కారుపై మహిళ మృతదేహంతో.. | road accident at mahabubnagar district addakula | Sakshi
Sakshi News home page

కారుపై మహిళ మృతదేహంతో..

Published Sun, Dec 18 2016 2:09 PM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM

కారుపై మహిళ మృతదేహంతో.. - Sakshi

కారుపై మహిళ మృతదేహంతో..

అడ్డాకుల(మహబూబ్‌నగర్ జిల్లా): అడ్డాకుల శివారులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలు..మహబూబ్‌నగర్ రూరల్ మండలం గాజులపేట గ్రామానికి చెందిన తూర్పు మహేశ్వరమ్మ(46), సిద్ధిలింగం దంపతులు వనపర్తిలో ఉన్న కూతురు ఇంటికి టీవీస్ మోపెడ్ వాహనంపై వెళ్తున్నారు. అడ్డాకుల దాటగానే వెనక నుంచి వస్తున్న ఓ కారు వీరిని ఢీకొట్టింది.

మహేశ్వరమ్మ కారు ముందుభాగంలో చిక్కుకుపోయింది. సుమారు 2 కి.మీలు అలానే కారు ఆమెను లాక్కొని పోయింది. స్థానికులు గమనించి కారును వెంబడించడంతో నిందితులు కారును వదిలి పరారయ్యారు. ఈ ఘటనలో మహిళ అక్కడికక్కడే మృతిచెందగా..ఆమె భర్తకు తీవ్రగాయాలయ్యాయి. భర్తను మహబూబ్‌నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement