ఈ సమస్యను తొలగిస్తాయని మంత్రి పేర్కొన్నారు. విపక్షాలు దళారుల కొమ్ముకాస్తూ దళారుల కోసం దళారులుగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళన సమసిపోతుందని అసత్యాలకు త్వరలో కాలం చెల్లుతుందని, వాస్తవం మాత్రం శాశ్వతమని మంత్రి పేర్కొన్నారు. కాంగ్రెస్, ఎన్సీపీలు వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్నాయని, అయితే వ్యవసాయ సంస్కరణలకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తన ప్రసంగాల్లో పలుమార్లు పిలుపుఇచ్చారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు యూటర్న్ తీసుకుందని అన్నారు. వ్యవసాయ బిల్లులతో వ్యవసాయ మార్కెట్ కమిటీలు మూతపడతాయని విపక్షాలు దుష్ర్పచారం సాగిస్తున్నాయని ఆరోపించారు. కనీస మద్దతు ధరపై వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు నిలిచిపోతుందని ప్రచారం చేస్తున్నారని ఇవన్నీ అసత్యాలేనని చెప్పుకొచ్చారు. -
వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ : విపక్షాల వ్యతిరేకత మధ్య పార్లమెంట్ ఇటీవల ఆమోదించిన మూడు వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆదివారం ఆమోదముద్ర వేశారు. సెప్టెంబర్ 20న పార్లమెంట్ ఈ బిల్లులను ఆమోదించింది. వ్యవసాయ బిల్లులను ఆమోదించరాదని, వాటిని తిప్పిపంపాలని గతవారం విపక్షాలకు చెందిన ప్రతినిధులు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిసి అభ్యర్ధించారు. రాజ్యసభలో రాజ్యాంగవిరుద్ధంగా ప్రభుత్వం ఈ బిల్లులను ఆమోదింపచేసుకుందని విపక్షాలు ఆరోపించాయి.మరోవైపు ఈ బిల్లులు రైతు ప్రయోజనాలకు విఘాతమని రైతు సంఘాలు కొద్దిరోజులుగా ఆందోళన బాటపట్టాయి. ఇక వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ పలు రైతు సంఘాలు ఈనెల 25న భారత్ బంద్ చేపట్టిన సంగతి తెలిసిందే. హరియాణ, పంజాబ్, మహారాష్ట్ర, యూపీ, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ రైతులు నిరసనలకు దిగారు. ఈ బిల్లులతో రైతులను కార్పొరేట్ వ్యాపారులు శాసిస్తారని, మద్దతు ధర వ్యవస్థ కనుమరుగవుతుందని విపక్ష నేతలు, రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తుంటే రైతుల ప్రయోజనాలకు ఇవి ఉపకరిస్తాయని, దళారీ వ్యవస్థ దూరమై రైతులకు మేలు చేకూరుతుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంటోంది. చదవండి : ‘ఆ బిల్లులను అడ్డుకోండి’ -
ఎంపీల సస్పెన్షన్: బరిలోకి పవార్
న్యూఢిల్లీ : రాజ్యసభలో వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ అడ్డుకున్న 8 మంది విపక్ష ఎంపీలపై వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం వారంతా పార్లమెంట్ ముందు ధర్నా చేపట్టారు. ఈ క్రమంలో రాజ్యసభ డిప్యూటీ చైర్పర్సన్ హరివంశ్ సింగ్ పార్లమెంటు ఆవరణంలో సస్పెండ్ చేసిన 8 మంది ఎంపీలకు టీ, స్నాక్స్ ఏర్పాటు చేశారు. అయితే ఇందుకు విపక్షాలు నిరాకరించడంతో పాటు మీడియా ముందు కావాలని ఇలా ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. కాగా సస్పెండ్ అయిన 8 మంది సభ్యులకుఎన్సీపీ చీఫ్ శరద్ పవర్ సంఘీభావం తెలిపారు. వారికి మద్దతుగా పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాడు. దీనిలో భాగంగానే ఓ రోజు నిరాహార దీక్ష చేపడుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఢిల్లీలో మంగళవారం శరద్ పవర్ మాట్లాడుతూ.. వ్యవసాయ బిల్లులపై రాజ్యసభలో మరింత చర్చ జరగాల్సి ఉందని అన్నారు. ఈ బిల్లుకు సంబంధించి సభ్యులకు ప్రశ్నలు ఉన్నాయని, ఇప్పటి వరకు జరిగిన దానిని బట్టి చూస్తుంటే ప్రభుత్వం దీనిపై చర్చను కోరుకోవడం లేదనిపిస్తుందన్నారు. సభ సభ్యులకు స్పందన రాలేని సమయంలో ఉపసభాపతి పోడియం వద్దకు వచ్చారని, బిల్లును ఆమోదించడానికి సభ్యుల అభిప్రాయాలు తెలుసుకోవాలన్నారు. దానిపై చర్చ జరగాలని, కానీ ఇలా ప్రతిపక్షాలు నిరసనలు చేస్తున్న క్రమంలో ఆదివారం రెండు వ్యవసాయ బిల్లులు రాజ్యసభలో ఆమోదించడంపై అభ్యంతంర వ్యక్తం చేస్తున్నానారన్నారు. బిల్లులు ఇలా ఆమోదం పొందడం తానెప్పుడూ చూడలేదని పవార్ పేర్కొన్నారు. కేవలం తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకే వారిని బహిష్కరించారని, సభ్యుల హక్కులను కొల్లగొట్టే ప్రయత్నం చేశారన్నారు. వైస్ చైర్మన్ నిబంధనలకు ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. విపక్షాలు నిరసన చేస్తున్న క్రమంలో వైస్ చైర్మన్ వచ్చి టీ, స్నాక్స్ అందించడం బాలేదని, వ్యవసాయ బిల్లులకు నిరసన తెలిపే సభ్యులకు సంఘీభావంగా తాను ఈ రోజు ఏమీ తినను అని పేర్కొన్నారు. కాగా విపక్షాల ఆందోళన మధ్య వ్యవసాయ బిల్లులు ఆదివారం రాజ్యసభ ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తనతో అసభ్యంగా ప్రవర్తించి వేటుకు గురైన 8 మంది ఎంపీల కోసం హరివంష్ టీ, స్నాక్స్ తీసుకురావడంపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు. -
ఫలించని టీ దౌత్యం : నిరాహార దీక్ష
సాక్షి,న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ బిల్లుల ఆమోదంపై రాజ్యసభలో రగడ, ప్రతిపక్ష సభ్యుల నిరవధిక నిరసన కొనసాగుతుండగా కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. పార్లమెంట్ ఆవరణలోని పచ్చిక బయళ్లలో రాత్రంతా నిరసన కొనసాగించిన ఎంపీలను రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ మంగళవారం పరామర్శించారు. టీకప్పులతో దౌత్యం చేయడానికి ప్రయత్నించారు. అయితే రైతులకోసం ఉద్యమిస్తాం.. పార్లమెంటు హత్యకు గురైందనే ప్లకార్డులతో నిరసన కొనసాగిస్తున్న ఎంపీలు మాత్రం "టీ దౌత్యాన్ని" నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. రైతు వ్యతిరేకి అంటూ ఆయనను దుయ్యబట్టారు. దీంతో తాను కూడా ఒకరోజు నిరసన దీక్ష చేస్తానని డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ ప్రకటించడం విశేషం. (ఎంపీల నిరసన : ఢిల్లీ పోలీసుల ఓవర్ యాక్షన్) వ్యవసాయ బిల్లులపై జరిగిన చర్చలో విపక్ష ఎంపీలు అనుచితంగా ప్రవర్తించారని హరివంశ్ ఆరోపించారు. ఎంపీల ప్రవర్తనకు నిరసనగా తాను ఇవాళ ఉదయం నుంచి 24 గంటలు నిరాహార దీక్ష చేపడుతున్నట్టు వెల్లడించారు. దీనికి సంబంధించి ఆయన రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడుకు లేఖ రాశారు. సభలో పరిణామాలు తనను మానసిక వేదనకు గురిచేశాయనీ, దీంతో రాత్రి నిద్ర కూడా పట్టలేదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం పేరిట గౌరవ సభ్యులు హింసాత్మకంగా వ్యవహరించారంటూ ఆరోపించారు. తన నిర్ణయం వారిలో “స్వీయ శుద్దీకరణ” భావనను ప్రేరేపిస్తుందని భావిస్తున్నానన్నారు. మరోవైపు తనపై దాడిచేసి, అవమానించిన వారికి వ్యక్తిగతంగా టీ ఆఫర్ చేయడం గొప్ప విషయమంటూ హరివంశ్పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రశంసలు కురిపించారు. ఆయన ఔదార్యం, శైలి ఆదర్శప్రాయం, ప్రజా స్వామ్యానికి ఇది చక్కటి సందేశం అంటూ ట్వీట్ చేశారు. यह हरिवंश जी की उदारता और महानता को दर्शाता है। लोकतंत्र के लिए इससे खूबसूरत संदेश और क्या हो सकता है। मैं उन्हें इसके लिए बहुत-बहुत बधाई देता हूं। — Narendra Modi (@narendramodi) September 22, 2020 -
ఎంపీల నిరసన : పోలీసుల ఓవర్ యాక్షన్
సాక్షి, న్యూఢిల్లీ : రైతులకు మేలు చేస్తాయనే పేరుతో తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై దేశవ్యాప్తంగా ఒకవైపు తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. మరోవైపు ఈ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించాలనే తీర్మానానికి రాజ్యసభ ఎంపీలు పట్టుబడుతున్నారు. ఈ సందర్భంగా సభలో పోడియంలోకి దూసుకెళ్లి, ఆందోళనకు దిగారు. ఇది 8మంది ఎంపీల సస్పెన్షన్ కు దారితీసింది. అయితే పట్టువదలకుండా పార్లమెంట్ ఆవరణలో ఎంపీలు తమ నిరసనను కొనసాగించారు. ప్రధానంగా పార్లమెంటు సమీపంలో సోమవారం మౌనంగా నిరసన చేపట్టిన పంజాబ్కు చెందిన నలుగురు పార్లమెంటు సభ్యుల పట్ల ఢిల్లీ పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. ఎంపీలపై దాడికి దిగారు. కాళ్లపై లాఠీలతో కొడుతూ, వారిని అక్కడినుంచి తొలగించేందుకు ప్రయత్నించారు. (8 మంది ఎంపీల సస్పెన్షన్) అయితే పార్లమెంటు షెడ్యూల్ కంటే ముందే బయలుదేరిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి దారి క్లియర్ చేసేందుకు ప్రయత్నించామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. అంతేకాదు ఎంపీలు తమ నిరసనకు ఎటువంటి అనుమతి తీసుకోలేదని, ప్రధానికి దారి క్లియర్ చేయడం తప్పనిసరి అని పేర్కొన్నారు. మరోవైపు మంగళవారం ఉదయం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నిరసన చేస్తున్న ఎంపీల వద్దకు వెళ్లి, వారిని పరామర్శించారు. టీ తాగాలని కోరారు. దీనికి ససేమిరా అన్న ఎంపీలు ఆయన్ను రైతు వ్యతిరేకి అంటూ విమర్శించారు. ఇది ఇలావుంటే హరివంశ్పై ప్రశంసలు కురిపించిన ప్రధాని మోదీ ఆయన తీరు ఆదర్శ ప్రాయమని వ్యాఖ్యానించడం గమనార్హం. (‘ఆ బిల్లులను అడ్డుకోండి’) కాగా కేంద్రం తీసుకొచ్చిన ఈ బిల్లులును వ్యతిరేకిస్తూ సెప్టెంబరు 25న దేశవ్యాప్త సమ్మెకు దిగనున్నారు. ప్రభుత్వ తీసుకొచ్చిన ప్రస్తుత బిల్లుతో దేశంలోని చిన్న, సన్నకారు రైతులు మరింత నష్టాల్లోకి జారిపోతారని రైతు సంఘాలు వాదిస్తున్నాయి. ఈ బిల్లులు కార్పొరేట్లకు కొమ్ము కాసేవే తప్ప, రైతులకు మేలు చేసేవి ఎంతమాత్రం కాదనివాదిస్తున్నాయి. అటు సస్పెన్షన్ కి గురైన ఎంపీలు, రాత్రంతా పార్లమెంట్ ఎదుట తమ నిరసనను కొనసాగించారు. నిబంధనలకు పూర్తిగా విరుద్ధంగా బిల్లులును సభలో ఆమోదించారని మండిపడ్డారు. రైతుల పక్షాన తమ పోరాటం కొనసాగుతుందంటూ నిరసనను కొనసాగిస్తున్నారు. -
‘ఆ బిల్లులను అడ్డుకోండి’
సాక్షి, న్యూఢిల్లీ : రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగించే వ్యవసాయ బిల్లులకు ఆమోదముద్ర వేయరాదని విపక్ష నేతలు రాష్ట్రపతికి సోమవారం విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విపక్షాలు ఈ అంశంపై వివరించేందుకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిసేందుకు అపాయింట్మెంట్ కోరాయి. వ్యవసాయ బిల్లులతో రైతాంగానికి ఎదురయ్యే నష్టాన్ని వివరించేందుకు తమకు సమయం కేటాయించాలని 12 రాజకీయ పార్టీలు రాష్ట్రపతిని కోరాయని కాంగ్రెస్ ఎంపీ శక్తిసింగ్ గోహిల్ తెలిపారు. కాగా విపక్షాల ఆందోళన మధ్య వ్యవసాయ బిల్లులు ఆదివారం రాజ్యసభ ఆమోదం పొందాయి. ఈ బిల్లులను అంతకుముందు లోక్సభ ఆమోదించిన సంగతి తెలిసిందే. ఇక వ్యవసాయ బిల్లులతో రైతులకు మేలు జరుగుతుందని, ఇది సేద్య చరిత్రలో చారిత్రక ఘట్టమని, దళారీ వ్యవస్థకు ముగింపు పలకవచ్చని పాలక బీజేపీ పేర్కొంటుండగా, రైతాంగాన్ని కార్పొరేట్లకు బానిసలుగా మార్చేస్తున్నారని విపక్షం మండిపడుతోంది. మరోవైపు వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంగా ఆదివారం రాజ్యసభలో రభస సృష్టించిన ఘటనలో ఎనిమిది మంది విపక్ష సభ్యులను రాజ్యసభ చైర్మన్ వారం రోజుల పాటు సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసి తమ గొంతు నొక్కలేరని, ఇది ప్రజాస్వామ్యానికి చీకటి రోజని తృణమూల్ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ ఆందోళన వ్యక్తం చేశారు. విపక్ష సభ్యుల సస్పెన్ఫన్ దురదృష్టకరమని, ఇది ప్రభుత్వ మనోభావాలకు అద్దం పడుతోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. సస్పెండ్ అయిన రాజ్యసభ సభ్యులు పార్లమెంట్ ఆవరణలో నిరసన చేపట్టారు. చదవండి : వారికి క్షమాభిక్ష కోరే అర్హత లేదు -
కనీస మద్దతు ధర : చిదంబరం ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం కొత్తగా ఆమోదించిన నూతన వ్యవసాయ బిల్లులపై విపక్ష పార్టీల నిరసన కొనసాగుతున్న తరుణంలో కేంద్ర మాజీ ఆర్థికమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిదంబరం కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రధానంగా కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) పై ఆయన తన దాడిని ఎక్కుపెట్టారు. ప్రభుత్వం వద్ద ప్రైవేటు వాణిజ్యానికి సంబంధించిన డేటా అందుబాటులో లేనప్పుడు రైతులకు కనీస మద్దతు ధర ఎలా ఇస్తారని ప్రశ్నించారు. భారతదేశం అంతటా ప్రతిరోజూ వేలాది గ్రామాల్లో మిలియన్ల ప్రైవేటు లావాదేవీలు జరుగుతాయి. ఏ రైతు ఏ వ్యాపారికి ఏ ఉత్పత్తులను అమ్మారో ప్రభుత్వానికి ఎలా తెలుస్తుందని వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ను ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలా ప్రణాళికలు వేస్తోందని చిదంబరం ట్వీట్ చేశారు. (రాజ్యసభ రగడ : విపక్ష ఎంపీల సస్పెన్షన్) రైతుకు చెల్లించే ధర మద్దతు ధరకంటే చాలా తక్కువగా ఉంటోందని చిదంబరం ఆరోపించారు. రైతుల పంటకు మద్దతు ధర కల్పిస్తామంటూ చెబుతున్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఇప్పటివరకు ఆ పని ఎందుకు చేయలేదని నిలదీశారు. దీన్ని గుడ్డిగా నమ్మేందుకు రైతులు మూర్ఖులు అని మంత్రి ప్రభుత్వం భావిస్తోందా అని మండిపడ్డారు. దీంతో పాటు సమాజంలోని వివిధ వర్గాల ప్రజలకు మోదీ సర్కార్ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన వైనంపై ఆయన విరుచుకుపడ్డారు. ప్రధానంగా ప్రతి భారతీయుడి ఖాతాలో15 లక్షలు రూపాయలు వేస్తామన్న హామీని మోదీ ప్రభుత్వం నెరవేర్చిందా? రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేశారాట? ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాల వాగ్దానం సంగతి ఏమిటని చిదంబరం ప్రశ్నించారు. కాగా, వ్యవసాయానికి సంబంధించిన ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ బిల్లు, ఫార్మర్స్ అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అస్యూరెన్స్ అండ్ ఫార్మార్స్ సర్వీసు బిల్లులకు ఇప్పటికే లోక్సభ ఆమోదం తెలుపగా, ఆదివారం రాజ్యసభ కూడా ఆమోదించింది. రాష్ట్రపతి సంతకంతో ఈ బిల్లులు అమలులోకి రానున్నాయి. కొత్త వ్యవసాయ బిల్లులంటూ రాజకీయ రగడ నడుస్తోంది. కార్పొరేట్లకు కొమ్ముకాసేందుకే ప్రభుత్వం ఈ బిల్లులను తీసుకొచ్చిందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. దీనిపై దేశవ్యాప్తంగా రైతులు నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. The Modi government should stop lying to the farmers and making false promises. The promise of guaranteeing MSP in private transactions is like the promise to deposit Rs 15 lakh in the bank account of every Indian — P. Chidambaram (@PChidambaram_IN) September 21, 2020 -
వ్యవసాయ బిల్లులకు రాజ్యసభ ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ : విపక్షాల తీవ్ర ఆందోళనల మధ్య రెండు వ్యవసాయ బిల్లులకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. మూజువాణి ఓటుతో బిల్లులకు పెద్దల సభ ఆమోదం తెలిపింది. రైతులకు మేలు జరిగేలా చర్యలు చేపడతామని, వ్యవసాయ సంస్కరణల ఫలితంగా దేశవ్యాప్తంగా రైతుల ఉత్పత్తులు పెరుగుతాయని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ బిల్లులపై చర్చ సందర్భంగా పేర్కొన్నారు. మంత్రి వ్యాఖ్యలను విపక్ష సభ్యులు అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్ష ఎమపీలు నినాదాలు చేశారు. బిల్లు ప్రతులను పలువురు సభ్యులు చించివేశారు. వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. విపక్ష సభ్యుల ఆందోళన మధ్య వ్యవసాయ బిల్లులను సభ ఆమోదం తెలిపిందని ప్రకటించిన డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్ సభను సోమవారానికి వాయిదా వేశారు. ఇక అంతకుముందు రాజ్యసభలో బిల్లు ఓటింగ్ను అడ్డుకునేందుకు విపక్షాలు తీవ్రంగా ప్రయత్నం చేశాయి. డిప్యూటీ చైర్మన్ పోడియం చుట్టూ చేరి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మరోవైపు తృణమూల్ కాంగ్రెస్కు చెందిన ఎంపీ డెరెక్ ఓ బ్రెయిన్ బిల్లు మాసాయిదా ప్రతులు చింపి.. పోడియంపై విసిరారు. టీఎంసీ, ఆమ్ఆద్మీ, శిరోమణీ అకాలీదళ్ సభ్యులు పోడియం వద్దకు చేరుకుని మైకులు విరగొట్టేందుకు ప్రయత్నించారు. దీంతో రాజ్యసభలో విపక్షాల తీరు తీవ్ర గందగోళానికి దారితీసింది. కాగా లోక్సభలో వ్యవసాయ బిల్లులు గురువారం రాత్రి ఆమోదం పొందాయి. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ఎన్డీయే మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్కు చెందిన హర్సిమ్రత్ కౌర్ బాదల్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ బిల్లులకు నిరసనగా పంజాబ్, హరియాణ సహా పలు రాష్ట్రాల్లో రైతులు ఆందోళనలు చేపట్టారు. చదవండి : రసవత్తరంగా రాజ్యసభ.. గట్టెక్కేదెలా! -
వ్యవసాయ బిల్లులకు వైఎస్సార్ సీపీ మద్దతు
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభలో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. ఈ బిల్లులతో రైతులకు స్వేచ్ఛ లభించి, దళారీ వ్యవస్థకు ముగింపు లభిస్తుందని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సభలో జరిగిన వ్యవసాయ బిల్లులపై చర్చలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. పంటలకు ముందుగానే ధర నిర్ణయం వల్ల రైతులకు ప్రయోజనం జరుగుతుందన్నారు. దళారీల ఆగడాల నుంచి రైతులకు విముక్తి కలుగుతుందని పేర్కొన్నారు. ‘‘మార్కెట్ కమిటీల నియంతృత్వానికి తెరపడుతుంది. బిల్లులో పొగాకును ఎందుకు చేర్చడం లేదు. రైతు ప్రయోజనాలకు వైఎస్సార్ కాంగ్రెస్ అండగా ఉంటుంది. రైతు భరోసా పేరుతో 49 లక్షల మంది రైతులకు ఏటా 13,500 ఇస్తోంది. రైతుల కోసం ధరల స్థిరీకరణ నిధిని సీఎం జగన్ ఏర్పాటు చేశారు. పంటలకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరలు ప్రకటించింది. రైతు భరోసా కేంద్రాలతో విత్తనాలు, ఎరువులు తదితర అన్ని అంశాల్లో సహాయకారిగా ఉంటుందని’’ ఆయన వివరించారు. (చదవండి: రాజ్యసభలో విశాఖ వాణి) కాంగ్రెస్ వ్యవహారశైలిపై విజయసాయిరెడ్డి ఫైర్.. కాంగ్రెస్ మేనిఫెస్టోలో మార్కెట్ కమిటీలు రద్దు చేసి, పంటల రవాణాపై ఆంక్షలను తొలగిస్తామని చెప్పిందని.. ఆ అంశాలనే ఎన్డీయే బిల్లుగా తెచ్చిందన్నారు. ఆత్మవంచన మానుకోవాలని కాంగ్రెస్కు విజయసాయిరెడ్డి హితవు పలికారు. దళారులకు కాంగ్రెస్ అండగా నిలబడుతోందని ఎంపీ విజయసాయి రెడ్డి ధ్వజమెత్తారు. -
రైతుల పాలిట రక్షణ కవచాలు
న్యూఢిల్లీ: వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసం ఉద్దేశించిన ఆ మూడు బిల్లులు చరిత్రాత్మకం అని ప్రధానమంత్రి మోదీ అన్నారు. అవి రైతు వ్యతిరేకమంటూ పెద్ద ఎత్తున విమర్శలు రావడం, కేంద్రంలో బీజేపీ మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్కి చెందిన మంత్రి హర్సిమ్రత్ కౌర్ రాజీనామా చేసిన నేపథ్యంలో ప్రధాని ఆ బిల్లుల్ని గట్టిగా సమర్థించారు. రైతులు, వినియోగదారుల మధ్య దళారీ వ్యవస్థ నుంచి కాపాడే రక్షణ కవచాలని వ్యాఖ్యానించారు. బిహార్లో పలు రైల్వే ప్రాజెక్టుల్ని ఆన్లైన్ ద్వారా ప్రారంభించిన ప్రధాని తన ప్రసంగంలో ఈ బిల్లుల గురించే ఎక్కువగా మాట్లాడారు. రైతులకు స్వేచ్ఛ కల్పించడం కోసం రక్షణగా ఆ బిల్లుల్ని తీసుకువస్తే విపక్షాలు దళారులకు కొమ్ము కాస్తూ రైతుల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని తీవ్రంగా విమర్శించారు. ఈ బిల్లులు అత్యంత అవసరం 21వ శతాబ్దంలో ఈ బిల్లుల అవసరం చాలా ఉందన్నారు. రైతుల్ని సంకెళ్లలో బంధించకుండా ఎక్కడైనా, ఎప్పుడైనా తమ ఉత్పత్తుల్ని అమ్ముకునే అవకాశం వస్తుందని ప్రధాని అన్నారు. ప్రభుత్వం ఇక వ్యవసాయ ఉత్పత్తుల్ని కొనుగోలు చేయదని, కనీస మద్దతు ధర ఇవ్వదని విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ (ఏపీఎంసీ) చట్ట సవరణల్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఇవే అంశాలను ఉంచిందని మోదీ ధ్వజమెత్తారు. దళారులకు ఎవరు కొమ్ము కాస్తున్నారో, తమకు అండగా ఎవరున్నారో అన్నదాతలు గమనిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం రైతుల నుంచి పంటలు కొనుగోలు చేస్తుందని, కనీస మద్దతు ధర ఇస్తుందని ప్రధాని హామీ ఇచ్చారు. ఎంఎస్పీని తొలగించే కుట్ర: కాంగ్రెస్ తాజాగా తీసుకువచ్చిన మూడు బిల్లుల ద్వారా ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) కల్పించే విధానాన్ని తొలగించే కుట్ర చేస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. రైతులను పాండవులతో, ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని కౌరవులతో పోలుస్తూ.. ఈ ధర్మ యుద్ధంలో ఎటువైపు ఉంటారో తేల్చుకోవాలని ఇతర రాజకీయ పార్టీలను కోరింది. రైతుల కోసం పార్లమెంటు వెలుపల, లోపల పోరాడుతామని స్పష్టం చేసింది. మాటలకు, చేతలకు పొంతన లేకుండా వ్యవహరిస్తున్న మోదీ ప్రభుత్వంపై రైతులు నమ్మకం కోల్పోయారని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. రైతుల పొట్టగొట్టి, తన స్నేహితులకు లాభం చేకూర్చాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని శుక్రవారం ట్వీట్ చేశారు. పార్లమెంటు తాజాగా ఆమోదించిన వ్యవసాయ బిల్లులు కనీస మద్దతు ధర విధానాన్ని నాశనం చేస్తాయని మరో సీనియర్ నేత పీ చిదంబరం పేర్కొన్నారు. -
‘దళారీల కొమ్ముకాస్తున్న విపక్షం’
సాక్షి, న్యూఢిల్లీ : లోక్సభలో శుక్రవారం వ్యవసాయ బిల్లులు ఆమోదాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతించారు. దళారీల నుంచి రైతులను కాపాడే ఈ సంస్కరణలను విపక్షాలు వ్యతిరేకించడాన్ని ఆయన తప్పుపట్టారు. దళారీలతో పనిలేకుండా రైతులు తమ ఉత్పత్తులను విక్రయించేందుకు ఈ సంస్కరణలు వెసులుబాటు కల్పిస్తాయని చెప్పారు. వ్యవసాయంలో రైతులకు నూతన స్వాతంత్ర్యం లభించిందని ప్రధాని కోసి రైల్ మెగా బ్రిడ్జిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన అనంతరం పేర్కొన్నారు. లోక్సభలో ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లులతో రైతులకు మేలు చేకూరుతుందని చెప్పారు. రైతులు తమ ఉత్పత్తులను మరింత మెరుగ్గా విక్రయించుకునేందుకు అవకాశాలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. ఈ బిల్లులు దళారీల నుంచి రైతులను రక్షిస్తాయని అన్నారు. ఈ అంశంపై రైతులను పక్కదారి పట్టించేందుక విపక్షాలు ప్రయత్నించాయని మండిపడ్డారు. దశాబ్ధాల తరబడి దేశాన్ని పాలించిన వారు రైతుల సాధికారత కోసం ఏమీ చేయలేదని ఆరోపించారు. రైతుల లాభాలను దోచుకునే దళారీలకు విపక్షాలు సహకరించేలా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. కాగా వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా పలు రాష్ట్రాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. పంజాబ్ కాంగ్రెస్ ఎంపీల పార్లమెంట్ ఆవరణలోనే బిల్లు కాపీలను చించివేయగా, ఆ రాష్ట్ర రైతులు ఈనెల 24 నుంచి 26 వరకూ రైల్ రోకోకు పిలుపు ఇచ్చాయి. మరోవైపు వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ఎన్డీయే భాగస్వామ్య పక్షం శిరోమణి అకాలీదళ్కు చెందిన కేంద్ర మంత్రి హరిసిమ్రత్ కౌర్ బాదల్ గురువారం తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. చదవండి : నా పుట్టినరోజుకు ఆ గిఫ్ట్ కావాలి: మోదీ -
గవర్నర్ ముందుకు ‘మూడు రాజధానుల బిల్లులు’
సాక్షి, అమరావతి: ‘సీఆర్డీఏ రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు’లను గవర్నర్ ఆమోదానికి ఏపీ ప్రభుత్వం శనివారం పంపించింది. శాసనమండలిలో రెండోసారి పెట్టి నెల రోజులు గడిచినందున నిబంధనల ప్రకారం అసెంబ్లీ అధికారులు.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు పంపించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 197 క్లాజ్ 2 ప్రకారం రెండోసారి బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మండలిలో పెట్టిన నెల రోజుల తర్వాత ఆటోమెటిక్గా ఆమోదించినట్టుగా పరిగణిస్తూ గవర్నర్ ఆమోదం కోసం రెండు బిల్లులను అసెంబ్లీ అధికారులు పంపించారు. -
గతేడాది మార్చి బిల్లునే చెల్లించండి
సాక్షి, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో ఇంటింటికీ వెళ్లి మీటర్ రీడింగ్ తీసి విద్యుత్ బిల్లుల డిమాండ్ నోటీసులు జారీ చేయడానికి బదులు ప్రత్యామ్నాయ విధానాన్ని అనుసరించాలని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు నిర్ణయం తీసుకున్నాయి. 2019 మార్చిలో జరిపిన వినియోగానికి సంబంధించి చెల్లించిన విద్యుత్ బిల్లులనే 2020 మార్చిలో జరిపి న వినియోగానికి సైతం చెల్లించాలని వినియోగదారులను కోరనున్నా యి. కొత్త వినియోగదారులైతే ఫిబ్రవరి 2020 నెలకు సంబం ధించి చెల్లించిన బిల్లు మొత్తాన్నే మార్చి నెల వినియోగానికి సైతం చెల్లించాలని కోరనున్నాయి. దీనికి సంబంధించిన అనుమతుల కోసం శుక్రవారం రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి ప్రతిపాదనలు సమర్పించాయి. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత మీటర్ రీడింగ్ తీసి వినియోగదారులు చెల్లించిన బిల్లులను సర్దుబాటు చేస్తామని ఈఆర్సీకి తెలిపాయి. వినియోగంతో పోల్చితే ఎవరైనా అధికంగా బిల్లులు చెల్లిస్తే.. తర్వాత మీటర్ రీ డింగ్ తీసినప్పుడు వారికి సంబంధించిన తదుపరి నెల బిల్లును ఆ మేరకు తగ్గించి సర్దుబాటు చేస్తారు. ఇదే తరహాలో అధిక వినియోగం ఉండి తక్కువ బిల్లులు చెల్లించిన వారి నుంచి తదు పరి నెల బిల్లులో ఆ మేరకు మిగిలిన మొత్తాన్ని అదనంగా వసూలు చేస్తామని ప్రతిపాదించాయి. ఈ ప్రతిపాదనలను పరిశీలించి శనివారం ఈఆర్సీ ఉత్తర్వులు జారీ చేసే అవకాశముంది. -
ఇలా చేస్తే రూ. 1 కోటి దాకా నజరానా
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) విధానాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయడంపై కేంద్రం దృష్టి పెట్టింది. కొన్న ప్రతీ వస్తువుకు విక్రేతల నుంచి కచ్చితంగా బిల్లు తీసుకునేలా కొనుగోలుదారులను ప్రోత్సహించే చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా రూ. 10 లక్షల నుంచి రూ. 1 కోటి దాకా బహుమతులు ఇచ్చేలా లాటరీని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. కేంద్రీయ పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) సభ్యుడు జాన్ జోసెఫ్ ఈ విషయాలు తెలిపారు. జీఎస్టీ కింద తీసుకునే ప్రతీ బిల్లుతోనూ కస్టమర్లు.. లాటరీలో పాల్గొనేందుకు అవకాశం ఉంటుందని ఆయన వివరించారు. "కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకే లాటరీ బిల్లు భారీ స్థాయిలో పెడుతున్నాం. కాబట్టి బిల్లు తీసుకోకుండా 28 శాతం (గరిష్ట జీఎస్టీ) పొదుపు చేయడం కన్నా రూ. 10 లక్షలో లేదా రూ. 1 కోటి దాకా గెలవడానికి అవకాశం ఉంటుంది కదా అని కొనుగోలుదారులు ఆలోచించడానికి ఆస్కారం ఉంటుంది. పన్నుల చెల్లింపుపై కొనుగోలుదారుల ఆలోచనా ధోరణులను మార్చేందుకు ఇలాంటివి ఉపయోగపడగలవు" అని ఆయన పేర్కొన్నారు. ప్రణాళిక ప్రకారం లాటరీలో పాల్గొనాలంటే కనీస బిల్లు మొత్తం ఉంటుంది. వినియోగదారుల సంక్షేమ నిధి నుంచి లాటరీ మొత్తాన్ని చెల్లిస్తారు. కొనుగోలుదారుల నుంచి అధిక మొత్తాలు వసూలు చేసి లాభాలు ఆర్జించిన వ్యాపార సంస్థలపై విధించిన జరిమానాలను ఈ నిధికి బదలాయిస్తున్నారు. -
కొత్త బిల్లులు పరిష్కారం చూపవు
సాక్షి, హైదరాబాద్: ఉన్నావ్, హైదరాబాద్ లాంటి ఘటనలను నిరోధించేందుకు కావాల్సింది కొత్త బిల్లులు కావని, రాజకీయ చిత్తశుద్ధి, పాలనాపరమైన నైపుణ్యంతోనే అరికట్టడం సాధ్యమని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. మహిళల అత్యాచార ఘటనలపై నిర్భయ లాంటి చట్టం ఉండగా కొత్తగా బిల్లులు ఎంత మాత్రం పరిష్కారం చూపలేవని, ప్రజల ఆలోచనా వైఖరి, విద్యా వ్యవస్థలో మార్పుతో పాటు దేశ సంస్కృతి పట్ల గౌరవం ఉన్నప్పుడే ఇలాంటి ఘటనలను రూపుమాపడం సాధ్యమవుతుందన్నారు. శుక్రవారం హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్హెచ్ఆర్డీ)లో జరిగిన ఆల్ ఇండియా సర్వీస్, సెంట్రల్ సివిల్ సర్వీస్ ఆఫీసర్ల 94వ ఫౌండేషన్ కోర్సు ముగింపు కార్యక్రమంలో వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళలు, గురువులు, పెద్దలను ఎలా గౌరవించాలో పాఠశాల స్థాయి నుంచి బోధిస్తూనే కఠిన చట్టాలను రూపొందించాలన్నారు. బాధితులు ఫిర్యాదులు చేసినప్పుడు సత్వరమే స్పందించడంతో పాటు, వేగవంతమైన విచారణ, సత్వర న్యాయం జరిగేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంలో నైతిక విలువలు వేగంగా పతనమవుతున్నాయని, భారతీయ మూలాల్లోకి తిరిగి వెళ్లాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో భవిష్యత్తులో మనుగడ కోసం ప్రకృతిని, సంస్కృతిని పరిరక్షించాల్సిన అవసరం ఉందని అన్నారు. 70 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో నేటికీ 18 నుంచి 20 శాతం మంది దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారని, పేదరికానికి దారితీస్తున్న కారణాలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాల్సిన అవసరం ఉందని వెంకయ్య నాయుడు అన్నారు. ప్రభుత్వాలు తాత్కాలికంగా ఇచ్చే తాయిలాలు పేదలకు ఎలాంటి మేలు చేయవని, సామాజిక, లింగ వివక్షతో పాటు ఆర్థిక అంతరాలు తొలగించాలని వెంకయ్యనాయుడు అన్నారు. ప్రజలకు చేరువై సుపరిపాలన ద్వారా ప్రభుత్వ పథకాలు అర్హులకు చేరేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుందన్నారు. వ్యవసాయ, వ్యాపార రంగాలు దేశానికి రెండు కళ్లలాంటివని, వలసవాద ఆలోచనా ధోరణి నుంచి ప్రజలు బయటకు రావాలన్నారు. శిక్షణలో ప్రతిభ చూపిన వారికి అవార్డులు.. తొలుత అంబేడ్కర్ చిత్రపటానికి వెంకయ్యనాయుడు నివాళి అర్పించారు. ఫౌండేషన్ కోర్సు జర్నల్ను విడుదల చేయడంతో పాటు, శిక్షణలో ప్రతిభ చూపిన పది మంది అధికారులకు అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, కేంద్ర డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ జాయింట్ సెక్రటరీ రష్మి చౌదరి, ఎంసీఆర్హెచ్ఆర్డీ డైరెక్టర్ బీపీ ఆచార్య, అదనపు డీజీ హర్ప్రీత్సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
హామీలకు చట్టబద్ధత
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల్లో 60 శాతం మేర నెల రోజుల్లోనే అమల్లోకి తీసుకువచ్చి తన చిత్తశుద్ధిని, ఇచ్చిన మాటపై నిలబడటాన్ని చాటి చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్రెడ్డి.. ఇప్పుడు ఆ హామీల్లోని పలు అంశాలకు 40 రోజుల్లోనే చట్టబద్ధత కల్పించేందుకు రంగం సిద్ధం చేశారు. గురువారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ సమావేశాల్లో ప్రజలకు ఇచ్చిన హామీలకు చట్టబద్ధత కల్పించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మొత్తం 12 బిల్లులను ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో పెట్టి చట్టబద్ధత కల్పించాలనే విషయమై మంగళవారం ముఖ్యమంత్రి సంబంధిత అధికారులతో సుమారు మూడు గంటలకు పైగా సుదీర్ఘ కసరత్తు చేశారు. ఆయా బిల్లులపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఎటువంటి పొరపాట్లు లేకుండా ఒకటికి రెండుసార్లు సరిచూసుకుని, న్యాయ శాఖతో సమన్వయంతో బిల్లులను రూపొందించాలని చెప్పారు. ఆయా బిల్లులపై మంత్రులు, అధికార సభ్యులు పూర్తి అవగాహనతో ఉండాలని స్పష్టం చేశారు. కొత్తగా చట్టాలను తీసుకురావడంతో పాటు, ఇదివరకు చేసిన చట్టాల్లో సవరణల కోసం ఉద్దేశించిన బిల్లులు ఇప్పటికే తుదిరూపు దిద్దుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులతో సమావేశం అయ్యారు. మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ఈ బిల్లులు రూపొందబోతున్నాయి. ప్రభుత్వ ఉద్ధేశం స్పష్టంగా ఉండాలి అంతకంతకూ పెరిగిపోతున్న స్కూలు, కాలేజీ ఫీజులపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, సామాజిక వేత్తల నుంచి వైఎస్ జగన్ 14 నెలల సుదీర్ఘ పాదయాత్ర సమయంలో పెద్ద ఎత్తున అర్జీలు, ఫిర్యాదులు అందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాటి నియంత్రణ, పర్యవేక్షణకు చేయనున్న చట్టం కట్టుదిట్టంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. కౌలు రైతులు, శాశ్వత బీసీ కమిషన్.. నామినేటెడ్ పదవులు, పనుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు 50 శాతం తదితర అంశాలపై రూపొందించే చట్టాల విషయమై ముఖ్యమంత్రి సంబంధిత అధికారులతో చర్చించారు. ప్రతి బిల్లులో ప్రభుత్వ ఉద్దేశాలు, తీసుకురాబోతున్న చట్టాల వల్ల ప్రజలకు ఏవిధంగా ప్రయోజనం కలగబోతుందన్న అంశాలను స్పష్టంగా పేర్కొనాలని అధికారులను ఆదేశించారు. ప్రధాన బిల్లుల వివరాలు ఇలా ఉన్నాయి. స్థానికంగా ఉపాధికి ఊతం పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకు కల్పించే దిశగా చట్టాన్ని తెచ్చేందుకు ఉద్దేశించిన బిల్లుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులతో మాట్లాడారు. ఈ చట్టం పకడ్బందీగా ఉండాలని, ఎటువంటి న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా జాగత్రలు తీసుకోవాలని చెప్పారు. పాదయాత్ర సమయంలో ఈ విషయంపై వైఎస్ జగన్ హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ చట్టం కార్యరూపం దాలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మంచి రోజులు ఇప్పటికే మంత్రివర్గంలో 60 శాతం పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అవకాశం కల్పించడమే కాకుండా ఎస్సీ మహిళకు హోం శాఖను అప్పగించి ఇప్పటికే ముఖ్యమంత్రి తన చిత్తశుద్ధిని నిరూపించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ వర్గాలకు నామినేషన్ పదవులు, ఐదు లక్షల రూపాయలలోపు నామినేషన్ పనుల్లో 50 శాతం కల్పిస్తూ చట్టబద్ధత కల్పించాలని నిర్ణయించారు. వెనుకబాటుతనాన్ని చెప్పుకోవచ్చిక.. వివిధ కులాలను బీసీల్లో చేర్చాలనే డిమాండ్ నేపథ్యంలో జగన్మోహన్రెడ్డి ఎన్నికల సభల్లో.. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఎవరైనా బీసీలుగా గుర్తింపు పొందడానికి ఆ కమిషన్కు దరఖాస్తు చేసుకుంటే వారి స్థితిగతులతో పాటు పొరుగు రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు, ఇక్కడ ఎందుకు వారు బీసీలుగా మారాలని కోరుకుంటున్నారనే అంశాలను అధ్యయనం చేసి బీసీ కమిషన్ సిఫార్సులు చేస్తుందని అప్పట్లో ప్రకటించారు. ఇప్పుడు ఇందుకు అనుగుణంగా శాశ్వత ప్రాదిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేసేందుకు అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించనున్నారు. ఏపీఐడీఈ చట్టంలో మార్పులు ఇష్టానుసారం టెండర్ల ఖరారుకు రాష్ట్ర ప్రభుత్వం చెక్ పెట్టనుంది. స్విస్ చాలెంజ్ ముసుగులో అస్మదీయ సంస్థలకు నామినేషన్పై కట్టబెట్టడం వంటి అనైతిక చర్యలకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పులుస్టాప్ పెట్టనుంది. ఒక రకంగా చెప్పాలంటే గత టీడీపీ సర్కారు రాష్ట్ర ఖజానా నుంచే భారీ దోపిడీకి పాల్పడింది. ఈ నేపధ్యంలో టెండర్ల విధానంలో సమూల మార్పులు తీసుకువచ్చి ప్రజాధనాన్ని వృధా కాకుండా ఆదా చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా టెండర్ల స్క్రూటినీకి జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా ప్రభుత్వం తొలి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే చట్ట సవరణలను చేయాలని నిర్ణయించింది. గత చంద్రబాబు సర్కారు రాజధానిలో సింగపూర్ ప్రైవేట్ సంస్థల కోసం స్విస్ చాలెంజ్ ముసుగులో కారు చౌకగా రైతుల నుంచి తీసుకున్న భూములను అప్పగించేందుకు వీలుగా ఏపీఐడీఈ చట్టంలో సవరణలు తీసుకువచ్చింది. స్విస్ చాలెంజ్ విధానంలో సీఎస్ నేతృత్వంలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆథారిటీ తొలుత ప్రాజెక్టు ప్రతిపాదనలను పరిశీలించాల్సి ఉండగా, గత టీడీపీ సర్కారులో సింగపూర్ కంపెనీల ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపాక ఆ అథారిటీకి ఆ ప్రతిపాదనలను పంపించారు. దీనిని హైకోర్టు తప్పుపట్టడంతో ఆ అథారిటీనే రద్దు చేస్తూ ఏపీఐడీఈ–2001 చట్టంలో చంద్రబాబు సర్కారు సవరణలు చేసింది. అలాగే సింగపూర్ ప్రైవేట్ కంపెనీలు కోరిన విధంగా రాజధాని భూములపై సర్వహక్కులు కల్పిస్తూ మరోసారి చంద్రబాబు సర్కారు ఏపీఐడీఈ చట్టంలో సవరణలు చేసింది. ఈ సవరణలన్నీ సింగపూర్ కంపెనీలకు భారీ ఆర్థిక ప్రయోజనం కలిగించేలా రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వాటిల్లేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏపీఐడీఈ చట్టం నుంచి ఈ సవరణలన్నీ తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిచింది. ఇందుకు అనుగణంగా ఏపీఐడీఈ చట్టంలో సవరణలను తీసుకురానున్నారు. ఏపీఐడీఈ చట్టం ప్రస్తుతం పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ)తో చేపట్టే ప్రాజెక్టులకే వర్తించనుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టుల పనులన్నింటినీ కూడా ఈ చట్టం పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా చట్టంలో సవరణలను ప్రతిపాదించనున్నారు. ఇదే చట్టంలో టెండర్లను జ్యుడిషియల్ స్క్రూటినీ చేసేందుకు వీలుగా జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రొవిజన్ను కొత్తగా చేర్చనున్నారు. దీంతో ఇక పీపీపీ ప్రాజెక్టులతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే అన్ని రకాల పనుల టెండర్లను పూర్తి పారదర్శకతతో జ్యుడిషియల్ స్క్రూటినీ అనంతరమే ఖరారు చేయనున్నారు. భూముల రీ సర్వే రాష్ట్ర వ్యాప్తంగా భూముల రీ సర్వే చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. ప్రస్తుతం భూములపై ఉన్న హక్కులు ఊహాజనితమేనని, వాస్తవ హక్కులు కాదని, దీంతో భూ యజమానులు తీవ్ర ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఒకరికి చెందిన భూమి మరొకరు కాజేయడం, భూమి హక్కు పత్రాలను సృష్టించడం వంటి చర్యలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఇందుకు స్వస్తి పలికి రాష్ట్రంలో భూములన్నీ రీ సర్వే కోసం ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రత్యేక చట్టం తీసుకురావాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఇందుకు అనుగుణంగా సమగ్ర టైటిల్ను కల్పించేందుకు వీలుగా చట్టం తీసుకురానున్నారు. భూములు రీ సర్వే చేసి శాశ్వత హక్కు కల్పించిన తరువాత సివిల్ న్యాయస్థానాలు కూడా ప్రశ్నించకుండా ఉండేలా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఆలయ పాలక మండళ్లపై సర్కారుకే అధికారం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)తో సహా పలు ఆలయాల పాలకమండళ్లు, ట్రస్టుల చైర్మన్లు, సభ్యులను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రీకాల్ చేయనుంది. ఆ నియమాకాలను సూపర్ సీడ్ చేసే అధికారం ప్రభుత్వానికి కల్పిస్తూ దేవదాయ చట్టంలో సవరణలు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. టీటీడీతో పాటు వివిధ ట్రస్టుల ఛైర్మన్లు, సభ్యులకు సంబంధించి రాజకీయ నియామకాలు జరుగుతుంటాయి. సాధారణంగా ప్రభుత్వం మారితే గత ప్రభుత్వం నియమించిన రాజకీయ పదవుల్లోని వారు రాజీనామా చేస్తారు. అయితే ఇప్పుడు పలువురు రాజకీయం చేయడానికి ఆ పదవుల్లోనే అంటిపెట్టుకుని ఉంటున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ సహా ఇతర ట్రస్టుల చైర్మన్లు, సభ్యులను రీకాల్ చేసే అధికారం ఎప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వానికి ఉండేలా దేవదాయ శాఖ చట్టంలో సవరణలు తీసుకువస్తూ ప్రస్తుత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం పొందాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎట్టకేలకు లోకాయుక్త రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రంలో లోకాయుక్త ఏర్పాటు కాలేదు. గత ఐదేళ్ల చంద్రబాబు సర్కారు లోకాయుక్త ఏర్పాటుపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్.జగన్ తొలి బడ్జెట్ సమావేశాల్లోనే లోకాయుక్త ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. తెలంగాణ తరహాలోనే లోకాయుక్త చట్టానికి సవరణలు చేస్తూ లోకాయుక్త ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రిటైర్డ్ చీఫ్ జస్టిస్తోనే లోకాయుక్త ఏర్పాటు చేయాలని ప్రస్తుత చట్టంలో ఉంది. అయితే రిటైర్డ్ చీఫ్ జస్టిస్లు అందుబాటులో ఉండటం లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రిటైర్డ్ చీఫ్ జస్టిస్ అందుబాటులో లేకపోయిన పక్షంలో రిటైర్డ్ జడ్జిని నియమించేందుకు వీలుగా చట్టంలో సవరణలు చేసింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే తరహాలో చట్టంలో సవరణలు ప్రతిపాదిస్తూ ప్రస్తుత అసెంబ్లీసమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. విద్యార్థుల తల్లిదండ్రులకు ఊరట ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యను వ్యాపారం చేయడాన్ని నియంత్రించేందుకు, ప్రభుత్వ రంగంలోని విద్యా సంస్థలు పటిష్టం చేయడానికి ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లును తీసుకురావాలని సీఎం నిర్ణయించారు. ఇందుకు సంబంధించి పాఠశాల విద్య, కాలేజీ విద్య నియంత్రణ విభాగాలను ఏర్పాటు చేయనున్నారు. ఫీజుల నియంత్రణతో పాటు, మౌలిక వసతుల కల్పనకు సంబంధించి సమగ్ర బిల్లును అసెంబీల్లో ఆమోదించడం ద్వారా చట్టబద్ధత కల్పించనున్నారు. కౌలు రైతులకు అండ భూ యజమానుల హక్కులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం ఇచ్చేందుకు వీలుగా చట్టంలో సవరణలు తీసుకురావాలని నిర్ణయించారు. 11 నెలల పాటు కౌలు ఒప్పందంపై కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు వీలుగా చట్టంలో సవరణలు చేయనున్నారు. కల్తీ విత్తనాలు, నకిలీ పురుగు మందులకు చెక్ రాష్ట్రంలో రైతులను పట్టిపీడుస్తున్న కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులకు చెక్ పెట్టాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా విత్తన కంపెనీలు, ఎరువులు, పురుగు మందుల డీలర్లతో వ్యవసాయ శాఖ అవగాహన ఒప్పందాలను చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. వ్యవసాయ శాఖ అవగాహన ఒప్పందం చేసుకున్న కంపెనీల నుంచే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు కొనాలని రైతులకు ప్రభుత్వం సూచించనుంది. విత్తన, ఇతర కంపెనీల టర్నోవర్ ఆధారంగా సెక్యూరిటీ డిపాజిట్ను నిర్ధారించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉదాహరణకు వంద కోట్ల టర్నోవర్ గల కంపెనీ అయితే రెండు కోట్ల రూపాయల మేర సెక్యూరిటీ డిపాజిట్ చేయించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. కంపెనీలతో చేసుకునే అవగాహన ఒప్పందాల్లోనే నకిలీ విత్తనాల వల్ల మొలకెత్తకపోయినా లేదా దిగుబడి రాకపోయినా, దిగుమతి తగ్గినా ఆయా రైతులకు నష్టపరిహారం ఆయా కంపెనీల ద్వారా చెల్లించేలా క్లాజులను పొందు పరచాలని భావిస్తున్నట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని ఆ అధికారి తెలిపారు. నకీలీ విత్తనాలు నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసినప్పటికీ దానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఇదంతా జరగాలంటే చాలా సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో మధ్యే మార్గంగా విత్తన కంపెనీలతో వ్యవసాయ శాఖ అవగాహన ఒప్పందాలను చేసుకోవాలనే ఆలోచన చేస్తున్నట్లు ఉన్నతాధికారి తెలిపారు. ప్రభుత్వం మారినా పదవులు వదలని నేతలు అధికారం కోల్పోయిన తర్వాత నైతిక ప్రమాణాలు, విలువలు పాటించి గత ప్రభుత్వంలో దక్కిన నామినేటెడ్ పదవులకు రాజీనామా చేసే సంప్రదాయాన్ని టీడీపీ నేతలు పాటించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడి నెలన్నర కావస్తున్నా చాలా మంది టీడీపీ నేతలు ఇంకా తమ పదవులను వదిలేందుకు ఇష్టపడడం లేదు. టీటీడీ చైర్మన్గా పని చేసిన పుట్టా సుధాకర్ యాదవ్ రాజీనామా చేయకుండా మొండికేశారు. ఎట్టకేలకు విమర్శలు తట్టుకోలేక రాజీనామా చేశారు. ఆర్టీసీ చైర్మన్గా ఉన్న వర్ల రామయ్య, ఎస్సీ కో–ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్, శాప్ చైర్మన్ అంకమ్మ చౌదరి, ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దివి శివరాం, స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నామన రాంబాబు, ఆర్టీసీ రీజియన్ చైర్మన్లు.. ఇలా చాలా మంది ఇంకా ఆ పదవులను పట్టుకుని వేలాడుతూనే ఉన్నారు. అధికార మార్పిడి తర్వాత వదిలిపెట్టాల్సిన పదవులను వదిలే విషయంపై చంద్రబాబు సైతం వారికి సరైన దిశా నిర్దేశం చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పదవులు వదలని వ్యవహారంపై టీడీపీలోని పలువురు సీనియర్ నాయకులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తరచూ నీతులు, విలువల గురించి చెబుతూ ఆచరణలో పాటించక పోవడం సరికాదనే అభిప్రాయం ఆ పార్టీలోనే వ్యక్తమవుతోంది -
అడ్డగోలు దోపిడీ
అనంతపురం న్యూసిటీ: సర్వజనాస్పత్రిలోని సీటీ స్కాన్ నిర్వాహకులు అడ్డగో లు దోపిడీకి తెరలేపారు. 2017లో స్కానింగ్ యంత్రం ఏర్పాటు చేసినప్పటి నుంచి విద్యుత్ వినియోగాన్ని తెలిపే మీ టర్ను ఏర్పాటు చేయించుకోలేదు. ఇ ప్పటి వరకు ఆస్పత్రి యాజమాన్యంపై రూ 25 లక్షల నుంచి రూ 30 లక్షల భారం పడుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే రూ లక్షల్లో సీటీ స్కాన్ నిర్వాహకులు లబ్ధిపొం దారని చెప్పాలి. అయినా ఆస్పత్రి ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎంఓయూ బుట్టదాఖలు ఎస్ఎల్ డయాగ్నస్టిక్ సెంటర్ ఒప్పంద నియమాలను (ఎంఓయూ) బుట్ట దా ఖలు చేసిందన్న ఆరోపణలున్నాయి. ఎంఓయూలో సీటీ స్కాన్ నిర్వాహకులు ప్రత్యేకంగా కరెంటు మీటర్ వేసుకోవాలి. దీని ద్వారా ప్రతి నెలా కరెంటు బిల్లు వారే చెల్లిం చాలి. కానీ ఇంతవరకు మీటర్ బిగించలేదు. సర్వజనాస్పత్రిలో రోగులకు సంబంధించి రోజూ 25 నుంచి 30 సీటీ స్కాన్లు చేస్తారు. ప్రభుత్వం ఒక్కో స్కాన్కి రూ 899 చెల్లిస్తుంది. ఇలా ప్రతి నెలా సీటీ స్కాన్ నిర్వాహకులు 900 నుంచి వెయ్యి స్కానింగ్ తీస్తారు. ఇలా స్కాన్ నిర్వాహకులకు ప్రతి నెలా రూ 8 లక్షల నుంచి రూ 9 లక్షల వరకు బిజినెస్ జరుగుతుంది. రూ 30 లక్షల భారం సాధారణంగా ఏదేనీ సీటీ స్కాన్ నిర్వహణలో ప్రతి నెలా రూ లక్షకుపైగానే కరెం టు బిల్లు వస్తుంది. ఆస్పత్రిలో వినియోగించే స్కాన్కు రూ లక్షల్లోనే కరెంటు బిల్లు వస్తుందని పలువురు అధికారులు చెబుతున్నారు. ప్రతి నెలా రూ లక్షల్లో లబ్ధిపొందుతున్నా..ఎందుకు కరెంటు మీటర్ వేయించుకోలేదో అర్థం కావడం లేదు. ఆస్పత్రిలోని ఓ కీలక అధికారి అండదండలతోనే ఈ అడ్డగోలు వ్యవహారం సాగుతోందని సమాచారం. ప్రతి పైసా చెల్లించాల్సిందే విద్యుత్ వినియోగానికి సంబంధించి సీటీ స్కాన్ నిర్వాహకులు ప్రతిపైసా చెల్లించాల్సి ందే. స్కానింగ్ యూనిట్లో ప్రత్యేకంగా మీటర్ బిగించుకోని విషయం నిజమే. అందుకు సంబంధించి మీటర్ బిగించుకోవాలని చెప్పాం. త్వరలో వేయిస్తామన్నారు. మీటర్ అమర్చాక వచ్చే మొదటి మూడు నెలల సగటు తీసుకొని బిల్లు చెల్లించేలా చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ జగన్నాథ్, ఆస్పత్రి సూపరింటెండెంట్ -
విద్యార్థుల సొమ్ముకు వేశారు కన్నం
చీరాల: అవినీతికి, అక్రమాలకు కాదేది అనర్హం అన్నట్లు విద్యాశాఖ వ్యవహరిస్తోంది. విద్యాశాఖలో ఇప్పటికే అనేక అవినీతి వ్యవహారాలు బట్టబయలైనా సిబ్బందిలో ఎటువంటి మార్పులు కనిపించడం లేదు. ప్రస్తుతం ఈ శాఖలో మరో అక్రమ వ్యవహారం బయటపడింది. బస్సు సౌకర్యం లేని గ్రామాలు, దూర ప్రాంతాల నుంచి ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విద్యార్థులకు నెలకు రూ.300 చొప్పున విద్యాశాఖ ప్రతి విద్యార్థికి చెల్లిస్తుంది. జిల్లాలో ప్రధానంగా పర్చూరు ప్రాంతంలో పాఠశాలలకు, గ్రామాలకు మధ్య చాలా దూరం ఉండడంతో విద్యార్థులు వ్యయప్రయాసలతో చదువుకోవాల్సి వస్తుంది. వీరి కోసం విద్యాశాఖ ఇటువంటి అవకాశం కల్పించింది. చీరాల నియోజకవర్గంలో పాఠశాలలన్నీ కిలోమీటరు దూరంలోనే ఉండి బస్సు సౌకర్యం కూడా ఉన్నప్పటికీ నిబంధనలు విరుద్ధంగా వ్యవహరిస్తూ విద్యార్థులకు నయాపైసా కూడా చెల్లించకుండానే పాఠశాల ఉపాధ్యాయులు, ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ కలిసి సొమ్ము స్వాహా చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. 2017–18 విద్యా సంవత్సరంలో వేటపాలెం మండలం నాయనిపల్లి పడమర స్కూల్లో 41 మంది విద్యార్థులకు దూర ప్రాంతం నుంచి వస్తున్నట్లుగా, వారికి ఆర్టీసీ బస్సు సౌకర్యం లేనట్లుగా రికార్డుల్లో సృష్టించి రూ.1.68 లక్షల నిధులు మింగేశారు. అయితే ఇక్కడ కిలోమీటరులోపే ప్రాథమిక పాఠశాల ఉంది. కానీ ఎక్కువ దూరం ఉన్నట్లుగా చూపించి డబ్బులు కాజేశారు. అలానే దేశాయిపేటలో 30 మంది విద్యార్థులకు బస్సు సౌకర్యం లేదని, రవాణా సౌకర్యం కింద రూ.90 వేలు డ్రా చేసి విద్యార్థులకు దక్కనివ్వలేదు. వేటపాలెం ఓఆర్ఎస్ (ప్రాథమిక పాఠశాల) ఏడుగురు విద్యార్థులకు రవాణా సౌకర్యం కింద రూ.12,900, కొత్తపేట యానాది సంఘం యూపీ స్కూల్లో రవాణా సౌకర్యం కింద తొమ్మిది మంది విద్యార్థులకు మొత్తం రూ.15,900 చొప్పున మొత్తం కలిపి రూ.2,25,600 గత మార్చిలో డ్రా చేసి బిల్లులన్నీ స్వాహా చేశారు. నిబంధనలు ఇవీ... ఈ జీవో ప్రకారం మండల పరిధిలోని కిలోమీటరు దూరంలో ఎటువంటి ప్రభుత్వ పాఠశాల లేకుండా ఆ పాఠశాలలోని వారు కిలోమీటరు పక్కన ఉన్న పాఠశాలలో ప్రాథమిక స్థాయి విద్యార్థులకు రవాణా సౌకర్యం కింద రూ.300 చెల్లించాల్సి ఉంది. అది కూడా బస్సు సౌకర్యం లేని ప్రాంతాలకు మాత్రమే. ఆర్టీసీ బస్సు పాసులు అందించాలనే నిబంధన ఉంది. అలానే యూపీ పాఠశాల విద్యార్థులకు 2 కిలోమీటర్లు దాటి మరో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న వారికి రవాణా సౌకర్యం చొప్పున ప్రతి విద్యార్థికి రూ.300 చెల్లిస్తుంది. అలానే హైస్కూల్లో చదువుతున్న విద్యార్థులకు మూడు కిలోమీటర్లు దాటి వెళున్న వారికి రూ.300 చొప్పున అందిస్తుంది. వేటపాలెం మండలంలో ప్రతి కిలోమీటరుకు ప్రాథమిక పాఠశాల, రెండు కిలోమీటర్లలో యూపీ స్కూల్స్, మూడు కిలోమీటర్ల దూరంలో హైస్కూల్ ఉన్నాయి. చివరకు చీరాల నుంచి ఒంగోలుతో పాటు ఈ పాఠశాలకు ఆర్టీసీ బస్ సౌకర్యం ఉంది. అయినా దూర ప్రాంతాల నుంచి వస్తున్నట్లు నమ్మించారు. బయటపడిందిలా... ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఏటా గణనీయంగా పడిపోవడంతో బడిబాట పేరుతో విద్యార్థులను పాఠశాలలో చేర్పించాలని విద్యాశాఖ ఆదేశించింది. అలానే విద్యార్థుల సంఖ్య తగిన రీతిలో లేకపోతే ఆ పాఠశాలను తొలగిస్తున్నారు. దీంతో విద్యాసంవత్సరం మొదటి సంవత్సరంలోనే ఆయా పాఠశాలలో ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరిగి విద్యార్థులను చేర్పించేందుకు మొదటలో ఉపాధ్యాయులు ఒక్కొక్కరు రూ.500లు చొప్పున ఖర్చు పెట్టి విద్యార్థులను తీసుకువచ్చేందుకు ఆటోలు ఏర్పాటు చేశారు. అయితే రవాణా చార్జీల కింద వచ్చిన నిధులలో ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన రూ.500 ఇవ్వకపోవడంతో ఉపాధ్యాయుడికి, ప్రధానోపాధ్యాయుడికి మధ్య వివాదం తలెత్తడంతో ఈ అవినీతి వివాదం బట్టబయలైంది. ఎంఈఓ ఏమంటున్నారంటే.... వేటపాలెం మండల ఎంఈఓ ఏకాంబరేశ్వరరావు ఈ అక్రమ వ్యవహారంపై మాట్లాడుతూ విద్యార్థులకు రవాణా కింద చెల్లించాల్సిన నగదు దుర్వినియోగం అయినట్లు తన దృష్టికి వచ్చిందని, దానిపై విచారిస్తున్నట్లు తెలిపారు. అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. -
ఇక పెళ్లిళ్లకు లెక్కలు ఉన్నాయ్..
