కర్నూలు నగరంలోని నంద్యాల చెక్పోస్టు సమీపంలో ఆటో, బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఓ విద్యార్థి దుర్మరణం చెందాడు.
విద్యార్థి దుర్మరణం
Jan 8 2017 12:24 AM | Updated on Nov 9 2018 5:02 PM
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): కర్నూలు నగరంలోని నంద్యాల చెక్పోస్టు సమీపంలో ఆటో, బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఓ విద్యార్థి దుర్మరణం చెందాడు. నగరంలోని టీజీవీ కాలనీలో నివాసం ఉన్న ఆటో డ్రైవర్ బి.వెంకటేశ్వర్లు కుమారుడు సాగర్ (16) షరీన్నగర్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. శుక్రవారం రాత్రి 7.30 గంటల సమయంలో వెంకటేశ్వర్లు నంద్యాల చెక్పోస్టు చేరుకుని పనిమీద కుమారుడిని అక్కడికి రమ్మని పిలిచాడు. సాగర్ బైక్పై చెక్పోస్టు వైపు వెళ్తుండగా గుర్తు తెలియని ఆటో వేగంగా వచ్చి ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లగా అంబులెన్స్లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కొద్ది సేపటికి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement