బైంసాలో నలుగురు బైక్ దొంగలను పోలీసులు అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు.
బైంసాలో నలుగురు బైక్ దొంగలను పోలీసులు అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. వారి నుంచి 18 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్, బైంసా, కరీంనగర్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో వీళ్లు దొంగతనాలకు పాల్పడ్డారు. వీరిలో ఓ బాలనేరస్తుడు కూడా ఉన్నాడు. మీడియా ప్రవేశపెట్టిన అనంతరం రిమాండ్కు తరలించారు.