పోడూరు : పెళ్లంటే పందిళ్లు, తప్పెట్లు, తాళాలు, తలంబ్రాలు.. మూడే ముళ్లు.. ఏడే అడుగులు.. మొత్తం కలిపి నూరేళ్లు.. అంటూ వివాహం గురించి, పెళ్లి సందడి గురించి ఒక్క పాటలో కవులు తెలిపారు.మన భారతదేశంలో వివాహ వ్యవస్థకు ప్రత్యేక విశిష్టత ఉందని విదేశీయులు సైతం నమ్ముతారు. వివాహం తర్వాత ప్రతి ఒక్కరికి కొత్త జీవితం ప్రారంభమవుతుంది. కొత్త బంధాలు, బంధుత్వాలు ఏర్పడుతాయి. తాళి అనే బంధం ఏర్పడినప్పటి నుంచి కాటికి చేరే వరకు భార్యాభర్తలు ఒకరికొకరు కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ తోడూ నీడగా ఉంటారు. అలాంటి పటిష్టమైన మన వివాహ వ్యవస్థను కట్న కానుకలు, లాంఛనాలనే చీడ పురుగు పట్టి పీడిస్తుంది. ఇటీవల పేద, ధనిక అనే తేడా లేకుండా ఆడంబ రాలకు పోయి తలకు మించిన ఖర్చులు పెడుతూ పెళ్లిళ్లు వైభవంగా జరిపిస్తున్నారు. అయితే కట్నం కోసం అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యను వేధించే అత్తింటి వారు, అలాగే అత్తింటివారిపై తప్పుగా వరకట్న కేసులు పెట్టి వేధించే కోడళ్లను నిత్యం సమాజంలో చూస్తున్నాం. ఈనేపథ్యంలో వరకట్న వేధింపులను అరికట్టేందుకు ప్రభుత్వం 498 చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చింది. ఈ చట్టాన్ని అడ్డుపెట్టుకుని తప్పుడు వరకట్న కేసులు కూడా నమోదవుతున్నాయి. భార్యాభర్తల గొడవల్లో కోర్టులకెక్కినపుడు పెళ్లి సమయంలో అనేక లాంఛనాలు సమర్పించామని, ఘనంగా ఖర్చు చేసి పెళ్లి జరిపించామని ఇరువైపుల నుంచి కోర్టులో పిటీషన్లు దాఖలవుతున్నాయి. కట్నం కోసం కట్టుకున్నదాన్ని తన్ని పుట్టింటికి తరిమివేసేవారు కొందరైతే, అత్తింటివారిపై తప్పుడు కేసులు పెట్టి వేధించే అతివలు మరికొందరున్నారు. ఇలా ఇరువైపుల నుంచి వచ్చే కేసుల దృష్ట్యా ఇలాంటి తప్పుడు కేసులు అరికట్టేందుకు ఇటీవల సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఒక సూచన చేసింది. దాని ప్రకారం పెళ్లి సమయంలో అయ్యే ఖర్చుల వివరాలను ప్రభుత్వానికి సంబంధీకులు సమర్పించాలని కోర్టు సూచించింది. ఈ నిర్ణయాన్ని అనేక మంది స్వాగతిస్తున్నారు. గతంలోనూ వివాహాల గురించి చట్టాలు వచ్చాయి. వివాహాలను తప్పనిసరిగా నమోదు చేయాలనే చట్టం ఉన్నా అమలు చేసే అధికార యంత్రాంగం, ఆచరించే ప్రజలు లేక అవి నిష్ఫలమయ్యాయి. అందుకే చట్టాలు వచ్చినపుడు ప్రజలు దాన్ని అర్ధం చేసుకుని నడుచుకుంటే సత్ఫలితాలుంటాయి. అలాగే చట్టాలను ప్రభుత్వం సక్రమంగా అమలు చేసినపుడే ప్రయోజనం ఉంటుంది. పెళ్లి ఖర్చులు ప్రభుత్వానికి తెలపాలనే సుప్రీంకోర్టు సూచనను పలువురు మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వరకట్న వివాదాలుండవు సుప్రీంకోర్టు చెప్పినట్లుగా చట్టం చేస్తే ముఖ్యంగా మన దేశంలో వరకట్న వివాదాల కు చెక్ పడుతుంది. వరకట్న వివాదాల్లో చాలా వరకు తప్పుడు కేసులు ఉంటున్నాయి. పెళ్లిళ్ల పేరుతో చేసే ఆడంబరాలు తగ్గుతాయి. ఇలాంటి ఆడంబరాలు తగ్గించుకుని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుంది.-కొప్పిశెట్టి ఏసుబాబు, గుమ్మలూరు అప్పుల బాధ తప్పుతుంది పేద, సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు ఒక ఆడ బిడ్డకు పెళ్లి చేయాలంటే లక్షల్లో అప్పు చేయాల్సిన పరిస్థితి మనదేశంలో నెలకొంది. ఆర్థిక సామర్థ్యం లేకపోయినా కట్న కానుకలు, ఆడంబరాల కోసం అప్పులు చేయాల్సి వస్తోంది. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని అమలు చేయడం వల్ల ఆడపిల్లల తల్లిదండ్రులకు ఆ అప్పుల బాధ చాలా వరకు తగ్గుతుంది.తాళాబత్తుల వెంకటేశ్వరరావు, జిన్నూరు కచ్చితంగా అమలు చేయాలి పెళ్లి ఖర్చులు ప్రభుత్వానికి చెప్పాలన్న నిర్ణయాన్ని కచ్చితంగా అమలు చేయాలి. వరకట్న నిషేధం ఎప్పట్నుంచో అమలులో ఉన్నా సరిగా అమలు కావడం లేదు. వర కట్నాల వల్ల కొంత మంది సంసారాలు నాశనమవుతున్నాయి. అత్తింటి పోరు తట్టుకోలేక ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.అందే నాగేశ్వరరావు, రావిపాడు -
విచారణ ‘బీచ్’లోకేనా?!
సాక్షి, మచిలీపట్నం : మసూల బీచ్ ఫెస్టివల్ పేర అక్రమాలకు ఆజ్యం పోశారు. అందినకాడికి దోచుకునేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. అనుకున్నదే తరువాయి దోపిడీ పర్వానికి పావులు కదిపారు. ఏకంగా రూ.కోట్లు దోపిడీకి తెగబడ్డారు. చేయని ఖర్చుకు బిల్లులు పెట్టి కోట్లు నొక్కేందుకు తెర తీశారు. అక్రమ బాగోతంపై ‘సాక్షి’లో ‘బీచ్ ఫెస్టివల్ దోపిడీ’, ‘బీచ్ లెక్కలన్నీ తూచ్’ శీర్షికలతో వరుస కథనాలు ప్రచురితం కావడంతో రాజకీయ, అధికార వర్గాల్లో కలకలం రేగింది. మొక్కల పేరుతో రూ.60 లక్షలు బిల్లులు పెట్టి రూ.50 లక్షలు స్వాహా చేసేందుకు సిద్ధమైన వైనాన్ని, మూడు రోజుల పాటు స్టేజ్ నిర్మాణానికి రూ.9 లక్షలు వెచ్చించాల్సి ఉండగా, రూ.40 లక్షలకు పైగా బిల్లులు పెట్టిన తంతును బహిర్గతం చేయడంతో స్పందించిన కలెక్టర్ లక్ష్మీకాంతం అక్రమాలపై విచారణ నిర్వహించాలని జేసీ విజయకృష్ణన్ను నియమించారు. ఇంత వరకు బాగానే ఉన్నా ఇక్కడే అసలు కథ ప్రారంభమైంది. అనూహ్యంగావిచారణ అధికారి మార్పు.. బీచ్ ఫెస్టివల్ దోపిడీ పర్వంపై విచారణకు తొలుత జేసీ విజయకృష్ణన్ను నియమించారు. ఆమె తనదైన శైలిలో విచారణకు ఉపక్రమించారు. అక్రమ తంతులో ఎవరి హస్తం ఉంది? ఎవరెవరికి ఏ మేరకు ముడుపులు అందాయి? అన్న కోణంలో విచారణ ప్రారంభించారు. అనంతరం ఏమైందో ఏమో? అనూహ్యంగా విచారణ అధికారి మార్పు ప్రక్రియ తెరపైకి వచ్చింది. అంత తక్కువ వ్యవధిలోనే మార్పు చేయాల్సిన అవసరం ఏముంటుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీని వెనుక మరో కోణం దాగుందని స్పష్టమవుతోంది. అక్రమాలను కప్పి పుచ్చేందుకే ఇలాంటి చర్యలకు దిగుతున్నారని అర్థమవుతోంది. జేసీ స్థానంలో విచారణ అధికారులుగా డీఆర్వో, ఆర్డీవో, ‘ముడా’ వీసీని నియమించారు. దొంగ చేతికి తాళాలు ఇచ్చిన చందంగా నిధుల దుర్వినియోగం అయిన శాఖకు చెందిన అధికారికే ఆ బృందంలో స్థానం కల్పించారు. వారే నిధుల వ్యయంపై నివేదిక ఇవ్వాలని సూచించడాన్ని బట్టి చూస్తే విచారణ ఏ మేరకు పక్కాగా జరుగుతుంది? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బిల్లులు తాత్కాలికంగా నిలుపుదల చేసినా.. మరో రెండు రోజుల్లో మంజూరుకు కసరత్తు జరుగుతోంది. దీని బట్టి చూస్తే అక్రమ బిల్లులను సక్రమం చేసుకుని, అవినీతి నుంచి బయటపడేందుకు పావులు కదుపుతున్నారని అర్థమవుతోంది. ఇదిలా ఉంటే అక్రమ తంతు నుంచి గట్టెక్కించాలని ఓ అధికారికి ఇటీవల భారీగా ముడుపులు సమర్పించినట్లు తెలిసింది. భారీగా పెట్టిన బిల్లులను పైకి తక్కువగా చూపించి.. చెల్లింపుల్లో మాత్రం యథావిథిగా ఇచ్చేందుకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే మొదలైనట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ అంశం హాట్ టాపిక్గా మారడంతో ఇప్పట్లో బిల్లులు చెల్లిస్తే మరింత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు తలెత్తుతాయేమోనని.. కొన్ని రోజులు విరామం ప్రకటించి.. విషయం సద్దుమణిగిన అనంతరం చెల్లించే యోచనలో ఉన్నట్లు సమాచారం. -
కారులు..కాసులు
జిల్లాకు చెందిన ఓ ఎంపీడీఓ తన సొంత వాహనాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ వాహనం పేరుతోనే ప్రతి నెలా రూ.35 వేలు డ్రా చేస్తున్నారు. ఈ వాహనాన్ని కూడా ఎప్పుడో ఒకసారి తీస్తారంతే. ఆ ఎంపీడీఓనే సొంతంగా డ్రైవింగ్ చేసుకుంటారు. బినామీ పేరుతో అద్దె సొమ్మును ఎంచక్కా లాగేస్తున్నారు. ఆ సొంత వాహనంలో ఏ రోజూ క్షేత్ర పర్యటనకు వెళ్లిన దాఖాలాలు లేవు. అడపాదడపా సిబ్బందితో సమీక్షలు చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఉపాధి పథకం నుంచి వచ్చే ప్రయోజనాలన్నీ పొందుతున్నారు. కేవలం ఆ ఒక్క ఎంపీడీఓనే కాదు సింహభాగం ఎంపీడీఓలదీ అదే పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా 90 శాతం మందిదీ ఇదే తంతు. సాక్షి, మచిలీపట్నం: కష్టజీవుల ఆకలి తీర్చి, ఉపాధి కల్పించేందుకు ప్రారంభించిన గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసులు కురిపిస్తోంది. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై నిధులు దోచేయడం, దొంగ బిల్లులు పెట్టి స్వాహా పర్వానికి తెర తీస్తున్నారు. ఇది నిత్యం జరిగే ప్రక్రియ. ఇదిలా ఉంటే అందులో మరో కోణం దోపిడీకి సాక్ష్యంగా నిలుస్తోంది. పనుల పర్యవేక్షణకు ప్రభుత్వం కేటాయిస్తున్న వాహనాల వాహనాల అద్దె పేరుతో దోపిడీ దారి వెతుక్కున్నారు. నెల గడవడమే ఆలస్యం ఠంచనుగా ఎక్కడికక్కడ నిధులు డ్రా చేసేస్తున్నారు. అసలు వాహనాలనే అద్దెకు తీసుకోలేదు. అతికొద్ది మంది మాత్రమే అద్దె వాహనాలు తీసుకున్నారు. అయినా అద్దెకు వాహనాలు తీసుకున్నట్లు రికార్డులు చిత్రీకరించారు. కొందరు అతి తెలివి ఉపయోగించి.. నెలలో రెండు మూడు రోజులు మాత్రమే అద్దెకు తీసుకుంటున్నారు. వీరితోనే ఖాళీ బిల్లు తీసుకుని అద్దె డ్రా చేసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. ఇదీ కథ! జిల్లాలో 49 మండలాలుండగా.. అన్ని మండాల్లో ఉపాధి పనులు సాగుతున్నాయి. ఎంపీడీఓలు క్షేత్రస్థాయికి వెళ్లి ఉపాధి పనులు తనిఖీ నిర్వహించేందుకు అద్దె ప్రాతిపదిక వాహన సౌకర్యం కల్పిస్తారు. ఇలా ఎంపీడీఓకు నెలకు వాహన అద్దెకు రూ.35 కేటాయిస్తారు. ఆ నిధులు వారు ఎప్పుడైన డ్రా చేసుకోవచ్చన్న వెసలుబాటు కల్పించారు. ఇలా 49 మండలాలుంగా 47 మండలాల్లో కార్లు వినియోగిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తప్పకుండా అద్దె వాహనం ఏర్పాటు చేసుకోవాలి. సొంత వాహనాలనే అద్దె వాహనాలుగా చలామని చేస్తున్నారు. ఇలా ఒకటి రెండు కాదు.. జిల్లా వ్యాప్తంగా 90 శాతానికిపైగా ఇదే తంతు సాగుతోంది. వాస్తవానికి ఎవరు ఏ వాహనాన్ని తీసుకున్నారు? ఆ యజమాని ఎవరు? డ్రైవర్ పేరు.. అతడి లైసెన్సు వంటి వివరాలన్నీ డ్వామా పీడీ కార్యాలయానికి పంపాలి. కానీ ఆ ఊసేలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే.. దోపిడీ ఏ స్థాయిలో సాగుతుందో ఇదే నిదర్శనం. అద్దె వాహనాలు పెట్టారా? లేదా? అన్నది డ్వామా అధికార యంత్రాంగం కూడా కనీస శ్రద్ధ చూపలేదు. జిల్లా కేంద్రం నుంచి పీడీ, అదనపు పీడీలు, సహాయ పీడీలు క్షేత్ర పర్యటనకు వెళ్లే సంబంధిత ఉపాధి సిబ్బంది మాత్రమే వారి వెంట వెళ్తున్నారు. స్థానికంగా ఎంపీడీఓలు అసలు వెళ్లడం లేదు. ఉపాధి తమకు సంబంధం లేదన్న నిర్లక్ష్యం వైఖరి వీడలేదు. మండల స్థాయి పథక అధికారి (పీఓ) ఎంపీడీఓనే ఉంటారు. అందుకే ఆయన పేరుపైనే డిజిటల్ సంతకాల తాళం (డీఎస్కే) ఉంటుంది. ప్రతి బిల్లు చెల్లింపు ఎంపీడీఓ/ఏపీఓ ద్వారానే సాగుతుంది. నెలకు అద్దె రూ.35 వేలు... మండల స్థాయిలో ఉపాధి కీలక అధికారి ఎంపీడీఓనే. పూర్తిస్థాయి పర్యవేక్షణాధికారి ఆయనే. ఆయన ఒక్కరే రెగ్యులర్ అధికారి. మిగిలిన ఏపీఓ, ఈసీ, టీసీ, సీఓ.. వంటి కేడర్ల సిబ్బంది మొత్తం హెచ్ఆర్ పాలసీ కింద ఉన్నారు. అందుకే డీఎస్కే పీఓగా ఉన్న ఎంపీడీఓకే ప్రాధాన్యం ఇచ్చారు. మండలం అంతా విస్తృతంగా తిరిగి కూలీలకు పని దినాలు కల్పించడం. వారి సమస్యలు, బిల్లుల చెల్లింపుల్లో జాప్యాన్ని నివారించడం.. వంటి సమస్యలు ఎక్కడికక్కడ పరిష్కరించాలనే ఉద్దేశంతో అద్దె వాహన వసతిని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. సంబంధిత మండల సిబ్బందిని వెంట పెట్టుకుని మండలంలో తిరగాలి. ఈ క్రమంలోనే గత ఏడాది అక్టోబరు నుంచి వాహన వసతిని సమకూర్చారు. ఈ ఏడాది మార్చి దాకా ఈ సౌకర్యాన్ని కల్పిస్తూ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి కమిషనర్ (సీఆర్డీ) ఉత్తర్వు ఇచ్చారు. మొదట్లో రెండు నెలలకు ఒకేసారి రూ.70 వేలు తీసుకున్నారు. ప్రస్తుతం ప్రతి నెలా తప్పుకుండా డ్రా చేస్తేన్నారు. ఇలా ఒక్కో ఎంపీడీఓ అద్దె వాహనం రూపంలో రూ.లక్షలు డ్రా చేశారు. మొత్తంగా నెలకు రూ.16.45 లక్షలు అద్దె వాహనాలకే వెళ్తోంది. ఎంపీడీఓలు ఏ వాహనం వాడుతున్నారు. దీనికి సంబంధించి వివరాలను నిర్దేశిత వెబ్సైట్లో అప్లోడ్ చేయడంతో నేరుగా సీఆర్డీ కార్యాలయం నుంచే అద్దె చెల్లించారు. ఈ వాహనాలకు సంబంధించి పీడీ కార్యాలయంలో ఏ వివరాలు లేవు. ఊసేలేని క్షేత్ర పర్యటన! ఉపాధి పనుల సీజన్ మొదలైంది. పల్లెలకు వెళ్లి కూలీలతో మాట్లాడాలి. గ్రామ సభలు నిర్వహించాలి. వలసలను నియంత్రించేలా పనులు చూపాలి. ఇందుకు సిబ్బందితో నిత్యం సమీక్షలు జరపాలి. జిల్లాలో ఎక్కువ శాతం ఎంపీడీఓలు ఇవేమీ పట్టడం లేదు. నివాస ప్రాంతాల నుంచి తమ కార్యాలయాలకు వెళ్లడం.. సిబ్బందిపై కర్ర పెత్తనం చెలాయించడానికే పరిమితం అయ్యారు. డ్వామా అధికారులు కూడా వారితో పనిచేయించడం లేదు. వారితో ఏనాడూ సమీక్ష జరపలేదు. అందుకే పని దినాలు కూడా రోజూ 60 వేలు కూడా దాటం లేదు. మరోవైపు.. వ్యక్తిగత పనులకే వాహనాలు ఎక్కువ శాతం వినియోగిస్తున్నారు. అత్యధిక శాతం మంది ఎంపీడీఓలు పట్టణ ప్రాంతాల్లో నివాసం ఉంటుండటం, అక్కడి నుంచి ఎంపీడీఓ కార్యాలయానికి రావడం.. తిరిగి వెళ్లిపోవడం.. దీంతోనే ప్రభుత్వం కేటాయించిన 2,000 కిలో మీటర్లు ముగుస్తున్నాయి. ఇక తమకు కేటాయించిన దూరం తిరిగేశామని మిన్నకుండిపోతున్నా. ఈ విషయమై డ్వామా పీడీని వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. ఆయన అందుబాటులోకి రాలేదు. -
లేని వాహనానికి మూడేళ్ల బిల్లులు..
బినామీ వాహనంతో మూడేళ్ల బిల్లులు నొక్కేసేందుకు విద్యుత్శాఖ అధికారులు సిద్ధమయ్యారు. యుటిలిటీ వాహనం పేరిట విద్యుత్ శాఖ ఇచ్చిన సౌలభ్యాన్ని ఆసరా చేసుకొని వాహనాన్ని వాడకుండానే రూ.10.83 లక్షల బిల్లులు స్వాహా చేసేందుకు గుట్టుగా ప్రయత్నం సాగిస్తున్నారు. ఓ పోలీస్టేషన్లో ఉన్న వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ నమోదు చేసి బిల్లులు సమర్పించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే ఉన్నతాధికారుల అనుమతులు లేకుండానే వాహనం అద్దె, బిల్లుల చెల్లించేందుకు అగ్రిమెంట్లు సైతం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏడాది అద్దెకు సంబంధించి రూ.3 లక్షలు చెల్లింపులు జరిగినట్లు సమాచారం. విషయం బయటకు రావడంతో బిల్లుల చెల్లింపు ప్రక్రియ నిలిపివేయడంతో పాటు విచారణకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ అంశాలపై ‘సాక్షి’ పరిశోధనాత్మక కథనం.. సాక్షి, మెదక్:మెదక్ విద్యుత్ డివిజన్ పరిధిలోని పాపన్నపేట సబ్డివిజన్లో ఓ అధికారి నిబంధనలకు విరుద్ధంగా మూడేళ్లకు సంబంధించి యుటిలిటీ వాహనం బిల్లులు కాంట్రాక్టర్ పేరిట పొందడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందించడానికి ప్రతి ఏడాది సబ్ డివిజన్ అధికారులకు ఒక యుటిలిటీ వాహనం ఇస్తారు. ఈ వాహనం విద్యుత్ సామగ్రి రవాణా చేసేందుకు అనుకూలంగా ఉండాలి. అయితే కొంతమంది అధికారులు తమ సొంత వాహనాలను దీనికోసం వాడుతూ యుటిలిటీ వాహనం పేరిట బిల్లులు వసూలు చేస్తున్నారు. కారులాంటి వాహనాలకునెలకు రూ.20వేలు చెల్లిస్తుండగా ట్రక్కు లాంటి వాహనాలకు రూ.32వేలు క్లయిమ్ చేసే అవకాశం ఉంటుంది. యుటిలిటీ వాహన సేవలు వినియోగించుకుంటున్నట్లు తప్పుడు బిల్లులు సమర్పిస్తూ...డబ్బు దండుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. మూడేళ్ల బిల్లులకు అగ్రిమెంట్ ఆ విద్యుత్ అధికారి కాంట్రాక్టర్ పేరిట నవంబర్ 2015 నుంచి సెప్టెంబర్ 2017 వరకు పాత డివిజన్లో ఉన్న జోగిపేటలో బిల్లులు పొందడానికి యత్నించినట్లు సమాచారం. అయితే అవి బినామీ కావడంతో అక్కడి అధికారులు వాటిని క్లయిమ్ చేయనట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో పాపన్నపేట సబ్ డివిజన్ మెదక్ డివిజన్ పరిధిలోనికి మారింది. దీంతో పాపన్నపేటకు చెందిన అధికారి మెదక్ డివిజన్లో మూడేళ్లకు సంబంధించిన బిల్లులు క్లయిమ్ చేయించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు. కొంత వరకు ఈ ప్రయత్నం సఫలమైనట్లు తెలుస్తోంది. నవంబర్ 2015 నుంచి నవంబర్ 2017 వరకు లేని వాహనానికి ఓ కాంట్రాక్టర్ పేరిట రూ.10.83 లక్షల బిల్లులు తయారు చేసి మంజూరీ కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. చిత్రం ఏమిటంటే మెదక్ డివిజన్లోకి మారిన కేవలం ఆరు నెలల కాలంలో మూడేళ్ల బిల్లులకు అగ్రిమెంట్ సైతం చేయించుకొని నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు పొందేందుకు అధికారులను ప్రసన్నం చేసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఒక ఏడాదికి సంబంధించి సుమారు రూ.3లక్షల వరకు బిల్లులు క్లయిమ్ చేయించుకున్నట్లు తెలుస్తోంది. అగ్రిమెంట్ నంబరు 56001919362 ద్వారా రూ.4,00,907 అగ్రిమెంట్ నంబరు 560022811 ద్వారా రూ.1,72,052, అగ్రిమెంట్ నంబరు 560022812 ద్వారా రూ.1,72,052, అగ్రిమెంట్ నంబరు 5600267270 ద్వారా రూ.3,38,400 మొత్తం రూ.10,83,860 బిల్లుల చెల్లింపుల కోసం బిల్లులు సమర్పించినట్లు ఆరోపణలున్నాయి. అలాగే 2017లో ఈదురు గాలులు వచ్చి పాపన్నపేట మండలంలో విద్యుత్ స్తంభాలు పడిపోయిన సమయంలో ఓ కాంట్రాక్టర్ పేరిట అగ్రిమెంట్ చేయించుకొని సుమారు రూ.5లక్షల వరకు నిధులు కాజేసినట్లు ఆరోపణలున్నాయి. బిల్లులు చెల్లించలేదు.. పాపన్ననపేట ఏడీఈ సబ్ డివిజన్ కార్యాలయంలో యుటిలిటీ వాహనం బిల్లులు చెల్లింపుల వ్యవహారంపై డీఈ వెంకటరత్నం వివరణ కోరగా అగ్రిమెంట్ వివరాలను సమగ్రంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. పోలీస్టేషన్లో ఉన్న వాహనంపై బిల్లులు క్లెయిమ్ చేసినట్లు వచ్చిన ఆరోపణలను ఆయన కొట్టేశారు. ఒక వాహనం వినియోగించినట్లు బిల్లులు సమర్పించటం జరిగిందన్నారు. ఏడాదికి సంబంధించిన బిల్లులు మంజూరు చేశామన్నారు. ఇంకా డబ్బులు డ్రా కాలేదని తెలిపారు. యుటిలిటీ వాహనం వినియోగం, బిల్లులు సమర్పించిన తీరుపై అనుమానాలు ఉండటంతో విచారణకు ఆదేశించామన్నారు. -
షర్ట్ విప్పిచూడ.. బంగారు నగలుండ..
దొడ్డబళ్లాపురం: బిల్లు, తగిన దాఖలు పత్రాలు లేకుండా కారులో తరలిస్తున్న రెండు కేజీల బంగారాన్ని దేవనహళ్లి తాలూకా బాలేపుర చెక్పోస్టులో పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం హొసకోట నుంచిదేవనహళ్లి మీదుగా వస్తున్న కారును బాలేపుర చెక్పోస్టు వద్ద ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులు తనిఖీ చేశారు. డ్రైవర్ తన షర్ట్ కింద కడుపు భాగంలో పొట్లాల రూపంలో బంగారాన్ని దాచుకున్న విషయం బయట పడింది. పరిశీలించగా రెండు కేజీలుగా లెక్కతేలింది. ఇందుకు సంబంధించి బిల్లులు లేకపోవడంతో స్వాధీనం చేసుకొని డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై చెన్నరాయపట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
బిల్లు చూస్తే గుండె దడ
కర్నూలు నగరంలోనిఓ ఫంక్షన్ హాలుకు చెందిన వ్యక్తి రెండు నెలల క్రితం గుండెనొప్పి రావడంతో నగరంలో కొత్తగా ఏర్పాటైన ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. అతన్ని 45 రోజుల పాటు ఆసుపత్రిలో ఉంచుకుని రూ.33 లక్షల బిల్లు వేశారు. ముక్కుపిండి మరీ వసూలు చేశారు. ఆ బిల్లు కట్టి బతుకు జీవుడా అంటూ సదరు వ్యక్తి డిశ్చార్జ్ అయ్యాడు. కర్నూలు నగరానికి చెందిన ఫైనాన్స్ వ్యాపారి రాము బీపీ చెక్ చేయించుకోవడానికి తన సామాజిక వర్గానికే చెందిన వైద్యుడు నిర్మించిన ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాడు. అతనికి అక్కడ ఈసీజీ, 2డీ ఎకోతో పాటు యాంజియోగ్రామ్ పరీక్షలు చేశారు. రూ.10వేలు బిల్లు వేశారు. అలాగే రెండు వాల్వులు బ్లాక్ అయ్యాయని, ఆపరేషన్ చేసి స్టెంట్లు వేయాలని చెప్పారు. దీంతో బెదిరిపోయిన అతను బెడ్పై నుంచే ఇంటికి ఫోన్ చేసి రూ.4లక్షలు తెప్పించుకుని స్టెంట్లు వేయించుకున్నాడు. కర్నూలు(హాస్పిటల్): ప్రకాశం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఛాతి నొప్పి అంటూ నగరంలోని ఓ ప్రముఖ ఆసుపత్రికి వెళ్లాడు. అతనికి స్టెంట్ వేయాలని, రూ.2లక్షలు అవుతుందని వైద్యులు చెప్పారు. తనకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందని చెప్పగా, క్లెయిమ్ మొత్తంతో పాటు అదనంగా రూ.50వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే నాణ్యత లేని స్టెంట్ వేయాల్సి ఉంటుందని బెదిరించారు. ఎడతెరిపిలేని దగ్గు అయితే టీబీ కావచ్చనే తరహాలో ఛాతిలో నొప్పి ఉంటే అది గుండెనొప్పికి దారితీయొచ్చంటూ రోగులను కొందరు వైద్యులు బెంబేలెత్తిస్తున్నారు. అవసరం లేకపోయినా ఈసీజీ, 2డీ ఎకో పరీక్షలతో పాటు యాంజియోగ్రామ్ పరీక్షలూ చేస్తున్నారు. ఈ పరీక్షలపై అవగాహన లేని వారికి కాస్త తేడా కన్పిస్తోందని, స్టెంట్ వేయించుకోకపోతే ప్రాణాలకే ప్రమాదమని బెదిరించి మరీ రూ.లక్షలు వసూలు చేస్తున్నారు. ఒకప్పుడు కర్నూలు నగరంలో నాణ్యమైన వైద్యం అందించే ఆసుపత్రులు లేవని బాధపడేవారు. ఇప్పుడు నాణ్యమైన వైద్యం అందించే ఆసుపత్రులు వచ్చినా, లేనిపోనివి చెప్పి ఎక్కడ బిల్లుతో బాదుతారోనని జనం బెదిరిపోతున్నారు. అవసరం లేకపోయినా పలు పరీక్షలు చేయించి..బిల్లుల మోత మోగిస్తుండటంతో అప్పులు చేసి మరీ చెల్లించాల్సి వస్తోంది. గతంలో కర్నూలు నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మాత్రమే యాంజియోగ్రామ్లు చేసేవారు. ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ఐదారు ఆసుపత్రుల్లో కేథలాబ్లు ఏర్పాటు చేశారు. నాలుగు ఆసుపత్రుల్లో గుండె శస్త్రచికిత్సలు కూడా చేస్తున్నారు. కర్నూలుతో పాటు వైఎస్ఆర్ జిల్లా, అనంతపురం, తెలంగాణలోని గద్వాల, అలంపూర్, మహబూబ్నగర్, బళ్లారి ప్రాంతాలకు చెందిన హృద్రోగులు చికిత్స కోసం కర్నూలు వస్తున్నారు. హైదరాబాద్తో పోలిస్తే గుండె చికిత్సలు ఇక్కడ కాస్త తక్కువైనా పోటీ ఎక్కువ కావడం, పెట్టుబడులు, నిర్వహణఖర్చులు పెరిగిపోవడంతో కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రులు కొన్ని అనైతిక వైద్యానికి తెరతీశాయన్న విమర్శలు విన్పిస్తున్నాయి. ఆయా ఆసుపత్రుల వైపు వెళ్లాలంటేనే జనం భయపడే పరిస్థితి ఏర్పడింది. డామిట్ ‘స్టెంట్’ కథ అడ్డం తిరిగింది! స్టెంట్ల పేరుతో ప్రైవేటు ఆసుపత్రులు దోపిడీ చేస్తున్నాయని ఫిర్యాదులు రావడంతో కేంద్ర ప్రభుత్వం వాటి ధరలను గణనీయంగా తగ్గించేసింది. ఒక్కో స్టెంట్ ధర రూ.30,180లుగా నిర్ణయించింది. కానీ తెలివిమీరిన కొందరు ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల నిర్వాహకులు స్టెంట్ల ధరలు తగ్గించి, హ్యాండ్లింగ్ చార్జీలు(నిర్వహణ ఖర్చులు) మాత్రం పెంచేశారు. ఈ కారణంగా ఒక స్టెంట్ వేయించుకుంటే ఎప్పటిలాగే రూ.1.50 లక్షల నుంచి రూ.2లక్షల వరకు ఖర్చవుతోంది. ఫీజుల వివరాలు జాడలేదు ప్రతి కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రిలో ప్రజలందరికీ కనిపించేలా ఫీజుల వివరాలు ప్రదర్శించాలి. ఆసుపత్రిలోకి ప్రవేశించగానే రిసెప్షన్ కౌంటర్ వద్ద గానీ, అందరికీ కనిపించే విధంగా గానీ ఈ బోర్డు ఏర్పాటు చేయాలి. ఆసుపత్రిలో ఏయే చికిత్సకు ఎంత వసూలు చేస్తున్నారు.. ల్యాబ్ పరీక్షా ఫీజుల వివరాలను సైతం ఇందులో ప్రదర్శించాలి. కర్నూలు నగరంలో కొన్ని ఆసుపత్రులు మాత్రమే ఈ విధానాన్ని పాటిస్తున్నాయి. అధికశాతం కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఫీజుల వివరాలు మచ్చుకైనా కనిపించవు. ఈ విషయమై ప్రశ్నించే అధికారం, దమ్ము జిల్లా అధికారులకు లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
లేనిది ఉన్నట్టు... అంతా కనికట్టు...
ఒకే ఇంట్లో నిర్మించిన మరుగుదొడ్డికి ముగ్గురి పేర్లతో బిల్లులు కాజేశారు. తాత్కాలికంగా గుడ్డతో కట్టుకున్న దొడ్డి ఉంటే దానికి డబ్బులు గుంజేశారు. చనిపోయినవారి పేర్లను చేర్చి వారి పేరున స్వాహా చేశారు. ఇదీ కొత్తవలస మండలం చినరావుపల్లిలో జరిగిన బిల్లుల మాయాజాలం. కొత్తవలసరూరల్(శృంగవరపుకోట): స్వచ్ఛభారత్ మిషన్లో భాగంగా సంపూర్ణ బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ఓ వైపు జిల్లా కలెక్టర్ ఓ ఉద్యమంలా కార్యక్రమాలు చేపడుతుంటే అందులోనూ కాసులు కాజేసేవారు పుట్టుకొస్తున్నారు. నిర్దేశించిన లక్ష్యాలు పూర్తి చేయడానికి తప్పుడు లెక్కలతో బిల్లులు కాజేసేశారు. ఈ స్కాం వెనుక మండలానికి చెంది న ఓ అ«ధికారి టీడీపీ ప్రతినిధుల అండదండలతో ఉన్నట్టు తెలుస్తోంది. మండలంలోని చినరావుపల్లిలో జరిగిన బిల్లులే అక్రమాలకు తార్కాణంగా నిలుస్తున్నాయి. 40శాతానికి పైగా బిల్లులు స్వాహా చినరావుపల్లిలో చనిపోయినవారి పేరిట చెల్లింపు, అస్సలు నిర్మాణాలే లేకుండా డ్రా చేయడం, అసంపూర్తిగా వదిలేసిన వాటికీ, ఒకే నిర్మాణంతో ముగ్గురికి బిల్లులు చెల్లించిన సంఘటనలు వెలుగు చూశాయి. గ్రామంలో 182 మరుగుదొడ్లు నిర్మించినట్టు బిల్లులు తీసేసుకున్నా... 40 శాతానికి పైగా బిల్లులు ఇవ్వలేదని స్పష్టమవుతోంది. గ్రామానికి చెందిన సింగంపల్లి వాసు, బూసాల వెంకటరమణతో పాటు గ్రామంలోగల తెలుగు తమ్ముళ్లు తదితరులు కలెక్టరేట్లోని గ్రీవెన్స్సెల్కు ఇచ్చిన ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది. గ్రామంలో 182 మంది లబ్దిదారులను ఓడీఎఫ్కు ఎంపికచేసి దాదాపు రూ. 27 లక్షలు మంజూరు చేశారు. అందులో ఎన్జీఓ అకౌంట్లో రూ. 24 లక్షలు, వెలుగు సీసీ వీఓ అకౌంట్లో 2 లక్షలు, లబ్ధిదారుల అకౌంట్లో సుమారు 84 వేలు చేరింది. పనులు పర్యవేక్షించాల్సిన కార్యదర్శి మరో గ్రామం బాధ్యతలు చూస్తున్నందున దీనిపై దృష్టిసారించలేకపోయారు. ఉపాధి టీఏ సూర్యకుమారి జియోట్యాగింగ్ వంటి పనులు చూశారు. అయితే అనుమానం వచ్చి ఆమె అభ్యంతర పెట్టినా కొందరి ఒత్తిళ్లతో తలూపక తప్పలేదు. రకరకాలుగా అక్రమాలు ∙గ్రామానికి చెందిన కొయ్యాన లక్ష్మి, కొయ్యాన కొండమ్మ, కొయ్యాన గౌరి ఒకే కుటుంబంగా నివసిస్తున్నారు. ఇక్కడ ఒకే మరుగుదొడ్డి నిర్మించినప్పటికీ వీరి ముగ్గురి పేరిట మూడు బిల్లులుగా రూ. 45 వేలు ఆన్లైన్లో చెల్లించేశారు. ∙గంధం సరళ అనే ఆమె కేవలం ఒక గుడ్డమాత్రమే కట్టుకుని మరుగుకు వినియోగిస్తున్నారు. ఈమెకు తెలీకుండానే బిల్లు చెల్లించినట్టు నమోదైంది. ∙అడ్డాల లక్ష్మికి అసలు ఇల్లే లేదు. అయినా లెక్కకోసం నందలు తీసి వదిలేశారు. ∙చనిపోయిన యర్ర బంగా రమ్మ పేరిట నిర్మించిన బాత్రూంను అసంపూర్తిగా వదిలే సి లబ్ధిదారునికి చేరాల్సిన బిల్లులు పక్కదారి పట్టించేశారు. కంప్యూటర్ మాయాజాలం గ్రామంలో జరిగిన బిల్లు చెల్లింపుల వ్యవహారంలో సాంకేతిక మాయాజాలం కూడా వెలుగు చూసింది. బాత్రూం ఐడీ 30311073 కొయ్యానగౌరి అని నమోదైతే రేషన్ కార్డు కొయ్యాన అచ్చుతరావుగా చూపుతోంది. లబ్ధిదారుల జాబితాకు రేషన్కార్డులకు అసలు పొంతన ఉండట్లేదు. మరుగుదొడ్డి నిర్మించకుండానే తినేశారు మా ఇంటికి మరుగు లేదు. గుడ్డ కట్టుకుని మరుగుగా వాడుకుంటున్నాం. నుయ్యి పక్కనే బాత్ రూం కడతామంటే వద్దన్నాం. వేరే దగ్గర కట్టుకుంటామని తెలిపాం. మాకు తెలీకుండానే మరుగు కట్టినట్లు రూ. 15 వేలు నిధులు తినేశారు. – గంధం సరళ కుమార్తె మూడువేలు తీసుకున్నారు మేము కట్టుకున్న మరుగుకు 15వేలు మంజూరయ్యారన్నారు. రూ. 12వేలే ఇచ్చారు. మిగతా మొత్తంకోసం జన్మభూమి సభలో అధికారుల్ని నిలదీసినా ఫలితం లేకపోయింది. పైగా ఖర్చులు ఉంటాయంటున్నారు. – కర్రి పార్వతి అసలు లిస్టే నాకు తెలీదు గ్రామంలో ఎన్ని మరగుదొడ్లు నిర్మించారో ఎంతమందికి బిల్లులు ఇచ్చారో ఆ లిస్టే నాకు తెలీదు. అధికారులు ఎలా చెయ్యమంటే అలాచేశాను. కొన్ని నిర్మాణాలు పూర్తికాక, ప్రభుత్వం నుంచి బిల్లులు రావటం ఆలస్యమైంది. గ్రామంలో కొంతమంది వీధికుళాయిల వద్ద వచ్చిన చిన్నగొడవతో నాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. నా సొంత డబ్బులు చెల్లించి మరీ నిర్మాణాలు చేపడుతున్నాను. – బొబ్బిలి రమణ, సర్పంచ్ -
నగల దుకాణంలో ఐటీ శాఖ తనిఖీలు
చిత్తూరు కార్పొరేషన్: నగరంలోని ఓ ప్రముఖ బంగారపు నగల దుకాణంలో ఐటీ శాఖ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. ఉదయం పది గంటల నుంచి దుకాణం షట్టర్ మూసివేసి సోదాలు జరిపారు. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో ఆ సంస్థకు సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న130 దుకాణలపై అధికారులు ఏకకాలంలో దాడులు చేసినట్లు తెలిసింది. చిత్తూరులోని దుకాణంలో తమిళనాడు అధికారులు సోదాలు చేశారు. అమ్మకం, కొనుగోళ్ల ఇన్వాయిస్లు, ట్యాక్స్ రిట్నర్న్ వంటి కీలక పత్రాలు పరిశీలించారు. దీంతో నగరంలోని చిన్నచిన్న బంగారపు దుకాణదారులు అప్రమతమై కొన్ని దుకాణాలను మూసివేశారు. సాయంత్రం వరకు ఐటీ అధికారులు సోదాలు చేస్తుండటంతో నగరంలోని పలు నగల దుకాణదారుల్లో అలజడి మొదలైంది. -
సీఎం వస్తే.. జేబుకు చిల్లే!
ఆందోళన చెందుతున్న అధికారులు అనంతపురం అర్బన్: ముఖ్యమంత్రి జిల్లాకు వస్తున్నారంటే... అధికారులు హడలిపోతున్నారు. ఏర్పాట్లపేరుతో ఇప్పటికే భారీగా ముట్టజెప్పుకున్న అధికారులు...ఇపుడు మళ్లీ సీఎం వస్తున్నారనగానే జేబులు తడుముకుంటున్నారు. సీఎం పర్యటనల కోసం ఇప్పటికే లక్షలాది రూపాయలు అప్పులు చేసిన అధికారులు...ఆ బిల్లులు రాక.. అరువు తెచ్చిన చోట మాటపోతోందని ఆవేదన చెందుతున్నారు. రూ.లక్ష లేక రూ.2 లక్షలో కాదు ఏకంగా రూ.కోటిన్నరకు పెగా బిల్లులు బకాయి ఉండడంతో వాటిని ఎలా తీర్చాలో అర్థం కాక... పరిస్థితి కలెక్టర్కి చెప్పుకునే ధైర్యం చాలక మనోవేదనకు గురవుతున్నారు. ఇక ఆర్టీసీ సంస్థకు ఏకంగా రూ.7.56 కోట్లు బకాయి ఉన్నట్లు తెలిసింది. మోయలేని భారం ఈ ఏడాది ఇప్పటి వరకు ముఖ్యమంత్రి నాలుగు సార్లు జిల్లా పర్యటనకు వచ్చారు. ఐదవసారిగా ఈనెల 8న జిల్లాకు వస్తున్నారు. ముఖ్యమంత్రి సభలకు తరలించే ప్రజలకు భోజన వసతి గతంలో ఉండేది కాదు. కానీ రాయదుర్గం నియోజకవర్గంలో జరిగిన ‘ఏరువాక’ కార్యక్రమానికి దాదాపు 200 బస్సుల్లో ప్రజలను తరలించారు. వీరందరికీ అధికారులు భోజన వసతి కల్పించారు. పర్యటనకు వచ్చిన ప్రతిసారి ముఖ్యమంత్రి రెండు, మూడు కార్యక్రమాలతో పాటు, బహిరంగసభలోనూ పాల్గొంటారు. ఇందుకు వేదిక, పూల అలంకరణ, మైక్ సిస్టం, బారికేడ్లు ఏర్పాటు, కుర్చీలు, షామియానాలు, ఇలా పలు రకాల ఏర్పాట్ల బాధ్యత అధికారులదే. వీటనింటికి తమ పరపతి మీద అరువు పెట్టి పూర్తి చేస్తునామనీ, సీఎం పర్యటన తర్వాతైనా బిల్లులు మంజూరు చేస్తున్నారా... అంటే అదీ లేదని అధికారవర్గాలు వాపోతున్నాయి. చివరికి రూ.50 వేలు బిల్లు కూడా మంజూరు కావడం లేదని కొందరు అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే సీఎం పర్యటన అంటే భయపడాల్సి వస్తోందంటున్నారు. -
చెట్ల కిందనే పాఠాలు!
► బిల్లులు రాక గదికి తాళాలు వేసిన కాంట్రాక్టర్ ! ► ఆరుబయట కూర్చుంటున్న విద్యార్థులు ► పట్టించుకోని ఉన్నతాధికారులు ► ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు ఇల్లందకుంట: ఉన్నతాధికారుల నిర్లక్ష్యం..విద్యార్థులకు శాపంగా మారింది. బిల్లులు చెల్లించడంలో ప్రభుత్వం చేస్తున్న జాప్యంతో విసుగెత్తిన ఓ కాంట్రాక్టర్ అదనపు తరగతిగదులకు తాళం వేయడంతో విద్యార్థులకు చెట్లే దిక్కయ్యాయి. చేసేదేమిలేక ఉపాధ్యాయులు సైతం చెట్ల కిందనే పాఠాలు బోధిస్తున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసిన పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూ.28.61లక్షలతో.. ఇల్లందకుంట మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల శిథిలావస్థకు చేరడంతో ప్రభుత్వం రెండేళ్ల క్రితం రూ.28.61లక్షల నిధులు మంజూరు చేసింది. పనులు చేపట్టిన కాంట్రాక్టర్ సకాలంలో పూర్తి చేశాడు. ఈ విద్యాసంవత్సరం అదనపు తరగతి గదులకు మారేందుకు ఉపాధ్యాయులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అయితే తనకు బిల్లులు రాలేవంటూ కాంట్రాక్టర్ నూతన భవనాలకు తాళం వేసుకున్నారని ప్రధానోపాద్యాయుడు సాంబయ్య తెలిపారు. చేసేదేమి లేక చెట్ల కిందనే పాఠాలు బోధిస్తున్నట్లు చెప్పారు. వెనుదిరుగుతున్న తల్లిదండ్రులు చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలో చేర్పించేందుకు వచ్చి ఇక్కడి విద్యార్థుల చెట్ల కింద కూర్చోవడాన్ని చూసి వెనుదిరుగుతున్నారు. అన్ని వసతులు ఉన్నప్పటికీ కాంట్రాక్టర్ తాళం వేయడం, ఉన్నతాధికారులు స్పందించకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే విద్యార్థుల సంఖ్య తగ్గే ప్రమాదం ఉందని విద్యార్థి సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు. అధికారులకు నివేదించాం డబ్బులు ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్ నూతన భవనాలకు తాళం వేసుకున్నారు. ఈ విషయంతోపాటు విద్యార్థులు చెట్ల కింద కూర్చుంటున్న విషాయన్ని సైతం ఉన్నతాధికారులకు నివేదించాం. ప్రస్తుతం కూలిపోయిన తరగతిగదులలో కొందరు, మరికొందరు చెట్లకింద కూర్చుంటున్నారు. కాంట్రాక్టర్కు సైతం చాలాసార్లు ఫోన్ చేశాం. ఆయన స్పందించడం లేదు. – సాంబయ్య, ప్రధానోపాధ్యాయుడు -
ఉపాధి.. హతవిధీ
► పేరుకుపోతున్న ఉపాధి బకాయిలు ► అల్లాడిపోతున్న కూలీలు ► చెల్లించేదే తక్కువ మొత్తం ► దెబ్బతింటున్న పథకం లక్ష్యం ► కుప్పంలో పరిస్థితి మరీ ఘోరం గ్రామీణ పేదలకు, దినసరి కూలీలకు వరప్రసాదం ఉపాధి హామీ. వలసలకు అడ్డుకట్టవేసి.. గ్రామీణ భారతాన్నిఆర్థికంగా శక్తిమంతం చేయడం దీని ఉద్దేశం. సొంత ఊళ్లలోనే పని అడిగిన ప్రతి ఒక్కరికీ సంవత్సరంలో కనీసం 100 రోజులు పని కల్పించాలి. పని అయితే కల్పిస్తున్నారు కానీ కూలి చెల్లించడంలో మాత్రం ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. పథక ఉద్దేశం దెబ్బతింటోంది. జనవరి 15 నుంచి ఉపాధి కూలీలకు వేతనాలు ఇవ్వడంలేదు. నిరుపేదలు ఆకలితో అలమటిస్తున్నారు. జిల్లాలో వలసలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కేంద్రం తన వాటాగా ఇచ్చిన నిధులను ప్రభుత్వ అవసరాలకు ఖర్చు చేయడంతో ఉపాధి కూలీలకు మూడు నెలలుగా వేతనాలు లేక అల్లాడుతున్నారు. చిత్తూరు,సాక్షి: జిల్లాలో ఉపాధి పథకంలో పని చేసే వారికి జనవరి 15 నుంచి కూలి నిలిచియిపోయింది. ఈ మూడునెలల్లో రూ.18 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను ఇతర అవసరాలకు వాడుకుంటుండటంతోనే ఉపాధి వేతనాలు నిలిచి పోయాయని తెలుస్తోంది. అయితే ఉపాధి హామీ పథకానికి మెటీరియల్ పనులు చేసే కాంట్రాక్టర్లకు మాత్రం ఎప్పటికప్పుడు సొమ్ములు చెల్లిస్తోంది. కూలీలకు మాత్రం మొండిచేయి చూపిస్తోంది. ఫిబ్రవరిలో కలెక్టర్ సిద్ధార్థజైన్ ఉపాధి పనులకోసం రూ.13 కోట్లు విడుదల చేశారు. ఈ మొత్తాన్ని కాంట్రాక్టర్ల చెల్లింపులకే కేటాయించారు. పెద్ద నోట్ల ప్రభావంతో చెల్లింపులు నిలిచిపోవడంతో కూలీలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం.. వేతనాలు చెల్లించాలని ఇండియన్ బ్యాంకును ఆదేశించింది.దీంతో ఆ బ్యాంకు రూ.6కోట్లు వేతనాలుచెల్లించింది. వీటిని కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు చెల్లించలేదు. పని కల్పన అంతంత మాత్రమే..: జిల్లా నుంచి పక్క రాష్ట్రాలకు వలసలు ఎక్కువగా ఉండటంతో ప్రతి రోజూ లక్ష మందికి ఉపాధి కల్పించాలని ప్రభుత్వం లక్ష్యం నిర్ణయించుకుంది. కేవలం 30 వేల మందికి మాత్రమే పనులు కల్పిస్తున్నారు. ప్రతి కూలీకి రూ.194 కనీసవేతనం నిర్ణయించగా.. కేవలం రూ.168 లు మాత్రమే చెల్లిస్తున్నారు. గిట్టుబాటు ధర కల్పిండంలో కూడా ప్రభుత్వం విఫలమైంది. దీంతో ఉపాధి పనులపై కూలీలు ఆసక్తి చూపించడంలేదు. మొత్తం 6.58,914 మంది కూలీలుండగా 2016–17 ఏడాదికి గాను 2,27,206 మందికి మాత్రమే పని కల్పించారు. కుప్పంలో మరీ ఘోరం..: జిల్లాలోనే అధికంగా వలసలున్న ప్రాంతం కుప్పం. వలసల్ని కట్టడి చేయడంలో ప్రభుత్వ పూర్తిగా విఫలం అయింది. నియోజకవర్గంలో 18606 మందికి జాబ్కార్డులుండగా కేవలం 9226 మందికి మాత్రమే పని కల్పిస్తున్నారు. కూలి కూడా రూ.167లు మాత్రమే చెల్లించారు. ఈ ధర గిట్టుబాటు కాకపోవడంతో వలసలు ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి. వలసలన్న చోట పని దినాలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినా ఇక్కడ అమలు కావడం లేదు. బిల్లులు మంజూరు కాలేదు...: గత 6 నెలలుగా ఉపాధిహామి బిల్లులు మంజూరు కాలేదు. ఇంకుడు గుంతలు తవ్వ మన్నా రు. తవ్విన తరువాత బిల్లులు మంజూరు చేయలేదు. అంతే కాకుండా మామిడి చెట్ల బిల్లులు కూడా చాలావరకు మంజూరు కాలేదు. టీడీపీ ప్ర భుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఉపాధి హామి బిల్లులు చాలావరకు సమయానికి రావడం లే దు. ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా ఉపాధిహామి బిల్లులు మంజూరు చేయాలని కోరుతున్నాం. ---పి.రాజారెడ్డి, లింగనపల్లి పస్తులు గడుపుతున్నాం: గ్రామీణ ఉపాధిహామీ పనులు చేసి రెండు నెలలు గడుస్తున్నా కూలీ డబ్బులను చెల్లించలేదు. దీంతో రెక్కాడితే కాని డొక్క నిండని బతుకులు గడుపుతు న్న మాకు చేతిలో చిల్లిగవ్వ లే కుండా పస్తులు గడుపుతున్నాము. దీనికితోడు ఉపాధిహామీ నిధులు సీసీ రోడ్లకు మళ్లించడంతో మాకు ఉపాధిహామీ పనులు సక్రమంగా కల్పించడం లేదు. దీంతో పొట్టకూటి కోసం పిల్లపాపలతో కలసి వలసలు వెళ్లాల్సిన పరిస్థితి మళ్లీ ఎదురవుతోంది. –పోలమ్మ, గురవరాజుపల్లి ఎస్టీ కాలనీ, రేణిగుంట -
బిల్లుల వసూలు పై దృష్టి సారించండి
ఎస్ఈ భార్గవ రాముడు కర్నూలు(రాజ్విహార్): నెలవారి విద్యుత్ బిల్లుల వసూలుపై దృష్టి సారించాలని ఏపీసీపీడీసీఎల్ కర్నూలు ఎస్ఈ (ఆపరేషన్స్) జి. భార్గవ రాముడు సూచించారు. శుక్రవారం స్థానిక కొత్త బస్టాండ్ సమీపంలోని విద్యుత్ భవన్లో కర్నూలు డివిజన్ నెలవారీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సెక్షన్ల వారీగా జరుగుతున్న పురోగతి పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్పాట్ బిల్లింగ్ ప్రక్రియ పూర్తయ్యాక బిల్లుల వసూలుపై దృష్టి 100 శాతం లక్ష్యం సాధించాలని సూచించారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు పాత బకాయిలను ప్రస్తుత నెల బిల్లుతోపాటు 12 శాతం పాత బకాయిలను రాబట్టాలన్నారు. నిర్ణీత గడువులోపు బిల్లులు చెల్లించని పక్షంలో విద్యుత్ సరఫరాను నిలిపివేయాలన్నారు. సమావేశంలో కర్నూలు ఆపరేషన్స్ డిజినల్ ఎలక్ట్రికల్ ఇంజనీరు పి.వి. రమేష్, డీఈటీ మహమ్మద్ సాధిక్, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ మతృనాయక్, ఏడీఈలు, ఏఈలు, ఏఓలు పాల్గొన్నారు. -
బిల్లులు బంద్
రూ. 13,000కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో సర్కారు చెల్లించాల్సిన మొత్తం ♦ అదనంగా ఆరోగ్యశ్రీ, ‘ఫీజు’, ఇన్పుట్ సబ్సిడీల కింద మరో రూ.3 వేల కోట్ల బకాయిలు ♦ పెద్ద నోట్ల రద్దు ప్రభావం నేపథ్యంలో ఆచితూచి వ్యవహరిస్తున్న ఆర్థిక శాఖ ♦ చెల్లింపుల కోసం భారీగా అప్పుల సమీకరణ కోసం ప్రభుత్వ కసరత్తు.. నేడు సెక్యూరిటీల వేలం ద్వారా రూ.1,500 కోట్ల సేకరణ సాక్షి, హైదరాబాద్ గతేడాదితో పోలిస్తే ఆదాయ వృద్ధి పెరిగినా... నోట్ల రద్దు పరిణామాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆపసోపాలు పడుతోంది. అన్ని శాఖల పరిధిలో గత మూడు నెలలుగా చెల్లించాల్సిన బిల్లులన్నీ పెండింగ్లో పెట్టింది. దీంతో ప్రాధాన్యంగా ఎంచుకున్న పనులు, కార్యక్రమాలు కూడా ఎక్కడికక్కడే ఆగిపోయాయి. మొత్తంగా వివిధ శాఖలకు చెల్లించాల్సిన రూ.4,000 కోట్ల మేర బిల్లులు నిలిచిపోయినట్లు అంచనా. ఈ ఏడాది అత్యంత ప్రాధాన్యంగా ఎంచుకున్న నీటి పారుదల విభాగంలో మూడు నెలలుగా రూ.3,000 కోట్ల బిల్లులు ఆగిపోయి.. సాగునీటి ప్రాజెక్టుల పనులు నత్తనడకలా మారాయి. దీంతో పాటు ఆర్ అండ్ బీ, మిషన్ కాకతీయ, విద్యుత్ విభాగంలో చెల్లించే బిల్లులను సైతం ఆర్థిక శాఖ ఆపేసింది. అవన్నీ కలిపి మరో రూ.1,000 కోట్లు బకాయిలు పేరుకుపోయినట్లు అంచనా. ఆచితూచి వ్యవహరిస్తున్న ఆర్థిక శాఖ నోట్ల రద్దుతో గత రెండు నెలల్లో రాష్ట్ర ఖజానాకు దాదాపు రూ.800 కోట్ల మేర గండి పడింది. ఇలా రాబడి తగ్గడం, ఆర్థిక సంవత్సరం ముగిసే చివరి త్రైమాసికం కావడంతో ఆర్థిక శాఖ బిల్లుల చెల్లింపులపై ఆచితూచి వ్యవహరిస్తోంది. మూడు నెలలుగా బిల్లులు రాకపోవడంతో అన్ని శాఖల పరిధిలో పనులు చేస్తున్న బడా కాంట్రాక్టర్లు సైతం ఆర్థిక శాఖ చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికే ఆరోగ్యశ్రీకి రూ.400 కోట్లు, ఫీజు రీయింబర్స్మెంట్కు దాదాపు రూ.2,000 కోట్లు బకాయిలున్నాయి. ఇన్పుట్ సబ్సిడీకి రూ.420 కోట్లు చెల్లించాల్సి ఉంది. అసలు తక్షణ ప్రాధాన్యమైన ధాన్యం కొనుగోళ్లకు డబ్బులు సర్దుబాటు చేసేందుకే గత నెలలో ఆర్థిక శాఖ ఇబ్బంది పడింది. ఈ నేపథ్యంలో తక్షణావసరాల దృష్ట్యా తగినంత రుణ సేకరణ కోసం కసరత్తు చేస్తోంది. మార్కెట్లో బాండ్ల వేలం ద్వారా సరిపడేంత రుణం తీసుకోవాలని నిర్ణయించింది. ఆర్బీఐ ఆధ్వర్యంలో మంగళవారం జరిగే సెక్యూరిటీల వేలం ద్వారా రూ.1,500 కోట్ల మేరకు రుణం తీసుకోనుంది. ఉదయ్తో మరింత అప్పు కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఉదయ్ పథకంలో చేరడంతో ఈ ఆర్థిక సంవత్సరంలోనే మరో రూ.9,000 కోట్లకు పైగా బాండ్ల ద్వారా సమకూర్చుకోవడం తప్పనిసరని ప్రభుత్వం భావిస్తోంది. ‘ఉదయ్’పథకం నిబంధనల మేరకు డిస్కంలకు ఉన్న అప్పుల్లో 75 శాతాన్ని ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. ఇప్పుడున్న లెక్కల ప్రకారం డిస్కంల అప్పుల్లో రూ.8,923 కోట్లు ప్రభుత్వం చెల్లించాలి, అది కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేలోపే వాటిని తీర్చాల్సి ఉంది. అంతమేరకు బాండ్ల వేలం ద్వారా నిధుల సేకరణ తప్పనిసరి. అందుకే జనవరి చివరి వారంతో పాటు ఫిబ్రవరి, మార్చి నెలల్లో మరోమారు ఆర్బీఐ ద్వారా బాండ్లు వేలం వేసి భారీ మొత్తంలో రుణం స్వీకరించేందుకు ఆర్థిక శాఖ కసరత్తు ప్రారంభించింది. ఇక గత నవంబర్ చివరి నాటికే రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్లో బాండ్ల వేలం ద్వారా రూ.9,900 కోట్లు సమీకరించింది. మంగళవారం నాటి సెక్యూరిటీల వేలంలో మరో రూ.1,500 కోట్లు స్వీకరించనుండడంతో ఈ అప్పు రూ.11,400 కోట్లకు చేరుతోంది. గృహ రుణాల తకరారు..! మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కొత్త హామీలు మరింత భారం కానున్నాయని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. ఇప్పటివరకు వివిధ పథకాల్లో పక్కా ఇళ్లను పొందిన లబ్ధిదారులు చెల్లించాల్సిన గృహ రుణాలను మాఫీ చేస్తామని ఇటీవలే సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. దాదాపు రూ.3,200 కోట్లు మాఫీ చేస్తామని, నెల రోజుల్లో బ్యాంకుల్లో పెట్టిన పట్టాలను ఇప్పిస్తామని చెప్పారు. అయితే ఈ రుణాలను ప్రభుత్వం బ్యాంకులకు తిరిగి చెల్లిస్తుందా.., ఎన్ని విడతల్లో చెల్లిస్తుందనే దానిపై గృహ నిర్మాణ విభాగం ఇంకా కసరత్తు చేయలేదు. ఆ శాఖ నుంచి ఎలాంటి సమాచారం తమకు అందలేదని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. -
నోట్ల రద్దు ప్రభావం..
'మధ్యాహ్న' భారం ! ఏజెన్సీలకు అందని బిల్లులు నాలుగు నెలలుగా బకాయి నిత్యావసర సరుకుల కొనుగోలుకు అగచాట్లు అప్పు కోరితే ధరల పెంపు దిక్కుతోచని స్థితిలో నిర్వాహకులు ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం చెల్లించే డబ్బు – 1–5వ తరగతి వరకు రూ. 5.13 – 6–10 తరగతి వరకు రూ. 7.18 – మధ్యాహ్న భోజనం అమలవుతున్న పాఠశాలలు : 3,783 – రోజూ భోజనం తింటున్న విద్యార్థులు : 3,43,557 – బిల్లుల పెండింగ్ మొత్తం రూ. 17.53 కోట్లు ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపౌట్స్ను తగ్గించాలనే ప్రధాన ఉద్ధేశంతో మధ్యాహ్న భోజనం పథకం అమలు చేస్తున్నారు. పథకం నిర్వహణకు ప్రభుత్వం నుంచి నిధుల మంజూరులో జాప్యం ఏర్పడినా నిర్వాహకులే సర్దుబాటు చేసేవారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో డబ్బు లభించే పరిస్థితిలేదు. దుకాణాల్లో అప్పు అడిగితే సరుకుల ధరలను పెంచేస్తున్నారని వారు వాపోతున్నారు. కిలోపై రూ. 15–25 ఎక్కువగా చెబుతున్నారని. గత్యంతరం లేక సరులకు తెచ్చుకొంటున్నామని వారు చెబుతున్నారు. జిల్లాలో 2,663 ప్రాథమిక, 595 ప్రాథమికోన్నత, 525 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. మొత్తం 3,43,557 మంది విద్యార్థులు పాఠశాలల్లో భోంచేస్తున్నారు. నిధులున్నా ఇవ్వలేదు.. 9,10 తరగతులకు సంబంధించి డిసెంబర్ దాకా నిధులు అందుబాటులో ఉన్నాయని, అయితే రెండు నెలలుగా విడుదల చేయడం లేదని తెలిసింది. నాలుగు నెలలకు సంబంధించి మొత్తం జిల్లాలోని ఏజెన్సీలకు రూ. 17.53 కోట్లు బకాయిలు ఇవ్వాల్సి ఉంది. దీంతోపాటు కార్మికులకు కూడా వేతనాలు చెల్లించాల్సి ఉంది. అందని బిల్లులు... : నాగమణి, మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లాలో సెప్టెంబర్ నుంచి మధ్యాహ్న భోజన బిల్లులు ఇవ్వలేదు. కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద నోట్లు రద్దువల్ల అప్పులు పుట్టడం లేదు. కిరాణకొట్లలో అప్పు తీసుకోవడం వల్ల అధికరేట్లు వేస్తున్నారు. కార్మికుల వేతనాలు కూడా మంజూరు చేయలేదు. ప్రభుత్వం ఏమీ పట్టించుకోవడం లేదు. నిధులు మంజూరు కాలేదు.. : శామ్యూల్, డీఈఓ మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి వచ్చిన నిధులన్నీ ఇచ్చేశాం. మూడో విడత బడ్జెట్ ఇంకా మంజూరు కాలేదు. బిల్లులు పెండింగ్ ఉండడంతో ఏజెన్సీలు ఇబ్బందులు పడుతున్న సంగతి వాస్తవమే. ప్రభుత్వం మంజూరు చేయగానే వారివారి ఖాతాల్లో జమా చేసేలా చర్యలు తీసుకుంటాం.