టీబీ బోర్డు సమావేశం వాయిదా
అనంతపురం సెంట్రల్ : తుంగభద్ర బోర్డు సమావేశాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు. ఈ నెల 14న సమావేశం నిర్వహిస్తున్నట్లు తొలుత ఉత్తర్వులు వెలువరించారు. అయితే.. హెచ్చెల్సీకి నీటి విడుదలలో అన్యాయం జరుగుతోందనే ఉద్దేశంతో తాము సమావేశానికి హాజరుకాలేమని ఎస్ఈ శేషగిరిరావు లేఖ రాశారు. దీంతో సమావేశాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు. తదుపరి తేదీని తర్వాత ప్రకటిస్తామని టీబీ బోర్డు అధికారులు తెలిపారు.