సగం సమయం కూడా పని చెయ్యలేదు | Sakshi
Sakshi News home page

సగం సమయం కూడా పని చెయ్యలేదు

Published Sun, Aug 13 2023 4:50 AM

Parliament functioned for less than half of scheduled time - Sakshi

న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు షెడ్యూల్‌ సమయంలో సగం కూడా పని చెయ్యలేదు. అయినప్పటికీ రికార్టు స్థాయిలో 23 బిల్లులు పాసయ్యాయి. మణిపూర్‌లో జాతుల ఘర్షణ ఈ సారి ఉభయసభల్ని కుదిపేసింది. లోక్‌సభ కార్యకలాపాలు 43% జరిగితే, రాజ్యసభ 55% సమయం కార్యకలాపాలు కొనసాగించింది. పాలసీ రీసెర్చ్‌ స్టడీస్‌ (పీఆర్‌ఎస్‌) అందించిన డేటా ప్రకారం లోక్‌సభ 17 రోజులు సమావేశమైంది.

అవిశ్వాస తీర్మానంపై 20 గంటల సేపు చర్చ జరిగింది. ఈ చర్చలో 60 మంది సభ్యులు పాల్గొన్నారు. పార్లమెంటు ఆమోదించిన బిల్లుల్లో ఢిల్లీలో పాలనాధికార బిల్లు, డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటక్షన్‌ బిల్లు, అటవీ సంరక్షణ సవరణ బిల్లు, మైన్స్‌ అండ్‌ మినరల్స్‌ సవరణ బిల్లు ప్రధానమైనవి. ఈసారి సభలో ప్రవేశ పెట్టిన బిల్లుల్లో 56% కేవలం ఎనిమిది రోజుల్లో పార్లమెంటు ఆమోదాన్ని పొందాయి. మరో 17% బిల్లుల్ని కమిటీల పరిశీలనకు పంపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement