క్రిష్ణ జింకపిల్లను అప్పగిస్తున్న గ్రామస్తులు
నర్వ : కందిచేన్లో దారితప్పి వచ్చిన కష్ణ జింకపిల్లను స్థానిక రైతులు చేరదీసి నర్వ పోలీసులకు అప్పగించిన సంఘటన ఆదివారం సీపురం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు.. మండల పరిధిలోని సీపురం గ్రామానికి చెందిన రైతు ఆంజనేయులు ఆదివారం తెల్లవారుజామున తాను సాగుచేస్తున్న కందిచేనుకు వెళ్లి పరిశీలిస్తుండగా జింకపిల్ల తారసపడింది. దీంతో ఆంజనేయులు జింకపిల్లను జాగ్రత్తగా చేరదీసి జక్కనపల్లి గ్రామవాసులతో కలిసి నర్వ పోలీస్స్టేషన్కు తీసుకొచ్చారు. జింకపిల్లను స్వాధీనం చేసుకొని ఫారెస్టు అధికారులకు అప్పగించినట్లు ఏఎస్ఐ మక్సూద్ అహ్మద్ తెలిపారు.