నిరాదరణకు గురైతే రూ. పదివేల భరణం | Rs.10 thousand alimony for neglected | Sakshi
Sakshi News home page

నిరాదరణకు గురైతే రూ. పదివేల భరణం

Published Mon, Jan 23 2017 10:44 PM | Last Updated on Tue, Sep 5 2017 1:55 AM

నిరాదరణకు గురైతే రూ. పదివేల భరణం

నిరాదరణకు గురైతే రూ. పదివేల భరణం

కొడుకులు, కుమార్తెల నిరాదరణకు గురైన తల్లిదండ్రులు, వయోవృద్ధులు కనిష్టంగా పది వేల రూపాయల భరణం పొందేందుకు చట్టాలున్నాయని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, లోక్‌ అదాలత్‌ జడ్జి ఎంఏ సోమశేఖర్‌ తెలిపారు.

- జిల్లా లోక్‌ అదాలత్‌ జడ్జి ఎంఏ సోమశేఖర్‌
- వృద్ధాశ్రమంలో న్యాయ విజ్ఞాన సదస్సు
 
కర్నూలు (కొండారెడ్డి ఫోర్టు): కొడుకులు, కుమార్తెల నిరాదరణకు గురైన తల్లిదండ్రులు, వయోవృద్ధులు కనిష్టంగా పది వేల రూపాయల భరణం పొందేందుకు చట్టాలున్నాయని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, లోక్‌ అదాలత్‌ జడ్జి ఎంఏ సోమశేఖర్‌ తెలిపారు. ఇందుకు వయోవృద్ధులు, ముసలి తల్లిదండ్రులు, రక్షణ, సంరక్షణ చట్టం-2007 అవకాశం కల్పిస్తోందన్నారు. అలాంటి వారు ఆర్‌డీఓకు దరఖాస్తు చేసుకుంటే నెలకు కనీసం పదివేల రూపాయల భరణం పోందే అవకాశం ఉందన్నారు.
 
సోమవారం ఎలుకూరు ఎస్టేట్‌లోని శ్రీమాతా అన్న పూర్ణేశ్వరి వృద్ధుల ఆశ్రమంలో న్యాయ విజ్ఞానా సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఆస్తి రాయించుకున్న తరువాత వారి సంతతి నిరాదరణకు  గురిచేస్తే ఆ  రిజిస్ట్రేషన్‌ పత్రాలు చెల్లవన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు ప్రసాదు, తిరుపతయ్య, అశ్రమ మేనేజర్‌ కేసీ రంగస్వామి పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement