అనంతపురం అగ్రికల్చర్ : రానున్న నాలుగు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి, డాక్టర్ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగపు శాస్త్రవేత్త వై.పవన్కుమార్రెడ్డి తెలిపారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుంచి అందిన సమాచారం మేరకు వచ్చే నాలుగు రోజుల్లో 5 నుంచి 35 మి.మీ మేరకు వర్షపాతం నమోదు కావచ్చన్నారు. గురువారం వర్షసూచన ఎక్కువగా ఉందని తెలిపారు. పగటి ఉష్ణోగ్రతలు 34 నుంచి 36, రాత్రిళ్లు 25 నుంచి 28 డిగ్రీలు, గాలిలో తేమశాతం ఉదయం 75 నుంచి 82, మధ్యాహ్నం 38 నుంచి 56 శాతం మధ్య రికార్డు కావచ్చన్నారు. 4 నుంచి 28 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండగా అందులో 20, 21 తేదీల్లోనే ఎక్కువ వేగంతో గాలులు వీస్తాయని వివరించారు.