ఔటర్ రింగ్ రోడ్డుపై పోలీసుల తనిఖీల్లో ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి.
శంషాబాద్(రంగారెడ్డి జిల్లా): రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై తనిఖీలు నిర్వహించిన పోలీసులు ఆటోలో తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ముగ్గురు వ్యక్తులు ఆటోను వదిలి పారిపోయారు. ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. విచారణ జరుపుతున్నారు.