wife dead
-
భార్యను చంపి, ముక్కలు చేసి.. కుక్కర్లో ఉడికించి..
సాక్షి, హైదరాబాద్/మీర్పేట: ఓ వ్యక్తి అనుమానంతో తన భార్యను పాశవికంగా హత్య చేశాడు. అయినా కసి తీరక ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికాడు. ఓ పెద్ద కుక్కర్ తీసుకొచ్చి శరీర భాగాలను ఉడకబెట్టాడు. తర్వాత ఎండబెట్టి, కాల్చాడు. ఇంట్లోనే రెండు, మూడు రోజుల పాటు రోకలి బండతో దంచి పొడిగా చేశాడు. ఆ పొడిని డ్రైనేజీ మ్యాన్హోల్లో కలిపేశాడు. మిగిలిన ఎముకల ముక్కలను సమీపంలోని జిల్లెలగూడ (చందన) చెరువులో పారేశాడు. రంగారెడ్డి జిల్లా మీర్పేట పోలీసు స్టేషన్ పరిధిలోని జిల్లెలగూడ న్యూ వేంకటేశ్వర కాలనీలో ఈ దారుణం చోటు చేసుకుంది. హత్య చేసి.. ఇంట్లోంచి వెళ్లిపోయిందని... స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం..ప్రకాశం జిల్లా జేపీ చెరువుకు చెందిన విశ్రాంత ఆర్మీ జవాన్ గురుమూర్తి (39), వెంకట మాధవి (35) భార్యాభర్తలు. వారికి 13 ఏళ్ల క్రితం వివాహమైంది. ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఐదేళ్ల క్రితం జిల్లెలగూడ న్యూ వేంకటేశ్వర కాలనీలోకి వచ్చి, అద్దె ఇంట్లో ఉంటున్నారు. గురుమూర్తి కంచన్బాగ్లోని డీఆర్డీఓలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. గురుమూర్తి విపరీత ప్రవర్తన, అనుమానిస్తూ వేధిస్తుండటంతో భార్య మాధవి ఇబ్బందిపడుతూ ఉండేది. ఇరువురి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ నెల 16న గురుమూర్తి, మాధవి మధ్య మరోసారి వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో గురుమూర్తి ఆమెను పాశవికంగా హత్యచేశాడు. కానీ ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోయిందని అందరికీ చెప్పాడు. మాధవి తల్లి ఉప్పాల సుబ్బమ్మ తన కూతురు కనిపించకుండా పోయిందని ఈ నెల 18న మీర్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. అదుపులోకి తీసుకుని విచారించడంతో.. ఇంట్లో గొడవ జరిగిన సమయంలోనే మాధవిని గురుమూర్తి హత్య చేశాడు. కానీ ఏమీ ఎరగనట్టుగా అత్తమామలతోపాటు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్టు తెలుసుకున్న పోలీసులు గురుమూర్తిపై నిఘా పెట్టారు. అతడి ప్రవర్తన, కదలికలపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకొని విచారించగా.. అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి లోతుగా దర్యాప్తు చేస్తున్నామని మీర్పేట్ సీఐ నాగరాజు తెలిపారు. యూట్యూబ్లో చూసి.. ముందుగా కుక్కపై ప్రయోగం చేసి.. భార్యను హత్య చేసిన గురుమూర్తి పోలీసులకు ఎలాంటి ఆధారాలు, ఆనవాళ్లు చిక్కకుండా పక్కా ప్లాన్ చేశాడు. శరీరంలోని ఎముకలను పొడిగా ఎలా మార్చాలని యూట్యూబ్, ఇతర సామాజిక మాధ్యమాల్లో శోధించాడు. క్రైమ్, హర్రర్ సినిమాలు చూశాడు. ముందుగా వీధి కుక్క మీద ప్రయోగం చేశాడు. కుక్కను ఇంట్లోకి తీసుకొచ్చి చంపేశాడు. ముక్కలుగా నరికి, ఎముకలతో సహా కుక్కర్లో ఉడకబెట్టాడు. తర్వాత అదే తరహాలో భార్య శరీరాన్ని కూడా ముక్కలు చేసి, ఉడకబెట్టాడు. ఎండబెట్టి, కాల్చి పొడి చేశాడు. ఆధారాల కోసం పోలీసుల ప్రయత్నాలు.. మాధవి మిస్సింగ్ కేసు నేపథ్యంలో.. జిల్లెలగూడ న్యూవేంకటేశ్వర కాలనీలో గురుమూర్తి, మాధవి నివాసమున్న ఇల్లు, పరిసర ప్రాంతాలను పోలీసులు మూడు రోజులుగా క్షుణ్నంగా పరిశీలించినట్టు తెలిసింది. ఆమె హత్యకు గురై ఉంటే ఏమైనా ఆధారాలు లభిస్తాయేమోనని డ్రైనేజీ మ్యాన్హోల్స్, నాలాలను కూడా తెరిచి పరిశీలించినట్టు స్థానికులు తెలిపారు. కానీ నిందితుడిని విచారించిన సమయంలో అసలు సంగతి బయటపడింది. దీనితో ఆయా అంశాలను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. నిందితుడు గురుమూర్తి పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. వారి పిల్లలు మేడ్చల్లోని అమ్మమ్మ వాళ్ల ఇంట్లో ఉన్నట్టు తెలిసింది. -
ట్రంప్ కుటుంబంలో తీవ్ర విషాదం
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన మొదటి భార్య ఇవానా ట్రంప్ (73) గురువారం కన్నుముశారు. ఈ విషయాన్ని ట్రంపే స్వయంగా తన సొంత సోషల్ మీడియా 'ట్రుత్ సోషల్' వేదికగా వెల్లడించారు. అయితే ఆమె మృతికి గల కారణాన్ని మాత్రం ట్రంప్ చెప్పలేదు. 'న్యూయార్క్ సిటీలోని తన నివాసంలో ఇవానా మరణించింది. ఆమె అందమైన, అద్భుతమైన మహిళ. గొప్ప స్ఫూర్తిదాయక జీవితాన్ని గడిపింది. ఆమెకు తన ముగ్గురు పిల్లలు డొనాల్డ్ జూనియర్, ఇవాంక, ఎరిక్లే సర్వస్వం. ఆమె పట్ల మేమూ గర్వపడుతున్నాం. ఇవానా ఆత్మకు శాంతి చేకూరాలి' అని ట్రంప్ భావోద్వేగ సందేశాన్ని రాసుకొచ్చారు. ఇవానా ట్రంప్ ఓ మోడల్. 1977లో అప్పుడు రియల్ ఎస్టేట్ డెవలపర్గా ఉన్న ట్రంప్ను పెళ్లాడారు. ఈ దంపతులకు పెళ్లైన ఏడాదికే డొనాల్డ్ జూనియర్ పుట్టాడు. ఆ తర్వాత 1981లో ఇవాంక, 1984లో ఎరిక్ జన్మించారు. 1993లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ట్రంప్ మార్లా మ్యాపుల్స్ను రెండో పెళ్లి చేసుకున్నారు. 1999లో ఈమెతో కూడా విడిపోయి 2005లో మెలానియా ట్రంప్ను మూడో పెళ్లి చేసుకున్నారు. చదవండి: నిరసనల్లో వేల మంది.. పట్టించుకోని జంట.. ఫోటో వైరల్ -
అనుమానం పెనుభూతమై.. భార్యను హత్య చేసిన భర్త
ఒంటిమిట్ట: అనుమానం పెనుభూతమై ఓ వ్యక్తి కట్టుకున్న భార్యనే కడతేర్చిన ఉదంతం శుక్రవారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్ఐ సంజీవరాయుడు తెలిపిన వివరాలు.. 2015లో షేక్రేష్మా(24)కు పెనగలూరు మండలం, నారాయణ నెల్లూరు గ్రామ వాసి అయిన షేక్ ఇస్మాయిల్తో వివాహమైంది. వీరికి తైబా తస్నిమ్, జైనబ్ అనే ఇద్దరు చిన్నారులు ఉన్నారు. రేష్మాపై ఇస్మాయిల్ అనుమానం పెంచుకోవడంతో చాలా రోజులుగా వారి మధ్య కలతలు రేగాయి. మూడు నెలల క్రితం రేష్మా తల్లిదండ్రులు షేక్ మహ్మద్ రఫీ, షేక్ అమ్ములు ఉంటున్న ఒంటిమిట్ట మండలం దిగువ వీధిలోకే వారు కూడా వచ్చి బాడుగ ఇంట్లో ఉంటున్నారు. అయినా వారిద్దరి మధ్య గొడవలు ఆగకపోగా ఎప్పటిలానే శుక్రవారం ఉదయం కూడా ఇంట్లో గొడవ పడ్డారు. ఆ సమయంలో క్షణికావేశానికి గురైన ఇస్మాయిల్ కత్తి తీసుకుని రేష్మా గొంతు కోసి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న సీఐ రాజా ప్రభాకర్, ఎస్ఐ సంజీవరాయుడు ఘటనా స్థలానికి చేరుకుని రేష్మా మృతదేహాన్ని పరిశీలించి, పోస్ట్మార్టం నిమిత్తం కడప రిమ్స్కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడు ఇస్మాయిల్ ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. రేష్మా మృతి చెందడం, ఆమె భర్త పరారీలో ఉండడంతో ఇద్దరు బిడ్డలు బిక్కుబిక్కుమంటూ ఉండడం చూసి స్థానికులు కన్నీటి పర్యంతం అయ్యారు. -
దారుణం: భార్య, అత్తను గొడ్డలితో నరికి హత్య
సాక్షి, సంగారెడ్డి: ఐడీఏ బొల్లారంలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య, అత్తను అతి కిరాతకంగా గొడ్డలితో నరికి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. పోలీసుల వివరాల ప్రకారం.. నర్సింహ దంపతులు గాంధీ నగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. భార్యభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో భార్య పుట్టింటికి వెళ్లింది. ఆమె తిరిగి భర్త వద్దకు రావడానికి నిరాకరిచింది. దీంతో భార్య కాపురానికి రావటం లేదని ఆదివారం ఉదయం అత్త ఇంటికి వెళ్లి తన భార్య, అత్తను విచక్షణారహితంగా గొడ్డలితో దాడి చేసి హతమార్చాడు. ఈ ఘటనలో తన భార్య, అత్త అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం నిందితుడు నర్సింహ పోలీసుస్టేషన్కి వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: డబ్బుల కోసం భర్తనే -
రోడ్డు ప్రమాదం: కేంద్రమంత్రి భార్య మృతి
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో విషాదం చోటుచేసుకుంది. కేంద్ర ఆయుష్, యునానీ, హోమియోపతి మంత్రి శ్రీపాద యశోనాయక్ కారు సోమవారం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆయన భార్య విజయ నాయక్, వ్యక్తిగత సహాయకుడు(పీఏ) దీపక్ మృత్యువాత పడ్డారు. కేంద్ర మంత్రితో సహా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉత్తర కన్నడ జిల్లాకు వచ్చిన శ్రీపాద యశోనాయక్ గోకర్ణ నుంచి గోవాకు తిరిగి వెళ్తున్న సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళ్తున్న మంత్రి కారు అంకోలా తాలూకా హోసకంబి వద్దకు రాగానే డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో పల్టీ కొట్టింది. ఈ సమయంలో కారులో శ్రీపాద నాయక్, ఆయన భార్య, పీఏ దీపక్, అనుచరుడు సాయికిరణ్, గన్మ్యాన్, డ్రైవర్ ఉన్నారు. ప్రమాదంలో మంత్రి భార్య, పీఏ మృతిచెందారు. గాయపడిన మంత్రిని గోవాకు తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్కు ఫోన్ చేసి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. శ్రీపాద నాయక్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రమాదంలో మంత్రి భార్య, పీఏ మృతిచెందడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మంత్రిని గోవాకు తరలిస్తున్న దృశ్యం. ప్రమాదంలో ధ్వంసమైన కారు -
అనుమానం పెనుభూతమై..
♦ భార్య మృతి, భర్త పరిస్థితి విషమం ♦ అనాథగా మారిన కుమారుడు శ్రీకాంత్ ♦ తిరుమలగిరి మండలంలో ఘటన ♦ కుటుంబ కలహాలతో భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం తిరుమలగిరి (నాగార్జునసాగర్) : కుటుంబ కలహాలతో భార్యాభర్తలు ఆత్మహత్యయత్నానికి పాల్పడగా.. భార్య మతి చెంది, భర్త పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన తిరుమలగిరి మండలం నెల్లికల్ గ్రామపంచాయతీ పరిధిలోని జాల్తండాలో సోమవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, తెలిసిన వివరాల ప్రకారం.. జాల్తండాకు జటావత్ రవీందర్(35)కు తొమ్మిది సంవత్సరాల క్రితం పీఏపల్లి మండలం బూడిదగట్టు తండాకు చెందిన బుజ్జి (27)తో వివాహం జరిగింది. రవీందర్, బుజ్జి దంపతులకు మొదటి మూడు కాన్పుల్లో ముగ్గురు మగపిల్లలు పుట్టి చనిపోయారు. నాలుగో కాన్పులో మగపిల్లాడు జన్మనించడంతో వారు ఆ పిల్లాడిని అల్లారుముద్డుగా పెంచుకుంటూ జీవనం సాగిస్తున్నారు. చిచ్చుపెట్టిన అనుమానం.. రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగ సందర్భంగా పంపిణీ చేస్తున్న చీరలను తెచ్చుకోవడానికి బుజ్జి సోమవారం నెల్లికల్ వెళ్లింది. బుజ్జి ఆలస్యంగా ఇం టికి రావడంతో ఇంతసేపు ఏంచేశావ్.. ఎక్కడికి వెళ్లావంటూ భర్త రవీందర్ బుజ్జిని చితకబాది తన పొలం వద్దకు వెళ్లాడు. మనస్తాపానికి గురైన బుజ్జి ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగింది. చుట్టుపక్కల వారు గమనించి బుజ్జిని చికిత్స నిమిత్తం నాగార్జునసాగర్ కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు నల్లగొండకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం నాగార్జునసాగర్ తరలించారు. మనస్తాపానికి గురైన భర్త.. భార్యపై చేయిచేసుకోవడంతో రవీం దర్ మనస్తాపానికి గురై తన పొలం వద్ద పురుగుల మందు తాగాడు. ఇంటికి వచ్చి తాను పురుగుల మందు తాగానని చెప్పడంతో గ్రామస్తులు రవీందర్ను నాగార్జునసాగర్ తరలించి చికిత్స చేయిస్తున్నారు. ప్రస్తుతం రవీందర్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. తల్లి ఆత్మహత్య, తండ్రి అసస్శారక స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండడంతో.. కుమారుడు శ్రీకాంత్ అనాథగా మారాడు. ఏమీ తెలియక బాలుడు అమ్మేది అంటూ తన కుటుంబ సభ్యులను అడిగిన తీరు అక్కడివారిని కంటనీరు పెట్టించింది. శ్రీకాంత్ను కూడా చంపేవారా.. శ్రీకాంత్ నెల్లికల్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. సోమవారం శ్రీకాంత్ పాఠశాలకు వెళ్లాడు. శ్రీకాంత్ పాఠశాలకు వెళ్లకుండా ఇంటివద్దే ఉంటే మనస్తాపానికి గురైన ఆత్మహత్యయత్నానికి పాల్పడిన ఆ దంపతులు పిల్లవాడిని కూడా విగతజీవిగా మార్చేవారా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
కారుపై మహిళ మృతదేహంతో..
-
కారుపై మహిళ మృతదేహంతో..
అడ్డాకుల(మహబూబ్నగర్ జిల్లా): అడ్డాకుల శివారులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలు..మహబూబ్నగర్ రూరల్ మండలం గాజులపేట గ్రామానికి చెందిన తూర్పు మహేశ్వరమ్మ(46), సిద్ధిలింగం దంపతులు వనపర్తిలో ఉన్న కూతురు ఇంటికి టీవీస్ మోపెడ్ వాహనంపై వెళ్తున్నారు. అడ్డాకుల దాటగానే వెనక నుంచి వస్తున్న ఓ కారు వీరిని ఢీకొట్టింది. మహేశ్వరమ్మ కారు ముందుభాగంలో చిక్కుకుపోయింది. సుమారు 2 కి.మీలు అలానే కారు ఆమెను లాక్కొని పోయింది. స్థానికులు గమనించి కారును వెంబడించడంతో నిందితులు కారును వదిలి పరారయ్యారు. ఈ ఘటనలో మహిళ అక్కడికక్కడే మృతిచెందగా..ఆమె భర్తకు తీవ్రగాయాలయ్యాయి. భర్తను మహబూబ్నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నీ వెంటే నేను..
వడదెబ్బతో భర్త మృతి.. తట్టుకోలేక భార్య మరణం పాన్గల్: ‘నీ వెంటే నేనూ.. అంటూ భర్త మరణం తట్టుకోలేక భార్య తుదిశ్వాస విడిచింది. ఈ ఘటన మహబూబ్నగర్ మండలం పానగల్ మండలం గోప్లాపూర్ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నాగయ్య(66) సోమవారం వడదెబ్బతో అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే వనపర్తి ఏరియా అసుపత్రికి, అక్కడి నుంచి జిల్లాకేంద్రానికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతదేహాన్ని మంగళవారం స్వగ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహిస్తున్న తరుణంలో భార్య సౌభాగ్యమ్మ(62) రోదిస్తూ కుప్పకూలింది. బంధువులు పరిశీలించగా అప్పటికే మృతిచెందింది. ఇద్దరూ ఎంతో అన్యోన్యం గా ఉండేవారని, భర్త మరణించడంతో షాక్తో ఆమె కూడా మరణించినట్లు బంధువులు తెలిపారు. -
దంపతుల ఆత్మహత్యాయత్నం: భార్య మృతి
కర్నూలు (బనగానపల్లె) : కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం నందవరం గ్రామంలో గురువారం దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగగా.. కుటుంబసభ్యులు హుటాహుటిన బనగానపల్లెలో ఓ ఆసుపత్రికి తరలించారు. చికిత్సపొందుతూ భార్య వెంకటలక్ష్మి(50) మృతిచెందగా, భర్త రామచంద్రారెడ్డి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుటుంబకలహాలతోనే ఈ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వికటించిన పుష్కర ప్రేమ
శృంగవరపుకోట: సుమారు 12 ఏళ్ల క్రితం వారిద్దరూ ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. కులాలు వేరైనా మనసులు కలిసి మనువాడిన వారిద్దరూ ఒక్కటిగా ఉంటే చాలు అనుకున్న ఇరువైపుల కుటుంబాలు ఆనందించి వారి వివాహబంధాన్ని ఆనందించి ఆమోదించారు. ఆ దంపతులిద్దరూ ఇంతవరకూ అన్యోన్యంగా కాపురం చేశారు. వారి అన్యోన్యానికి గుర్తుగా ఇద్దరు అబ్బాయిలు జన్మించారు. అంతలో ఏమైందో? వారి కాపురంలో కలహాలు చోటు చేసుకున్నాయి. భార్యతో గొడవపడ్డ భర్త మద్యం మత్తులో ఆమెపై దాడికి తెగబడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్.కోట మండలం సంతగవిరమ్మపేట గ్రామానికి చెందిన సన్యాసమ్మ..విజయనగరానికి చెందిన మజ్జి శ్రీనివాసరావును ప్రేమించి పెళ్లాడింది. వీరికి లోకేష్, అఖిల్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎస్.కోట పట్టణంలోని శ్రీనివాసకాలనీలో టెలిఫోన్ ఎక్స్చేంజ్ కార్యాలయం ఎదుట నివాసముంటున్న ఎం.సన్యాసమ్మ స్థానిక ప్రభుత్వాస్పత్రిలో స్టాఫ్నర్స్గా పనిచేస్తోంది. మంగళవారం రాత్రి 9.30 గంటల సమయంలో మజ్జి శ్రీనివాసరావు భార్యతో గొడవపడి ఎక్సర్సైజులు చేసే డంబెల్స్తో ఆమె తలపై బలంగా మోదాడు. దాంతో ఆమె తల ఎడమవైపు బలమైన గాయం అయ్యింది. ఈ గొడవతో ఉలిక్కిపడిన ఇరుగుపొరుగు వారు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సన్యాసమ్మ భర్త ఎస్.కోట పోలీస్స్టేషన్కు వెళ్లి భార్యపై దాడి చేశానని చెప్పి లొంగిపోయాడు. ఎస్సై సాగర్బాబు హుటాహుటిన శ్రీనివాసకాలనీకి చేరుకుని రక్తపు మడుగులో ఉన్న సన్యాసమ్మను ఆస్పత్రికి తరలించారు. బాధితురాలికి డాక్టర్ శ్యామల ప్రాథమిక చికిత్స చేసి విశాఖకు తరలించాలని సూచించారు. జరిగిన సంఘటనపై ఎస్సై మాట్లాడుతూ శ్రీనివాసరావు డ్రైవర్గా పని చేస్తున్నాడని, బాధ్యతారహితంగా తిరుగుతాడని, భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని తెలిపారు. ఆ దంపతులను గతంలో ఒకసారి స్టేషన్కు పిలిచి మందలించామని చెప్పారు. పూర్తి వివరాలు బాధితురాలి నుంచి సేకరించాల్సి ఉందన్నారు. -
బీబీనగర్లో దంపతులపై కత్తులతో దాడి
నల్గొండ : నల్లగొండ జిల్లాలో దారుణం జరిగింది. బీబీనగర్లో దొంగలు బీభత్సం స్పష్టించారు. అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన దొంగలు.... దంపతులపై కత్తులతో దాడి చేసి నగదు, బంగారాన్ని దోచుకెళ్లారు. దొంగల దాడిలో భార్య అక్కడికక్కడే మరణించగా భర్త తీవ్రంగా గాయపడ్డాడు. అయితే ఇది దొంగల పని కాదని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. తెలిసినవారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘాటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్ట్మార్టంకు తరలించి, దర్యాప్తు చేపట్టారు.